కొత్త భవనం.. ప్చ్‌! | - | Sakshi
Sakshi News home page

కొత్త భవనం.. ప్చ్‌!

Jun 18 2025 3:23 AM | Updated on Jun 18 2025 3:23 AM

కొత్త

కొత్త భవనం.. ప్చ్‌!

ఇది జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్‌ సర్కిల్‌ కార్యాలయం నూతన భవనం. నిర్మాణం పూర్తయి రెండున్నర ఏళ్లు దాటింది. సుమారు రూ.40లక్షల వ్యయంతో నిర్మించారు. పాత కార్యాలయం నుంచి ఈ నూతన భవనంలోకి మారేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ భవన ఆవరణ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. లక్షల వ్యయంతో నిర్మించిన భవనం ఇలా అలంకారప్రాయంగా మారింది.

కలెక్టరేట్‌ క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న ఎకై ్సజ్‌ సీఐ కార్యాలయం ఇది. ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. అలాంటప్పుడు అధికారులు ఈ ఆఫీసును కొత్త భవనంలోకి మార్చేందుకు అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పెచ్చులూడి పడిపోయే భవనాన్ని సొంత నిధులతో రిపేర్‌ చేయిస్తున్నారు తప్పితే కొత్త భవనంలోకి మారేందుకు యత్నించకపోవడం గమనార్హం.

కొత్త భవనం.. ప్చ్‌!1
1/1

కొత్త భవనం.. ప్చ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement