-
వామ్మో సెప్సిస్..!
వాషింగ్టన్: సెప్సిస్.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? రక్తానికి ఇన్ఫెక్షన్ సోకడం. శరీరంలో ప్రవహించే రక్తం అంతా కలుషితమైపోయి రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంతో మనిషి కుంగి కృశించిపోవడం. ఇప్పుడు ఈ జబ్బు ప్రాణాంతకంగా మారింది. ఇది సోకిందంటే శరీరం అంతా కుళ్లిపోయి మనిషి ప్రాణాలను తోడేస్తుంది. గతంలో కంటే సెప్సిస్ సోకిన మృతులు రెట్టింపు అయ్యాయని లాన్సెట్ జర్నల్ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. సెప్సిస్ ఇన్ఫెక్షన్ సోకిన ప్రతీ అయిదుగురిలో ఒకరు మృత్యువాత పడుతున్నారని పిట్స్బర్గ్ వర్సిటీ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. 2017లో ప్రపంచవ్యాప్తంగా సెప్సిస్ ఇన్ఫెక్షన్ కారణంగా 1.1 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయినట్టు లాన్సెట్ జర్నల్ నివేదికలో వెల్లడించింది. సెప్సిస్ సోకిన వారిలో ప్రాణాలతో బతికి బయటపడ్డా, జీవితాంతం మంచానికి అతుక్కుపోయే పరిస్థితి కూడా వస్తుందని అధ్యయనకారులు వెల్లడించారు. సెప్సిస్ పురుషుల్లో కంటే మహిళలకే అధికంగా సోకుతుంది. 2017 సంవత్సరంలో అత్యధికంగా నిరుపేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సెప్సిస్ కేసులు 85 శాతం వరకు నమోదుకాగా, ఇందులో ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లోనివే ఎక్కువ. 40 శాతం కంటే ఎక్కువ కేసులు అయిదేళ్లలోపు పిల్లల్లో కనిపిస్తున్నాయని వాషింగ్టన్ స్కూలు ఆఫ్ మెడిసన్ ప్రొఫెసర్ మోహెసన్ నఘావి అన్నారు. -
హిల్లరీపై ట్రంప్ ఆధిక్యం
వాషింగ్టన్ పోస్ట్-ఏబీసీ న్యూస్ సర్వేలో 1 శాతం మెజారిటీ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్పై తొలిసారిగా పైచేయి సాధించారు. వాషింగ్టన్ పోస్ట్/ఏబీసీ న్యూస్ సర్వేలో ట్రంప్.. హిల్లరీ కన్నా ఒక శాతం ముందంజలో ఉన్నారు. సర్వేలో 45 % మంది ఓటర్లు హిల్లరీ పక్షాన నిలవగా, ట్రంప్కు 46 % మంది ఓటర్ల మద్దతు లభించింది. మరోవైపు హిల్లరీ, ట్రంప్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ‘హిల్లరీ వారానికి 65 కోట్ల మంది వలసదారులను అమెరికాలోకి తీసుకురావాలనుకుంటున్నారు. అంటే 12 వారాల్లోనే అమెరికాలోని జనాభా, ప్రపంచ జనాభాను మించిపోతుంది. ఇదే జరిగితే మనకంటూ దేశమే ఉండదు’ అని ట్రంప్ అన్నారు. తొలుత అమెరికాలో అనేక కంపెనీలు ఏర్పాటై వేలాది ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చాయనీ, ఇప్పుడు ఆ ఉద్యోగాలన్నీ భారత్, చైనా, మెక్సికో తదితర దేశాలకు తరలిపోయాయనిపేర్కొన్నారు. తాను అధ్యక్షుడినైతే ఈ పరిస్థితిని చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రైవేటు ఈమెయిళ్ల కేసులో ఎఫ్బీఐ దర్యాప్తును పునఃప్రారంభించడంపై హిల్లరీ మండిపడ్డారు. ఈ విషయంలో తానే తప్పూ చేయలేదన్నారు. ట్రంప్కు రష్యాతో రహస్య సంబంధాలున్నాయని మీడియా నివేదిక వెలుగులోకి రావడంతో దానిపై సమాధానం చెప్పాలని హిల్లరీ డిమాండ్ చేశారు. ట్రంప్ సంస్థల్లో ఒక రహస్య సర్వర్ ఉందనీ, దాని నుంచి రష్యాలోని ఆల్ఫా బ్యాంకుకు చెందిన రెండు సర్వర్లతో ట్రంప్ కంపెనీ సంప్రదింపులు జరుపుతోందని నివేదికలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలను ట్రంప్ వర్గం తోసిపుచ్చింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement