-
అశోక్ గజపతిరాజు హుందాగా వ్యవహరించాలి:మంత్రి వెల్లంపల్లి
-
దేవుడి ఆలయాన్ని సర్కస్ కంపెనీ అంటారా..?: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయనగరం: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచలం బోడికొండపై ఆలయ ధర్మకర్త అశోక్గజపతిరాజు వీరంగం సృష్టించడంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'అశోక్ గజపతి రాజు హుందాగా వ్యవహరించాలి. ఆలయ ధర్మకర్తగా ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం హేయమైన చర్య. ధర్మకర్త అని చెప్పుకోవడమే తప్ప దేవాలయాన్ని ఏనాడైనా అభివృద్ధి చేశారా?. రాష్ట్ర ప్రభుత్వం రాతి ఆలయాన్ని పటిష్టంగా నిర్మిస్తుంటే సర్కస్ కంపెనీ అని అశోక్ గజపతి అనడంపై చర్యలు తీసుకొవడం జరుగుతుంది. ఏం జరగకపోయినా ఏదో జరిగినట్లు అశోక్గజపతిరాజు రాద్ధాంతం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఆలయ అభివృద్ధి చేయకపోవడం, ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం చూస్తుంటే రాముని విగ్రహం ధ్వంసంలో వీళ్ల పాత్ర ఉందేమోనని అనుమానం కలుగుతోంద'ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదవండి: (రామతీర్థం బోడికొండపై అశోక్గజపతిరాజు వీరంగం) -
కలువరాయి పోస్టాఫీస్లో నిధుల స్వాహా...?
బొబ్బిలి రూరల్: మండలంలోని కలువరాయి పోస్టాఫీసు లో వివిధ ఖాతాల్లో జమచేసిన మొత్తం స్వాహా అయినట్టు తెలుస్తోంది. దీనికి బీపీఎం లక్ష్మణరావే బాధ్యుడని గుర్తించి ఈ నెల 8న సస్పెండ్ చేశారు. ఇప్పటికే రూ. 54వేలు రికవరీ చేయగా... ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కలువరాయి పోస్టాఫీసు పరిధిలో కలువరాయి, వాకాడవలస, ముత్తాయవలస, కుమందానపేటలున్నాయి. 256 ఎస్బీ ఖాతాలు, 88 సుకన్య సమృద్ధి యోజన, 408 రికరింగ్ డిపాజిట్లు, 30 వరకూ గ్రామీణ తపాలా ఇన్సూరెన్స్లు ఉన్నాయి. జూన్ ఒకటో తేదీన సుకన్య సమృద్ధి యోజ న లబ్ధిదారు ఒకరు బొబ్బిలిలో తన ఖాతా అప్డేట్ చేసినపుడు తేడా రావడంతో బీపీఎం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పార్వతీపురం పోస్టల్ సూపరింటెండెంట్ ఆదేశాల మేర కు బొబ్బిలి మెయిన్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి.గౌతంకుమార్ విచారణ చేపట్టారు. ఆయన పలు ఖాతాలు చెక్చేయగా, పాస్పుస్తకాల్లో కొట్టివేతలు, దిద్దుబాట్లు గుర్తించారు. మరోవైపు ఖాతాదారులు డిపాజిట్ చేయడానికి వేసిన సొమ్ము ఆలస్యంగా జమ అయినట్లు గుర్తించారు. ఇంకా కొన్ని ఖాతాలు చెక్ చేయాల్సి ఉంది. ముత్తాయవలసలో సుమా రు 30ఖాతాలు ఇంకా పరిశీలించలేదు. బీపీఎం లక్ష్మణరావు గతంలోనే కొన్ని ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. ప్రస్తు తం పోస్టాïఫీసులో ఇన్ఛార్జ్గా మరో బీపీఎంను పోస్టల్ అధికారులు నియమించారు. గ్రామస్తులు లక్ష్మణరావుకు అనుకూలంగా ఉండడంతో విషయం బయటకు పొక్కడంలేదు. దీనిపై లక్ష్మణరావు సాక్షితో మాట్లాడుతూ అక్రమాలు ఏవీ లేవని, రాజకీయ దురుద్దేశంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. దర్యాప్తు అధికారి, బొబ్బిలి పోస్టల్ ఇన్స్పెక్టర్ టి.గౌతంకుమార్ సాక్షితో మాట్లాడుతూ బీపీఎంపై ఆరోపణలు రావడం వాస్తవమేనని, ఆతనిని ఈ నెల 8న సస్పెండ్ చేశామని, రూ. 54వేలు రికవరీ చేశామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. -
ఏకే 47 లభ్యం..
