-
వాల్తేర్ డివిజన్కు రూ.2857.85 కోట్లు కేటాయింపు
విజయనగరం టౌన్: ఈస్ట్కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్కు 2023–24 బడ్జెట్లో రూ. 2857.85 కోట్లు కేటాయించినట్టు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో విజయనగరం–సంబల్ పూర్ (టిట్లాఘర్) మూడోలైన్ (264.60 కిలోమీటర్లు) నిర్మాణానికి 920 కోట్లు, కొత్తవలస–కోరాపుట్ (189.278 కిలోమీటర్లకు) రూ. 410 కోట్లు కేటాయింపులు జరిగాయన్నారు. గోపాలపట్నం–విజయనగరం వరకూ ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ, బైపాస్లైన్లు ఏర్పాటుకు రూ. 32.78 కోట్లు, రోడ్డు సేఫ్టీ వర్క్స్, అండర్ బ్రిడ్జిలకు సంబంధించి గుమడ–పార్వతీపురం ఆర్ఓబీకి రూ.60 లక్షలు, పలాస–పూండి లైన్కు రూ.2.05 కోట్లు, పొందూరు–సిగడం రోడ్డు ఓవర్ బ్రిడ్జికి రూ.1.50 కోట్లు, కోమటిపల్లి–గజపతినగరం ఆర్ఓబీ లెవెల్ క్రాసింగ్ రూ. 2లక్షలు, పలాస–పూండి, నౌపడలలో లిమిటెడ్ హైట్ సబ్వేస్కు రూ.3.71 కోట్లు, కోటబొమ్మాళి–తిలారు, పలాస–పూండి,కోట బొమ్మాళి యార్డ్లలో లిమిటెడ్ హైట్ సబ్వేస్కు రూ.3.2కోట్లు, కొత్తవలస– కిరండాల్ సబ్వేస్ లెవెల్ క్రాసింగ్లకు రూ.78 లక్షలు, నౌపాడ–కోట బొమ్మాళి ఆర్ఓబీ సబ్వేకు రూ.2 కోట్లు, ఉర్లాం–శ్రీకాకుళం ఆర్ఓబీకి రూ.2 కోట్లు కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. రైల్వే ట్రాక్ల ఆధునికీరణకు సంబంధించి పలాస–విశాఖ–దువ్వాడకు రూ.40 కోట్లు, కోరాపుట్ –సింగపూర్ లైన్కు రూ.20.01 కోట్లు, సింగపూర్ –విజయనగరం రోడ్డుకు రూ.25 కోట్లు కేటాయించారన్నారు. రైల్వే అధికారులు, సిబ్బంది క్వార్టర్స్ ఆధునికీకరణ, రిపేర్లకు సంబంధించి రూ.15 లక్షలు కేటాయింపులు జరిగాయన్నారు. వీటితో పాటు సిగ్నల్ అండ్ టెలికమ్, వర్క్షాప్ ప్రొడక్షన్ యూనిట్స్, కొత్త లైన్లు, డబ్లింగ్ పనులు, రీమోడలింగ్స్, కొన్ని ప్రత్యేక గుర్తింపు పొందిన పనులకు నిధులు కేటాయించారన్నారు. -
గుడ్న్యూస్: ఈ రూట్లలో సంక్రాంతి పండుగకి ప్రత్యేక రైళ్లు
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ–శ్రీకాకుళం రోడ్–వికారాబాద్ మధ్య వయా దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. ►కాచిగూడ–శ్రీకాకుళం రోడ్(07611) రైలు: కాచిగూడలో ఈ నెల 10న సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45కు దువ్వాడ చేరుతుంది. తిరిగి 5.47కు బయలుదేరి అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. ►శ్రీకాకుళం రోడ్–వికారాబాద్(07612) రైలు: శ్రీకాకుళం రోడ్లో ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అదే రోజు సాయత్రం 5.10కు దువ్వాడ చేరుకుని, తిరిగి 5.47కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. ►వికారాబాద్–శ్రీకాకుళంరోడ్(07613) స్పెషల్: వికారాబాద్లో ఈ నెల 12న సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.45కు దువ్వాడ చేరుతుంది. తిరిగి 5.47కు బయలుదేరి అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. ►శ్రీకాకుళం రోడ్–కాచిగూడ(07614) స్పెషల్: శ్రీకాకుళం రోడ్లో ఈ నెల 13న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 5.20కు దువ్వాడ చేరుకుని, తిరిగి 5.22కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. రైళ్ల గమ్యం కుదింపు, దారి మళ్లింపు.. ►వాల్తేర్ డివిజన్ కే–ఆర్ లైన్ కోరాపుట్–మనబర్, కోరాపుట్–దుమురిపుట్ సెక్షన్ల మధ్య జరుగుతున్న ట్రాక్ ఆధునికీకరణ, రెండో ట్రాక్ పనుల నిమిత్తం పలు రైళ్ల గమ్యం కుదిస్తున్నట్లు, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ►విశాఖపట్నం–కోరాపుట్(08546) పాసింజర్ స్పెషల్ ఈ నెల 5 నుంచి 10 వరకు లక్ష్మీపూర్ రోడ్ వరకు మాత్రమే నడుస్తుంది. కోరాపుట్–విశాఖపట్నం(08545) పాసింజర్ స్పెషల్ ఈ నెల 6 నుంచి 11 వరకు లక్ష్మీపూర్ రోడ్ నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటుంది. ►విశాఖపట్నం–కోరాపుట్(08512) ఎక్స్ప్రెస్ ఈ నెల 6, 9 తేదీల్లో దమన్జోడి వరకు మాత్రమే నడుస్తుంది. కోరాపుట్–విశాఖపట్నం(08511) ఎక్స్ప్రెస్ ఈ నెల 7, 10 తేదీల్లో దమన్జోడి నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటుంది. ►ఈ నెల 6న విశాఖలో బయలుదేరే విశాఖపట్నం–కిరండూల్(08551) పాసింజర్ స్పెషల్ అరకు వరకు మాత్రమే నడుస్తుంది. ►ఈ నెల 6న కిరండూల్లో బయలుదేరే కిరండూల్–విశాఖపట్నం(08552) పాసింజర్ స్పెషల్ జయపూర్ వరకు మాత్రమే నడుస్తుంది. -
విశాఖ to బెంగళూరు వీక్లీ ఎక్స్ప్రెస్కు ఫుల్ డిమాండ్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): బెంగళూరు రైలు ప్రయాణం విశాఖ వాసులకు గగనంగా మారింది. ఫుల్ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఒకటి అయినా.. బెంగళూరుకు విశాఖ నుంచి నేరుగా ఒక్క రైలు కూడా లేదు. అన్నీ ఇతర ప్రాంతాల నుంచి విశాఖ మీదుగా వెళ్లేవే. వాటిలో విశాఖ కోటా చాలా తక్కువ. గతంలో విశాఖపట్నం నుంచి నడిచే ప్రశాంతి ఎక్స్ప్రెస్ను భువనేశ్వర్కు మళ్లించేశారు. అప్పటి నుంచి ప్రజాప్రతినిధులు, బెంగళూరుకు ప్రత్యేక రైలు కోసం ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునేవారే లేకపోయారు. రిజర్వేషన్ కష్టమే.. విశాఖపట్నం మీదుగా బెంగళూరుకు ఎన్ని రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా అన్ని ఫుల్గానే నడుస్తాయి. ప్రస్తుతం విశాఖపట్నం మీదుగా ప్రశాంతి, హౌరా –యశ్వంత్పూర్ వంటి రెగ్యులర్ రైళ్లతో పాటు, ముజఫర్పూర్–యశ్వంత్పూర్(మంగళ), గౌహతి–శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినస్ బెంగళూరు(ఎస్ఎంవీటీ) (సోమ, మంగళ, బుధ), హౌరా–ఎస్ఎంవీటీ (హమ్సఫర్)(మంగళ), హతియా–ఎస్ఎంవీటీ (సోమ, బుధ) భువనేశ్వర్–కృష్ణరాజపురం(హమ్సఫర్)(బుధ), డిబ్రూఘడ్–ఎస్ఎంవీటీ స్పెషల్ (గురు), భాగల్పూర్–ఎస్ఎంవీటీ (బుధ), టాటా–యశ్వంత్పూర్(శుక్ర), పూరీ–యశ్వంత్పూర్ (గరీబ్రధ్)(శుక్ర), హౌరా–మైసూరు(శని), టాటా–యశ్వంత్పూర్(శని). ప్రతీ ఆదివారాలలో హతియా–ఎస్ఎంవీటీ(ఆది), భువనేశ్వర్–బెంగళూరు కంటోన్మెంట్(ఆది), న్యూ టిన్సుకియా–బెంగళూరు(సోమ), అగర్తలా–ఎస్ఎంవీటీ(హమ్సఫర్) (సోమ) వంటీ వీక్లీ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. కానీ ఈ రైళ్లలో ఎప్పుడూ రిజర్వేషన్ దొరకదు. ఈ ఎక్స్ప్రెస్లలో రిజర్వేషన్ కావాలంటే కనీసం రెండు, మూడు నెలలు ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి. నగరవాసులు ఎక్కువశాతం బెంగళూరు వంటి ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీరు తరచూ నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. కానీ రైళ్లలో వీరికి రిజర్వేషన్ దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీక్లీ ఎక్స్ప్రెస్.. మరో రెండు ఆదివారాలే.. ప్రస్తుత డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్కుమార్ సత్పతి ప్రత్యేక కృషితో విశాఖపట్నం నుంచి బెంగళూరుకు డైరెక్ట్గా వీక్లీ స్పెషల్ రైలును తాత్కాలికంగా రెండు నెలలు నడిపేందుకు అనుమతి వచ్చింది. ఈ విషయం జూలై 22న ప్రకటించగా వెంటనే ఈ రైల్లోని సీట్లు అన్ని దాదాపుగా ఫుల్ అయిపోయాయి. ఆగస్ట్ 7వ తేదీ నుంచి ఇప్పటివరకు ఈ రైలు 6 ట్రిప్పులు నడవగా ప్రతీ సారి సీట్లు, బెర్తులు ఫుల్ అయ్యి, పూర్తి ఆక్యుపెన్సీతో ఈ రైలు నడిచింది. ఇంకా మిగిలి ఉన్న రెండు ట్రిప్పులలో అంటే సెప్టెంబరు 18, 25తేదీల్లోనూ స్లీపర్ వెయిటింగ్ లిస్ట్ 64, 08 ఉంది, ఇక ఏసీలో 25, 2 ఉంది. కోచ్లు పెంచినా తరగని జాబితా.. ఈ రైలు ఆక్యుపెన్సీ దృష్టిలో పెట్టుకుని ఆగస్ట్ 22వ తేదీ నుంచి ఒక స్లీపర్క్లాస్, ఒక థర్డ్ ఏసీ కోచ్లను అదనంగా జత చేశారు. అయినా వెయిటింగ్ లిస్ట్ జాబితా తరగడం లేదు. గత ఆదివారం (సెప్టెంబరు 11వ తేదీన) రిజర్వేషన్లు దొరక్క స్లీపర్లో దాదాపు 43 మంది, ఏసీలో 15 మంది టికెట్లు రద్దు చేసుకున్నట్లు సమాచారం. అదనంగా పెంచిన కోచ్లతో ఈ రైల్లో మొత్తం స్లీపర్ క్లాస్ 720, థర్డ్ ఏసీ–370, సెకండ్ ఏసీ–46 బెర్తులు, సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయినా విశాఖపట్నం నుంచే ప్రతీసారి నూరు శాతం ఆక్యుపెన్సీతో బయల్దేరుతుంది. ఇంత డిమాండ్ ఉన్న ఈ మార్గంలో నడిచే ఈ వీక్లీ స్పెషల్ను డైలీ ఎక్స్ప్రెస్గా మార్చాలని నగరవాసులు కోరుతున్నారు. దీనిపై ఇటీవల విలేకరుల సమావేశంలో డీఆర్ఎం మాట్లాడుతూ డిమాండ్ ఉన్న రూట్లలో రైళ్లు నడిపేందుకు, అవసరమైనప్పుడు అదనపు కోచ్లను జత చేసేందుకు వాల్తేర్ డివిజన్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయన కృషి ఫలించి, విశాఖ వాసుల ఆశ నెరవేరాలని ఆకాంక్షిద్దాం. (క్లిక్: నయా ‘ఆన్లైన్’ మోసం.. ఆర్డర్ ఇవ్వకపోయినా ఇంటికి కొరియర్) -
శ్రీమంతుడు సినిమాలోలా.. రైలు వదిలి సైకిలెక్కి!
తాటిచెట్లపాలెం: ఆయన వాల్తేరు డివిజన్ డీఆర్ఎం. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు గ్రామంలో పర్యటించినట్టు డీఆర్ఎం అనూప్కుమార్ సత్పతి కూడా తాటిచెట్లపాలెం రైల్వే కాలనీలో పర్యటించారు. కాలనీ మొత్తం సైకిల్పైనే ప్రయాణించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకున్నారు. కాలనీ ప్రజలతో మాట్లాడారు. సదుపాయాలు, వసతులు, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, పార్కుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. పారిశుధ్య, పరిశుభ్రత, సెక్యూరిటీ విషయంలో అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని సిబ్బందిని హెచ్చరించారు. ఆయన వెంట సివిల్ ఇంజినీరింగ్ విభాగ అధికారులు, పర్యావరణ, ఆరోగ్య విభాగ సిబ్బంది ఉన్నారు. -
‘ఈస్ట్కోస్ట్’లో కోచ్ల ఆట
సాక్షి, విశాఖపట్నం: ఈస్ట్కోస్ట్ రైల్వే అధికారుల పక్షపాత ధోరణి మరోసారి బట్టబయలైంది. వాల్తేరు డివిజన్కు పాత కోచ్లు పడేసి.. కొత్త టెక్నాలజీతో తయారైన ఎల్హెచ్బీ కోచ్లను తమ పరిధిలో తిప్పుకోవడం వారికి ఆనవాయితీగా మారిపోయింది. వీటిపై విమర్శలు రావడంతో ఈసారి కొత్త పంథాని అనుసరించారు. కొత్త కోచ్లను విశాఖ డివిజన్కు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించి.. తమ పరిధిలోనే కొత్త కోచ్లను తిప్పుకుంటున్నారు. తాజాగా వచ్చిన ప్రకటనతో ఈ విషయం తేటతెల్లమైంది. పేరు వాల్తేరుదే అయినా.. కొత్త కోచ్లపై పెత్తనం మాత్రం భువనేశ్వర్దేనన్న విషయం చెప్పకనే చెప్పారు. జగదల్పూర్–భువనేశ్వర్(08445) స్పెషల్ ట్రైన్ను ఎల్హెచ్బీ కోచ్లతో ఈ నెల 10 నుంచి నడుపుతున్నట్లు గురువారం వాల్తేరు డివిజన్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రైలు వాస్తవానికి జగదల్పూర్, కోరాపుట్, రాయగడ, విజయనగరం, పలాస మీదుగా ప్రయాణిస్తుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్కు రాదు. ఈ రైలు వల్ల విశాఖ డివిజన్కు పెద్దగా ఉపయోగం లేదు. వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్న కొన్ని స్టేషన్ల మీదుగా రైలు వెళ్తుంది కాబట్టి.. విశాఖ డివిజన్కు కేటాయించామని చెబుతున్నారు. కానీ.. పెత్తనమంతా భువనేశ్వర్ అధికారులదే. విశాఖ స్టేషన్కు రాని ఎల్హెచ్బీ ట్రైన్ని వాల్తేరు డివిజన్కు కేటాయిస్తున్నట్లు ఎలా పేర్కొంటారని రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విమర్శిస్తున్నారు. దీనిపై వాల్తేరు డివిజన్ అధికారులు కూడా నోరు మెదపకపోవడం శోచనీయమని వ్యాఖ్యానిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement