-
నెలకు లక్షల్లో జీతాలు.. నెలాఖరుకు జేబులు ఖాళీ!
ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి రచించిన రిచ్ డాడ్-పూర్ డాడ్ పుస్తకంలో చెప్పినట్లే ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఉంది. దేశంలో సుమారు 80 శాతం మంది వైట్కాలర్ ఉద్యోగుల జీతాలు నెల తిరక్కుండానే అయిపోతున్నాయని ఓ సర్వేలో తేలింది. వీరిలో దాదాపు మూడోవంతు మంది జీతాలు నెలలో సగం రోజులు గడవకుండానే ఖర్చవుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. కన్సల్టింగ్ సంస్థ ఈవై, స్టార్టప్ రిఫైన్లు కలిసి సంయుక్తంగా ఎర్న్డ్వేజ్ యాక్సెస్ మోడల్(ఒక రకంగా రోజువారీ జీతం విధానం) (EWA)పై సర్వే నిర్వహించారు. ‘ఎర్న్డ్ వేజ్ యాక్సెస్ ఇన్ ఇండియా: ద ఫైనల్ ఫ్రంటియర్ ఆఫ్ ఎంప్లాయి వెల్బీయింగ్’ పేరిట ఈ నివేదికను తయారు చేశారు. ఈ నివేదిక ప్రకారం.. ఉద్యోగుల జీవన వ్యయం నిరంతరం పెరగడం, జీవనశైలి భయాలు, పేలవమైన ఆర్థిక ప్రణాళిక, ఈఎమ్ఐ ఖర్చులు వంటి కారణాలతో ఉద్యోగులు జీతాలు నెల తిరక్కుండానే అయిపోతున్నాయి. జూలై-ఆగస్టు 2021లో 20 నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్న భారతదేశంలోని 3,010 వేతన ఉద్యోగులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నివేదికను తయారు చేశారు. నెల ప్రారంభంలోనే 14 శాతం మంది, నెల మధ్యలో 20 శాతం, నెలాఖరునాటికి 47 శాతం వారి పూర్తిగా ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ఈ ఈడబ్ల్యూఏ సర్వే ప్రకారం కేవలం 38 శాతం మంది మాత్రమే సంతోషంగా ఉన్నారని, వారి ఆర్థికస్థితి అదుపులో ఉన్నట్లు ఈ అధ్యయనం హైలైట్ చేసింది. (చదవండి: విమానం ప్రమాదం, తండ్రి - కూతురు ప్రాణాలు కాపాడిన ఐపాడ్..!) ఐటీ ఉద్యోగుల చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు ఈ ఆర్థిక ఒత్తిడి కేవలం తక్కువ ఆదాయం గల వారికి మాత్రమే పరిమితం కాలేదు. ఎందుకంటే, నెలకు రూ.1,00,000 కంటే ఎక్కువ సంపాదించే వారిలో 59 శాతం మంది తమ జీతాలు నెలాఖరులోగా ఖర్చు అయిపోతున్నాయి.59 శాతం మందికి జీతాలు వచ్చే సమయానికి చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. వీరికి ఆర్ధిక క్రమశిక్షణ కొరవడినట్లు తేలింది. వీరు ఒక మార్కెట్ చక్రంలో ఇరుకున్నారు. వాస్తవానికి భారత్లో అత్యధిక వేతనాలు పొందే ఐటీ సెక్టార్లోని ఉద్యోగుల జీతాలను విచ్చల విడిగా ఖర్చు చేస్తున్నారు. దీంతో నెలాఖరులో చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. ఇక ఈడబ్ల్యూఏ విధానంలో జీతాలు తీసుకోవడానికి చాలా తక్కువ మంది ఉద్యోగులు ఆసక్తి చూపగా.. మిగిలిన వారు మరింత తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఈ సరికొత్త మోడల్లో మీరు సంపాదిస్తున్న సమయంలో ఎప్పుడైనా జీతాలను డ్రా చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా పశ్చిమ దేశాల్లో దీనిని అనుసరిస్తున్నారు. 