breaking news
Y.S.Vijayamma
-
బాబు బాల్ వేయరు...కిరణ్ బ్యాటింగ్ చేయరు
-
బాబు బాల్ వేయరు...కిరణ్ బ్యాటింగ్ చేయరు: విజయమ్మ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు తన సిద్ధాంతాలను మార్చుకున్నారని ఆరోపించారు. గురువారం ఆమె హైదరాబాద్లో మీడియా చిట్చాట్లో ... రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని గత ఆరు నెలలుగా ముఖ్యమంత్రి కిరణ్ను తమ పార్టీ కోరుతున్న సంగతిని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఆయన నుంచి స్పందన కరువైందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన తరువాత ఇప్పుడు సమైక్య తీర్మానం కుదరదంటూ సీఎం విడ్డూరంగా మాట్లాతున్నారని ఆమె పేర్కొన్నారు. అప్పుడే సమైక్య తీర్మానం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అంటూ విజయమ్మ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బౌలింగ్ చేస్తుంటే సీఎం కిరణ్ బ్యాటింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విభజన జరిగే వరకు చంద్రబాబు బాల్ వేయరు, కిరణ్ బ్యాటింగ్ చేయరని ఆమె పేర్కొన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు వెళ్లే అఖిలపక్షంలో తమ పార్టీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంవీఎస్ నాగిరెడ్డి హాజరవుతురన్నారు. ప్రముఖ రచయిత్రి కాత్యాయనీ విద్మహే రచించిన సాహిత్యాకాశంలో సగం-స్త్రీల అస్తిత్వ సాహిత్యం కవిత్వం, కథ అనే సాహిత్య విమర్శ గ్రంథం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాత్యాయనీని వైఎస్ విజయమ్మ అభినందనలు తెలిపారు. -
మండేలా జీవితం ఓ సందేశం:విజయమ్మ
-
మండేలా జీవితం ఓ సందేశం: వైఎస్ విజయమ్మ
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా జీవితం ఓ సందేశమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. మండేలా సంతాప తీర్మానాన్ని సీఎం కిరణ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ...మండేలా ప్రతి ఒక్కరికి మార్గదర్శి అని పేర్కొన్నారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ, లూధర్ కింగ్, నెల్సన్ మండేలాలు మహాపురుషులని వైఎస్ విజయమ్మ ప్రశంసించారు.ఆ మహాపురుషుల జీవితాలకు ఎల్లలు లేవన్నారు. మానవాళిని మాటలు, చేతల ద్వారా నడిపిన మహానీయుల్లో మండేలా ఒకరిని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. అలాగే వివిధ పార్టీల శాసనసభ పక్ష నేతలు ఈ సందర్బంగా మండేలా దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని ఈ సందర్బంగా కొనియాడారు.