breaking news
WPL 2026 Auction
-
మహిళల ప్రీమియర్ లీగ్లో కొత్త స్పాన్సర్లు
భారత్ ఇటీవల ఐసీసీ ఉమెన్ ప్రపంచ కప్ టోర్నీలో విజయం సాధించిన తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 వేలం అంచనాలను మించిపోయింది. ఆటగాళ్లకు కోట్ల రూపాయాలు ఇచ్చేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. దాంతోపాటు చాట్జీపీటీ, కింగ్ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, బిస్లెరీ వంటి ప్రముఖ సంస్థలు లీగ్లో కొత్త స్పాన్సర్లుగా చేరడం గమనార్హం. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5, 2026 వరకు షెడ్యూల్ చేసిన నాలుగో ఎడిషన్ డబ్ల్యూపీఎల్ టోర్నమెంట్కు పెరుగుతున్న కార్పొరేట్ కంపెనీల ఆసక్తిని ఇది హైలైట్ చేస్తుంది.ఐసీసీ ప్రపంచకప్లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ను గెలుచుకున్న టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ రూ.3.2 కోట్లతో ఈ వేలంలో అత్యధిక ధర సాధించారు. వేలం పూల్లో 73 స్లాట్ల కోసం 277 మంది ఆటగాళ్లు పోటీ పడ్డారు. అగ్రశ్రేణి క్రికెటర్ల కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే ప్రయత్నించాయి. వేలంలో అధిక ధర సాధించిన కొందరు ఆటగాళ్ల వివరాలు కింది విధంగా ఉంది.అమెలియా కెర్ (న్యూజిలాండ్): ముంబై ఇండియన్స్కు రూ.3 కోట్లుశిఖా పాండే (భారత్): యూపీ వారియర్జ్ రూ.2.4 కోట్లుసోఫీ డివైన్ (న్యూజిలాండ్): గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లుమెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా): యూపీ వారియర్జ్ రూ.1.9 కోట్లుశ్రీచరణి (భారత్): ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.3 కోట్లుచినెల్లె హెన్రీ (వెస్టిండీస్): ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.3 కోట్లుఆశా శోభన (భారత్): యూపీ వారియర్జ్ రూ.1.1 కోట్లుస్పాన్సర్షిప్లు..కొత్తగా చేరిన చాట్జీపీటీ, కింగ్ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, బిస్లెరీ లీగ్కు మరింత బలాన్ని ఇచ్చాయి. బీసీసీఐ ప్రకటన ప్రకారం ఈ మూడు సంస్థల ఒప్పందాల విలువ రూ.48 కోట్లు. ఇది 2026, 2027 సీజన్లలో కొనసాగుతుంది. ఇప్పటికే ఉన్న అగ్రశ్రేణి భాగస్వాముల వివరాలు ఇలా ఉన్నాయి.టాటా గ్రూప్ (టైటిల్ పార్టనర్)సింటెక్స్, హెర్బాలైఫ్ (ప్రీమియర్ భాగస్వాములు)సియట్ (స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్టనర్)ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది? -
డబ్ల్యూపీఎల్ వేలంలో దీప్తి ధమాకా
భారత జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ దీప్తి శర్మకు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో భారీ విలువ దక్కింది. 2026 సీజన్ కోసం నిర్వహించిన మెగా వేలంలో దీప్తిని అత్యధికంగా రూ.3 కోట్ల 20 లక్షలకు ఆమె గత జట్టు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. డబ్ల్యూపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక మొత్తం 2023లో స్మృతి మంధాన (రూ.3.40 కోట్లు)కు దక్కగా... దీప్తి రెండో స్థానంలో నిలిచింది. కెప్టెన్గా మూడుసార్లు ఢిల్లీని ఫైనల్కు చేర్చిన ఆ్రస్టేలియా దిగ్గజం మెగ్ లానింగ్ను రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ తమ సారథిగా ఎంచుకునే అవకాశం ఉంది. వరల్డ్ కప్ విజయంలో భాగమైన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.30 కోట్లు ఇచ్చి మళ్లీ తమ జట్టులోకి తీసుకుంది. న్యూఢిల్లీ: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) –2026 సీజన్ కోసం గురువారం నిర్వహించిన వేలంలో 67 మంది మహిళా క్రికెటర్లను ఐదు ఫ్రాంచైజీలు ఎంచుకున్నాయి. వీరిలో 23 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 276 మంది ప్లేయర్లు వేలంలోకి రాగా, గరిష్టంగా 73 ఖాళీలు ఉండగా... తమకు కావాల్సిన ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు టీమ్లు ఓవరాల్గా రూ. 