14 రోజులకు ఒకసారి యుకెజి ఇండియా, రెఫిన్ వంటి సంస్థలు పాశ్చాత్య దేశాలు స్వీకరించిన నమూనాను భారతదేశంలో పరీక్షిస్తున్నాయి. ఇంకా అనేక ఇతర సంస్థలు ప్రతి 14 రోజులకు ఒకసారి జీతాలను ఉద్యోగులకు చెల్లించేందుకు సిద్దం ఆవుతున్నాయి. ఎఫ్ఎంసిజి, తయారీ, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రియల్ ఎస్టేట్, రిటైల్, రెస్టారెంట్లు, లాజిస్టిక్స్, పర్యాటకం, రవాణా వంటి రంగాలలో ఈడబ్ల్యుఏ విధానాన్ని అనుసరిస్తున్నాయని తేలింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, ఐటీ, టెలికమ్యూనికేషన్లు కంపెనీలు ఈడబ్ల్యుఏ విధానాన్ని దేశంలో అమలచేసేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలపై క్రేజ్ మరి ఇంతగా ఉందా...!) -
టాటాలో సంచలనం: భారీగా ఉద్యోగాల కోత
టాటా మోటార్స్ లో భారీ సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద పునర్ నిర్మాణ ప్రక్రియను టాటా మోటార్స్ చేపట్టింది. ఈ పునర్ నిర్మాణ చర్యలతో దాదాపు 1200-1300 మంది ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు కేటాయిస్తున్నారు. అంతేకాక వేరే యూనిట్లకు తరలి వెళ్లాలని లేదంటే కంపెనీ విడిచిపెట్టాలని ఉద్యోగులకు నిర్మోహమాటంగా టాటా మోటార్స్ యాజమాన్యం చెప్పేస్తోంది. ఇప్పటికే 2500 పొజిషన్లను కంపెనీ తీసివేసింది. కంపెనీ తొలగించిన వీరిలో ఎక్కువగా కిందిస్థాయి వారే ఉన్నారని తెలిసింది. టాటా మోటార్స్ లో ఈ పునర్ నిర్మాణ చర్యలు చేపట్టకపోతే, ఉద్యోగుల ఖర్చులు రూ.400-రూ.500 కోట్లు పెరిగే అవకాశముందని కంపెనీ హ్యుమన్ రిసోర్సస్ హెడ్ గజేంద్ర చందెల్ అన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాల్లో ఇది చాలా ఎక్కువని, ఈ ఏడాది బడ్జెట్ రూపొందించేటప్పుడే కొత్త రూపురేఖలను సిద్ధంచేశామని, దీంతో రూ.400 కోట్లను తగ్గించుకోవచ్చని అంచనావేసినట్టు చెప్పారు. సంస్థలో వైట్ కాలర్ పాపులేషన్ ఆందోళన కలిగిస్తోందని, 1500 మంది మేనేజింగ్ డైరెక్టర్లను తొలగించే యోచనలో ఉన్నట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్యుయెంటర్ బచక్ అంతకముందే పేర్కొన్నారు. గత 18 నెలల్లో టాటా మోటార్స్ లో 2500 వైట్-కాలర్ పొజిషన్లు ఖాళీ అయ్యాయని, ఇవి పొదుపుకు సహకరిస్తున్నాయని కంపెనీ చెప్పింది. వచ్చే రెండు-మూడేళ్లలో బ్లూ-కాలర్ ఉద్యోగాలు కూడా 3000 వరకు తగ్గిపోయే అవకాశముంది. ప్రస్తుతం కంపెనీలో 30వేల మంది బ్లూ-కాలర్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 10 శాతం తగ్గించుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. తమ ప్లాంట్ల ఉత్పత్తిని మెరుగుపరచడానికి కంపెనీ 10 శాతం వేతనాన్ని పనితీరు ఆధారితానికి లింక్ చేసింది. అయితే టాటా మోటార్స్ వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి నష్టాలనే నమోదుచేస్తోంది. బీఎస్-3 వాహనాల ఇన్వెంటరీతో 2017 ఆర్థిక సంవత్సరంలో రూ.2,480 కోట్ల నష్టాలను కంపెనీ మూటగట్టుకుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement