-
నేటి నుంచి యువజనోత్సవాలు
గుంటూరు, ఏఎన్యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల యువజనోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరిగే యువజనోత్సవాలకు ఏఎన్యూ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 30కి పైగా కళాశాలల నుంచి 1200 మంది వరకు యువతీ యువకులు పాల్గొంటారని యువజనోత్సవాల కోఆర్డినేటర్ డాక్టర్ మురళీమోహన్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ఏఎన్యూ క్రీడా ప్రాంగణంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో నారా రోహిత్ పాల్గొంటారన్నారు. వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య కే జాన్పాల్, పలువురు యూనివర్సిటీ అధికారులు పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఏఎన్యూ క్రీడా ప్రాంగణం, విద్యార్థి కేంద్రం తదితర ప్రాంతాల్లో వేదికలు సిద్ధం చేశామని చెప్పారు. పోటీల షెడ్యూల్ శనివారం ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని మురళీమోహన్ చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు మ్యూజిక్ విభాగంలో క్లాసికల్ ఇన్స్ట్రుమెంటల్ సోలో(నాన్పెర్క్యూషన్), క్లాసికల్ ఇన్స్ట్రుమెంటల్ సోలో(పెర్క్యూషన్), వెస్ట్రన్ వోకల్(సోలో), గ్రూప్సాంగ్(వెస్ట్రన్) అంశాల్లో, థియేటర్ విభాగంలో మిమిక్రీ, మైమ్, ఫైన్ఆర్ట్స్ విభాగంలో ఆన్ద స్పాట్ పెయింటింగ్, క్లేమోడలింగ్, పోస్టర్ మేకింగ్, మెహంది, డాన్స్ విభాగంలో క్లాసికల్ డాన్స్, ఫోక్ ఆర్కెస్ట్రా, క్విజ్ విభాగంలో ప్రిమిలినరీ, ఫైనల్ పోటీలు జరుగుతాయన్నారు. 16వ తేదీన ఉదయం 9:30 గంటలకు లిటరరీ ఈవెంట్స్లో డిబేట్, ఎలక్యూషన్ అంశాల్లోను, థియేటర్ విభాగంలో వన్ యాక్ట్ప్లే, ఫైన్ఆర్ట్స్ విభాగంలో స్పాట్ ఫోటోగ్రఫీ, కొల్లేజ్ అంశాల్లోను, మ«ధ్యహ్నం 12 గంటలకు మ్యూజిక్ విభాగంలో క్లాసికల్ ఓకల్ సోలో( హిందూస్థానీ/కర్నాటక), లైట్ ఓకల్ (సోలో), గ్రూప్సాంగ్ ( ఇండియన్) అంశాల్లోను ఫైన్ ఆర్ట్స్లో ఇన్స్టాలేషన్ అండ్ కార్టూనింగ్లోను పోటీలు ప్రారంభమవుతాయి. 17వ తేదీ ఉదయం 9:30 గంటలకు డాన్స్ విభాగంలో ఫోక్ డాన్స్/ట్రైబల్ డాన్స్, థియేటర్ విభాగంలో స్కిట్, ఫైన్ ఆర్ట్స్ విభాగంలో రంగోలి అంశాల్లోను పోటీలు జరుగుతాయి. సాయింత్రం 4 గంటలకు జరిగే ముగింపు కార్యక్రమానికి సినీ నటుడు పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారని తెలిపారు. -
ఇక యువ సంబరాలు
► ఈ నెల 30న జిల్లా యువజనోత్సవాలు ► పలు అంశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆదిలాబాద్ కల్చరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాదేశానుసారంగా జిల్లాలో యువజన సంబరాలు ప్రారంభం కానున్నాయి. కళాకారుల ప్రదర్శనలతో హోరెత్తనున్నాయి. జిల్లాల విభజన తర్వాత నిర్వహించే జిల్లాస్థాయి పోటీలు ఇవే. గతంలో మూడురోజుల పాటు నిర్వహించే యువజనోత్సవాలు ప్రస్తుతం 18 మండలాలే ఉండటంతో ఒకే రోజు నిర్విహ ంచనున్నారు. ఈ నెల 30న జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం వరకు సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన సర్వీసుల శాఖ సీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనాలంటే కళాకారులు 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. గత మూడేళ్లుగా నిర్వహించిన పోటీల్లో జాతీయ స్థాయిలో రాణించిన కళాకారులు, కళాబృందాలు ఈ పోటీలకు అనర్హులు. పోటీ అంశాలు.. జిల్లాలోని కళాకారులకు పలు అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఓడస్సి, మణిపురి, ఫోక్సాంగ్(గ్రూప్), ఫోక్డ్యాన్స్(గ్రూప్), కర్ణాటక హూకల్, హిందుస్థానీ హూకల్, ప్లూట్, మృదంగం, వీణా, సితార్, తబల, గిఠార్, హర్మోనియగం, వన్యాక్ట్ప్లే(గ్రూప్)హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. ఎలుక్యుషన్ (వ్యక్తిత్త)పోటీలు (హిందీ, ఇంగ్లీష్ భాషల్లో) నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో పాల్గొనే మండలాలు... ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్ అర్బన్, బేల, జైనథ్, తాంసి, భీంపూర్, తలమడుగు, గుడిహత్నూర్, మావల, ఇచ్చోడ, సిరికొండ, జైనథ్, బజార్హత్నూర్, నేరడిగోండ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాధిగూడ, 18 మండలాల కళాకారులు, విద్యార్థులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారు. కళాకారులకు కాస్ట్యూమ్స్, రవాణా ఖర్చులు... పోటీల్లో పాల్గొనే వారికి రావాణా, కాస్టూమ్ ఖర్చులు యువజన సర్వీసుల శాఖ ద్వారా అందించబడుతుంది. ఫోక్డ్యాన్స్ గ్రూప్ 20 మంది గ్రూప్కు రూ. 1000 చోప్పున, వన్యాక్ట్ ప్లే సభ్యులకు రూ. 600 చోప్పున, ఫోక్ గ్రూప్ సాంగ్ 10 మందికి రూ. 500 చోప్పున, వ్యక్తిత్వ, ఇతరాత్ర ప్రదర్శనలో పాల్గొనే వారికి రూ. 50 చోప్పున అందించనున్నారు. మరిన్ని వివరాలకు సెల్: 9849913061, 9440843848, 9515460477 లకుసంప్రదించాలని కోరారు. పాటించాల్సిన సూచనలు పోటీల్లో పాల్గొనే కళాకారులు వారి ప్రదర్శన సామాగ్రిని వెంటతెచ్చుకోవాలి. ఫోక్ డ్యాన్స్ గ్రూప్లో 20 మంది, ఫోక్ సాంగ్లో 10 మంది కంటె ఎక్కువ ఉండరాదు. ఫోక్డ్యాన్స్లో రికార్డు చేసిన క్యాసెట్లు, పెన్డ్రైవ్లు అనుమతించబడవు లైవ్లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ఫోక్డ్యాన్స్ గ్రూప్కు 15 నిమిషాలు, ఫోక్సాంగ్కు 7 నిమిషాల సమయం ఉంటుంది వన్యాక్ట్ప్లేకు గరిష్టముగా 12మందిని 45 నిమషాల వరకు అనుమనిస్తారు. వన్యాక్ట్ప్లే హిందీ లేదా ఇంగ్లీష్ బాషలో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ఇతరాత్ర ప్రదర్శనలకు సైతం సమయం 10 నుంచి 15 నిమిషాలు కేటాయిస్తారు తమ ఎంట్రిలను బయోడేటాను పూర్తి చేసి ఇవ్వాలి న్యాయనిర్ణేతల నిర్ణయాన్ని తుది నిర్ణయం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: సజ్జల
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
Advertisement