breaking news
walks
-
చార్ధామ్ నుంచి పశుపతినాథ్ వరకు..
ఉత్తరాఖండ్కు చెందిన 23 ఏళ్ల యువకుడు చందూ కార్కి తన అసాధారణ సంకల్పంతో చరిత్ర సృష్టించారు. ఏకంగా 18,554 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని కాలినడకన పూర్తి చేసి అందరినీ విస్మయానికి గురిస్తున్నాడు. కేవలం యాత్ర చేయడమే కాకుండా, దేశ ఆధ్యాత్మిక వైభవాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో ఆయన ఈ సాహసానికి పూనుకున్నారు. దాదాపు మూడేళ్ల కాలంలో 806 రోజుల పాటు ఆయన సాగించిన ఈ ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆస్తికరంగా మారింది.యాత్ర వెనుక అసలు లక్ష్యంఉత్తరాఖండ్లోని బెరీనాగ్ తహసీల్ పరిధిలోని మానిఖేత్ గ్రామానికి చెందిన చందూ కార్కి, అల్మోడాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. భారతదేశాన్ని అత్యంత సన్నిహితంగా పరిశీలించాలని, ఇక్కడి సంస్కృతి, ఆధ్యాత్మిక సంపద, ప్రకృతి అందాలను స్వయంగా వీక్షించాలనే కోరికతో ఆయన ఈ సాహసానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 19, 2023న తన స్వగ్రామం నుండి ఈ అఖిల భారత పాదయాత్రను ప్రారంభించారు.రికార్డు స్థాయిలో సాగిన ప్రయాణంఈ ప్రయాణంలో భాగంగా చందూ కార్కి భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను చుట్టేశారు. ఎక్కడా వాహనాలను ఆశ్రయించకుండా పూర్తిగా కాలినడకనే ప్రయాణించారు. కేవలం 806 రోజుల్లోనే 18,554 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన భిన్న సంస్కృతులు, భాషలు, జీవనశైలిని కలిగిన కోట్లాది మంది ప్రజలను నేరుగా కలుసుకున్నారు.పవిత్ర క్షేత్రాలు.. మహా యాత్రలుఈ సుదీర్ఘ యాత్రలో భాగంగా చందూ కార్కి ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ చార్ధామ్లను దర్శించుకోవడంతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలను సందర్శించాడు. వీటితో పాటుగా హరిద్వార్ నుండి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళ్ వరకు అలాగే ఏకంగా నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం వరకు అత్యంత కఠినమైన కావడి పాదయాత్రలను విజయవంతంగా పూర్తి చేశాడు.ఎదురైన భయానక, కఠిన పరిస్థితులుచందూకు ఈ పాదయాత్ర ఎప్పుడూ పూలబాటలా సాగలేదు. ప్రయాణంలో అనేకసార్లు జనావాసాలు లేని, కనీసం మనుషుల సంచారం కూడా లేని నిర్జన అడవులు, కొండ ప్రాంతాలు ఎదురయ్యాయి. కొన్నిసార్లు రెండు మూడు రోజుల పాటు ఎలాంటి దుకాణాలు లేదా గ్రామాలు కనిపించలేదు. ఆ సమయంలో తన బ్యాగులో ఉన్న కొద్దిపాటి బిస్కెట్లు, నీళ్లతోనే రోజంతా గడిపిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఆయన తెలిపారు. నేపాల్ పశుపతినాథ్ యాత్ర సమయంలో అత్యంత భయానక అనుభవాలను ఎదుర్కొన్నట్లు ఆయన వెల్లడించారు.ప్రజల ఆప్యాయతలు - గుజరాత్ జ్ఞాపకాలుదేశవ్యాప్తంగా తాను తిరిగిన ప్రాంతాలలో ప్రజల నుండి లభించిన ప్రేమ, ఆదరాభిమానాలు ఎప్పటికీ మరచిపోలేనని చందూ చెప్పారు. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో తనకు లభించిన ఆతిథ్యం, ప్రజల ఆప్యాయత ఎప్పటికీ మరచిపోలేనని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ ఉన్నప్పటికీ, భారతదేశ ఆత్మ మాత్రం ఒకటేనని ఆయన తన ప్రయాణ అనుభవాల ద్వారా గ్రహించానని అన్నారు.భవిష్యత్ లక్ష్యాలు కేవలం రికార్డుల కోసమే కాకుండా, భారత్-నేపాల్ దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని చాటిచెప్పడమే తన యాత్ర ముఖ్య ఉద్దేశమని చందూ స్పష్టం చేశారు. ప్రస్తుతం తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా లక్షలాది మందికి చేరువ చేస్తున్న ఆయన, భవిష్యత్తులో దేశవిదేశాలలో మరెన్నో సాహసోపేతమైన యాత్రలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
వెట్టి చాకిరీ నుంచి తప్పించుకోవడానికి...
