breaking news
vital information
-
మంచి మాట: మన ఆలోచనలే మన జ్ఞానం
పుట్టుక, మరణాల మధ్య జీవితం చైతన్యవంతంగా కొనసాగుతుంది. ఈ జీవితంలో మనస్సు ద్వారా అనేక అనేక ఆలోచనలతో జీవితానికి సంబంధించి కీలకమైన సమాచారం వస్తుంది. ఈ ఆలోచనలన్నీ మనిషి శారీరక మానసిక కర్మలను బట్టి వస్తుంటాయి. శరీరంలో శక్తి తక్కువగా ఉంటే భౌతికపరమైన ఆలోచనలు, శక్తిస్థాయులు పెరిగే కొద్దీ మార్పు చెంది ఆధ్యాత్మికత గురించి, ఆత్మను గురించీ ఆలోచనలు వస్తుంటాయి. మనిషికి తమోగుణంతో శరీరానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. యవ్వనంలో ఇంద్రియాలు ఉద్రేకం ఎక్కువగా ఉండి రజోగుణంకు సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. వయసు మళ్లి వానప్రస్థంలో ప్రవేశించగానే ప్రేమ, దయ, జాలికి సంబంధించిన సత్వగుణ ఆలోచనలు వస్తుంటాయి. జ్ఞానపరంగా ఎదిగిన వారికి అత్యుత్తమమైన ఆలోచనలు వస్తాయి. మనుషులని తన మనసే నడిపిస్తుంది అసలు ఈ మనసు ఎక్కడ ఉంది, దానిని గుర్తించడం ఎలా అంటే గత జన్మల కర్మల అనుభవాల ప్రతిరూపమే మనసు. దీని యొక్క ప్రభావం సూక్ష్మ శరీరం పై పడుతుంది. మనసులో వచ్చే ఆలోచనలు ప్రతిరూపమే మానవ జీవితం. మనిషి కుటుంబం, సంఘం, సమాజంలో వివిధ రకాల వ్యక్తుల మధ్య జీవిస్తున్నప్పుడు, కొందరు పాతవారు దూరమవుతారు. వారి ఆలోచనల ప్రభావం కొంత ఉంటుంది. కొందరు కొత్తవారు దగ్గరవుతారు వీరు వీరి ఆలోచనలని జోప్పించడానికి సిద్ధంగా ఉంటారు. వీరి ద్వారా గాయాలు, ఘర్షణలు, సంఘర్షణలు, వ్యతిరేకతలు, అనుకూలతలు, మానసిక ఒత్తిడుల రూపంలో మనసులోకి ప్రవేశిస్తాయి. అప్పుడు ప్రతి వ్యక్తి ఆలోచనలు మాటలు ద్వంద్వంతో కూడి ఉంటాయి. ద్వంద్వం అంటే రెండుగా ఉన్నది. ఒకటి బయటికి వ్యక్తమౌతుంది. మరొకటి లోపల దాగి ఉంటుంది. బయటపడ్డ దాని గురించి ఆలోచిస్తే లోపల దాగి ఉన్న దాన్ని గుర్తించలేము. ఎప్పుడైతే బయటపడ్డ దాని గురించి ఆలోచిస్తామో అప్పుడు పక్షపాతంగా, ఏకపక్షంగా, పరిమితంగా ఆలోచిస్తున్నట్లే, ఎప్పుడైతే మానవుడు లోపల దాగి ఉన్న దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడో... పరిమితంగా ఆలోచించడం నుండి అపరిమితంగా ఆలోచించడం మొదలవుతుందో అదే అప్పుడే అజ్ఞానం నుంచి బయట పడి జ్ఞానం పొందుతాడు. అనవసర విషయాలపై అతిగా ఆలోచిస్తే శారీరక శ్రమ చేసిన దానికంటే రెట్టింపు శక్తిని కోల్పోతున్నాడు. కొందరు ఎలాంటి శారీరక శ్రమ లేని పనులు చేస్తున్న సాయంకాలానికి అలసిపోతారు. కారులోనో, బస్సులోనో, ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాంటి శారీరక శ్రమలేకున్నా అలసి పోతున్నారు అనవసరంగా అతిగా మనసు ఆలోచించటమే అందుకు కారణం.. మనస్సు ఆలోచించకుండా ఉన్నప్పుడు శూన్య స్థితికి చేరుతుంది. బాహ్య ప్రపంచంలో ఏది జరిగినా ఎలా జరిగినా అనుకూలతలకు, ప్రతికూలతలకు మనస్సు స్పందించకూడదు. ఇదే ఆధ్యాత్మిక మార్గం. అజ్ఞాని అంతరంగాన్ని విస్మరించి ప్రాపంచిక విషయాలపై ఆరాటపడుతూ ప్రపంచం నుంచి నాకేంటి అనే భావనను అతిగా పెంచుకొని ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనే భావనతో అసంతృప్తి చెంది ప్రాపంచిక విషయాల మోజులో సంబంధాలు ఏర్పరుచుకున్నాడో అప్పుడు పరిమితంగా ఆలోచిస్తాడు. జ్ఞానికి విశ్వం గురించి దైవం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి, దైవం వైపు మళ్ళి బంధాలను విడనాడి ఏకత్వం వైపు మళ్లాలి. ఏ వ్యక్తి ఏకత్వం వైపు మళ్ళి తన మనసును సరి చేసుకుని సంపూర్ణతను పొందుతూ దైవం వైపుగా ప్రయాణం చేస్తాడో అతను జ్ఞానిగా మరి ముక్తి లేదా మోక్షం పొందే అవకాశం ఉంది. – భువనగిరి కిషన్ యోగి -
మధుకర్రెడ్డి నుంచి కీలక సమాచారం సేకరణ
ధర్మవరం అర్బన్: పోలీసు కస్టడీలో ఉన్న అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగ మధుకర్రెడ్డి నుంచి ధర్మవరం పట్టణ పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. పోలీసులు నాలుగురోజులపాటు ఇతడిని కస్టడీలోకి తీసుకున్నారు. సోమవారం మధుకర్రెడ్డి నుంచి సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. ఏటీఎం దొంగ మధుకర్రెడ్డి ధర్మవరంలో 2013 నవంబర్ 10న చంద్రబాబు నగర్కు చెందిన ప్రమీలమ్మను హత్య చేసి, ఆమె వద్దనున్న 2 ఏటీఎంలు, జత కమ్మలను ఎత్తుకెళ్లాడు. అప్పట్లో హత్య కేసు నమోదైంది. ఆ హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారించారు. ఇంకా పలు కేసులను మధుకర్రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది. బెంగళూరు నగరంలో ఎక్కువగా ఏటీఎంలలో దోపిడీలు చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఇంకా మూడురోజులపాటు మధుకర్రెడ్డిని ధర్మవరం పట్టణ పోలీసులు విచారించనున్నారు. దీంతో మధుకర్రెడ్డి చేసిన మరిన్ని నేరాలు బయటపడే అవకాశం ఉంది. -
భానుప్రీతి మృతి కేసులో కీలక సమాచారం
-
భానుప్రీతి మృతి కేసులో కీలక సమాచారం
విజయవాడలోని మేరీ స్టెల్లా విద్యార్థిని భాను ప్రీతి అనుమానాస్పద మృతి కేసులో కీలక సమాచారం లభ్యమైంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన భానుప్రీతి చేతి రాతతో ఉన్న మూడు పేర్లు, నాలుగు ఫోన్ నంబర్లు ఉన్న పేపర్ ఒకదాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది డస్ట్బిన్లో దొరికింది. అయితే రూంలో మరో ముగ్గురు కూడా ఉంటారు. దాంతో ఈ ఫోన్ నంబర్లున్న కాగితాన్ని భానుప్రీతే రాసిందా, మరెవరైనా రాశారా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, ఆ ఫోన్ నెంబర్లు ఎవరివన్న సమాచారాన్ని ఇంకా బయటపెట్టలేదు. ఆమె తన తెలుగు పుస్తకంలో రాసుకున్న ఒక వాక్యాన్ని కూడా పోలీసులు గుర్తించారు. వీటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక మరో వైపు మంగళవారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో భానుప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కాలేజి యాజమాన్యం, పోలీసులు దీన్ని ఆత్మహత్యగా చెబుతున్నా, తమ కూతురు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇందులో ఏదో కుట్ర ఉందని ఆమె తండ్రి సుబ్బారావు అంటున్నారు. దీనిపై సీఐడీ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.