-
రెండోసారి బాధ్యతలు కోరుకోవడం లేదు: లిమాయే
న్యూఢిల్లీ: ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత రెండోసారి బాధ్యతలను చేపట్టాలని కోరుకోవడం లేదని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ విక్రమ్ లిమాయే స్పష్టం చేశారు. లిమాయే పదవీకాలం జూలైలో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈలో పాలనా పరమైన లోపాలు, కో–లొకేషన్ వ్యవహారంపై సెబీ, సీబీఐ విచారణలు, మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ అరెస్ట్ నేపథ్యంలో లిమాయే ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘నేను రెండవ టర్మ్ను కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదు. అందువల్ల తిరిగి దరఖాస్తు చేయడంకానీ, ప్రస్తుతం జరుగుతున్న నియామకం ప్రక్రియలో పాల్గొనడం కానీ చేయడం లేదు. ఇదే విషయాన్ని బోర్డుకు తెలిపాను. నా పదవీకాలం 2022 జూలై 16వ తేదీతో ముగుస్తుంది’’ అని లిమాయే తెలిపారు. చాలా క్లిష్టమైన కాలంలో సంస్థను నడిపించడానికి, సంస్థను స్థిరీకరించడానికి, బలోపేతం చేయడానికి, పాలనా ప్రక్రియ, సమర్థతను మరింత పటిష్టంగా మార్చడానికి, సాంకేతిక పురోగతికి, వ్యాపార వృద్ధికి తన వంతు కృషి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఎన్ఎస్ఈ చీఫ్గా లిమాయే నియామకానికి సెబీ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్ఎస్ఈ కొత్త చీఫ్గా విక్రమ్ లిమాయే నియామకానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆమోదం తెలిపింది. కాగా సుప్రీంకోర్టు జనవరిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యవహారాల పర్యవేక్షణ కోసం నలుగురు సభ్యులతో కూడిన ఒక కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో విక్రమ్ లిమాయే కూడా ఒక సభ్యుడు. ఈయన ఇంకా ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. లిమాయే బీసీసీఐలోని తన విధులను ముగించుకొని అటుపైన ఎన్ఎస్ఈ కొత్త చీఫ్గా బాధ్యతలు చేపడతారు. గతేడాది డిసెంబర్లో చిత్ర రామకృష్ణ ఎన్ఎస్ఈ చీఫ్ పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఎన్ఎస్ఈ బోర్డు ఈ ఏడాది ఫిబ్రవరిలో విక్రమ్ లిమాయేను ఎన్ఎస్ఈ కొత్త ఎండీ, సీఈవోగా ఎన్నుకుంది. వాటాదారులు ఈయన నియామకానికి మార్చిలోనే ఆమోదం తెలిపారు. ఇప్పుడు తాజాగా సెబీ కూడా లిమాయే నియామకానికి అంగీకారం తెలిపింది. కాగా ఈయన పలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, ఇంటర్నేషనల్ కమర్షియల్ బ్యాంక్స్, గ్లోబల్ అకౌంటింగ్ సంస్థలతో కలిసి పనిచేశారు. -
ఎన్ఎస్ఈ కొత్త బాస్ ఈయనే!
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)కొత్త బాస్ గా ఐడీఎఫ్సీ ఎండీ విక్రం లిమాయే ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో సీఈవో , ఎండీగా ఆ యన్ను ఎన్నుకున్నారు. తుది ఆమోదం కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఎన్ఎస్ఈ ఎజిఎంకు పంపించారు. రూ.10,000 కోట్లు అంచనాతో ఎన్ఎస్ఈ త్వరలో ఐపీవోకు రానున్న తరుణంలో ఈ అపాయింట్మెంట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. అతని ఎంపిక సరైందనీ, అపార అనుభవం వున్న విక్రం నాయకత్వంలో వ్యాపారం మరింత అభివృద్ధి సాధిస్తుందని కెఆర్ చోక్సీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ దేవేన్ చోక్సీ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆసియాలోనే అతిపురాతనమైన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) బంపర్ లిస్టింగ్ సాధించింది. దీంతో త్వరలోనే ఐపీవోకు రానున్న ఎన్ఎస్ఈ మరింత అద్భుతమైన విజయం సాధిస్తుందని ఎనలిస్టులు చెబుతున్నారు. కాగా ఇటీవల ఎన్ఎస్ఈ ఛైర్మన్ చిత్రారామకృష్ణన్ ఎన్ఎస్ఇకి గుడ్ బై చెప్పారు. 2018 మార్చి వరకు ఆమె పదవీ సమయం ఉన్నప్పటికీ అకస్మాత్తుగా ఆమె తన పదవి నుంచి నిష్క్రమించారు. అల్గో వ్యాపార వ్యవస్థలో కొంతమంది బ్రోకర్లకు ప్రిఫరెన్షియల్ యాక్సెస్ ఇచ్చినట్టుగా ఎన్ఎస్ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకూ లిస్టింగ్ పొందిన ఎక్స్ఛేంజీలలో ఎన్వైఎస్ఈ, నాస్డాక్, లండన్ స్టాక్ ఎక్స్చేంజీ, హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజీ, డాయిష్ బోర్స్ వంటివి ఉన్నాయి. -
బీసీసీఐకి కొత్త బాస్లు వచ్చారు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రోజువారీ కార్యకలాపాలు చూసేందుకు సుప్రీం కోర్టు నలుగురితో ఓ కమిటీ నియమించింది. బీసీసీఐ పాలక మండలి సభ్యులుగా కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఐడీఎఫ్సీ అధికారి విక్రమ్ లిమాయె, మహిళ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానాను నియమించింది. ఈ కమిటీకి వినోద్ రాయ్ సారథ్యం వహిస్తారు. సోమవారం సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త కమిటీలో టీమిండియా మాజీ క్రికెటర్లకు కానీ, బోర్డు మాజీ అధికారులకు కానీ స్థానం దక్కలేదు. మాజీ మహిళ క్రికెటర్ డయానాకు చోటు లభించింది. మిగిలిన ముగ్గురు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు. ఈ కమిటీలో కేంద్ర క్రీడల శాఖ మంత్రిని సభ్యుడిగా నియమించాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయనందుకు సుప్రీం కోర్టు బీసీసీఐపై కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఈ కమిటీని నియమించింది.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తొలిసారి ఓటేశారు (ఫొటోలు)
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతల దాడి
నా ఓటు .. నా హక్కు (ఫొటోలు)
తడిచి మురిసిన ముంబై : భారీ గాలిదుమ్ముతో ఆగిన విమాన సేవలు
మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా?
IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా
సమయం మించిపోతోంది.. రండి.. ఓటేయండి (ఫొటోలు)
మే 19కల్లా అండమాన్కు రుతుపవనాలు
నాన్నను బతికుండగానే కాలం చేయమని కోరా!: నటుడు
ఓటు హక్కు వినియోగించుకున్న యాంకర్ శ్యామల కుటుంబ సభ్యులు
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement