-
కనీస వేతనం ఎలా ఉండాలి?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని కార్మికులకు కనీస వేతనం నెలకు 18 వేల రూపాయలు ఉండాలన్నది బుధవారం నాడు ఢిల్లీని ముట్టడించిన కార్మికుల, కర్షకుల ప్రధాన డిమాండ్లలో ఒకటి. నెలకు 18 వేల రూపాయలన్నది ఎలా ప్రామాణికం? దేశంలో ప్రస్తుతం కనీస వేతన ఎంత ఇస్తున్నారు? దాన్ని ఎలా లెక్కిస్తున్నారు. ఏటా కనీస వేతనం పెరుగుతున్నదా ? తగ్గుతున్నదా? ఇతర దేశాల్లో ఈ వేతనం ఎలా ఉంది? కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు కనీస వేతనాన్ని నెలకు 18 వేల రూపాయలుగా నిర్ణయించింది. తమకు కూడా అంతే వేతనాన్ని కనీస వేతనంగా ఇప్పించాలని కార్మిక లోకం డిమాండ్ చేస్తోంది. 1948 నాటి పార్లమెంట్ చట్టం ప్రకారమే ఇప్పటికీ దేశంలో కనీస వేతనాన్ని అంచనా వేస్తున్నారు. నాటి చట్టానికే పలుసార్లు మార్గదర్శకాలను మారుస్తూ వచ్చారు తప్ప, చట్టం స్వరూపాన్ని ఇప్పటికీ మార్చలేక పోయారు. పర్యవసానంగా గత మూడు దశాబ్దాలుగా దేశం ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తున్నప్పటికీ పెరగాల్సిన కార్మికుడి వేతనం (విలువ ఆధారిత సూచిక ప్రకారం...ఉత్పత్తులు, వచ్చిన లాభాలను పరిగణలోకి తీసుకొని విలువను అంచనా వేస్తారు) తగ్గుతూ వస్తోంది. దీని అర్థం దేశం సాధిస్తున్న ఆర్థిక ఫలితాల్లో కార్మికుడికి సరైన భాగం లభించడం లేదు. ఫలితాల్లో ఎక్కువ భాగం యజమానులకే వెలుతోంది. 1981–1982 సంవత్సరం నుంచి 2011–12 సంవత్సరం వరకు అందుబాటులో ఉన్న ఆర్థిక పురోభివద్ధి గణాంకాల ప్రకారం కంపెనీల ఉత్పత్తి, లాభాలు ఎంతో పెరిగినా కార్మికుల కనీసవేతనాలు మాత్రం తగ్గుతూ వచ్చాయి. 2009–-2010లో ఆర్థిక పురోభివద్ధి విలువలో కార్మికుడి వేతనాల శాతం 11.9 శాతం ఉన్నట్లు తేలింది. అంతకు దశాబ్దం క్రితం 15 శాతం ఉండగా,ఆ తర్వాత తగ్గింది. అభివద్ధి చెందిన దేశాల సంగతి పక్కన పెడితే వర్ధమాన దేశాలకన్నా భారత కార్మికుల వేతనాలు ఎంతో తక్కువ. ఆర్థిక పురోభివద్ధి విలువ ఆధారిత వేతనాల పద్ధతి మన దేశంలో లేకపోవడంతో వేతనాలు తగ్గడం కనిపిస్తోంది. 1948 నాటి పార్లమెంట్ చట్టం ప్రమాణాల ప్రకారం నేడు కేంద్రం నిర్ణయించిన కనీస దినసరి వేతనం 176 రూపాయలుగా ఉంది. దీన్ని నెలలోని 31 రోజులకు లెక్కిస్తే 5,456 రూపాయలు మాత్రమే. ఈ కనీస వేతనాన్ని కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన చట్టంలో లేకపోయినప్పటికీ కేంద్రం పరిధిలోని ఓ కంపెనీ తన కార్మికుడికి ఈ కనీస వేతనం ఇస్తే సరిపోతుందన్నమాట. రోజువారిగా ఓ కార్మికుడు తీసుకునే కాలరీల ఆహారం, నలుగురు సభ్యులుగల కుటుంబంలో వారందరి బట్టలకయ్యే గుడ్డా, ఉండటానికి అద్దె, ఇద్దరు పిల్లల చదువు, వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రమాణంగా తీసుకొని దినసరి వేతనాలను లెక్కించే బరువు బాధ్యతలను పార్లమెంట్ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. తర్వాత సవరించిన ప్రమాణాల్లోఓ కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు పనిచేసినా, ఒకరి వేతనాన్నే