breaking news
Young Professionals
-
యూకే వీసా.. ఇండియన్స్కి గుడ్ న్యూస్
యునైటెడ్ కింగ్డమ్.. యూకే వెళ్లాలని, అక్కడ చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని చాలామంది కలలు కంటుంటారు. అయితే ఆ అవకాశం అందరికీ దొరకదు. కానీ ఇప్పుడు యూకేలో ఉద్యోగం, ఉన్నత విద్య లేదా అంతర్జాతీయ అనుభవం కోసం ఎదురుచూస్తున్న భారత యువతకు మరో కీలక అవకాశం లభించింది. ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ (India Young Professionals Scheme - YPS) కింద 2026 సంవత్సరానికి సంబంధించిన రెండో, చివరి బ్యాలెట్ జూలై 21 నుంచి ప్రారంభం కానుంది.ఈ వీసా స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే.. ముందుగానే ఉద్యోగ ఆఫర్ లేదా యజమాని స్పాన్సర్షిప్ అవసరం లేకుండానే అర్హులైన భారతీయులు యూకేలో రెండేళ్ల వరకు నివసిస్తూ, ఉద్యోగం చేయడం లేదా చదువుకోవడం చేయవచ్చు. ఈ వివరాలను యూకే ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.జూలై 21 నుంచి 48 గంటలపాటు బ్యాలెట్యూకే ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం బ్యాలెట్ జూలై 21, 2026 మధ్యాహ్నం 1:30 గంటలకు (IST)ప్రారంభమై, జూలై 23 మధ్యాహ్నం 1:30 గంటలకు ముగుస్తుంది. ఈ బ్యాలెట్లో నమోదు పూర్తిగా ఉచితం. అయితే బ్యాలెట్లో ఎంపికైన వారికి మాత్రమే తదుపరి వీసా దరఖాస్తు చేసే అవకాశం లభిస్తుంది. ఫలితాలను బ్యాలెట్ ముగిసిన రెండు వారాల్లోపు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు.మొత్తం 3,000 వీసాలు..2026 సంవత్సరానికి ఈ పథకం కింద మొత్తం 3,000 వీసా స్థానాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం ఇప్పటికే ఫిబ్రవరిలో నిర్వహించిన తొలి బ్యాలెట్లో కేటాయించగా, మిగిలిన స్థానాలను ఇప్పుడు నిర్వహించే రెండో, చివరి బ్యాలెట్ ద్వారా భర్తీ చేయనున్నారు. అందుకే ఇది ఈ ఏడాది చివరి అవకాశం కానుంది.అర్హతలు ఇవే..ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి.భారతీయ పౌరుడు అయి ఉండాలి.వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.కనీసం బ్యాచిలర్ డిగ్రీ లేదా సమాన అర్హత ఉండాలి.యూకేలో ప్రారంభ ఖర్చులకు సరిపడా 2,530 పౌండ్లు (సుమారు రూ.3.27 లక్షలు) పొదుపు ఉన్నట్లు నిరూపించాలి.ఇతర వీసా అర్హతలను కూడా పూర్తి చేయాలి.దరఖాస్తు ఎలాగంటే..అర్హులైన అభ్యర్థులు యూకే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో బ్యాలెట్లో నమోదు చేసుకోవాలి. నమోదు సమయంలో పూర్తి పేరు, పుట్టిన తేదీ, పాస్పోర్ట్ వివరాలు, పాస్పోర్ట్ స్కాన్ కాపీ, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి వివరాలు సమర్పించాలి. నమోదు చేసిన సమాచారం పాస్పోర్ట్లోని వివరాలతో పూర్తిగా సరిపోవాలి.ఎంపికైతే ఏమి చేయాలి?బ్యాలెట్లో పేరు ఎంపికైన వారికి ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. ఆ తేదీ నుంచి 90 రోజుల్లోపు వీసా కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. అలాగే వీసా ఫీజు, ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ చెల్లించి, బయోమెట్రిక్ వివరాలు సమర్పించాలి. బ్యాలెట్లో ఎంపిక కావడం మాత్రమే వీసా మంజూరుకు హామీ కాదని, తుది పరిశీలన అనంతరం మాత్రమే వీసా జారీ అవుతుందని యూకే ప్రభుత్వం స్పష్టం చేసింది.