breaking news
waleterudivision
-
గుడ్ న్యూస్: అందుబాటులోకి అదనపు బెర్తులు, సీట్లు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఎటూ వెళ్లలేని పరిస్థితులు. ఇప్పుడు పరిస్థితులు కాస్త కుదుటపడడంతో దసరా సెలవులకు నగరవాసులు పలు పర్యాటక ప్రాంతాల సందర్శన, బంధువుల వద్దకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో పలు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వస్తోంది. డీఆర్ఎం ప్రత్యేక చర్యలు పరిస్థితిని గమనించిన వాల్తేర్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్కుమార్ సత్పతి ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ను క్లియర్ చేసే దిశగా ఆయా రైళ్లకు అదనపు కోచ్లను జత చేసి బెర్తులు, సీట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం(సమతా ఎక్స్ప్రెస్), విశాఖపట్నం–కోర్బా–విశాఖపట్నం(కోర్భా ఎక్స్ప్రెస్), విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం(స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్), విశాఖపట్నం–కడప–విశాఖపట్నం(తిరుమల ఎక్స్ప్రెస్), విశాఖపట్నం–బెంగళూరు–విశాఖపట్నం(వీక్లీ స్పెషల్) ఎక్స్ప్రెస్లకు ఇరువైపులా తాత్కాలికంగా ఒక్కో థర్డ్ ఏసీ కోచ్లను జత చేశారు. విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం(ఎల్టీటీ ఎక్స్ప్రెస్), విశాఖపట్నం–గా«ంధీదాం–విశాఖపట్నం(ఎక్స్ప్రెస్)లకు ఒక్కో స్లీపర్ క్లాస్ కోచ్లను, భువనేశ్వర్–విశాఖపట్నం–భువనేశ్వర్(ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్)లకు ఒక్కో ఏసీ చెయిర్ కార్ కోచ్లను అదనంగా జత చేశారు. ఇదే విధంగా మరిన్ని రైళ్లకు అదనపు కోచ్లను దసరా వరకు కొనసాగించాలని రైల్వే ప్రయాణికులు కోరతున్నారు. ప్రత్యేక రైళ్లు నడపాలి దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, హౌరా తదితర మార్గాల్లో దసరా ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. వీటిని సాధ్యమైనంత త్వరగా ప్రకటిస్తే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని సూచిస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం–బెంగళూరు–విశాఖపట్నం మధ్య ప్రతి ఆది, సోమవారాల్లో నడుస్తున్న వీక్లీ స్పెషల్ను రెగ్యులర్ రైలుగా మార్చేందుకు డీఆర్ఎం కృషి చేయాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వారణాసి రైలు గురించి కూడా డీఆర్ఎం కృషి చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. ఇదీ చదవండి: కాలువలతో చెరువుల అనుసంధానం -
ఏర్పాట్లు పుష్కలంగా...
విశాఖరైల్వేస్టేషన్లో పూర్తయిన కృష్ణాపుష్కర ఏర్పాట్లు ఓ రోజుముందు హెల్ప్డెస్క్ల నంబర్లు అందుబాట్లో.. విశాఖ మీదుగా పలు ప్రత్యేకరైళ్లతో సహా, సువిధా ఎక్స్ప్రెస్లు కూడా తాటిచెట్లపాలెం: ఈనెల 12 నప్రారంభంకానున్న కృష్ణాపుష్కరాల నేపథ్యంలో వాల్తేరుడివిజన్ కసరత్తుచేస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాలనుంచి విశాఖమీదుగా ప్రత్యేకరైళ్లతో పాటు సువిధా ఎక్స్ప్రెస్లను నడుపుతున్న ఈ శాఖ అందుకు అనుగుణంగానే ఏర్పాట్లనూ వేగవంతంచేస్తోంది. గోదావరి పుష్కరాలకు 6.3 లక్ష ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించిన నేపథ్యంలో, కష్ణాపుష్కరాలకు 3లక్షల పైచిలుకు ప్రయాణికులు రాకపోకలుసాగిస్తారని అంచనావేస్తున్న రైల్వేశాఖ ఆ స్థాయిలో ఏర్పాట్లను ముమ్మరంచేస్తోంది. ప్రత్యేకరైళ్ల ఇవే.. రాయగడ–కృష్ణ కెనాల్ జంక్షన్–రాయగడ ప్రత్యేకరైలు(08505/06). రాయగడనుంచి బయలుదేరి వెళ్లే ఈ రైలు(08505) ఆగష్టు 11,16,19,22తేదీల్లో మధ్యాహ్నం 02.30 గంటలకు బయలుదేరి అదేరోజు సాయంత్రం 07.45 గంటలకు విశాఖ చేరుకుని, ఆ మర్నాడు తెల్లవారుజామున 04.15గంటలకు కృష్ణకెనాల్చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 0806 నెంబరుతో కష్ణాకెనాల్జంక్షన్ నుంచి ఆగష్టు 12,17,20,23 తేదీల్లో రాత్రి 08.45 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 5గంటలకు విశాఖచేరుకుని అదేరోజు ఉదయం 9 గంటలకు రాయగడ చేరుకుంటుంది. ఓ థర్డ్ ఎ.సి, మూడు స్లీపర్క్లాసులు, 10 జనరల్సెకండ్క్లాస్ కోచ్ల కంపోజిషన్ఉన్న ఈ రైళ్లు పార్వతీపురం టౌన్, పార్వతీపురం,సీతానగరం, బొబ్బిలి, డొంకిన వలస, గజపతినగరం, గరుడబిల్లి, కొత్తవలస, సింహాచలం, విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట,రాజమండ్రి, ఏలూరు, గుణదల, విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. విశాఖపట్నం–గుంటూరు–విశాఖపట్నం స్పెషల్(08507/08) విశాఖపట్నం నుంచి 08507 నెంబరుతో వెళ్లే ఈ రైలు ఆగష్టు 11,12,13,14,16,17,19,20,21,22 తేదీల్లో రాత్రి 11 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 06.45 గంటలకు గుంటూరుచేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 08508 నెంబరుతో గుంటూరు నుంచి ఆగష్టు 12,13,14,15,17,18,20,21,22,23 తేదీల్లో ఉదయం 08.30 గంటలకు బయలుదేరి అదేరోజు సాయంత్రం 05.20 గంటలకు విశాఖచేరుకుంటుంది.ఐదు స్లీపర్,ఎనిమిది జనరల్సెకండ్ క్లాస్కోచ్ల సామర్థ్యమున్న ఈ జతరైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి,ఏలూరు,గుణదల,విజయవాడ,మంగళగిరి స్టేషన్లమీదుగా రాకపోకలు సాగిస్తాయి. పూరి–గుంటూరు–పూరి స్పెషల్(08405/06) పూరి నుంచి 08405 నెంబరుతో ఆగష్టు 11,16,19,22 తేదీల్లో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 09.25 గంటలకు విశాఖచేరుకుని, ఆ మర్నాడు ఉదయం 06.30 గంటలకు గుంటూరుచేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 08406 నెంబరుతో గుంటూరు నుంచి ఆగష్టు 12,17,20,23 తేదీల్లో రాత్రి 7 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు తెల్లవారుజామున 03.20 గంటలకు విశాఖచేరుకుని అదేరోజు ఉదయం 11.25 గంటలకు పూరిచేరుకుంటుంది. ఓ థర్డ్ ఎ.సి, మూడు స్లీపర్,10 జనరల్ సెకండ్క్లాస్ కంపోజిషన్ ఉన్న ఈ రైళ్లు ఖుర్దారోడ్,బాల్గాన్,బ్రహ్మపూర్, ఇచ్చాపురం, సోంపేట, పలాస, నౌపడా,కోటబొమ్మాలి,తైలూరు, శ్రీకాకుళం రోడ్డు, దూసి, పొందూరు, సిగడం,చీపురుపల్లి, గరివిడి, విజయనగరం, విశాఖపట్నం,దువ్వాడ, అనకాపల్లి, తుని,అన్నవరం, సామర్లకోట,రాజమండ్రి,ఏలూరు, గుణదల,విజయవాడ, కష్ణ కెనాల్ జంక్షన్, మంగళగిరి ప్రాంతాలమీదుగా రాకపోకలు సాగిస్తాయి. విశాఖ–తిరుపతి–విశాఖ స్పెషల్(07747/48) విశాఖనుంచి తిరుపతి వెళ్లే ఈ రైలు(07748) ఆగష్టు 13,20 తేదీల్లో తెల్లవారుజామున 05.45 గంటలకు బయలుదేరి అదేరోజు సాయంత్రం 07.45 గంటలకు తిరుపతిచేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 07747 నెంబరుతో తిరుపతినుంచి ఆగష్టు 12,19 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు మధ్యాహ్నం 2గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఓసెకండ్ ఎ.సి, మరోథర్డ్ ఎ.