పరిగణలోకి తీసుకోవాలని, కుటుంబంలోని నలుగురు వ్యక్తుల ఆహారాన్ని 2700 కాలరీలుగా లెక్కించాలని, వారికి ఏడాదికి 72 యార్డుల గుడ్డ ఖర్చు అవుతుందని, ఇద్దరి పిల్లల చదువు, నలుగురి ఆరోగ్యానికయ్యే ఖర్చును పరిగణలోకి తీసుకోవాలని, ఇంట్లో వంటకయ్యే ఖర్చును 20 శాతంగా తీసుకొని కనీస వేతనాన్ని లెక్కించాలని (అంటే కనీస వేతనంలో 20 శాతం డబ్బులను చెల్లిస్తే వారి ఇంధనపు ఖర్చు వెళ్లిపోవాలి) సూచనలున్నాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని లెక్కిస్తేనే నేడు కనీస దినసరి వేతనం 176 రూపాయలుగా తేలింది. కార్మికుడి కనీస అవసరాలను దష్టిలో పెట్టుకొని కనీస వేతనాన్ని లెక్కించే ఈ పద్ధతిని మార్చుకోవాలని, దేశం సాధిస్తున్న ఆర్థిక వద్ధిలో వాటా పద్ధతిన కార్మికుడికి వేతనాలు ఇవ్వాలని ఎప్పటి నుంచో ఆర్థిక నిపుణులు ఆందోళన చేస్తుండడంతో కనీస వేతనాలను నిర్ణయించే పూర్తి అధికారం ఇటు రాష్ట్రాలకు అటు కేంద్రానికి అప్పగిస్తూ గతంలో కేంద్రం ఓ బిల్లును తీసుకొచ్చింది. అది ఇప్పటికీ పార్లమెంట్లో మూలన పడి ఉంది. మనకంటే ఆర్థికంగా ఎంతో అభివద్ధి సాధిస్తున్న చైనాలో కార్మికుడి కనీస వేతనం నెలకు 22 వేల రూపాయలుంది. ఇక అమెరికాలోని రాష్ట్రాల్లో గంటకు ఏడున్నర డాలర్ల నుంచి ఎనిమిది డాలర్ల వరకు కనీస వేతనం ఉంది. అంటే రోజుకు ఎనిమిది గంటలు పనిచేసే ఓ కార్మికుడికి నెలకు లక్షా ఇరవై వేల రూపాయల నుంచి లక్షా యాభై వేల రూపాయల వరకు ఉంటుంది. అమెరికాకన్నా కూడా ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో కనీస వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా దేశాల్లో కనీస వేతనాలను చట్టబద్ధంగా అమలు చేయాల్సి ఉంటుంది. భారత్లో కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన లేదు. కనీస వేతనాన్ని నెలకు 18 వేల రూపాయలు చేయాలన్న డిమాండ్తోపాటు పంటలకు కనీస మద్దతు ధరలను పెంచాలని, వ్యయసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, ఆదివాసీల అటవి హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ దాదాపు ఒకటిన్నర లక్షల మంది కార్మికులు, కర్షకులు బుధవారం ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. ఇవే డిమాండ్లపై దాదాపు ఆరు నెలల క్రితం మార్చిలో 40 వేల మంది రైతులు మహారాష్ట్రలో 180 కిలోమీటర్ల పాద యాత్ర జరిపారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్ని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అయితే అందులో ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేరలేదని నాటి ర్యాలీలో పాల్గొని నేటి ర్యాలీలో కూడా పాల్గొన్న నాసిక్ నుంచి వచ్చిన సోమ్నాథ్ మంకర్ లాంటి వారు చెబుతున్నారు. సీపీఎం నాయకత్వంలోని యూనియన్ల మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కార్మికులు, కర్షకులు ర్యాలీకి తరలి వచ్చారు. -
ఆకలి పోరాటం
రాయగడ : జేకే పేపర్ మిల్ తమ డిమాండ్లను పరిష్కరించకపోవడంతో కార్మికులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. తొలుత 10రోజల క్రితం కార్మికలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఆం దోళనలు చేపడతామని అందులో పేర్కొన్నారు. చెప్పినట్టుగానే రోడ్లపై ర్యాలీ నిర్వహిస్తూ జిల్లా కార్మిక శాఖ కార్యాలయానికి చేరుకొని కార్యాల యం ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా 20 సంవత్సరాలుగా పని చేస్తున్న కాం ట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాం డ్ చేశారు. పని ఒత్తిడి అధికంగా ఉన్నా వేతనాలు మాత్రం పెంచడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే కార్మిక యూనియన్లు, యాజమాన్యం మధ్య జరుగుతున్న ఒప్పందాలు చట్టపరంగా జరగడం లేదని ఆరోపించారు. కార్మిక యూని యన్లు, యాజమాన్యం, కార్మిక శాఖల మధ్య కొ త్త ఒప్పందాలు చేసి కార్మికులకు అనుకూలంగా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం గానీ యాజమాన్యం గానీ స్పందించకపోవడంతో కార్మికులు రోడ్డెక్కవలసి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా కార్మికులతో పోలీసులు చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. -
నగర పంచాయతీగా దుబ్బాకను కొనసాగించాలి
పంచాయతీ కార్మికుల ర్యాలీ, రాస్తారోకో దుబ్బాక రూరల్: రద్దు చేసిన దుబ్బాక నగర పంచాయతీని ప్రభుత్వం కొనసాగించాలని నగర పంచాయతీ కార్మిక నాయకుడు రామస్వామి డిమాండ్ చేశారు. దుబ్బాక నగర పంచాయతీని పునరుద్ధరించాలని కోరు తూ బుధవారం కార్మికులు, వివిధ శాఖల సిబ్బంది ర్యాలీగా వెళ్లి బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. అనంతరం తహశీల్ కార్యాలయం వద్దకు వెళ్లి తహశీల్దార్ లక్ష్మణ్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ దుబ్బాక పంచాయతీలో 1980 సంవత్సరం నుంచి కొందరు 1989సంవత్సరం నుంచి మరికొందరు పనిచేస్తున్నారని, వీరు రూ. 500ల నుంచి రూ.3000 వేల మధ్య వేతనాలతో పనిచేస్తూ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నగర పంచాయతీలో విలీనమైన నాటినుంచి దుంపలపల్లి, ధర్మాజీపేట, చేర్వాపూర్, చెల్లాపూర్, మల్లాయిపల్లి, లచ్చపేట గ్రామాలకు చెందిన కార్మికులు సుమారు 80 మంది ఇక్కడ పనిచేస్తున్నారన్నారు. వారికి ఇప్పుడు కనీస వేతనాలు చెల్లిస్తున్నారన్నారు. దుబ్బాక నగర పంచాయతీ రద్దు చేస్తు కోర్టు తీర్పు ఇవ్వడంతో మళ్లీ తమ వేతనాలు తగ్గుతాయనే ఆందోళనలో ఉన్నారన్నారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దుబ్బాకను నగర పంచాయతీగా కొనసాగిం చాలని కోరారు. అనంతరం తహశీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డి, స్వామి, కార్మికులు పాల్గొన్నారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్
డిప్రెషన్లో ఉపాసన, అత్తారింటికి వెళ్లిన రామ్చరణ్ (ఫోటోలు)
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. త్వరలోనే రిటైర్మెంట్!?
ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తింది: సజ్జల
ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈవో
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement