-
ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది
‘‘సాధారణంగా స్టార్స్ ఉన్న సినిమాలైతే ముందు వాటి గురించి మాట్లాడుకున్న తర్వాత సినిమాకి వెళతారు. కానీ, ‘ఎవడు తక్కువ కాదు’లో స్టార్స్ లేరు. కథే స్టార్. ముందు మాట్లాడుకుని తర్వాత చూసే సినిమా కాదిది. సినిమా చూశాక దాని గురించి మాట్లాడుకునేలా ఉంటుంది’’ అన్నారు లగడపాటి శ్రీధర్. ‘రేసుగుర్రం, పటాస్, రుద్రమదేవి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ సహిదేవ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. తమిళ ‘గోలీ సోడా’ సినిమాకి ఇది రీమేక్. రఘు జయ దర్శకత్వంలో లగడపాటి శిరీషా సమర్పణలో లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. లగడపాటి శ్రీధర్ చెప్పిన విశేషాలు. ► టీనేజ్ లవ్స్టోరీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తమిళంలో రూ. 2 కోట్లతో తీసిన ‘గోలీ సోడా’ సినిమా రూ. 20కోట్లు వసూలు చేసింది. తెలుగులో ఇంకా ఎక్కువ బడ్జెట్తో, మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్తో రిచ్గా తీశాం. ► ‘గోలీ సోడా’ చిత్రానికి హీరోయిన్ సమంత పెద్ద అభిమాని. కథ అంత బాగుంటుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ కథలో మార్పులు చేశాం. టీనేజర్స్ నేపథ్యంలో తెలుగులో ఈ మధ్య మంచి సినిమా రాలేదు. ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది. ► యూత్లో ఎవడూ తక్కువ కాదు. వారికి ఎన్నో కలలు ఉంటాయి. వాటిని ఎలా సాధించొచ్చు? సాధించిన దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? అని మా సినిమాలో చెప్పాం. క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ► వేసవికి కావాల్సిన మాస్ యూత్ఫుల్ ఫిల్మ్. ఓవర్సీస్లో రిలీజ్కి ప్లాన్ చేయలేదు. ఇక్కడ స్పందనను బట్టి రిలీజ్ చేద్దామనుకుంటున్నాం. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాకి విక్రమ్కి ఎంత పేరొచ్చిందో ఈ సినిమాతో అంతకుమించి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్లకు సినిమా చూపించా.. చాలా సంతోషంగా అన్ని ఏరియాల వాళ్లు కొనుక్కోవడం బిగ్గెస్ట్ సక్సెస్. -
మే 24న ‘ఎవడు తక్కువ కాదు’
బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అనేది ట్యాగ్ లైన్. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రానికి రఘు జయ దర్శకుడు. ప్రియాంక జైన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు హరి గౌర సంగీతమందించారు. ‘పోయిన చోటే వెతుక్కోవాలి’ ‘పడిన చోటే పైకి లేచి నిలబడాలని’ పెద్దలు చెబుతారు. ఒక మార్కెట్లో కుర్రాడు పడిన చోటే పైకి లేచి నిలబడాలని ప్రయత్నించాడు. వయసులో చిన్నోడు అయినా ధైర్యంగా మార్కెట్లో పెద్దలతో తలపడ్డాడు. అప్పుడు ఆ పెద్దలు ఏం చేశారు? ఆ కుర్రాడు, అతడికి ఉన్న వ్యక్తులు ఎలా ఎదుర్కొన్నారు? ఈ యుద్ధంలో చివరికి ఏమైంది? అనేది ‘ఎవడు తక్కువ కాదు’ కథ. ఇప్పటికే సెన్సార్కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 24న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ‘ప్రచార చిత్రాలకు, పాటలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. పగ, ప్రతీకారం నేపథ్యంలో సరికొత్త కథ, కథనంతో రూపొందిన చిత్రమిది. అలాగే, ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. దర్శకుడు రఘు జయ చాలా సహజంగా చిత్రాన్ని తెరకెక్కించాడు. రియలిస్టిక్, రా అప్రోచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ట్రైలర్లో విక్రమ్ సహిదేవ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ బావుందని, అగ్రెస్సివ్గా చేశాడని అంతాప్రశంసిస్తున్నారు. ట్రైలర్ విడుదల చేసిన సుకుమార్ గారు కూడా మెచ్చుకున్నారు. సినిమా చూసి ప్రేక్షకులు మా విక్రమ్ ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రమిది’ అని అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement