breaking news
vizianagaram collector
-
వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: కలెక్టర్
సాక్షి, విజయనగరం : నిత్యావసరాల కొనుగోలు కోసం మినహా ప్రజలు ఇంటి నుండి బయటికి రావద్దని.. మరి ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఏమాత్రం బయటకు రాకూడదని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ ప్రజలను కోరారు. కరోనా వైరస్ నియంత్రణపై జిల్లా కలెక్టర్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. కాగా ఈ టాస్క ఫోర్స్ కమిటీతో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలు తెరిచే వుంటాయని చెప్పారు. కూరగాయలకు జిల్లా స్థాయిలో ధరలు నిర్ణయిస్తున్నామన్నారు. ఒకవేళ నిత్యావసర సరుకులు, కూరగాయలపై ఇష్టానుసారంగా ధరలు పెంచి విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.(కరోనా: ముంబై లోకల్ రైళ్లు బంద్) ఏపీ: కరోనా నియంత్రణకు మరిన్ని చర్యలు ఇక విదేశాల కాగా విదేశాల నుండి వచ్చిన వారు, క్వారంటైన్లో ఉన్నవారు బయట తిరిగితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక గ్రామాల్లో వుండే విదేశీయుల బాధ్యతను తహశీల్దార్, పోలీస్ శాఖలు అప్పగించగా.. పట్టణాల్లో వుండే విదేశీయుల బాధ్యత మున్సిపల్, పోలీస్ శాఖలకు అప్పగించామన్నారు. కరోనా చికిత్సకు సంబంధించిన సమాచారం కోసం 08922-227950 ఫోన్ నెంబర్తో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో కరోనా చికిత్సకు సంబంధించిన సమాచారం లేదా ఫిర్యాదు ఇచ్చేందుకు ఆరోగ్య శాఖ కార్యాలయంలోని 08922-236947 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి తెలపాలని కోరారు. కిరాణా దుకాణాలు, మందుల షాపులు, పెట్రోల్ బంకులు, ఎల్.పి.జి. ఏజెన్సీలు, పాల విక్రయ కేంద్రాలు మినహా ఇతర వ్యాపార సంస్థలేవి తెరవడానికి వీలు లేదన్నారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసినపుడు కుడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ఇంటి వద్ద కుడా ప్రతి రోజు వీలైనన్ని సార్లు సబ్బు లేదా హ్యాండ్ వాష్లతో చేతులు, చేతి వ్రేళ్ళను కనీసం 20 సెకన్ల పాటు కడుక్కోవాలిని సూచించారు. (కరోనా.. తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం) ప్రస్తుతం కరోనా వ్యాధి వ్యాప్తిలో మనం రెండో దశలో ఉన్నామని, ఈ స్థాయిలోనే వ్యాధిని కట్టడి చెయేచ్చని తెలిపారు. ఇందుకు ప్రజల సహకారం కావాలన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం ద్వారానే ఇది సాధ్యమన్నారు. జిల్లా కేంద్రం, నియోజక వర్గ కేంద్రాల్లో కలసి మొత్తం 1100 ఐసోలేషన్ పడకలు సిద్ధం చేస్తున్నామని, కరోనా చికిత్స కోసం జిల్లా కేంద్రంలో 300 పడకలు, నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడక చొప్పున ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నియోజక వర్గఆసుపత్రుల్లో తగిన సౌకర్యాలు లేకపోతె ఏదైనా భవనం లేదా లాడ్జిని అద్దె ప్రాతిపదికన తీసుకొని అక్కడ వసతులు కల్పిస్తామని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరోనా ఫిర్యాదుల కోసం 6309898989 వాట్సప్ నెంబర్ కుడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక కరోనా లక్షణాలతో జిల్లాలో ఇప్పటికి ఒక్క పాజిటివ్ కేసు కుడా నమోదు కాలేదని ఆయన వెల్లడించారు. -
కలెక్టర్, డీఎంహెచ్ఓలకు హెచ్ఆర్సీ నోటీసులు
శృంగవరపుకోట: రాష్ట్ర న్యాయసేవల అథారిటీ ఆదేశాల అమలులో కలెక్టర్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ చేసిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సి) కలెక్టర్, డీఎంహెచ్ఓలకు నోటీసులు జారీ చేసిందని స్థానిక న్యాయవాది చిక్కాల ఈశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఈమేరకు ఆయన హెచ్ఆర్సి జారీ చేసిన నోటీసు ప్రతిని మీడియాకు విడుదల చేశారు. జిల్లాలో దోమల నివారణకు సివిక్ ఎక్స్నోరా ప్రాజెక్టు అమలు చేయాలని రాష్ట్ర న్యాయసేవల అథారిటీ గతంలో ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాల అమలులో కలెక్టర్ చొరవ చూపకపోవడంతో హెచ్ఆర్సీని ఆశ్రయించినట్టు ఈశ్వరరావు చెప్పారు. దీంతో ఈ కార్యక్రమం అమలుకు తీసుకున్న చర్యలను వివరించే తగిన వివరాలతో ఆగస్టు 16వ తేదీన ఉదయం 10.30గంటలకు కమిషన్ ఎదుట హాజరు కావాలని హెచ్ఆర్సి ఆదేశించిందని న్యాయవాది ఈశ్వరరావు చెప్పారు. -
కలెక్టర్ బదిలీపై కేంద్రమంత్రి అశోక్ అసంతృప్తి
హైదరాబాద్ : విజయనగరం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే బదిలీపై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, ఆంధ్రప్రదేశ్ మంత్రి మృణాళిని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంతిలాల్ దండేనే విజయనగరం జిల్లా కలెక్టర్గా కొనసాగించాలని వారు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావును కోరారు. కాగా కాంతిలాల్ దండే గుంటూరు కలెక్టర్గా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కలెక్టర్ గా ముదావత్ ఎం.నాయక్ నియమితులయ్యారు. దండే తనదైన శైలిలో జిల్లా అధికార యంత్రాంగాన్ని నడిపించారు. పలు కీలక సమయాల్లో సమర్థంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే వచ్చిన పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, సాధారణ ఎన్నికలను చాకచక్యంగా నిర్వహించగలిగారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో చెలరేగిన నిరసనల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించారు. ముఖ్యంగా కర్ఫ్యూ సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించారు.