breaking news
Xiaomi Mi Max 2
-
ఆ ఫోన్కు జియో 100జీబీ ఉచిత డేటా
షావోమి కొత్త స్మార్ట్ఫోన్ ఎంఐ మ్యాక్స్2 కొనుగోలుచేయాలని ఎవరైనా జియో యూజర్లు ప్లాన్ చేస్తున్నారా? అయితే వారికోసం రిలయన్స్ జియో ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసిన వారికి 100జీబీ వరకు 4జీ డేటాను ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. రిలయన్స్ జియో, షావోమి భాగస్వామ్యంలో లాంచ్ ఆఫర్లలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నట్టు తెలిపింది. గతేడాది సెప్టెంబర్లో మార్కెట్లోకి ప్రవేశించిన జియో ఇప్పటికే టెలికాం ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే. ఎంఐ మ్యాక్స్ 2 మంగళవారం భాతర మార్కెట్లోకి లాంచైంది. దీని ధర 16,999 రూపాయలు. 6.44 అంగుళాల డిస్ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్, 4జీబీ ర్యామ్, 5300 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ప్రత్యేక ఫీచర్లు. జియో-ఎంఐ మ్యాక్స్ 2 ఆఫర్ 4జీ డేటా అందుబాటులో ఉన్న అన్ని రీఛార్జ్లకు, ఎస్ఎంఎస్లకు, సబ్స్క్రిప్షన్ చేసుకున్న జియో యాప్స్కు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులు రూ.309, అంతకంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేసుకుంటే, ప్రతి 28 రోజుల వ్యవధికి 10జీబీ 4జీ డేటా అదనంగా పొందుతారు. 10 రీఛార్జ్లకు ఇది అందుబాటులో ఉంటుంది. ఇలా 2018 మార్చి వరకు ప్రతి నెలా 10జీబీ అదనపు డేటాతో మొత్తం 100జీబీ డేటాను ఈ కస్టమర్లు పొందనున్నారు. ఉదాహరణకు... ఎంఐ మ్యాక్స్ 2ను కొనుగోలుచేసిన జియో కస్టమర్లు రూ.309తో రీఛార్జ్ చేసుకున్నారనుకోండి. ప్లాన్లో భాగంగా 56 రోజుల పాటు 56జీబీ పొందుతారు. దీంతో పాటు తొలి 28 రోజులకు 10జీబీ డేటా, మరో 28 రోజులకు 10జీబీ డేటా పొందుతారు. ఈ రీఛార్జ్ ప్యాక్ వాలిడిటీ అయిపోయ్యాక, మరోసారి రూ.309తో రీఛార్జ్ చేసుకుంటే, 56జీబీ+10జీబీ+10జీబీ మరో 56 రోజులు అందుబాటులోకి వస్తోంది. ఇలా ప్రతినెలా 10జీబీ డేటాను కస్టమర్లు పొందుతారు. ప్రస్తుతం జియో, షావోమి పార్టనర్షిప్లో ప్రకటించిన 100జీబీ డేటా వాల్యు చాలా ఎక్కువని తెలిసింది. అంతకముందు షావోమి ఫోన్లపై జియో 30జీబీ వరకు డేటా ఆఫర్చేసింది. ప్రస్తుతం ఎంపికచేసిన ఆసుస్ స్మార్ట్ఫోన్లకు మాత్రమే జియో 100జీబీ వరకు డేటాను అందిస్తోంది. జియోనితో కూడా జియోకు భాగస్వామ్యం ఉంది. ఇక తన బ్రాండు ఎల్వైఫ్ మొబైళ్లు కొనుగోలుచేసిన వారికి 20 శాతం అత్యధిక డేటా ఇస్తోంది. కొత్త జియోఫై పాకెట్ రూటర్ కొనుగోలుచేసిన వారికీ కూడా 224జీబీ వరకు ఉచిత డేటా ఆఫర్ చేస్తోంది. -
షావోమి కొత్త స్మార్ట్ఫోన్ స్పెషల్ ఏంటి?
న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ షావోమి మరో స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. షావోమి ఎంఐ మాక్స్ 2ను మంగళవారం ఢిల్లీలో నిర్ వహించిన లాంచింగ్ కార్యక్రమంలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఫ్లాగ్ షిప్ డివైస్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ, వరుస ఆవిష్కరణలు, వరుస రికార్డు అమ్మకాలతో దూసుకుపోతున్న షావోమి బిగ్ ఈజ్ బ్యాక్ అంటూ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఎంఐ మాక్స్కి కొనసాగింపుగా బిగ్ డిస్ప్లే, బిగ్గర్ బ్యాటరీ అంటూ ఈ తాజా షావోమి ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలోచైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్ ఇండియాలో మాత్రం ఒక వేరియంట్నే లాంచ్ చేసింది. 4జీబీ, 16జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.16999, ధరకు వినియోగదారులకు లభ్యం కానుంది. మెటల్బాడీ, రౌండెడ్ ఎడ్జ్స్తో స్పెషల్గా డిజైన్ చేసిన ఈ స్మార్ట్ఫోన్లో స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఒకే స్క్రీన్ లో రెండు యాప్లను ఒకేసారి వీక్షించే సదుపాయం స్ప్లిట్ స్క్రీన్తో సాధ్యం కానుంది. ఎంఐ మూడవ వార్షికోత్సవం సందర్బంగా జూలై 20 నుంచి ఈ డివైస్ అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీంతోపాటు ఒక సర్ ప్రైజ్ ఆఫర్ కూడా ఉంది. ఎంఐ మ్యాక్స్ 2 కొనుగోలు చేసిన కస్టమర్లకు జియో 100 జీబీ 4 జీ డాటా ఉచితం. అలాగే జులై 27నుంచి ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్ లోనూ ఒకేసారి విక్రయాలు ప్రారంభించనుంది. షావోమి ఎంఐ మ్యాక్స్ 2 ఫీచర్లు 6.44 అంగుళాల ఫుల్ హెచ్-డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్: 7.1.1 నోగట్ 2 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, 12 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5300 ఎంఏహెచ్