ఎంత ఖర్చవుతుంది?వీసా దరఖాస్తు సమయంలో 340 పౌండ్లు వీసా ఫీజుతో పాటు 1,552 పౌండ్లు ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ చెల్లించాలి. అదనంగా కనీసం 2,530 పౌండ్లు వ్యక్తిగత పొదుపు ఉన్నట్లు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.గుర్తుంచుకోవాల్సిన విషయాలుఒక్కో బ్యాలెట్కు ఒక్కసారి మాత్రమే నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఎంట్రీలు చెల్లవు. ఈసారి ఎంపిక కాకపోయినా అర్హత కొనసాగితే భవిష్యత్లో నిర్వహించే బ్యాలెట్లకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ ఏడాదికి జూలై బ్యాలెట్నే చివరిదిగా యూకే ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల ఆసక్తి ఉన్న యువత ముందుగానే అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవడం మంచిది. -
యువతకు ఆర్బీఐ బంపర్ ఆఫర్!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) యువ ప్రతిభను ఆకర్షించేందుకు ‘యంగ్ ప్రొఫెషనల్స్ (YP)’ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ, పబ్లిక్ పాలసీ, డేటా విశ్లేషణ, సాంకేతిక రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతకు అరుదైన అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.5 లక్షల స్థిర స్టైఫండ్ లభించనుండగా, నియామకం ఒప్పంద ప్రాతిపదికన ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు ముంబైలోని ఆర్బీఐ సెంట్రల్ ఆఫీస్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.ఆర్బీఐ ప్రణాళిక ప్రకారం ప్రారంభంలో మూడేళ్ల కాలానికి నియామకం చేపడతారు. పనితీరు, పరస్పర అంగీకారం ఆధారంగా ఈ గడువును గరిష్ఠంగా ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. అయితే ఈ నియామకం శాశ్వత ఉద్యోగానికి హామీ కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. కానీ, ఎంపికైన అభ్యర్థులు ఫుల్ టైమ్ ఉద్యోగులుగా పనిచేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అనుమతి లేకుండా ఇతర ఉద్యోగాలు లేదా కన్సల్టెన్సీ పనులు చేపట్టరాదు.ఎంపికైన యంగ్ ప్రొఫెషనల్స్కు నెలకు రూ.1,50,000 స్థిర స్టైఫండ్ చెల్లిస్తారు. దీనిపై వర్తించే ఆదాయపన్ను మినహాయింపులు అమల్లో ఉంటాయి. స్టైఫండ్కు అదనంగా ఇతర అలవెన్సులు, హెచ్ఆర్ఏ లేదా ప్రోత్సాహకాలు ఉండవని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.అభ్యర్థుల ఎంపిక వివిధ దశల్లో జరుగుతుంది. ముందుగా దరఖాస్తుల పరిశీలన, షార్ట్లిస్టింగ్ నిర్వహించి, అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేపడతారు. ఖాళీల సంఖ్య, దరఖాస్తుల నాణ్యత ఆధారంగా ఇంటర్వ్యూకు పిలిచే అభ్యర్థుల సంఖ్యను పరిమితం చేసే అధికారం ఆర్బీఐకి ఉంటుంది.ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, సీవీ, విద్యార్హత సర్టిఫికెట్లు, స్టేట్మెంట్ ఆఫ్ ఇంటరెస్ట్, రైటింగ్ శాంపిల్, రిఫరెన్స్ లెటర్తో కలిసి ఈ-మెయిల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. “YP Application – Post Code – Candidate Name” అనే సబ్జెక్ట్ లైన్తో [yphrmdco@rbi.org.in](mailto:yphrmdco@rbi.org.in) కు దరఖాస్తులు పంపాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే వారు ప్రతి పోస్టుకు ప్రత్యేక ఈ-మెయిల్ పంపాల్సి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం దరఖాస్తుల చివరి తేదీ జూలై 6, 2026గా అధికారిక ప్రకటనల్లో పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ను తప్పనిసరిగా పరిశీలించాలని ఆర్బీఐ సూచించింది. -
100 మంది యువకులను మోసగించి...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హనీ ట్రాప్ గ్యాంగ్ ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ఉద్యోగాలు చేస్తూ సోషల్ మీడియాను వినియోగించే యువకులే లక్ష్యంగా ఈ గ్యాంగ్ లు నడుస్తున్నాయి. నగరంలో తాజాగా జరిగిన ఓ సంఘటనలో ఇద్దరు వ్యక్తులతో పాటు ఢిల్లీ హోం గార్డు శాఖకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు దాదాపు 100 మందికి పైగా యువకులను మోసగించి డబ్బులు దోచుకున్నట్లు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో పనిచేసే పైలట్ ను ఓ ముఠా బెదిరించి రూ.9.70 లక్షలు దోచుకుందని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో పరిచయమైన సియా అనే అమ్మాయితో గత ఏడాది ఫ్రెండ్ అయ్యాడని, కొద్ది రోజుల చాటింగ్ తర్వాత ఇద్దరం కలిసి సినిమాకు వెళ్లామని ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా పూర్తయిన తర్వాత ఆమె తన ఫ్లాట్ కు వెళ్దామని చెప్పిందని, దారిలో సలోని అనే మరో అమ్మాయిని తన స్నేహితురాలిగా అతని కి పరిచయం చేసిందని తెలిపారు. వాళ్లిద్దరితో కలిసి ఫ్లాట్ కు వెళ్లగా.. ఉన్నట్టుండి సియా తనను సలోనితో వదిలేసి బయటకు వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు పోలీసు అధికారుల్లా నటించి అతన్ని ఓ గదిలో బంధించి యువతిని రేప్ చేశావని నిందించారని చెప్పారు. యువతిని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారని వివరించారు. బాధితుడిపై రేప్ కేసు పెడతామని బెదిరించారని చెప్పారు. కేసు నుంచి తప్పించాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.10 లక్షలకు కేసును మూసేయడానికి ఒప్పుకున్నారని తెలిపారు. ఘటన జరిగిన కొన్ని నెలల వరకు మామూలుగానే ఉన్న ఈ ఏడాది మార్చిలో కోర్టులో కేసు ఇంకా పెండింగ్ ఉందని, యువతి కోర్టులో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందని కేసు సెటిల్ చేయడానికి మరో రెండు లక్షలు ఇవ్వాలని బాధితుడిని డిమాండ్ చేశారని చెప్పారు. కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. బాధితుడిని బెదిరించిన ఫ్లాట్ అద్దెకు తీసుకుందని పోలీసులు తొలుత నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకరు ఢిల్లీ హోం గార్డులో పనిచేసే అధికారి జగ్తిందర్ సింగ్ గా గుర్తించి అరెస్టు చేశారు. సింగ్ ఇచ్చిన వివరాల ప్రకారం మిగిలిన ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు. ఆర్ధికంగా బలంగా ఉన్నవ్యక్తులను తాము సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేసి డబ్బులు గుంజినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. -
‘ఆరోగ్యం’పై అశ్రద్ధ..!
వ్యక్తిగత ఆరోగ్య బీమాపై యువ నిపుణుల అనాసక్తి... కాలం మారింది. మామూలుగా 9 గంటలకు నిద్రపోవాల్సిన మనం 2 గంటలకు నిద్రపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎప్పుడు తింటామో తెలియదు. దీంతో ఆరోగ్యం చెడిపోతోంది. ముఖ్యంగా ఉద్యోగుల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. జీవన విధానంలో వస్తున్న మార్పులు, మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు ఒకవైపు ఎక్కువైపోతుంటే, వ్యక్తిగత ఆరోగ్య బీమా తీసుకున్న యువ నిపుణులు చాలా తక్కువ మంది ఉన్నారు. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ సహా ఇతర ముఖ్యమైన నగరాల్లోని 23-35 ఏళ్ల వయసున్న దాదాపు 1,100 మంది యువ నిపుణులపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో ఒకసారి చూద్దాం. వ్యక్తిగత ఆరోగ్య బీమా.. 10% మందికే సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటే, మిగిలిన వారికి లేదు. ఇన్సూరెన్స్ కవర్ ఉన్న వారిలో 60 శాతం మంది కంపెనీ క్లెయిమ్ను మాత్రమే కలిగి ఉన్నారు. మిగిలిన 30 మంది కంపెనీ మెడిక్లెయిమ్తోపాటు పర్సనల్ హెల్త్ పాలసీని కలిగి ఉన్నారు. కేవలం 10 శాతం మంది మాత్రమే పర్సనల్ కవర్ను తీసుకున్నారు. పాలసీ లేనివారిలో 46 శాతం మంది అది చాలా ఖరీదైనదని, అందులో ఇన్వెస్ట్ చేయడానికి తాము ఇంకా చాలా యువకులమని 22 శాతం మంది తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ క్లిష్టమైనవని 15 శాతం మంది, దాని గురించి తెలియదని 17 శాతం మంది పేర్కొన్నారు. శారీరక నొప్పులతో బాధపడేవారే ఎక్కువ పలు రకాల వ్యాధులతో బాధపడుతున్నామని సర్వేలో పాల్గొన్న 45 శాతం మంది పేర్కొన్నారు. వీరిలో 40 శాతం మంది దీర్ఘకాలిక శారీరక నొప్పులతో సతమతమౌతున్నట్లు తెలిపారు. 20 శాతం మంది బరువు సంబంధిత సమస్యలతో, 18 శాతం మంది రక్తపోటు, 10 శాతం మంది శ్వాసకోశ రుగ్మతలతో, 8 శాతం మంది జీర్ణ సంబంధిత వ్యాధులతో, 4% మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ జబ్బులు వారు చేసే పని వల్ల వచ్చాయని 40% మంది, వంశపారంపర్యంగా వచ్చాయని 17 శాతం మంది, వ్యాయామం చేయకపోవడం వల్ల వచ్చాయని 10 శాతం మంది, ఒత్తిడి వల్ల వచ్చాయని 5 శాతం మంది, ఆహార విధానాల మా ర్పు వల్ల వచ్చాయని 28 శాతం మంది పేర్కొన్నారు. యువ నిపుణులు వారి కంపెనీలు ఇచ్చే మెడికల్ పాలసీలనే తీసుకుంటున్నారు తప్ప ప్రత్యేకంగా ఆరోగ్య బీమా తీసుకోవడానికి ఉత్సాహం చూపడం లేదు. కంపెనీ ఇచ్చే మెడికల్ క్లెయిమ్ వైద్య ఖర్చులకు సరిపోతుందని సర్వేలో పాల్గొన్న దాదాపు 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. పన్ను మినహాయింపుల నిమిత్తం హెల్త్ పాలసీని కలిగి ఉన్నామని 74 శాతం మంది తెలిపారు. -
యువ నిపుణులకు నీతి ఆయోగ్ భారీ వేతనాలు
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన యువ నిపుణులను ఆకర్షించేందుకు మునుపటి ప్రణాళికా సంఘం అందించిన దాని కంటే 30 శాతం ఎక్కువగా వేతనం ఇవ్వాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ని కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 20 మంది యువ నిపుణుల కోసం నీతి ఆయోగ్ రిక్రూట్మెంట్ ప్రారంభించింది. వీరికి నెలకు రూ.40,000- రూ.70,000 వేతనం అందించనుంది. ప్రణాళిక సంఘం నెలకు రూ.31,000-రూ.51,000 వేతనం అందించగా, అందుకు 30 శాతం ఎక్కువగా నీతి ఆయోగ్ అందించనుండడం విశేషం. దీంతో పాటు వయోపరిమితిని కూడా 40 ఏళ్ల నుంచి 32 ఏళ్లకు తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను పరిశీలించేందుకు చీఫ్ ఎకనమిస్ట్ కోసం కూడా నీతి ఆయోగ్ అన్వేషిస్తోంది.