సి, ఏడుస్లీపర్, 6 జనరల్ సెకండ్క్లాస్ల కంపోజిషన్ ఉన్న ఈ రైళ్లు దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, గుణెదల, విజయవాడ, కష్ణకెనాల్, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు,శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లమీదుగా రాకపోకలు సాగిస్తాయి. విజయవాడ–విశాఖ– విజయవాడ స్పెషల్(07753/07754) విజయవాడ నుంచి బయలుదేరి విశాఖ వచ్చే 07753 నెంబరుగలరైలు ఆగష్టు 11,12,13,14,18,19,20 21 తేదీల్లో రాత్రి 11.30 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 06.50 గంటలకు విశాఖచేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 07754 నెంబరుతో విశాఖనుంచి ఆగష్టు 12,13,14,15,19,20,22 తేదీల్లో ఉదయం 08.40 గంటలకు బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 03.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఓ సెకండ్ ఎ.సి, మరో రెండు థర్డ్ ఎ.సి, ఏడుస్లీపర్ , 5 జనరల్ సెకండ్ క్లాస్ కంపోజిషన్ఉన్న ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గుణెదల ప్రాంతాలమీదుగా రాకపోకలుసాగిస్తుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ తెలిపింది. విశాఖ మీదుగా సువిధాప్రత్యేకరైళ్లు... సంబల్పూర్–యశ్వంత్పూర్ వయా విశాఖ,రేణిగుంట మీదుగా సువిధాప్రత్యేకరైళ్లను నాలుగుట్రిప్పులు నడుపుతున్న రైళ్లవివరాలివే... సంబల్పూర్–యశ్వంత్పూర్ వీక్లీ సువిధా(82831/82832)... –సంబల్పూర్ నుంచి 082831 నెంబరుతో జూలై 27, ఆగష్టు 3,24,31 తేదీల్లో (బుధవారాల్లో) ఉదయం 11గంటలకు బయలుదేరే ఈ రైలు అదేరోజు సాయంత్రం7 గంటలకు విశాఖచేరుకుని ఆ మర్నాడు సాయంత్రం 04.40 గంటలకు యశ్వంత్పూర్చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 082832 నెంబరుతో యశ్వంత్పూర్ నుంచి జూలై 29, ఆగష్టు 5,26 తేదీల్లో( గురువారం అర్ధరాత్రుల్లో ) 12.30 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 08.35 గంటలకు విశాఖచేరుకుని, ఆ మర్నాడు సాయంత్రం 4.40 గంటలకు సంబల్పూర్ చేరుకుంటుంది. ఓ సెకండ్ ఎ.సి, మూడు థర్డ్ ఎ.సి, 10స్లీపర్, మరో రెండు జనరల్ సెంకండ్ క్లాస్ సిట్టింగ్ కంపోజిషన్ఉన్న ఈ రైళ్లు బర్గారోడ్, బోలంగీర్,టిట్లాఘర్, కేసింగ, రాయగడ, విశాఖపట్నం, విజయవాడ, గూడూరు, రేణిగుంట, జోలారిపుట్టాయ్,కృష్ణరాజపురం స్టేషన్లమీదుగా రాకపోకలు సాగిస్తాయి. జీఆర్పీ,ఆర్పీఎఫ్ సమాయుత్తం... స్టేషన్పరిసరప్రాంతాల్లో ఏ విధమైన అసాంఘికశక్తులు చొరబడకుండా, పూర్తి భద్రతాపరమైన ఏర్పాట్లను జీఆర్పీ, ఆర్పీఎఫ్ సంయుక్తంగా పరిశీలిస్తున్నాయి. నలుగురు జీఆర్పీ కానిస్టేబుళ్లకు ఓ ఎస్.ఐ స్థాయి అధికారిని నియమించి ఒడిశా, బీహార్ ప్రాంతాలమీదుగా విశాఖవచ్చే రైళ్లలో గస్తీనిర్వహిస్తున్నారు. ఆర్పీఎఫ్ సిబ్బంది స్టేషన్లో ప్రతి అంగులాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. పూర్తిస్థాయిలో కౌంటర్ల పనితీరు.. ఒకటోనెంబరు తో పాటు ఎనిమిదో నెంబరుప్లాట్ఫాంపై ఉన్న మొత్తం 10 కౌంటర్లు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. ఈ మేరకు అదనపు సిబ్బందిని నియమిస్తున్నారు. రెండు హెల్ప్డెస్క్లు.. రైల్వేస్టేషన్ మెయిన్గేట్తో పాటు అటు జ్ఞానాపురంవైపు పూర్తిస్థాయిలో రెండు హెల్ప్ డెస్క్లను ఏర్పాటుచేస్తున్నారు. వాటికి సంబంధించి ఎనిమిది నెంబర్లను . ఓ రోజుముందు సీనియర్డీసీఎం విడుదలచేస్తారు. స్కౌట్స్ అండ్ గైడ్స్: కౌంటర్దగ్గరక్యూపద్ధతి పాటించేలా, వాటర్సమస్య తలెత్తినా, క్లౌడ్కంట్రోల్చేసే భాధ్యత స్కౌట్స్ అండ్ గౌడ్స్తీసుకుంటుంది. వీరు స్వచ్ఛందంగా సేవచేయనున్నారు.