విజయనగరం టౌన్: చోరీకి గురైన ఏకే 47 గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సామాగ్రిని హైదరాబాద్ నుంచి ఒడిశా తరలిస్తున్న వాహనంలో ఈవీఎంలకు రక్షణగా ఉన్న ఒడిశా కానిస్టేబుల్కు చెందిన ఏకే 47 గన్ అక్టోబర్ 12వ తేదీ రాత్రి పోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విజయనగరం పోలీసులు నిందితులు సంజూరాం సిందూ, నగేష్ సిందూలను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఏకే 47 గన్, ఆరు తూటాలు, రాయికట్టిన ఒక జంగిల్ షూ, నాలుగు సెల్ఫోన్స్, కాల్చిన ఒక షెల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ జి.పాలరాజు శనివారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. అసలేం జరిగింది... హైదరాబాద్లోని ఈసీఐఎల్ నుంచి ఎన్నికల మెటీరీయల్ను ఒడిశా తీసుకొచ్చేందుకు ఆ రాష్ట్రంలోని డెంకనాల్ జిల్లా నుంచి అభిమన్యు సాహు అనే రిజర్వ్ కానిస్టేబుల్, తదితరులు వాహనాలకు బందోబస్తుగా వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరందరూ ఏకే 47 గన్లతో సామగ్రికి రక్షణగా ఉన్నారు. ఆరు కంటైనర్లలో సరుకు తీసుకువస్తూ అక్టోబర్ 11న డెంకాడ మండలం నాతవలస జంక్షన్కు చేరుకున్నారు. రాత్రి 1.30 గంటల తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కంటైనర్లో బ్యాగ్తో ఉన్న ఏకే 47 వాహనం దొంగిలించుకుపోయారు. దీంతో బాధితుడు అభిమన్యు సాహు ఫిర్యాదుతో మేరకు డెంకాడ పోలీసులు అక్టోబర్ 13న కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మిగతా బుల్లెట్లేవీ..? బ్యాగ్లో ఏకే 47 రైఫిల్ బట్ నంబర్ 2తో మ్యాగ్జైన్ విత్ 30 రౌండ్స్ బుల్లెట్స్, మొబైల్ ఫోన్, పెయిర్ జంగిల్ షూ, సివిల్ షూ, టీషర్ట్, ప్యాంట్స్, తదితర వస్తువులున్నాయి. అయితే ప్రస్తుతం ఏకే 47 గన్ బట్ నంబర్ 2 దొరికింది. మ్యాగజైన్ కనబడలేదు. 30 రౌండ్ల బుల్లెట్లకు గాను కేవలం 6 రౌండ్లు బుల్లెట్లు మాత్రమే దొరికాయి. ఒక జంగిల్ షూ రాయికి కట్టిఉంది. నాలుగు సెల్ఫోన్లు, కాలిపోయిన మరో సెల్ఫోన్ దొరికాయి. ఇలా ఛేదించారు.... ఏకె 47 కనిపించకుండా పోయిందన్న విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో అనేకమందిని పరిశీలించారు. ఈ నేపథ్యంలో తమకు లభించిన కీలక సమాచారం మేరకు నాతవలస జంక్షన్ వద్ద ఇటీవల వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని మహరాష్ట్ర, గుజరాత్కు చెందిన సంజురాం సిందూ, నగేష్ సిందూలుగా గుర్తించారు. తాము బతుకుదెరువు కోసం విజయనగరం వచ్చామని, ఎ.రావివలస వద్ద టెంట్లు వేసుకుని ఉంటున్నట్లు నిందితులు తెలిపారు. అక్టోబర్ 12న నాతవలస జంక్షన్ వద్ద ఆగిఉన్న కంటైనర్ లారీలో చోరీకి పాల్పడినట్లుగా అంగీకరించారు. దీంతో వారి నుంచి ఏకే 47 గన్, ఆరు తుటాలు, రాయి కట్టిన ఒక జంగిల్ షూ, నాలుగు సెల్ ఫోన్లతో పాటు కాల్చిన మరో సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నేరస్తుల గత చరిత్ర... నేరస్తులలో ఏ1గా ఉన్న మహారాష్ట్రకు చెందిన సంజూరాం సిందూ, గుజరాత్కి చెందిన ఏ2గా ఎరంర నగేష్ సిందూ ఇద్దరూ పార్థీ కులానికి చెందిన వారు. వీరిద్దరూ బంధువులు. జాతీయ రహదారిపై ఆగిఉన్న వాహనాలలో బ్యాగులు, సామాగ్రి దొంగలిస్తుంటారు. సుమారు పదేళ్ల కిందట వీరి కుటుంబాలు ఆంధ్రప్రదేశ్కు వలస వచ్చి శ్రీకాకుళం జిల్లాలో నిమ్మాడ, చిలకపాలెం, కోష్ట... విజయనగరం జిల్లాలో నాతవలస, ఎ.