40.80 కోట్లు ఖర్చు చేశాయి. భారత ఆల్రౌండర్ దీప్తి శర్మకు అత్యధికంగా రూ.3.20 కోట్లు దక్కాయి. విదేశీ ఆటగాళ్లలో న్యూజిలాండ్ స్టార్ అమేలియా కెర్కు రూ. 3 కోట్లు లభించగా... 11 మంది ప్లేయర్లకు కనీసం రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలు దక్కాయి. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు రెండు నగరాల్లో డబ్ల్యూపీఎల్ జరుగుతుంది. ముంబైలోని డీవై పాటిల్, వడోదరలోని కొటాంబి స్టేడియంలను టోర్నీకి వేదికలుగా నిర్ణయించారు. 2023లో మొదటిసారి డబ్ల్యూపీఎల్ వేలం జరిగింది. ఆ తర్వాత జరిగిన మెగా వేలం ఇదే కావడం గమనార్హం. తొలిసారి జట్లకు రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డును వాడుకునే అవకాశం కల్పించారు. వేలానికి ముందు యూపీ వారియర్స్ వద్ద ఏకంగా రూ.14.50 కోట్లు ఉండటంతో ఆ జట్టు చురుగ్గా పాల్గొని గరిష్టంగా 17 మంది ఆటగాళ్లను ఎంచుకుంది. డబ్ల్యూపీఎల్ వేలం విశేషాలు » ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీతో వేలం మొదలైంది. వన్డే వరల్డ్ కప్లో చెలరేగిన ఆమె ప్రాథమిక ధర రూ.50 లక్షలు కాగా... ఏ జట్టు కూడా తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. » దీప్తి కోసం 2023లో యూపీ వారియర్స్ రూ. 2.60 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఈ సీజన్కు ముందు ఆమెను విడుదల చేసింది. వేలంలో దీప్తి కనీస విలువ రూ. 50 లక్షలకు తీసుకునేందుకు ఢిల్లీ సిద్ధం కాగా... యూపీ ఆర్టీఎం కార్డును వాడుకొని తమ జట్టులోకి ఎంచుకుంది. » డబ్ల్యూపీఎల్లో మూడుసార్లు కెప్టెన్గా ఢిల్లీని ఫైనల్ చేర్చిన ఆసీస్ దిగ్గజం మెగ్ లానింగ్ కనీస ధర రూ.50 లక్షల నుంచి ఢిల్లీ, యూపీ పోటీ పడగా, చివరకు రూ.1.9 కోట్లతో యూపీ సొంతమైంది. » వేలంలో భారీ మొత్తం పలికిన ప్లేయర్ల జాబితాలో శిఖా పాండే కాస్త ఆశ్చర్యకరంగా అనిపించింది. భారత జట్టుకు ఎప్పుడో దూరమైన 36 ఏళ్ల శిఖా అంతర్జాతీయ మ్యాచ్ ఆడి దాదాపు మూడేళ్లవుతోంది. అయితే ప్రస్తుతం కరీబియన్ లీగ్ సహా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతూ ఫిట్గా ఉండటం ఆమె ఎంపికకు ప్రధాన కారణం. ఆర్సీబీతో పోటీ పడిన యూపీ చివరకు శిఖాను సొంతం చేసుకుంది.» వరల్డ్కప్ విజేత, కడప బిడ్డ శ్రీచరణిని రూ.1.30 కోట్లతో ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది.వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల వివరాలు (విలువ రూ.లలో)ఢిల్లీ క్యాపిటల్స్: షినెల్ హెన్రీ (1.30 కోట్లు), శ్రీచరణి (1.30 కోట్లు), వోల్వార్ట్ (1.10 కోట్లు), స్నేహ్ రాణా (50 లక్షలు), మిన్ను మణి (40 లక్షలు), లిజెల్ లీ (30 లక్షలు), తానియా భాటియా (30 లక్షలు), నందిని శర్మ (20 లక్షలు), దియా యాదవ్ (10 లక్షలు), మమత మదివాల (10 లక్షలు), లూసీ హామిల్టన్ (10 లక్షలు).గుజరాత్ జెయింట్స్: సోఫీ డివైన్ (2 కోట్లు), జార్జ్ వేర్హామ్ (1 కోటి), భారతి ఫుల్మలీ (70 లక్షలు), కాశ్వీ గౌతమ్ (65 లక్షలు), రేణుకా సింగ్ (60 లక్షలు), కిమ్ గార్త్ (50 లక్షలు), యస్తిక భాటియా (50 లక్షలు), డానీ వ్యాట్ (50 లక్షలు), తనూజ కన్వర్ (45 లక్షలు), అనుష్క శర్మ (45 లక్షలు), రాజేశ్వరి గైక్వాడ్ (40 లక్షలు), టిటాస్ సాధు (30 లక్షలు), కనిక అహుజా (30 లక్షలు), ఆయుషి సోని (30 లక్షలు), హ్యాపీ కుమారి (10 లక్షలు), శివాని సింగ్ (10 లక్షలు).ముంబై ఇండియన్స్: అమేలియా కెర్ (3 కోట్లు), సజీవన్ సజన (75 లక్షలు), షబి్నమ్ ఇస్మాయిల్ (60 లక్షలు), నికోలా క్యారీ (30 లక్షలు), సైకా ఇషాక్ (30 లక్షలు), సంస్కృతి గుప్తా (20 లక్షలు), త్రివేణి వశిష్ట (20 లక్షలు), రాహిలా ఫిర్దోస్ (10 లక్షలు), పూనమ్ ఖెమ్మార్ (10 లక్షలు), నల్లా క్రాంతి రెడ్డి (10 లక్షలు), మిలీ ఇలింగ్వర్త్ (10 లక్షలు).రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: లారెన్ బెల్ (90 లక్షలు), పూజ వస్త్రకర్ (85 లక్షలు), అరుంధతి రెడ్డి (75 లక్షలు), గ్రేస్ హారిస్ (75 లక్షలు), డిక్లెర్క్ (65 లక్షలు), రాధ యాదవ్ (65 లక్షలు), జార్జ్ వోల్ (60 లక్షలు), లిన్సీ స్మిత్ (30 లక్షలు), హేమలత దయాళన్ (30 లక్షలు), ప్రేమ రావత్ (20 లక్షలు), గౌతమ్ నాయక్ (10 లక్షలు), ప్రత్యూష కుమార్ (10 లక్షలు).యూపీ వారియర్స్: దీప్తి శర్మ (3.20 కోట్లు), శిఖా పాండే (2.40 కోట్లు), మెగ్ లానింగ్ (1.90 కోట్లు), ఫోబ్ లిచ్ఫీల్డ్ (1.20 కోట్లు), ఆశా శోభన (1.10 కోట్లు), సోఫీ ఎకెల్స్టోన్ (85 లక్షలు), డియాండ్రా డాటిన్ (80 లక్షలు), కిరణ్ నవ్గిరే (60 లక్షలు), హర్లీన్ డియోల్ (50 లక్షలు), క్రాంతి గౌడ్ (50 లక్షలు), ప్రతీక రావల్ (50 లక్షలు), క్లో ట్రయాన్ (30 లక్షలు), శిప్రా గిరి (10 లక్షలు), సిమ్రన్ షేక్ (10 లక్షలు), తారా నోరిస్ (10 లక్షలు), సుమన్ మీనా (10 లక్షలు), గొంగడి త్రిష (రూ. 10 లక్షలు). వీరికి నిరాశ అంతర్జాతీయ క్రికెట్లో తమదైన గుర్తింపు ఉన్న పలువురు ప్లేయర్లకు ఈసారి డబ్ల్యూపీఎల్ వేలంలో నిరాశే మిగిలింది. అలీసా హీలీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా ...విదేశీ ప్లేయర్లలో ఎమీ జోన్స్, హీతర్ నైట్, చమరి అటపట్టు, అలానా కింగ్, తజ్మీన్ బ్రిట్స్, సోఫీయా డంక్లీ, సుజీ బేట్స్ తది తరులను ఎవరూ పట్టించుకోలేదు. గతంలో లీగ్లో అవకాశం దక్కించుకొని ఈసారి వేలంలో ఎంపిక కాని భారత ప్లేయర్ల జాబితాలో ఉమా ఛెత్రి, సైమా ఠాకూర్లతోపాటు సబ్బినేని మేఘన, స్నేహ దీప్తి, అంజలి శర్వాణి (ఆంధ్రప్రదేశ్), యషశ్రీ (హైదరాబాద్) ఉన్నారు. -
WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 మెగా వేలంలో భారత క్రికెటర్లు దీప్తి శర్మ, నల్లపురెడ్డి శ్రీచరణి సత్తా చాటారు. వన్డే వరల్డ్కప్-2025లో వీరిద్దరు అదరగొట్టిన విషయం తెలిసిందే. దీప్తి ఈ మెగా టోర్నీలో 215 పరుగులు సాధించడంతో పాటు.. 22 వికెట్లు కూల్చింది.మరోవైపు.. లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణి (Shree Charani) పద్నాలుగు వికెట్లతో దుమ్ములేపింది. ఈ క్రమంలో అంచనాలకు అనుగుణంగా దీప్తి శర్మ ఈసారి వేలంపాటలో అత్యధిక ధర పలికిన ప్లేయర్గా నిలవగా.. శ్రీచరణి సైతం జాక్పాట్ అందుకుంది.మరి డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలంలో వీరితో పాటు అత్యధిక ధర పలికిన ప్లేయర్లు ఎవరో చూసేద్దామా!దీప్తి శర్మ (భారత్)👉ఆల్రౌండర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్అమెలియా కెర్ (న్యూజిలాండ్)👉ఆల్రౌండర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్శిఖా పాండే (భారత్)👉ఆల్రౌండర్- కనీస ధర రూ. 