గురుగ్రామ్: ప్రాథమిక విద్య హక్కుగా ఉన్నా... అది ఆచరణకు నోచుకోవడం లేదు. బాల కార్మిక నిర్మూలనకు ప్రభుత్వాలెన్ని పథకాలు పెడుతున్నా.. అమలులో విఫలమవుతూనే ఉందని మళ్లీ మళ్లీ రుజువవుతూనే ఉంది. తాజాగా బీహార్కు చెందిన ఓ బాలుడు.. ఆ వెట్టి నుంచి తప్పించుకోవడానికి 150 కిలోమీటర్లు నడిచాడు. చివరకు తన చేయి కూడా పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. 15 ఏళ్ల బాలుడు హర్యానా, జింద్ జిల్లాలోని ఒక పాడి పరిశ్రమలో కార్మికుగా పనిచేస్తున్నాడు. అతని స్వస్థలం బీహార్లోని కిషన్గంజ్ జిలా. నెలకు రూ.10,000 వేతనం ఇస్తామన్న హామీతో అతడిని పనిలోకి తీసుకెళ్లారు. డైరీ ఫామ్లో అతన్ని మోటరైజ్డ్ ఫీడర్ చాపర్ ఆపరేటర్గా పెట్టారు. ఆ ఫామ్ దగ్గరే ఓ గదిలో నివాసం. వేతనం మాట అటుంచితే.. సరైన ఆహారం కూడా పెట్టలేదు. చాపర్ ఆపరేటర్గా పనిచేస్తున్ను సమయంలో అతని చేతికి గాయమైంది. ఆ తరువాత అపాస్మరక స్థితిలోకి వెళ్లిపోయాడు. మెలకువ వచ్చేసరికి అతను డిస్పెన్సరీలో ఉన్నాడు. ప్రాథమిక చికిత్స చేసిన డిస్పెన్సరీ సిబ్బంది బాలుడిని వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. మళ్లీ ఫామ్కు వెళ్లడం ఇష్టం లేని బాలుడు బీహార్కు నడక మొదలు పెట్టాడు. దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం మొండిగా వెళ్లాలి. దాదాపు 150 కిలోమీటర్లు నడిచిన తరువాత నుహ్జిల్లాలోని టౌరు సమీపంలో అతన్ని ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు చూశారు. భోజనం పెట్టి, పోలీసులకు అప్పగించారు. వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు.. చేతి గాయానికి చికిత్స కోసం నుహ్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. అతని సోదరుడు, ఇతర బంధువులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుటుంబం హుటాహుటిన వచి్చన బాలుడిని తీసుకెళ్లి ఆస్పత్రిలో చేరి్పంచారు. గాయం తీవ్రమవ్వడంతో మోచేతి వరకు చేయిని తొలగించాల్సి వచి్చంది. -
పెళ్లి రోజు కాలినడకన తిరుమలకు టాలీవుడ్ యాంకర్ లాస్య (ఫోటోలు)
-
PM Modi Lakshadweep Visit: ప్రకృతిలో పరవశించిన నమో (ఫొటోలు)
-
‘నాలుగు కాళ్ల’ వింత కుటుంబం.. పశువుల తరహాలో నడక!
ప్రపంచంలో రకరకాల మనుషులు కనిపిస్తారు. అలాగే చిత్రమైన కుటుంబాలను కూడా మనం చూస్తుంటాం. విచిత్రమైన అలవాట్లు లేదా భిన్న ధోరణి కారణంగా ఆయా కుటుంబాల వారు ప్రత్యేకంగా కనిపిస్తారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఒక కుటుంబంలోని సభ్యులు జంతువుల మాదిరిగా నాలుగు కాళ్లతో నడుస్తుంటారు. వీరు తమ రెండు చేతులను రెండు కాళ్లుగా ఉపయోగిస్తుంటారు. ఈ విచ్రితమైన కుటుంబం టర్కీలోని ఒక శివారు గ్రామంలో ఉంటోంది. ఈ కుటుంబంలోని ఐదురుగురు సభ్యుల గురించి 2000లో ఒక వార్తాపత్రికలో ప్రచురితమయ్యింది. ఈ నేపధ్యంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(ఎల్ఎస్ఈ)కి చెందిన మానసిక శాస్త్రవేత్త నికోలస్ హంఫ్రే ఈ విచిత్ర కుటుంబాన్ని కలుసుకునేందుకు టర్కీ వెళ్లారు. ఈ విచిత్ర కుటుంబంలో తల్లిదండ్రులకు 18 మంది పిల్లలు. అయితే వీరిలోని ఆరుగురు జంతువుల తరహాలో నడిచేందుకు ఇష్టపడతారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక క్రియేటర్ ఈ విచిత్ర కుటుంబంపై 60 నిముషాల డాక్యుమెంటరీ రూపొందించారు. దానిలో శాస్త్రవేత్త హంఫ్రే మాట్లాడుతూ ఇలాంటి మనుషులను తాను ఎన్నడూ చూడలేదని, ఈ ఆధునిక యుగంలో వీరు పశుఅవస్థకు తిరిగి వెళుతున్నట్లున్నదని అన్నారు. కొందరు శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుటుంబసభ్యులు అనువంశిక సమస్యల కారణంగా ఇలా ప్రవర్తిస్తుండవచ్చని అన్నారు. కాగా ఈ ఆరుగురు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లలో ప్రస్తుతం ఐదుగురు మాత్రమే జీవించివున్నారు. వీరు 22 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్య వయసు కలిగినవారు. వీరి మెదడులో ఒక భాగం కుంచించుకుపోయిందని, దీనిని సెరెబెలర్ వర్మిస్ అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. సెరెబెలర్ వర్మిస్ కలిగినవారు తమ రెండు చేతులను కాళ్ల మాదిరిగా వినియోగించేందుకు ఇష్టపడతారన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పిండిమర.. ఒకరిని కాపాడబోయి.. వరుసగా నలుగురు! -
న్యూ బోర్న్ బేబీ అమేజింగ్ వీడియో
పుట్టీ పుట్టగానే ల్యాప్ ట్యాప్ ఆన్ చేసి హల్ చల్ చేసిన పసిపాప యాడ్ గుర్తుందా? శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక టెక్నాలజీకి సింబాలిక్ గా ఆ ప్రకటన రూపొందించడం అప్పట్లో ఆసక్తికరంగా మారింది. అయితే అంతే ఆసక్తికరంగా ఇపుడు ఒక వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. అమేజింగ్ న్యూ బోర్న్ బేబీ వీడియో ఇపుడు హాట్ టాపిక్గా నిలిచింది. శిశువు బుడిబుడి అడుగులు వేస్తున్న వీడియో ఫేస్బుక్లో వైరల్ గా మారింది. డాక్టర్ చేతిలో ఉండగానే ఈ శిశువు వడివడిగా అడుగులు వేస్తున్న ఈ అమేజింగ్ వీడియో పలువుర్ని ఆకట్టుకుంటోంది. అయితే ఈ వీడియో ఎపుడు ఎక్కడ తీసారనే వివరాలుమాత్రం అందుబాటులో లేవు. -
'ఫ్లోటింగ్ పియర్స్' తో నీటిపై నడవొచ్చు!
ఇటలీః బల్గేరియాకు చెందిన ఎనభై ఏళ్ళ క్రిస్టో వ్లాదిమిరోవ్ జావచెఫ్ తన ఆలోచనను అమల్లోకి తెచ్చాడు. రెండు ద్వీపాల మధ్య వంతెన నిర్మించాల్సిన అవసరం లేకుండా నీటిపై నడిచే విధానాన్ని కనుగొన్నాడు. తన ఆలోచనల రూపాన్ని ప్రజలకు, ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చి గంటలకొద్దీ ప్రయాణించాల్సిన పనిలేకుండా చేశాడు. ఇటలీలోని లాంబర్డేకు సమీపంలోని లేక్ ఐసోలో మోన్టేఐసోలో ద్వీపంలో సుమారు 2 వేల మంది జనాభా ఉంటారు. అక్కడినుంచీ లాంబర్డేకు వెళ్ళాలంటే పడవలను ఆశ్రయించాల్సిందే. పడవ ప్రయాణంతో కొద్దిపాటి దూరానికే నీటిలో గంటలదరబడి ప్రయాణం చేయాల్సి వచ్చేది. అయితే ఈ సమయాన్ని తగ్గించాలంటే వంతెన ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమా? అది జరిగే అవకాశం ఉందా అంటూ తీవ్రంగా ఆలోచించిన క్రిస్టోకు మెరుపులాంటి ఐడియా తట్టింది. నీటిపై నడిచే విధానం అమల్లోకి తెచ్చే అవకాశం ఉందేమోనన్న తన ఆలోచనకు పదును పెట్టిన క్రిస్టో రెండు ద్వీపాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు నీటిలోనే మార్గాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభించాడు. అనుకున్నదే తడవుగా గతేడాది ఫ్లోటింగ్ పియర్స్ పేరున తన కొత్త ప్రాజెక్టును ప్రారంభించాడు. నీటిపై తేలే రహదారిని ఏర్పాటు చేసేందుకు లక్షలకొద్దీ పాలిథిన్ క్యూబ్స్ ను వినియోగించాడు. సుమారు 3 కిలోమీటర్ల మేర సముద్రంపై తేలియాడే రోడ్డును నిర్మించి విజయం సాధించాడు. ఈ రోడ్డు మార్గం నిర్మించేందుకు సుమారు వంద కోట్ల రూపాయలను క్రిస్టో ఖర్చు చేశాడు. ప్రస్తుతం క్రిస్టో రూపొందించిన మార్గం పరిశీలిస్తున్న అధికారులు... అన్నిరకాలుగా తట్టుకునేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. పరిశీలన పూర్తయిన తర్వాత ప్రజలు దీనిపై నడిచేందుకు అనుమతిస్తారు. వచ్చే నెల్లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టుపై నడిచేందుకు స్థానికులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. నీటిపై తేలియాడే మార్గంలో ప్రయాణించేందుకు అత్యధిక జనాభా వచ్చే అవకాశం ఉండటంతో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక వాలంటీర్లను, లైఫ్ గార్డులను ఏర్పాటు చేశారు.