రావివలస వద్ద... విశాఖ జిల్లాలో తగరపువలస, ఆనందపురం వద్ద టెంట్లు వేసుకుని కాలం వెళ్లదీస్తుంటారు. ఆగిఉన్న వాహనాల్లో దొంగతనాలకు పాల్పడుతూ, తరచూ తమ నివాసాలు మారుస్తుంటారు. నగదు రివార్డు ఈ కేసులో త్వరగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ పాలరాజు అభినందించారు. అలాగే 25 వేల రూపాయల నగదు రివార్డు కూడా ప్రకటించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎం.నరసింహారావు, విజయనగరం డీఎస్పీ డి.సూర్యశ్రావణ్కుమార్, భోగాపురం సీఐ రఘువీర్విష్ణు, స్పెషల్ బ్రాంచ్ సీఐలు వైవీ శేషు, జి.రామకృష్ణ, డెంకాడ ఎస్సై జీఏవీ రమణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తిత్లీ విధ్వంసం
అంతా అనుకున్నట్టే తిత్లీ తీవ్రంగానే విధ్వంసం సృష్టించింది. తీరం దాటేముందు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలను నేలకూల్చింది. పలు ఇళ్లపై ప్రభావం చూపింది. వర్షప్రభావం అంతగా లేకపోయినా... వీచిన ఈదురు గాలులే కొంపముంచాయి. ముఖ్యంగా అరటి, చెరకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక పత్తి, వరి పంటలూ అక్కడక్కడ దెబ్బతిన్నాయి. విద్యుత్సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి జనం అవస్థలు పడ్డారు. పలు ప్రాంతాలకు బస్సులు, రైళ్లు రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయనగరం గంటస్తంభం: తిత్లీ తుఫాన్ గడచిన మూడురోజులుగా జిల్లాపై ప్రభావం చూపుతోంది. దీనిపై అధికార యంత్రాంగం ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ పంటల నష్టాన్ని నివా రించడంలో విఫలమయ్యారు. తుఫాన్ కేవలం చినుకులకే పరిమితమైనా ఈదురుగాలులు మాత్రంగా బలంగా వీయడంతో రైతులు ఆందోళన చెందారు. వారి ఆందోళనకు తగ్గట్టుగానే నష్టాలు చోటు చేసుకున్నాయి. బుధవారం రాత్రి సముద్ర తీరప్రాంతంలో అలల తాకిడి తగ్గి సముద్రం వెనక్కి వెళ్లింది. గురువారం అంతలోనే తెల్లారి ఝామున 3గంటల సమయంలో తుఫాన్ శ్రీకాకుళం జిల్లాలో తీరందాటింది. ఈ ప్రభావం జిల్లాలో తీవ్ర నష్టానికి కారణమైంది. 30.6మిల్లీమీటర్లు వర్షపాతం తుఫాన్ ప్రభావం వల్ల బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం 3గంటల వరకు జిల్లాలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడ్డాయి. మొత్తం గా అన్ని మండలాల్లో కలిపి సగటున 30.6మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు ఆనుకుని ఉన్నవి, ఒడిశాకు సమీపంలో ఉన్న ఏజెన్సీ మండలాల్లో భారీగా వర్షాలు కురిశాయి. కురుపాంలో అత్యధికంగా 112.8మిల్లీమీటర్లు, బలిజిపేటలో 99.6, కొమరాడలో 92.4, పార్వతీపురంలో 44.3, తెర్లాంలో 61.3, గుమ్మలక్ష్మీపురంలో 62.1, జియ్యమ్మవలసలో 51.6, గరుగుబిల్లిలో 46.3, మెరకముడిదాంవలో 55.4, బొబ్బిలిలో 35.3, సీతానగరంలో 33.3 మిల్లీమీటర్లు పడింది. మిగతా మండలాల్లో అన్ని చోట్లా వర్షాలు పడగా 10 నుంచి 30మిల్లీమీటర్లు లోపే నమోదైంది. వర్షం బాగా పడిన మండలాల్లో వరిపంటకు వారంరోజులపాటు ఊపిరి వచ్చినట్లే. తుఫాన్ మూలంగా అయినా భారీ వర్షాలు, ఎక్కువ రోజులు పడతాయని, ప్రస్తుతానికి నీరు పంటపొలాల్లో చేరి పంటకు జీవం రావడమేకాకుండా నీటివనరుల్లో నీరు చేరి పంటకు పూర్తి భరోసా వస్తుందని ఆశించిన రైతులకు మాత్రం నిరాశ తప్పలేదు. ఈ వర్షం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, పంట చేతికందుతుందన్న నమ్మకం పోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టం రూ. 31.30కోట్లు తుఫాన్ తీరందాటే సమయంలో గంటకు 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలలు వీచాయి. ఈ ప్రభావం పంటలపై పూర్తిగా పడింది. అరటి, చెరకుతోపాటు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. చీపురుపల్లి నియోజకవర్గంలోని చీపురుపల్లి మండలం దేవరపొదిలాం గ్రామంలో 50 ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. 20 ఎకరాల్లో చెరకుకు నష్టం వాటిల్లింది. కురుపాం మండలంలో 750 ఎకరాల్లో వరి, 12 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. పత్తి పంటకు కూడా భారీ నష్టం వాటిల్లింది. గరుగుబిల్లి మండలంలో ఇప్పలమట్ట, సంతోషపురం, గిజబ, చిలకాం, తోటపల్లి, పారివలస, రావివలస తదితర గ్రామాల్లో రెండు వేల ఎకరాల్లో అరటి పంటకు నష్టం వాటిల్లింది. పారివలస, బత్తివలస, తోటపల్లి, పెద్దూరు, కొత్తపల్లి, రావుపల్లి గ్రామాల్లో వరి మూడు వేల ఎకరాల్లో నీట మునిగింది. పార్వతీపురంలో సంగం వలస గ్రామంలో చీకటి సత్యనారాయణకు చెందిన ఎకరన్నర అరటి తోట నేలకొరిగింది. ఈ విధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా 2500హెక్టార్లులో అరటిపంట విరిగి నేలమట్టమైంది. 308 హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న నేలకొరిగి దెబ్బతింది. ఈ పంటల నష్టం విలువ రూ.31.30కోట్లు ఉంటుంది. మత్స్యకారులు గల్లంతు తుఫాన్ కారణంగా వచ్చిన సముద్రపు అలలు తాకిడికి జిల్లా తీరప్రాంతంలో ఎటువంటి ముప్పు వాటిల్లకపోయినా 15 రోజుల క్రితం విశాఖ నుంచి పూసపాటిరేగ మండలానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు ఒడిశాలోని రామయ్యపట్నం సముద్ర ప్రాంతంలో వేటకు వెళ్లగా బోటు బోల్తా పడి అందులో ముగ్గురు గల్లంతు కాగా మిగిలిన ముగ్గురు సురక్షితంగా ఇంటికి చేరారు. గల్లంతైనే వారిలో పూసపాటిరేగ మండలంలోని పతివాడ బర్రిపేటకు చెందిన సారి రాము(23), మైలపల్లి లక్ష్మణరావు(45) తమ్మయ్యపాలేనికి చెందిన బడే సత్తెయ్య(22) ఉన్నారు. ఏజెన్సీలో గాలులకు 50 ఇళ్ల పైకప్పులు ఎరిగి పడ్డాయి. కచ్చాఇళ్లతోపాటు రేకుల షెడ్లు పాడయ్యాయి. పరిస్థితి గమనించి ముందే అధికారులు ఖాళీ చేయించినా ప్రస్తుతం వారంతా అవాసం లేక ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం భారీ గాలులకు విద్యుత్ స్తంభాలు పలు చోట్ల నేలకొరిగాయి. వైర్లు తెగిపడ్డాయి. దీనివల్ల విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కొన్ని మండలాల్లో దెబ్బతిని విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కురుపాం మండలంలో విద్యుత్ సరఫరా మూడు రోజులుగా నిలిచిపోయింది. జియ్యమ్మవలస, కొమరాడలో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అక్కడక్కడ చెట్లు పడిపోవడంతో పార్వతీపురం మండలంలో రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement