-
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్కప్-2024కు మరో ఐదు వారాల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. కాగా ఈ మెగా ఈవెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ ఎంపికైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇటీవలే మియామీ గ్రాండ్ ప్రిక్స్లో సందడి చేసిన యువరాజ్.. వరల్డ్కప్ ట్రోఫితో ఫోటోలకు ఫోజులిచ్చాడు. రేసింగ్ ట్రాక్పై వరల్డ్కప్ ట్రోఫితో యువీ ఫోటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను యువరాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా 2007లో జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన యువీ.. టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలోనే ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదాడు. ఇప్పటికి టీ20 వరల్డ్కప్ అంటే యువరాజ్ సింగ్ కోసం ప్రతీ ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే యువీని ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. యువీ.. ఉసెన్ బోల్ట్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వరల్డ్కప్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. -
వరల్డ్కప్ ట్రోఫీని ఎవరు తయారు చేశారో తెలుసా.. ధర ఎంతంటే?
వన్డే ప్రపంచకప్.. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ వరల్డ్కప్ ట్రోఫీని సాధించాలని ప్రతీ జట్టు కలలు కంటుంది. మొత్తం 10 జట్లు బరిలోకి దిగితే చివరకు టైటిల్ను ముద్దాడేది ఒకే ఒక జట్టు. వారే విశ్వవిజేతగా నిలుస్తారు. ఈ సారి ఈ మెగా టోర్నీకి భారత్ వేదికైంది. పుష్కర కాలం తర్వాత భారత గడ్డపై వన్డే వరల్డ్కప్ జరగనుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఢిపెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్తో వన్డే ప్రపంచకప్-2023కు తెరలేవనుంది. ఈ వరల్డ్కప్కు సంబంధించిన ట్రోఫీ తాజాగా హైదరాబాద్లో సందడి చేసింది. ప్రముఖ కట్టడం చార్మినార్, హుస్సేన్ సాగర్ వద్ద ట్రోఫీని ఉంచి ఐసీసీ ప్రతినిధులు ప్రచారం నిర్వహించారు. అనంతరం వరల్డ్ కప్లో మూడు మ్యాచ్లకు వేదికైన ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో ట్రోఫీని ప్రదర్శించారు. ఈ ట్రోఫి ఇప్పటివరకు 18 దేశాలను ఈ తిరిగి వచ్చింది. ఇక వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచే జట్టుకు బహుకరించే ట్రోఫీ చరిత్ర, అది ఎవరు తయారు చేశారు? ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ప్రుడెన్షియల్ వరల్డ్కప్(1975) 1975లో వన్డే ప్రపంచకప్ ప్రయాణం మొదలైంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన తొలి వన్డే వరల్డ్కప్ను వెస్టిండీస్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అయితే ఈ టోర్నీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో జరిగినప్పటికీ ప్రుడెన్షియల్ వరల్డ్కప్ అని నామకరణం చేశారు. ఎందుకంటే ప్రుడెన్షియల్ అనే భీమా కంపెనీ తొలి వరల్డ్కప్ స్పాన్సర్గా వ్యవహరించింది. మొట్టమొదటి వరల్డ్కప్ ట్రోఫీ వెండి, బంగారం కలయికతో రూపొందించబడింది. ట్రోఫీ పైబాగంలో బంగారు పూత పూసిన క్రికెట్ బంతిని అమర్చారు. 1979, 1983 ప్రపంచకప్లో కూడా ప్రుడెన్షియల్ కంపెనీనే స్పాన్సర్గా వ్యవహరించింది. 1979 వన్డే ప్రపంచకప్ను రెండో సారి విండీస్ కైవసం చేసుకుగా.. 1983 వరల్డ్కప్ను అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన భారత జట్టు ముద్దాడింది. రిలయన్స్ ట్రోఫీ(1987).. ఇక 1987 వరల్డ్కప్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టైటిల్ స్పాన్సర్గా ఎంపికైంది. దీంతో ఆ ఏడాది మెగా ఈవెంట్ను రిలయన్స్ కప్గా పిలిచారు. రిలయన్స్ కూడా వెండి, బంగారం కలయికతో కప్ను తాయారు చేసింది. ప్రుడెన్షియల్ కంపెనీ వలే రిలయన్స్ కూడా ట్రోఫీ రూపకల్పనలో క్రికెట్ బాల్ను చేర్చింది. ఇక ఈ మెగా టోర్నీలో అద్బుత ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా జట్టు తొలి వరల్డ్కప్ను తమ ఖాతాలో వేసుకుంది. బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచ కప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కేవలం ఒక్క వరల్డ్కప్కు మాత్రమే టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించింది. 1992 ప్రపంచకప్లో మరోకొత్త టైటిల్ స్పాన్సర్ పుట్టుకొచ్చింది. బెన్సన్ అండ్ హెడ్జెస్ అనే బ్రిటీష్ సిగిరేట్ కంపెనీ 1992 ప్రపంచకప్కు టైటిల్ను స్పాన్సర్ చేసింది. దీంతో ఆ ఏడాది టోర్నీని బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్కప్ అని పిలిచారు. 1992 ప్రపంచకప్ పాకిస్తాన్ సొంతం చేసుకుంది. విల్స్ వరల్డ్కప్(1996) బెన్సన్ అండ్ హెడ్జెస్ కంపెనీ కూడా ఐసీసీతో తమ ప్రయాణాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. 1996 వన్డే ప్రపంచకప్లో విల్స్ అనే మరోసిగిరెట్ కంపెనీ టైటిల్ను స్పాన్సర్ చేసింది. దీంతో ఆ టోర్నీని విల్స్ వరల్డ్ కప్ 1996 అని పిలిచారు. ఈ విల్స్ వరల్డ్కప్ను శ్రీలంక ఎగరేసుకుపోయింది. ఐసీసీ కీలక నిర్ణయం.. ఇక 1996 వరల్డ్కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. 1999 వరల్డ్కప్ కోసం ఐసీసీనే ఒక సరికొత్త ట్రోఫీని ప్రవేశపెట్టింది. ఆ ట్రోఫీని తాయారు చేసే బాధ్యత లండన్లోని గారార్డ్ అనే ప్రముఖ జ్యుయలరీ సంస్థకు ఐసీసీ అప్పగించింది. వరల్డ్కప్ ట్రోఫీని తయారు చేయడానికి వారికి రెండు నెలల సమయం పట్టింది. వెండితో తయారైన ఈ ట్రోఫీకి పైనుంచి బంగారు పూత పూశారు. 60 సెంటీమీటర్ల ఎత్తుతో ఉన్న ఈ ట్రోఫీ పైన బంగారు వర్ణంలో గ్లోబు ఉంటుంది. ఈ గ్లోబ్కు సపోర్ట్గా మూడు సిల్వర్ కాలమ్లు ఉంటాయి. ఈ సిల్వర్ కాలమ్లు స్టంప్లు, బెయిల్స్ ఆకారంలో నిలువ వరుసగా ఉంటాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ను ప్రతిబింబించేలా ఈ ట్రోఫీని తాయారు చేశారు. గ్లోబ్ క్రికెట్ బంతిని సూచిస్తుంది. ఈ ట్రోఫీని ప్రత్యేక కొలతతో రూపొందించారు. ఏ కోణం నుంచి చూసిన ట్రోఫీ ఒకే విధంగా ఉంటుంది. ఈ ట్రోఫీ సుమారు 11 కిలోల బరువు ఉంటుంది. ధర ఎంతంటే? ఈ ట్రోఫీ తయారీకి ఐసీసీ 40వేల పౌండ్లు ఖర్చు చేసింది. అంటే ప్రస్తుత ధరల ప్రకారం దీని ధర రూ.30,85,320గా ఉంది. వరల్డ్కప్ విజేతగా నిలిచిన జట్టుకు ఈ ట్రోఫీని అందిస్తారు. విజేత పేరును ట్రోఫీ కింద భాగాన ముద్రిస్తారు. ఒరిజినల్ ట్రోఫీని పోలిన నకలును గెలిచిన జట్టుకు అందజేస్తారు. అసలు ట్రోఫీని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్లోని తమ కార్యాలయంలో ఉంచుతుంది. కాగా 1999 వరల్డ్కప్ కోసం తాయారు చేసిన ట్రోఫీనే ఇప్పటకి ఐసీసీ బహుకరిస్తుంది. చదవండి: PCA Stadium Pitch Report: ఆస్ట్రేలియా-భారత్ తొలి వన్డే.. రోహిత్ మూడో డబుల్ సెంచరీ ఇక్కడే! బ్యాటర్లకు పండగే -
మరోసారి ప్రయత్నిస్తాం
న్యూఢిల్లీ: తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్ టైటిల్ను వచ్చే ఏడాది సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లు భారత మహిళల క్రికెట్ వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. గతంలో మూడు పర్యాయాలు టైటిల్కు సమీపంగా వచ్చినప్పటికీ అనుకున్నది సాధించలేకపోయామని ఆమె వ్యాఖ్యానించింది. అందరి ఆశీర్వాదాలతో ఈసారి వరల్డ్కప్ సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. ‘2005లో... ఆ తర్వాత 2017 వన్డే ప్రపంచకప్లో రెండుసార్లు ఫైనల్లో బోల్తాపడ్డాం. అప్పుడు కెప్టెన్గా, ప్లేయర్గా చాలా కష్టపడ్డా. 2017 ఫైనల్లో గెలిస్తే రిటైర్ అవ్వాలని అనుకున్నా. కానీ అది జరగలేదు. ఆ తర్వాత 2018లో టి20 వరల్డ్కప్లో సెమీస్లో పరాజయం పాలయ్యాం. టైటిల్కు చాలా దగ్గరగా వచ్చి దూరమయ్యాం. కాబట్టి మరోసారి ప్రయత్నిద్దామని గట్టిగా నిశ్చయించుకున్నా. దేవుడి దయవల్ల ఈసారి సాధిస్తామని నమ్ముతున్నా’ అని 37 ఏళ్ల మిథాలీ వివరించింది. మహిళల క్రికెట్ ఆలస్యంగా బీసీసీఐ పరిధిలోకి రావడంతో ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది ప్రతిభగల అమ్మాయిలు క్రికెట్కు దూరమయ్యారని నిరాశ వ్యక్తం చేసింది. -
సాకర్ ఫైనల్ సమరం దృశ్యాలు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement