-
వృత్తి గ్లాస్ ఫిట్టర్.. ప్రవృత్తి సినిమా ఫైటర్!
సాక్షి, కల్లూరు: నటనపై ఆసక్తి ఉంటే చాలు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అనేందుకు ఈ యువకుడే నిదర్శనం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిత్రపరిశ్రమలో ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. కల్లూరుకు చెందిన ఈస్యం రాజేష్ గౌడ్ 7వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చదువులో రాణించలేక పోవడంతో కర్నూలు ఆటోనగర్లోని గాస్ల్ ఫిట్టింగ్ షాపులో ఫిట్టర్గా పని చేసేందుకు 1995లో చేరాడు. వృత్తిలో మెలకువలు నేర్చుకునేందుకు తిరుపతి, చెన్నై నగరాలకు వెళ్లి శిక్షణ పొందాడు. అనంతరం 2004లో వాణిజ్య నగర్లో గ్లాస్ ఫిట్టింగ్ షాపును ప్రారంభించాడు. 15 ఏళ్లుగా వివిధ వాహనాలకు, ఇళ్లకు, దుకాణాలకు గ్లాస్ ఫిట్టింగ్ పనులు చేస్తున్నాడు. ఇతనికి భార్య సమతతోపాటు శశినిల్గౌడ్, హర్షవర్దన్ గౌడ్ ఇద్దరు కుమారులు ఉన్నారు. 2005లో తొలిసారిగా స్నేహితుల సహకారంతో షార్ట్ ఫిల్మ్ ‘చీరల మోజు’లో నటించాడు. నటనలో మొదట షార్ట్ఫిల్మ్ వద్ద పడిన అడుగు నిదా నంగా వెండితెరకు పరిచయం చేసింది. ప్రస్తు తం ప్రధాన విలన్ పాత్రకు కూడా అవకాశాలు వస్తున్నాయి. షార్ట్ఫిల్మ్ టు వెండితెర నటనపై ఆసక్తి ఉన్న రాజేష్ అంచలంచెలుగా ఎదుగుతూ షార్ట్ ఫిల్మ్ నుంచి వెండితెర వరకు దూసుకువెళ్తున్నాడు. ఇతను మొదటగా 17 నిమిషాలు నిడివిగల ‘చీరల మోజు’ షార్ట్ ఫిల్మ్తో నటన ప్రారంభమైంది. ఆ తర్వాత నయన, యువర్ మై ఎమ్మెల్యే, కామన్ మ్యాన్ తదితర షార్ట్ ఫిల్మ్ల్లో రాజేష్ నటించాడు. నయనలో రౌడీగా, కామన్ మ్యాన్లో సీబీఐ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. దీంతో కర్నూలు నగరానికి చెందిన ఫిల్మ్ కో–ఆర్టినేటర్ నరసింహులు ద్వారా ‘కమల్’ సినిమాలో అవకాశం వచ్చింది. అందులో బిహార్ గ్యాంగ్ లీడర పాత్రను పోషించాడు. ఆ తరువాత ఇటీవల విడుదలైన ‘నేను లేను’ సినిమాలో విహారయాత్రకు వచ్చిన హీరో, హీరోయిన్లను బెదిరించి దోచుకోవడం, వారిని దెబ్బకొట్టేæ విలన్ పాత్రలో నటించాడు. ప్రస్తుతం హీరో ప్రభాస్ తమ్ముడు వర్మ హీరోగా తీస్తున్న బుల్లెట్ సినిమాలో, కోడుమూరుకు చెందిన దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో విలన్ పాత్రలు పోషిస్తున్నాడు. తెనాలి రామకృష్ణ సినిమాలో బిహారీ గ్యాంగ్ లీడర్గా రాజేష్ ఉంటాడు. అలాగే పలు ప్రముఖ దర్శకులు నిర్మిస్తున్న చిత్రాల్లో అవకాశాలు వచ్చినట్లు చెబుతున్నా డు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తన నటతో వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు కష్టపడుతున్నట్లు రాజేష్ చెబుతున్నాడు. -
మళ్లీ విలన్గా బాబీ?
కోలీవుడ్లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నటుల్లో బాబీసింహా ఒకరని చెప్పవచ్చు. లఘు చిత్రాలతో నట జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తరువాత వెండితెరకు పరిచయమయ్యారు. మొదట్లో ప్రతి నాయకుడిగా నటించి గుర్తింపు పొందారు. జిగర్తండా చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకుగానూ జాతీయ అవార్డును గెలుచుకున్న బాబీసింహా ఆ తరువాత కథానాయకుడిగా అవతారమెత్తారు. అయితే హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోయారనే చెప్పాలి. ప్రస్తుతం బాబీసింహా తిరుట్టుప్పయలే 2, వల్లవనుక్కు వల్లవన్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. వీటిలో వల్లవనుక్కు వల్లవన్ చిత్రానికి ఆయనే నిర్మాత. ఈ యువ నటుడు మళ్లీ విలన్ వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న కరుప్పన్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించడానికి అంగీకరించినట్లు తెలిసింది. అదే విధంగా హరి దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటించనున్న సామి-2లో ప్రతినాయకుడిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. అయితే ఇందులో విలన్గా నటించడానికి బాబీసింహా భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు, అంత పారితోషికం ఇవ్వడానికి దర్శకుడు సుముఖంగా లేరని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అన్నది త్వరలోనే తెలుస్తుందనుకోండి. మొత్తం మీద బాబీ విలన్గా మరోసారి తన సత్తా చాటనున్నారన్న మాట.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
- Today Horoscope: ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది
Advertisement