yasasvini
-
సైలెంట్ కిల్లర్
యశస్వికి వినికిడి లోపం. ఏ శబ్దాలకూ స్పందించదు. కానీ చదరంగంలోని గుర్రపు డెక్కల చప్పుళ్లు, ఏనుగుల ఘీంకారాలు, భటులు పరుగులు తీస్తున్న ధ్వనులు.. అవన్నీ చక్కగా వినిపిస్తాయి. ఇటీవలే ప్రపంచ చెస్ పోటీలలో పాల్గొని, జూనియర్స్ విభాగంలో కాంస్య పతకం కూడా సాధించింది. ఊళ్లో ఘనస్వాగతం పొందింది. యశస్వి కర్ణాటకలోని బంత్వాల్ గ్రామ బాలిక. పదో తరగతి చదువుతోంది. ఈ నెలలో యూకే లోని మాన్చెస్టర్లో జరిగిన అంతర్జాతీయ బధిరుల చెస్ పోటీలలో పాల్గొని కాంస్య పతకం సాధించింది. యశస్వి తల్లి యశోద స్కూల్ టీచర్. తండ్రి తిమ్మప్ప ల్యాబ్ టెక్నీషియన్. మెడల్ సాధించుకొచ్చిన యశస్వికి తను చదువుకున్న కాడేశ్వల్య హైస్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా స్వాగతం పలికినప్పుడు ఈ తల్లిదండ్రులు పుత్రికోత్సాహంతో పులకించిపోయారు. ‘‘ఇది మా అమ్మాయి పాల్గొన్న మొట్టమొదటి అంతర్జాతీయ పోటీ. జాతీయ స్థాయిలో రెండుసార్లు అవార్డులు అందుకుంది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. అక్కకూ వినిపించదు! పెద్దమ్మాయి యతిశ్రీ (20) ప్రస్తుతం పుత్తూరులో బీకాం చదువుతోంది. ఆమె కూడా బధిరురాలే. ‘‘యతిశ్రీకి ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడు, ఆమె శబ్దాలకు స్పందించడంలేదని గ్రహించాను. అప్పటికి తనకు కేవలం 20 శాతం మాత్రమే వినికిడి శక్తి ఉంది. నేను టీచర్ని కావడం వల్ల, ముందుగా నేను చదువుతున్న పాఠశాలలోనే చేర్పించి, ఆ తరవాత దగ్గరలో ఉన్న పాఠశాలలో చదివించాను. పెద్దయ్యాక కూడా దగ్గరలోనే ఉన్న కాలేజీలోనే చేర్పించాను. యతిశ్రీ చాలా చక్కగా భరతనాట్యం చేస్తుంది. బొమ్మలు కూడా వేస్తుంది. రకరకాల పోటీలలో ఎన్నో బహుమతులు సాధించింది’’ అని పెద్ద కూతురు గురించి కూడా గొప్పగా చెబుతారు యశోద. ‘ఎలారా దేవుడా’ అనుకున్నారుమొదట్లో ఈ దంపతులు, భగవంతుడు తమను చిన్నచూపు చూశాడనే భావనలో ఉండేవారు. రెండో అమ్మాయి యశస్వి పుట్టినప్పుడు ఆ అమ్మాయికి బాగానే వినిపిస్తుందనుకున్నారు. ఒక నెల అయ్యాక,యశస్వికి కూడా వినపడట్లేదని తెలిసిపోయింది. దాంతో హతాశులయ్యారు. ‘‘డాక్టరుకి చూపించినా ప్రయోజనం లేకపోయింది. యతిశ్రీ కంటే యశస్వికి ఇంకా బాగా తక్కువగా వినిపిస్తుంది. కానీ చాలా తెలివైనది. చదువులో 90 శాతం మార్కులు సాధించేది’’ అంటారు యశోద. పిల్లలు ఎన్ని విజయాలు సాధించినా, వారికి వైక ల్యం ఉంటే అది తల్లిదండ్రులకు బాధను కలిగిస్తుంది. అందుకే ఆ తల్లి శని ఆదివారాలలో యశస్విని స్పీ^Œ థెరపీ కోసం మంగళూరుకు తీసుకెళ్లేవారు. యశస్వికి చదువుతో పాటు చదరంగం మీద కూడా మక్కువ ఏర్పడింది. ముందుగా ఇంట్లోవారితో ఆడి, ఆ తరవాత స్కూల్లో ఆడింది. ఆమె ఆటలోని నేర్పరితనాన్ని గమనించిన టీచర్లు పుత్తూరులోని జీనియస్ చెస్ స్కూల్లో చేర్పించారు. బాధను మరిపించింది. చెస్ పోటీల కోసం ఈ ఏడాది జూన్ 25వ తేదీన యశస్వి ఢిల్లీ చేరుకుంది. జూలై ఆరవ తేదీన ఇంగ్లండ్ వెళ్లే వరకు ఢిల్లీలో బాగా ప్రాక్టీస్ చేసింది. ‘‘ఈ సాధన యశస్వికి ఒక మంచి అనుభవం. ఇంటి నుంచి దూరం వెళ్లడం ఇదే మొదటిసారి. మేం కూడా తన వెంట వెళ్లాలనుకున్నాం. కానీ కుదరలేదు. భగవంతుడి దయ వల్ల అన్నీ సాఫీగా జరిగిపోయాయి. మల్లి హందా అనే అమ్మాయితో కలిసి భారతదేశం తరఫున బాలికల విభాగంలో ఆడి వచ్చింది మా అమ్మాయి. జూనియర్స్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించింది. మేం పడిన బాధంతా మరచిపోయాను. మా పిల్లలిద్దరూ చక్కగా రాణిస్తున్నందుకు ఇప్పుడు మాకు ఆనందంగా ఉంది’’ అంటారు యశోద. – రోహిణి -
