breaking news
Womans Husband
-
ప్రేమించిన అమ్మాయికి ‘బాంబు’ కానుక
ఖైరాగఢ్ (ఛత్తీస్గఢ్): మ్యూజిక్ సిస్టమ్లో బాంబు పెట్టి ప్రేమించిన మహిళ భర్తకు బహుమతిగా పంపాడో వ్యక్తి. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది. ఖైరాగఢ్లోని కుసామి గ్రామానికి చెందిన వినయ్ వర్మ ఎల్రక్టీషియన్. కాలేజీ చదివేప్పటినుంచే ఓ యువతిని ప్రేమించాడు. ఆ విషయాన్ని ఆమెకూ చెప్పలేదు. ఈలోపు ఆమెకు పెళ్లయిపోయింది. ఎలాగైనా ఆమె భర్త ఖాన్ను చంపాలనుకున్నాడు. గూగుల్లో శోధించాడు. ఆన్లైన్ ట్యుటోరియల్స్ చూసి మ్యూజిక్ సిస్టమ్ స్పీకర్లో ఐఈడీని అమర్చాడు. మ్యూజిక్ సిస్టమ్ ప్లగిన్ చేయగానే బాంబు పేలిపోయేలా రూపొందించాడు. పార్సిల్ని మాన్పూర్లోని అఫ్సర్ఖాన్కు పంపించాడు. అయితే పార్సిల్ అందుకున్న ఖాన్ అనుమానంతో పోలీసులకు సమాచారం అందించాడు. బాంబు స్క్వాడ్ వచ్చి ప్యాకేజీని పరిశీలించగా, స్పీకర్ లోపల దాచిన 2 కిలోల ఐఈడీ దొరికింది. హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులు.. వినయ్వర్మను, అతనికి సహకరించిన మిత్రులను అరెస్టు చేశారు. వర్మకు వీటిని అందించిన స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. -
'అత్యాచార కేసుతో ఆ పార్టీకి సంబంధం లేదు'
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఐజీ అమితాబ్ థాకూర్పై అత్యాచార కేసు నమోదు చేయడం వెనుక అధికార సమాజ్వాదీ పార్టీ ప్రమేయం లేదని బాధితురాలి భర్త చెప్పారు. ఐజీపై కేసు పెట్టాలని తమపై రాజకీయ నాయకులెవరూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. ఐజీ తనపై అత్యాచారం చేశారని, ఇందుకు ఆయన భార్య కూడా సహకరిస్తుందని ఆరోపిస్తూ ఓ యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ తనను ఫోన్లో బెదిరించారని అమితాబ్ థాకూర్ ఫిర్యాదు చేసిన అనంతరం ఆయనపై రేస్ కేసు నమోదైంది. దీంతో ప్రతీకార చర్యగానే ఈ కేసు పెట్టారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి భర్త స్పందిస్తూ.. ఏ రాజకీయ నాయకుడితోనూ తనకు సంబంధాలులేవని చెప్పాడు.