-
‘నేను, మా నాన్న ఆయన సినిమాలకు ఫ్యాన్స్’
శ్రీలంక వెళ్లాలని భావిస్తున్న సూపర్స్టార్ రజినీకాంత్కు ఆ దేశం వీసా నిరాకరించిందనే వార్తలు కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రీలంక ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందని వాటి సారాంశం. అయితే ఆ వార్తలను శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్స తనయుడు నమల్ రాజపక్స కొట్టిపారేశారు. రజనీకాంత్కు శ్రీలంక ప్రభుత్వం వీసా నిరాకరించిందనడంలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. రజినీ సినిమాలకు తను పెద్ద అభిమానినని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. ‘ప్రముఖ నటుడు రజినీకాంత్కు శ్రీలకం ప్రభుత్వం వీసా నిరాకరించదనేది కేవలం రూమర్ మాత్రమే. శ్రీలంకలోని ప్రజల మాదిరిగానే నేను, మా నాన్న రజినీకాంత్ సినిమాలకు చాలా పెద్ద అభిమానులం. ఒకవేళ ఆయన మా దేశాన్ని సందర్శించుకోవాలంటే ఎలాంటి అవాంతరాలు ఉండబోవని’ చెప్పారు. అయితే కొద్ది రోజుల క్రితం శ్రీలంక నార్తర్న్ ప్రొవిన్స్ మాజీ ముఖ్యమంత్రి సీవీ విఘ్నేశ్వరన్ రజనీకాంత్ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీలంకలోని తమిళుల సమస్యలను ఆయన రజినీకాంత్తో చర్చించారు. ఈ భేటీ అనంతరం రజనీకాంత్ తమ దేశం రావాల్సిందిగా ఆహ్వానించారు. కాగా, ఇటీవల విడుదలైన రజనీకాంత్ దర్బార్ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సన్ పిక్చర్స్ బ్యానర్లో ‘తలైవార్ 168’ చిత్రంలో నటిస్తున్నారు. -
శ్రీలంక ప్రభుత్వంతో పనిచేసేందుకు రెడీ: తమిళ పార్టీ
శ్రీలంక ఉత్తరాది రాష్ట్రంలో ఘనవిజయం సాధించిన ప్రధాన తమిళ రాజకీయ పార్టీ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో ఎల్టీటీఈ ప్రాబల్యం తగ్గాక 25 ఏళ్ల అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో తమిళ్ నేషనల్ అలయెన్స్ (టీఎన్ఏ) సత్తచాటింది. నార్తర్న ప్రావిన్సియల్ కౌన్సిల్ (ఎన్పీసీ) ముఖ్యమంత్రిగా సి.వి.విఘ్నేశ్వరన్ ఎన్నికకావడం లాంఛనమే. తమిళుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో కలసి తమ పార్టీ పనిచేస్తుందని ఆయన చెప్పారు. ఐతే ప్రభుత్వంలో తాము చేరబోమని విఘ్నేశ్వరన్ స్పష్టం చేశారు. కౌన్సిల్ ప్రమాణ స్వీకారం చేశాక రాష్ట్రంలో పోలీసుల అధికారాలు, భూ సమస్యల గురించి చర్చించనున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో టీఎన్ఏకు తమిళులు మూకుమ్మడిగా మద్దతు పలికారు. 38 స్థానాలకు గాను టీఎన్ఏ 30 సీట్లు గెలుచుకుంది. జాఫ్నాలో పోటీచేసిన విఘ్నేశ్వరన్కు లక్షా 30 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. కాగా శ్రీలంకలో యూపీఎఫ్ఏ అధికారంలో ఉంది. అధ్యక్షుడు మహీందా రాజపక్సే ఈ పార్టీకి సారథ్యం వహిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement