breaking news
Worsens
-
ప్రపంచ వినాశనానికి కౌంట్డౌన్?
ప్రపంచంలోని వివిధ దేశాలలో జరుగుతున్న భీకర యుద్ధాలతో మానవాళి వినాశనం అంచునకు చేరింది. తాజాగా వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడులకు దిగిన దరిమిలా ఈ యుద్ధ భయాలు తారా స్థాయికి చేరాయి. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో మాదక ద్రవ్యాల ఉగ్రవాదానికి నాయకుడంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే వెనెజువెలా రాజధాని కారకాస్ సిటీపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఇదే కోవలో పలు దేశాల్లో ప్రస్తుతం భీకరంగా జరుగుతున్న యుద్ధాలు, వాటి పరిణామాలపై ప్రత్యేక కథనం ఇది..అంతర్జాతీయ రెస్క్యూ కమిటీ (ఐఆర్సీ) విడుదల చేసిన ‘ఎమర్జెన్సీ వాచ్లిస్ట్ 2026’ వాస్తవాలను కళ్లముందు ఉంచుతూ, ప్రపంచ దేశాలను మరింతగా భయపెడుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత దారుణమైన మానవీయ సంక్షోభాలను ఎదుర్కొంటున్న పలు దేశాల జాబితాను ఈ నివేదికలో పొందుపరిచారు. అంతర్జాతీయ సహాయం తగ్గుముఖం పట్టడం, యుద్ధాలు పెచ్చుమీరడం కారణంగా కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని, ప్రపంచ శాంతికి ఇది పెను సవాల్ అని ‘ఎమర్జెన్సీ వాచ్లిస్ట్ 2026’నివేదిక స్పష్టం చేసింది.సూడాన్: ఆగని మారణహోమంవరుసగా మూడవ ఏడాది కూడా ‘సూడాన్’ అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశంలో సైనిక దళాల మధ్య సాగుతున్న అంతర్యుద్ధం లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. 1.5 లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, దేశంలోని 40 శాతం జనాభా తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటోంది. విదేశీ శక్తులు ఆయుధాలు సరఫరా చేస్తూ, యుద్ధాన్ని పెంచి పోషిస్తుండటంతో సూడాన్లో శాంతి అనేది ఎండమావిలా మారింది.పాలస్తీనా: శిథిలాల కుప్పగా గాజా..గడచిన రెండేళ్లుగా పాలస్తీనాలో సాగుతున్న యుద్ధం గాజాను శ్మశాన వాటికగా మార్చేసింది. 70 వేల మందికి పైగా జనం మరణించగా, 90 శాతం మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 2025, అక్టోబర్లో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ, క్షేత్రస్థాయిలో హింస నిరంతరం కొనసాగుతూనే ఉంది. కనీస వైద్య సదుపాయాలు లేక, ఆహారం అందక గాజా నగరంలో కరువు తాండవిస్తోంది. లక్షలాది మంది చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో మృత్యువుతో పోరాడుతున్నారు.దక్షిణ సూడాన్: ముంచుకొస్తున్న అంతర్యుద్ధందక్షిణ సూడాన్ మరోసారి అంతర్యుద్ధం కోరల్లో చిక్కుకోనుంది. 2018 శాంతి ఒప్పందం విఫలం కావడంతో పాటు, పొరుగున ఉన్న సూడాన్ యుద్ధం కారణంగా చమురు ఎగుమతులు నిలిచిపోయి, ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారింది. దీనికి తోడు ఆరేళ్లుగా సంభవిస్తున్న వరదలు వ్యవసాయాన్ని దేశంలోని వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రస్తుతం 28 వేల మంది ఆకలితో చనిపోయే ప్రమాదం ఉందని ‘ఎమర్జెన్సీ వాచ్లిస్ట్ 2026’ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.ఇథియోపియా-హైతీ: గ్యాంగ్ వార్ల బీభత్సంఇథియోపియాలో ప్రాంతీయ విభేదాలు, అగ్రరాజ్యాల నిధుల కోత కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు హైతీలో ప్రభుత్వం అంటూ ఏదీ లేకపోవడంతో సాయుధ ముఠాల రాజ్యం భయోత్పాతాలను సృష్టిస్తోంది. రాజధాని పోర్ట్-అవు-ప్రిన్స్లో విపరీతంగా పెరిగిన లైంగిక దాడులు అక్కడ పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో తెలియజేస్తున్నాయి.మయన్మార్- కాంగో: సహజ వనరుల కోసం రక్తపాతంమయన్మార్లో సైనిక తిరుగుబాటు జరిగి ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ దేశంలో హింసాయుత ఘటనలు తగ్గుముఖం పట్టలేదు. 2025 నాటి భారీ భూకంపం మయన్మార్ను మరింతగా కుంగదీసింది. ఇక డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఖనిజాల కోసం సాయుధ ముఠాలు నిరంతరం ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా ఆహార లేమితో దేశంలోని 82 లక్షల మంది గర్భిణులు, పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వివిధ దేశాలకు అవసరమైన ఖనిజ సంపద ఇక్కడి నుండే వెళ్తున్నా, కాంగోలోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.లెబనాన్: ఆర్థిక పతనం- యుద్ధ భయంఒకప్పుడు పశ్చిమ ఆసియాలో ఆర్థిక పరిపుష్టి కలిగిన లెబనాన్ నేడు దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతోంది. కరెన్సీ విలువ 98 శాతం మేరకు పడిపోవడంతో ఇక్కడి సామాన్యుల బతుకు భారంగా తయారయ్యింది. ఇజ్రాయెల్-హెజ్బుల్లా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఎప్పుడు యుద్ధానికి దారితీస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.ఐఆర్సీ (ఐఆర్సీ) అభయం: ప్రాణాలను పణంగా పెట్టి..ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ రెస్క్యూ కమిటీ (ఐఆర్సీ) వివిధ దేశాలకు ఆశాకిరణంలా కనిపిస్తోంది. యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి వైద్యం, ఆహారం, రక్షణ కల్పిస్తూ లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతోంది. మానవత్వమే పరమావధిగా ఈ దేశాల్లోనూ ఐఆర్సీ తన సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఇది కూడా చదవండి: Republic Day: ‘పరేడ్’ టిక్కెట్ల బుకింగ్ షురూ.. రేట్లు ఎంతంటే? -
పరిస్థితి మరింత దిగజారుతోంది
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి మరింత దిగజారుతోందని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు70 లక్షలను మించడంతో ఆందోళన వ్యక్తం చేసిన సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. ఐరోపాలో పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం అవుతోందని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు. అమెరికా, దక్షిణ ఆసియాలోని 10 దేశాలనుంచి 75శాతం కేసులు నమోదయ్యాయంటూ విలేకరుల సమావేశంలో టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 రోజులలో తొమ్మిది రోజుల కాలంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రధానంగా ఆదివారం అత్యధిక సంఖ్యలో136,000 కేసులు నమోదయ్యాయన్నారు. ఆఫ్రికాలో చాలా దేశాలలో 1,000 కంటే తక్కువ కేసులు ఉన్నప్పటికీ, చాలా దేశాల్లో కొత్త ప్రాంతాల్లో విస్తరణ సహా కేసుల పెరుగుదల నమోదవుతోందని టెడ్రోస్ చెప్పారు. అదే సమయంలో ప్రపంచంలోని అనేక దేశాల్లో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని టెడ్రోస్ చెప్పారు. అయితే ఈ దేశాలలో అతిపెద్ద ముప్పు నిర్లక్ష్యమేనని టెడ్రోస్ పేర్కొన్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే వుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 71,93,476 మంది ఈ వైరస్ బారినపడగా 4,08,614 మందికి పైగా బాధితులు మరణించారు. -
యాక్సిస్ బ్యాంకుకు కార్పొరేట్ రుణాల సెగ
ముంబై: దేశంలో మూడవ అతిపెద్ద ప్రయివేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకును మొండి బకాయిల సెగ బాగానే తాకింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసిక ఫలితాల్లో బ్యాంక్ భారీ నికర లాభాలను నమోదు చేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 83 శాత పడిపోయింది. బ్యాంక్ నికర లాభం 83 శాతం క్షీణించి రూ. 319 కోట్లను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ.1,915.60 కోట్ల నికర లాభాలు సాధించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) మాత్రం 11 శాతం పెరిగి రూ. 4,514 కోట్లను అధిగమించింది. నికర ఎన్పీఏలు కూడా 0.48 శాతం నుంచి 2.02 శాతానికి ఎగశాయి.క్యూ2(జూలై-సెప్టెంబర్)లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.54 శాతం నుంచి 4.17 శాతానికి ఎగబాకాయని బ్యాంక్ ప్రకటించింది. గతంలో ప్రకటించిన రూ.7,287 కోట్ల సమస్యాత్మక రుణాలు సెకండ్ క్వార్టర్ ను ప్రభావితం చేసినట్టు చెప్పారు. ఇంకా రూ.13,789 కోట్లరుణాలను వాచ్ లిస్ట్ లో ఉన్నట్టు వెల్లడించారు. ప్రధానంగా కార్పొరేట్ రుణాల ఎగవేత బ్యాంకు రికార్డును దెబ్బతీసిందని బ్యాంక్ ఫైనాన్స్ ఛీఫ్ జైరాం శ్రీధరన్ చెప్పారు. వార్షిక ప్రాతిపదికన మొదటి సగం లో దాదాపు 305 బేసిస్ పాయింట్లను రికార్డ్ చేయనుంది. మునుపటి మార్గదర్శకత్వం 125-150 బేసిస్ పాయింట్లుకంటే రెట్టింపు కంటే ఎక్కువ. ప్రొవిజన్లు ఐదు రెట్లు ఎగసి లాభాలను దెబ్బతీశాయి. ప్రొవిజన్లకు రూ. 3623 కోట్లను కేటాయించింది.నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 20 బేసిస్ పాయింట్లు నీరసించి 3.64 శాతానికి చేరాయి. ఈ నిరాశాజనక ఫలితాలతో మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. దాదాపు 7.56 శాతం పతనమైంది. -
గుంటూరులో తాగునీటి కటకట