20 లక్షలు- రూ. 2.4 కోట్లకు దక్కించుకున్న యూపీ వారియర్స్సోఫీ డివైన్ (న్యూజిలాండ్)👉ఆల్రౌండర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 2 కోట్లకు కొనుక్కున్న గుజరాత్ జెయింట్స్మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా)👉బ్యాటర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.90 కోట్లకు సొంతం చేసుకున్న యూపీ వారియర్స్శ్రీచరణి (భారత్)👉ఆల్రౌండర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.3 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్చినెలె హెన్రి (వెస్టిండీస్)👉ఆల్రౌండర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.30 కోట్లకు కొనుక్కున్న ఢిల్లీ క్యాపిటల్స్ఫోబే లిచిఫీల్డ్ (ఆస్ట్రేలియా)👉బ్యాటర్- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్లారా వొల్వర్ట్ (సౌతాఫ్రికా)👉బ్యాటర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ఆశా శోభన (భారత్)👉బౌలర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న యూపీ వారియర్స్లారెన్ బెల్ (ఇంగ్లండ్)👉బౌలర్- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 90 లక్షలకు కొనుక్కున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.చదవండి: WPL 2026 Auction Updates: ఎవరికి ఎంత ధర? -
అయ్యో పాపం!.. దీప్తి శర్మకే ఎందుకిలా?
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 మెగా వేలంలో భారత ఆల్రౌండర్ దీప్తి శర్మకు భారీ ధర దక్కింది. న్యూఢిల్లీ వేదికగా గురువారం నాటి వేలంపాటలో యూపీ వారియర్స్ ఆమెను ఏకంగా రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఆదిలో దీప్తి కోసం ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.కాగా డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్ (2023) నుంచి దీప్తి శర్మ యూపీ వారియర్స్కే ప్రాతినిథ్యం వహిస్తోంది. అలిసా హేలీ గాయం వల్ల దూరం కావడంతో 2025లో యూపీ కెప్టెన్గానూ దీప్తి వ్యవహరించింది. అయితే, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆమె సారథ్యంలో యూపీ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదు.ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ఇదిలా ఉంటే.. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025లో భారత్ విజేతగా నిలవడంలో దీప్తి శర్మదే ముఖ్య పాత్ర. ఈ ఆల్రౌండర్ మూడు అర్ధ శతకాల సాయంతో 215 పరుగులు చేయడంతో పాటు.. మొత్తంగా 22 వికెట్లు కూల్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకుంది. ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు కూల్చడం హైలైట్గా నిలిచింది.ఢిల్లీ క్యాపిటల్స్ తప్పఈ నేపథ్యంలో యూపీ దీప్తిని రిటైన్ చేసుకుంటుందని భావించగా.. అనూహ్యంగా ఆమెను వేలంలోకి వదిలింది. వేలంలో దీప్తి కోసం ఫ్రాంఛైజీలు ఎగబడతాయని భావించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తప్ప ఎవరూ కనీసం ఆమె వైపు చూడలేదు.ఈ క్రమంలో కనీస ధర రూ. 50 లక్షలకు దీప్తి వేలంలోకి రాగా ఢిల్లీ అదే ధరకు దీప్తిని కొనుగోలు చేయాలనుకుంది. ఇంతలో రంగంలోకి దిగిన యూపీ.. రైట్ టు మ్యాచ్ (RTM) కార్డు ద్వారా అదే ధర చెల్లించి దీప్తిని సొంతం చేసుకోవాలని భావించింది. అయితే, ఢిల్లీ ఒక్కసారిగా దీప్తి ధరను రూ. 3.2 కోట్లకు పెంచింది.ఢిల్లీ వదిలేలా లేదని భావించిన యూపీ రూ. 3.2 కోట్ల వద్ద తమ RTM కార్డును ఉపయోగించి దీప్తిని తిరిగి సొంతం చేసుకుంది. ఫలితంగా డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ప్లేయర్గా.. ఆష్లే గార్డ్నర్ (గుజరాత్- 2023- రూ. 3.2 కోట్లు) రికార్డు సమం చేసింది. కాగా ఆర్సీబీ 2023లో స్మృతి మంధానను రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేయగా.. ఆమె లీగ్లో అత్యంత ఖరీదైన ప్లేయర్గా కొనసాగుతోంది. చదవండి: WPL 2026: వేలంలో శ్రీచరణికి భారీ ధర -
WPL 2026: వేలంలో శ్రీచరణికి భారీ ధర
భారత క్రికెటర్, కడప ముద్దుబిడ్డ నల్లపురెడ్డి శ్రీచరణి (Shree Charani)కి జాక్పాట్ తగిలింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఆమె కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో శ్రీచరణికి భారీ ధర దక్కింది.ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్లో భారత్ చాంపియన్గా నిలవడంలో శ్రీచరణిది ముఖ్య భూమిక. ఈ మెగా ఈవెంట్లో శ్రీచరణి ఏకంగా పద్నాలుగు వికెట్లు పడగొట్టింది. తద్వారా భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ నిలిచింది. రూ. 30 లక్షల కనీస ధరఈ నేపథ్యంలో ప్రపంచకప్ విజేత శ్రీచరణికి భారీ ధర దక్కుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆమె అదరగొట్టింది. రూ. 30 లక్షల కనీస ధరతో శ్రీచరణి వేలంలోకి రాగా.. యూపీ వారియర్స్ తొలి బిడ్ వేసింది. ఆ వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దిగి.. ధరను ఏకంగా రూ. 75 లక్షలకు పెంచింది.దీంతో యూవీ వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఆ వెంటనే మళ్లీ రూ. 90 లక్షలకు ధరను పెంచింది. ఈ క్రమంలో శ్రీచరణిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీ క్యాపిటల్స్ ధరను ఏకంగా రూ. 1.3 కోట్లకు పెంచగా.. యూపీ వెనక్కి తగ్గింది. ఫలితంగా శ్రీచరణి రూ. 1.3 కోట్లకు మళ్లీ సొంతగూటి (ఢిల్లీ)కి చేరుకుంది.ఎదురులేని చరణికాగా గతంలో శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడింది. 2024 సీజన్లో రూ. 55 లక్షలకు ఆమెను ఢిల్లీ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. దీంతో అత్యధిక ధర దక్కించుకున్న నాటి అన్క్యాప్డ్ ప్లేయర్ల లిస్టులో శ్రీచరణి చేరింది. అరంగేట్రంలోనే ఎలిస్ పెర్రీని అవుట్ చేసి ఆగమనాన్ని ఘనంగా చాటింది ఈ స్పిన్ బౌలర్.ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన శ్రీచరణి 2025 ఏప్రిల్లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. శ్రీలంకతో ముక్కోణపు వన్డే సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అదే ఏడాది ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా టీ20లలోనూ అడుగుపెట్టింది. 4/12 గణాంకాలతో సత్తా చాటి తొలి అంతర్జాతీయ టీ20లోనే ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్గా నిలిచింది.ఇక ఇప్పటి వరకు భారత్ తరఫున 18 వన్డేలు, ఐదు టీ20లు ఆడిన 21 ఏళ్ల శ్రీచరణి.. వరల్డ్కప్లో ఏకంగా పదకొండు వికెట్లు కూల్చి సత్తా చాటింది. ప్రపంచకప్ విజేతగా డబ్ల్యూపీఎల్ వేలంలోకి వచ్చిన ఆమె కనీస ధర.. దాదాపుగా 333 శాతం పెరగడం విశేషం. -
WPL 2026 Auction: ముగిసిన వేలం.. ఎవరికి ఎంత ధర?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ మెగా వేలం ముగిసింది. న్యూఢిల్లీ వేదికగా గురువారం నాటి ఈ వేలంపాటకు మల్లికా సాగర్ ఆక్షనీర్గా వ్యవహరించారు. డబ్ల్యూపీఎల్లోని మొత్తం ఐదు ఫ్రాంచైజీల్లో కలిపి 73 స్థానాలు ఖాళీ ఉన్నాయి. వీటి కోసం ఏకంగా 277 మంది వేలంలో పోటీ పడుతున్నారు. ఇందులో 194 మంది భారత క్రికెటర్లే ఉండటం విశేషం.చదవండి: WPL 2026: రిటైన్ చేసుకున్న, రిలీజ్ చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితాWPL 2026 Auction Updates:👉వేలంలో చివరి ప్లేయర్.. ఆయూషీ సోనిని రూ.30 లక్షలకు కొన్న గుజరాత్👉డాన్నీ వ్యాట్ హాడ్జ్ను రూ.50 లక్షలకు కొన్న గుజరాత్ 👉ప్రతీక్ రావల్ను రూ.50 లక్షలకు కొన్న యూపీ👉మిన్ను మణిని రూ.40 లక్షలకు కొన్న ఢిల్లీ👉దయాలన్ హేమలతను రూ.30లక్షలకు కొన్న ఆర్సీబీ👉రాజేశ్వరి గైక్వాడ్ను రూ.40 లక్షలకు కొన్న గుజరాత్ 👉ఆసీస్ సూపర్ బౌలర్ మిల్లిసెంట్ హాల్ ఇల్లింగ్వర్త్ను రూ.10 లక్షలకు కొన్న ముంబై👉సైకా ఇషాక్ను రూ.30 లక్షలకు కొన్న ముంబై👉జి. త్రిషను రూ.10 లక్షలకు తీసుకున్న యూపీ👉ప్రత్యుష కుమార్ను రూ.10 లక్షలకు తీసుకున్న ఆర్సీబీ👉పూనమ్ ఖేమార్ను రూ. 10 లక్షలకు కొన్న ముంబై👉శివాంగి సింగ్ను రూ. 10 లక్షలకు కొన్న గుజరాత్👉గౌతమీ నాయక్ను రూ. 10 లక్షలకు కొనుగోలు చేసిన ఆర్సీబీ👉సుమన్ మీనాను రూ. 10 లక్షలకు కొన్న ముంబై👉అన్క్యాప్డ్ ఆల్రౌండర్లు త్రివేణి వశిష్టను రూ. 20 లక్షలకు, నల్లరెడ్డిని రూ. 10 లక్షలకు కొన్న ముంబై👉సౌతాఫ్రికా ఆల్రౌండర్ క్లోయీ ట్రియాన్ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్👉భారత అన్క్యాప్డ్ ఆల్రౌండర్ సుమన్ మీనాను రూ. 10 లక్షలకు కొనుగోలు చేసిన యూపీ👉అమెరికా ప్లేయర్ తారా నోరిస్ను రూ. 10 లక్షలకు కొన్న యూపీ వారియర్స్.👉ఆస్ట్రేలియాకు చెందిన లూసీ హామిల్టన్ను రూ. 10 లక్షలకు కొన్న ఢిల్లీ👉ఆసీస్ ఆల్రౌండర్ కిమ్ గార్త్ను రూ. 50 లక్షలకు సొంతం చేసుకున్న గుజరాత్👉యస్తికా భాటియాను రూ. 50 లక్షలకు కొన్న గుజరాత్👉సిమ్రాన్ షేక్ను రూ. 10 లక్షలకు కొన్న యూపీ👉షిప్రా గిరిని రూ. 10 లక్షలకు కొనుక్కున్న యూపీ👉మమత మడివాలాను రూ. 10 లక్షలకు కొన్న ఢిల్లీ👉హ్యాపీ కుమారిని రూ. 10 లక్షలకు సొంతం చేసుకున్న గుజరాత్👉నందాని శర్మను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ👉ఆసీస్ ఆల్రౌండర్ గ్రేస్ హ్యారిస్ను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన ఆర్సీబీ👉ఆస్ట్రేలియా ఆల్రౌండర్ నికోలా క్యారీని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై👉ఆల్రౌండర్ అనుష్క శర్మను రూ. 45 లక్షలకు దక్కించుకున్న గుజరాత్👉ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ జార్జియా వారేహామ్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేసిన గుజరాత్👉ఆల్రౌండర్లు తనూజ కణ్వార్ను రూ. 45, కనిక్ అహుజాను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్👉రహీలా ఫిర్దోజ్ను రూ. 10 లక్షలకు కొనుక్కున్న ముంబైఆల్రౌండర్ పూజా వస్త్రాకర్కు రూ.85 లక్షలుకొనుగోలు చేసిన ఆర్సీబీవికెట్ కీపర్ తాన్యా భాటియాను రూ. 30 లక్షలకు కొన్న ఢిల్లీ క్యాపిటల్స్అరుంధతి రెడ్డి ఆర్సీబీకిభారత పేసర్, హైదరాబాదీ స్టార్ అరుంధతి రెడ్డిని ఆర్సీబీ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది.ఎస్ సజనను కొనుగోలు చేసిన ముంబైసుజన కనీస ధర రూ. 30 లక్షలతో వేలంలోకి రాగా.. ముంబై రూ. 75 లక్షలకు సొంతం చేసుకుంది.ప్రతికా రావల్కు భారీ షాక్భారత స్టార్ ఓపెనర ప్రతికా రావల్ వేలంలో అమ్ముడుపోలేదు. వరల్డ్కప్ -2025లో సత్తా చాటిన ఆమెపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. ఈ టోర్నీ సందర్భంగా ప్రతికా చీలమండకు గాయం అయింది. ఆమె కోలుకునేందుకు చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతోనే ఫ్రాంఛైజీలు ఆమెను కొనుగోలు చేయనట్లు తెలుస్తోంది.కశ్వీ గౌతమ్కు రూ. 65 లక్షలుతొలుత కశ్వీని కొనుగోలు చేసిన యూపీ.. RTM ద్వారా తిరిగి దక్కించుకున్న గుజరాత్శిఖా పాండేకు రూ. 2.4 కోట్లుశిఖా పాండేను కొనుగోలు చేసిన యూపీ వారియర్స్డియెండ్రా డాటిన్ యూపీకియూపీ రూ. 80 లక్షలకు విండీస్ ఆల్రౌండర్ డియెండ్రా డాటిన్ను సొంతం చేసుకుంది.అమ్ముడుపోని అన్క్యాప్డ్ ప్లేయర్లు (కనీస ధర రూ. 10 లక్షలు)డవీనా పారిన్, వ్రింద దినేశ్, దిశా కసత్, ఆరుషి గోయెల్, సనికా చల్కే, హుమైరా కాజీ, అమన్దీప్ కౌర్, గొంగడి త్రిష, జింతిమణి కలిత. యశశ్రీ, షిప్రా గిరి, మమత మడివాలా, ఖుషి భాటియా, ప్రత్యూష కుమార్, నందిని కశ్యప్, హ్యాపీ కుమారి, నందిని శర్మ, కోమల్ప్రీత్ కౌర్, మిల్లీ ఇల్లింగ్వర్త్, షబ్నమ్ షకీల్, ప్రకాశిక నాయక్, భారతి రావల్, ప్రియాంక్ కౌశల్, పరుణిక సిసోడియా, జాగ్రవి పవార్.అన్క్యాప్డ్ ప్లేయర్ల వేలంముంబైకి సంస్కృతి గుప్తరూ. 20 లక్షలకు సంస్కృతిని కొనుగోలు చేసిన ముంబైఆర్సీబీకి అన్క్యాప్డ్ ఆల్రౌండర్భారత అన్క్యాప్డ్ ఆల్రౌండర్ ప్రేమా రావత్ను ఆర్సీబీ రూ. 20 లక్షలకు తిరిగి దక్కించుకుంది. గుజరాత్ జెయింట్స్ ప్రేమ కోసం బిడ్ వేయగా.. RTM కార్డు ద్వారా అదే ధర చెల్లించి సొంతం చేసుకుంది. దీయా యాదవ్భారత క్రికెటర్ దీయా యాదవ్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 10 లక్షల కనీస ధరకు కొనుక్కుంది.ముగిసిన వికెట్ కీపర్లు, స్పిన్నర్లు, పేసర్ల వేలంఆశా శోభనకు జాక్పాట్కనీస ధర రూ. 30 లక్షలతో వేలంలోకి వచ్చిన భారత స్పిన్నర్ ఆశా శోభనకు జాక్పాట్ తగిలింది. ఆర్సీబీతో పోటీ పడి మరీ యూపీ వారియర్స్ రూ. 1.1 కోట్లకు ఆమెను దక్కించుకుంది.ఆర్సీబీకి లిన్సే స్మిత్ఇంగ్లండ్ స్పిన్నర్ లిన్సే స్మిత్ను ఆర్సీబీ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.షబ్నమ్ ఇస్మాయిల్ను కొనుక్కున్న గుజరాత్సౌతాఫ్రికా స్టార్ షబ్నమ్ ఇస్మాయిల్ను రూ. 60 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది.టైటస్ సాధు ధర ఎంతంటే?భారత స్పిన్నర్ టైటస్ సాధును గుజరాత్ రూ. 30 లక్షలకు కొనుక్కుంది.క్రాంతి గౌడ్ ధర ఎంతంటే?యూపీ వారియర్స్ కనీస ధర రూ. 50 లక్షలకే వరల్డ్కప్ విన్నర్, భారత పేసర్ క్రాంతి గౌడ్ను సొంతం చేసుకుంది.ఆర్సీబీకి లారెన్ బెల్ 24 ఏళ్ల ఇంగ్లండ్ పేసర్ లారెన్ బెల్ను ఆర్సీబీ రూ. 90 లక్షలకు కొనుగోలు చేసింది.ఉమా ఛెత్రి అన్సోల్డ్వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన ఉమా ఛెత్రికి భారీ షాక్. రూ. 50 లక్షల కనీస ధరకు కూడా ఎవరూ ఆమెను కొనలేదుజలిజెల్లె లీ ధర ఎంతంటే?సౌతాఫ్రికా వికెట్ కీపర్ లిజెల్లె లీని రూ. 30 లక్షల కనీస ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది.హర్లిన్ డియోల్కు కనీస ధరయూపీ వారియర్స్ రూ. 50 లక్షలకు భారత ఆల్రౌండర్ హర్లిన్ డియోల్ను కొనుగోలు చేసింది.రాధా యాదవ్ ఆర్సీబీకిగుజరాత్తో పోటీపడి భారత స్పిన్నర్ రాధా యాదవ్ను ఆర్సీబీ రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది.స్నేహ్ రాణాకు రూ. 50 లక్షలుఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు భారత స్పిన్నర్ స్నేహ్ రాణాను కొనుక్కుంది.నదినె డిక్లెర్క్ ఏ జట్టుకంటే?సౌతాఫ్రికా పవర్ హిట్టింగ్ ఆల్రౌండర్ నదినె డిక్లెర్క్ను ఆర్సీబీ రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది.శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్కువరల్డ్కప్-2025 విజేత, ఆంధ్ర క్రికెటర్ శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.3 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.చినెల్ హెన్రికి రూ. 1.3 కోట్లువెస్టిండీస్ ఆల్రౌండర్ చినెల్ హెన్రీని రూ. 1.3 కోట్లకు కొనుకున్న ఢిల్లీ.జార్జియా వోల్ ఆర్సీబీకిఆసీస్ ప్లేయర్ జార్జియా వోల్ను ఆర్సీబీ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది.కిరణ్ నవ్గిరేకు రూ. 60 లక్షలుభారత బ్యాటర్ కిరణ్ నవ్గిరేను రూ. 60 లక్షలకు కొనుక్కున్న యూపీ వారియర్స్. అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక భారత క్రికెటర్ కిరణ్.ఫోబే లిచ్ఫీల్డ్ను కొనుక్కున్న యూపీఆసీస్ యువ బ్యాటర్ ఫోబీ లిచ్ఫీల్డ్ను రూ. 1.2 కోట్లకు కొనుక్కున్న యూపీ వారియర్స్అమ్ముడుపోని సౌతాఫ్రికా ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్సబ్బినేని మేఘనకు షాక్ఆంధ్ర క్రికెటర్ సబ్బినేని మేఘన అమ్ముడుపోలేదు. రూ. 30 లక్షల కనీస ధరకు కూడా ఆమెను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయలేదు.లారా వొల్వర్ట్ ఢిల్లీకిఢిల్లీ క్యాపిటల్స్ సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ లారా వొల్వర్ట్ను రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ ముందుగా బిడ్ వేసినా ఢిల్లీ వెనక్కి తగ్గలేదు. లారా కొనుగోలుతో ముగిసిన మార్క్యూ సెట్.మెగ్ లానింగ్కు రూ. 1.9 కోట్లుఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ మెగ్ లానింగ్ను రూ. 1.9 కోట్లకు కొనుక్కున్న యూపీ వారియర్స్. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా పనిచేసిన లానింగ్.రేణుకా ఠాకూర్కు తక్కువ ధరే!భారత స్టార్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ను రూ. 60 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్ జెయింట్స్అమేలీ కెర్కు ఎంత ధరంటే?న్యూజిలాండ్ క్రికెటర్ అమేలీ కెర్ను రూ. 3 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్వేలానికి ముందు వదిలేసి మళ్లీ కొనుగోలు చేసిన ముంబైసోఫీ ఎక్లిస్టోన్ ఆడేది ఆ జట్టుకేఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లిస్టోన్ను యూపీ వారియర్స్ రూ. 85 లక్షలతో తిరిగి సొంతం చేసుకుంది. RTM కార్డు వాడి ఆమెను దక్కించుకుంది. దీప్తి శర్మకు డిమాండ్ లేదా?👉వరల్డ్కప్ విన్నర్ దీప్తి శర్మను పట్టించుకోని ఫ్రాంఛైజీలు👉కనీస ధర రూ. 50 లక్షలకు దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ యత్నం👉ఇంతలో రంగంలోకి యూపీ వారియర్స్👉RTM (రైట్ టు మ్యాచ్) కార్డును ప్రయోగించిన యూపీ👉ఈ క్రమంలో యూపీతో పోటీపడిన ఢిల్లీ👉రూ. 3.2 కోట్లకు ధర పెంచిన ఢిల్లీ👉అనూహ్య రీతిలో RTM కార్డు ద్వారా దీప్తిని రూ. 3.2 కోట్లకు దక్కించుకున్న యూపీ👉వేలానికి ముందు దీప్తిని వదిలేసిన యూపీరూ. 50 లక్షలతో వేలంలోకి👉న్యూజిలాండ్ ఆల్రౌండర్ సోఫీ డివైన్ రూ. 50 లక్షలతో వేలంలోకి రాగా.. గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.అమ్ముడుపోని అలిసా హేలీ👉ఆస్ట్రేలియా సీనియర్ వికెట్ కీపర్, ఓపెనర్ అలిసా హేలీకి మొండిచేయి👉కనీస ధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన అలిసాను ఎవరూ కొనలేదు.