మహిళా రౌడీషీటర్ యశస్విని అరెస్ట్
అప్పు చెల్లించలేదని దాడి బెంగళూరు(బనశంకరి) : తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ మహిళా రౌడీషీటర్ ఓ యువతి ఇంటికి వెళ్లి తీవ్రపదజాలంతో దూషించి బెదిరించిన సంఘటన సుబ్రమణ్యపుర పోలీస్స్టేషన్ పరిధిలో బుదవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... ఫైనాన్స్, వ డ్డీ వ్యాపారం నిర్వహించే యశస్విని బుధవారం రాత్రి తన ఇంటికి వచ్చి బెదిరించి తీవ్రంగా దూషించినట్లు బాధితురాలు తాయమ్మ ఇక్కడి సుబ్రమణ్యపుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనారోగ్య నిమిత్తం తాను యశస్విని వద్ద రూ. లక్ష అప్పు తీసుకున్నానని, వడ్డీ కూడా చెల్లించానని తాయమ్మ వాపోయారు. రాత్రి ఒక్కసారిగా తన ఇంటికి వచ్చి యశస్విని దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఇదిలా ఉంటే బసవనగుడి పోలీస్స్టేషన్లో రౌడీషీటర్ జాబితాలో యశస్విని పేరు ఉందని పోలీసులు తెలిపారు. సుబ్రమణ్యపుర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాపర్లకు మస్కా కొట్టింది
కిడ్నాపైన బాలిక చాకచక్యంగా తప్పించుకున్న సంఘటన అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి మండలం నాగసముద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యశస్విని(8) అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి ఎన్.ఎస్ గేట్ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఆపి బాలిక విషయమై సంభాషిస్తుండగా.. అప్రమత్తమైన బాలిక వారి చెర నుంచి తప్పించుకొని పక్కనే ఉన్న సబ్స్టేషన్లోకి పరిగెత్తింది. విషయం గమనించిన విద్యుత్ సిబ్బంది ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. -
యశస్విని విస్తరణ
సాక్షి,బెంగళూరు : రాష్ట్రంలో గుర్తింపు పొందిన సహకార సంఘాల్లోని సభ్యులకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించే ‘యశస్విని’ పథకం పరిధిని విస్తరింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన వెలువరించింది. ఇకపై యశస్విని పథకం పరిధిలోకి గుండె, వెన్ను, కీళ్ల శస్త్ర చికిత్సలనూ చేర్చుతున్నట్లు అందులో పేర్కొంది. అంతేకాకుండా కేన్సర్కు రేడియేషన్ థెరపీనీ చేర్చింది. దీని వల్ల ఇకపై బ్రెస్ట్, గర్భకోశం, సెర్విక్స్, ఆహారనాళం, రిక్టల్, ప్రోటెస్ట్ కేన్సర్లకు రేడియేషన్ థెరపీను పొందడానికి వీలవుతుంది. అదేవిధంగా గర్భిణి నుంచి బిడ్డకు హెచ్ఐవీ సోకకుండా నిరోధించడానికి అందించే ప్రివెన్షన్ ఆఫ్ పేరెంట్ టూ చైల్డ్ ట్రాన్స్మిషన్ (పీపీటీసీటీ)...హెచ్ఐవీ సోకిన మహిళకు అందించే లోయర్ సెగ్మెంట్ కేసెరీయన్ సెక్షన్ (ఎల్ఎస్పీఎస్) చికిత్సను కొత్తగా యశ స్విని పరిధిలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సదుపాయం అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 30.36 లక్షల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత ప్రభుత్వం 13 విభాగాల్లో 805 రకాల శస్త్రచికిత్సలను ఈ పథకం కింద సర్కార్ అందిస్తోంది. కాగా, 2012-13 ఏడాదిలో యశస్విని పథకం కింద 1.10 లక్షల మంది ఔట్పేషంట్లకు చికిత్స అందించగా, 83,802 మందికి వివిధ రకాల శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 492 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందడానికి అవకాశం ఉంది.