breaking news
VRAs demand
-
TS: వీఆర్ఏల సర్ధుబాటు.. జీవో సస్పెండ్ చేసిన హైకోర్టు
-
జీవో 81ను సవరణ చేయాలని వీఆర్ఏల డిమాండ్
-
14లోగా కేసీఆర్ సర్కారు స్పందిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ)గా పనిచేస్తున్న రాష్ట్రంలోని 23వేల మంది రెవెన్యూ సిబ్బంది కష్టాలు ఎప్పటికి తీరుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏళ్లు గడుస్తున్నా.. నిరవధిక సమ్మె చేపట్టినా.. నిర్వేదంతో ప్రాణాలపై ఆశలు వదులుకుంటున్నా ప్రభు త్వం మాత్రం తమపై కనికరం చూపడం లేదని వీఆర్ఏలు వాపోతున్నారు. సమ్మె పూర్తయి ఆరునెలలవుతున్నా నేటికీ తమ డిమాండ్లు హామీలుగానే మిగిలిపోయాయని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు. మూడే ప్రధాన డిమాండ్లు వీఆర్ఏలు ప్రధానంగా మూడు డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు పేస్కేల్ వర్తింపజేయాలని, అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కలి్పంచాలని, 50 ఏళ్లుపైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు, మంత్రి కేటీఆర్, అప్పటి సీఎస్ సోమేశ్కుమార్ సమక్షంలో జరిగిన చర్చలు ఫలితాన్ని ఇవ్వకపోగా, గత ఏడాదిలో 80 రోజుల పాటు చేసిన నిరవధిక సమ్మె తర్వాత కూడా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మిగిలిపోయిందని వాపోతున్నారు. ఇన్నాళ్లూ తమ గోడు ప్రభుత్వానికి చెప్పే ఉన్నతాధికారి (సీసీఎల్ఏ) లేరని భావించామని ఇప్పుడు కొత్త సీసీఎల్ఏగా నవీన్ మిత్తల్ బాధ్యతలు చేపట్టినా పరిస్థితి అలానే ఉందంటున్నారు. అంబేడ్కర్ జయంతి నాటికి రాష్ట్ర ప్రభుత్వంపై మరోమారు ఒత్తిడి పెంచాలని వీఆర్ఏల జేఏసీ భావిస్తోంది. అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్14) సందర్భంగానైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో మరోసారి ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని భావిస్తున్నారు. ఏప్రిల్15న సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాలనే యోచనలో ఉన్నారు. సీఎంపై ఇంకా నమ్మకముంది తరతరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్న తమను గుర్తించి తెలంగాణ రాగానే జీతాలు పెంచింది సీఎం కేసీఆరే. వీఆర్ఏలను పేస్కేల్ ఉద్యోగులుగా గుర్తిస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చింది కూడా ఆయనే. కొన్ని అనివార్య పరిస్థితుల దృష్ట్యా ఆలస్యం జరుగుతున్నప్పటికీ మాకు కేసీఆర్పై నమ్మకం ఉంది. రాష్ట్రంలోని 23వేల మంది వీఆర్ఏలకు ఆయన న్యాయం చేస్తారనే భరోసాతో ఉన్నాం. – కర్ణకంటి రాజేశ్, డైరెక్ట్ రిక్రూటీ వీఆర్ఏల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ -
వీఆర్ఏల కలకలం
ఆలంపల్లి, న్యూస్లైన్: పెంచిన జీతాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె. మహంతి, డీజీపీ ప్రసాదరావు వాహనాలను అడ్డుకున్నారు. ఆదివారం అనంతగిరి అడవిలో జింకలు వదిలే కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న వారి వాహనాలను సబ్కలెక్టర్ కార్యాలయం ఎదుట అడ్డుకున్నారు. దీంతో సహనం కోల్పోయిన పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ‘లాఠిన్యం’తో పలువురికి గాయాలు.. చాలీచాలని జీతాలతో తమ బతుకు దుర్భరంగా మారిందని వీఆర్ఏలు వికారాబాద్ పట్టణంలో మూడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం అనంతగిరికి వచ్చిన సీఎస్ పి.కె మహంతికి వినతిపత్రం ఇవ్వాలని భావించామని, వాహనాలు అడ్డుకోవాలని తమ ఉద్దేశం కాదని వీఆర్ఏలు తెలిపారు. పోలీసుల చేతుల్లో చావుదెబ్బలు తినాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు తాము ఉదయం నుంచి పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నా ఫలితం లేకపోయిందన్నారు. మరోమార్గం లేక సీఎస్, డీజీపీ వాహనాలను అడ్డుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కాగా అంతకు ముందు రోడ్డుపై బైఠాయించిన వీఆర్ఏలకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. అంతలోనే సీఎస్, డీజీపీ వాహనాలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాజకుమారి, ఏఎస్పీ వెంకటస్వామి రంగంలోకి దిగి సిబ్బందితో కలిసి ఆందోళనకారులను చితకబాదారు. అధికారుల తీరుకు నిరసనగా సీఐటీయూ డివిజన్ కార్యద ర్శి మహిపాల్ నినాదాలు చేయడంతో పోలీసులు ఆయనపై తమ ప్రతాపాన్ని చూపించారు. బూటు కాళ్లతో తన్నడంతో మహిపాల్ రోడ్డుపై సొమ్మసిల్లిపడిపోయారు. అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిరసనలో పాల్గొన్న పలువురు మహిళలను కూడా పోలీసులు తోసేశారు. నిరసనకారుల్ని పోలీసులు చెదరగొట్టి సీఎస్, డీజీపీ వాహనాలను పంపించి వేశారు. కాగా భద్రత చర్యల్లో పోలీసు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారని డీజీపీ అసహనం,ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా వాహనాలను అడ్డుకున్న పదిమందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ లచ్చిరాంనాయక్ తెలిపారు. విధులు నిర్వహిస్తున్నారా..? లేక నిద్ర పోతున్నారా..? వీఆర్ఏలు అడ్డుకుంటున్న సమాచారం తనకు ముందే ఎందుకు సమాచారం ఇవ్వలేదని వికారాబాద్ స్పెషల్ బ్రాంచ్కు చెందిన సిబ్బందిపై ఎస్పీ రాజకుమారి మండిపడ్డారు. విధులు నిర్వహిస్తున్నారా..? నిద్రపోతున్నారా.? అని తీవ్రంగా మందలించారు. ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారు..? సెట్లో సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఓ కానిస్టేబుల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వివరణ ఇవ్వాలంటూ ఎస్పీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసుల దాడి అమానుషం.. సమస్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించేందుకు వచ్చిన తమపై పోలీసులు లాఠీలతో దాడి చేయడం అమానుషమని జిల్లా వీఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు జి.నర్సింలు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశం ఖండించారు.