breaking news
Vijay Hazare
-
క్వార్టర్స్లో కర్ణాటక, ముంబై
అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక, ఢిల్లీ, యూపీ, ముంబై, పంజాబ్ జట్లు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాయి. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్లో కర్ణాటక 150 పరుగుల తేడాతో రాజస్తాన్పై గెలుపొందింది. లీగ్ దశలో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లాడిన కర్ణాటక అన్నింట్లోనూ గెలిచి 24 పాయింట్లతో క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది.కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ అగర్వాల్ (107 బంతుల్లో 100; 9 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో ఆకట్టుకోగా... దేవదత్ పడిక్కల్ (82 బంతుల్లో 91; 12 ఫోర్లు, 2 సిక్స్లు) త్రుటిలో ఆ అవకాశం కోల్పోయాడు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్తాన్ 38 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. కరణ్ లాంబా (55)టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ మానవ్ సుతార్ (4), దీపక్ హూడా (29) సహా తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 5 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో తమిళనాడు 54 పరుగుల తేడాతో త్రిపురపై... జార్ఖండ్ 2 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్పై... కేరళ 8 వికెట్ల తేడాతో పాండిచ్చేరిపై విజయాలు సాధించాయి. యూపీ ‘సిక్సర్’ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ఉత్తరప్రదేశ్ (యూపీ) జట్టు విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో వరుసగా ఆరో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం రాజ్కోట్ వేదికగా జరిగిన పోరులో ఉత్తరప్రదేశ్ 54 పరుగుల తేడాతో విదర్భపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తర ప్రదేశ్ నిరీ్ణత 50 ఓవర్లలో 5 వికెట్లకు 339 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ గోస్వామి (109 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... కెపె్టన్ రింకూ సింగ్ (30 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్స్లు), ధ్రువ్ జురేల్ (56; 5 ఫోర్లు, 1 సిక్స్), ప్రియమ్ గార్గ్ (67; 6 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అనంతరం ఛేదనలో విదర్భ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 285 పరుగులకు పరిమితమైంది.అమన్ మోఖడే (117 బంతుల్లో 147; 17 ఫోర్లు, 2 సిక్స్లు) ‘శత’క్కొట్టగా... అక్షయ్ వాడ్కర్ (51 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీ సాధించాడు. యూపీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా... కార్తిక్ త్యాగీ, విప్రాజ్ నిగమ్ చెరో రెండు వికెట్లు తీశారు. గ్రూప్ దశలో ఆడిన 6 మ్యాచ్ల్లోనూ గెలిచిన యూపీ జట్టు 24 పాయింట్లతో ‘టాప్’లో నిలిచి క్వార్టర్స్కు చేరింది. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో బరోడా 76 పరుగుల తేడాతో జమ్ముకశ్మీర్పై... హైదరాబాద్ 107 పరుగుల తేడాతో జమ్మూకశ్మీర్పై... చండీగఢ్ 7 వికెట్ల తేడాతో అస్సాంపై గెలుపొందాయి. గెలిపించిన శ్రేయస్, ముషీర్ యువ ఆటగాడు ముషీర్ ఖాన్ (51 బంతుల్లో 73; 8 ఫోర్లు, 3 సిక్స్లు; 1/47) ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చడంతో ముంబై జట్టు ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా... మంగళవారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై 7 పరుగుల తేడాతో హిమాచల్ ప్రదేశ్పై గెలుపొందింది. ఈ మ్యాచ్ను 33 ఓవర్లకు కుదించగా... మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 9 ఓవర్లలో 299 పరుగులు చేసింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (53 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముషీర్ ఖాన్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. టీమిండియా ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (15), సర్ఫరాజ్ ఖాన్ (21), సూర్యకుమార్ యాదవ్ (24), శివమ్ దూబే (20) భారీ ఇన్నింగ్స్లు ఆడలేకపోయారు. గాయం నుంచి కొలుకున్న అనంతరం ఆడిన తొలి మ్యాచ్లో శ్రేయస్ చక్కటి స్ట్రోక్ ప్లేతో అదరగొట్టాడు.హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో వైభవ్ అరోరా, అభిషేక్ కుమార్, కుషాల్ పాల్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో హిమాచల్ ప్రదేశ్ 32.4 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. పుఖ్రాజ్ మన్ (64; 7 ఫోర్లు, 3 సిక్స్లు), అంకుష్ బెయిన్స్ (53; 4 ఫోర్లు, 3 సిక్స్లు), మయాంక్ డాగర్ (64; 11 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో పోరాడారు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే 4 వికెట్లు పడగొట్టాడు. గ్రూప్ ‘సి’లో పంజాబ్, ముంబై చెరో 5 విజయాలతో 20 పాయింట్లు సాధించి పట్టిక తొలి రెండు స్థానాల్లో నిలిచి రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరాయి.. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో ఉత్తరాఖండ్ 6 వికెట్ల తేడాతో సిక్కీంపై... పంజాబ్ 6 వికెట్ల తేడాతో గోవాపై... ఛత్తీస్గఢ్ 6 పరుగుల తేడాతో మహారాష్ట్రపై గెలిచాయి. ప్రియాన్‡్ష ఆర్య మెరుపులు వికెట్ కీపర్ రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు విజయ్ హజారే టోర్నీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం ఆలూరు వేదికగా జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో రైల్వేస్పై గెలుపొందింది. మొదట రైల్వేస్ 40.4 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. కుష్ మరాథె (51; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఆయుశ్ బదోనీ, నవ్దీప్ సైనీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 21.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రియాన్‡్ష ఆర్య (41 బంతుల్లో 80; 12 ఫోర్లు, 3 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... సార్థక్ రంజన్ (33; 5 ఫోర్లు), నితీశ్ రాణా (38 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), రిషబ్ పంత్ (24; 1 ఫోర్, 3 సిక్స్లు) తలో చేయి వేశారు.గ్రూప్ దశలో ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట గెలిచిన ఢిల్లీ 20 పాయింట్లతో పట్టికలో ‘టాప్’లో నిలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ఢిల్లీ జట్టు ఈ టోరీ్నలో నాకౌట్ దశకు చేరడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. ఇదే గ్రూప్లో జరిగిన ఇతర మ్యాచ్ల్లో సౌరాష్ట్ర 111 పరుగుల తేడాతో సర్వీసెస్పై... గుజరాత్ 233 పరుగుల తేడాతో ఒడిశాపై విజయాలు సాధించగా... హరియాణా, ఆంధ్ర జట్ల మధ్య మ్యాచ్ ‘టై’గా ముగిసింది. మరోవైపు ప్లేట్ గ్రూప్ ఫైనల్లో బిహార్ 6 వికెట్ల తేడాతో మణిపూర్పై విజయం సాధించింది. -
చరిత్ర సృష్టించిన జైస్వాల్.. టీమిండియా తొలి క్రికెటర్గా అరుదైన రికార్డు!
పెర్త్ టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సంచలన శతకంతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం దుమ్ములేపాడు. సిక్సర్తో వంద పరుగుల మార్కు అందుకున్న జైస్వాల్.. ఆస్ట్రేలియా గడ్డ మీద తన మొదటి సెంచరీ నమోదు చేశాడు. ఓవరాల్గా టెస్టుల్లో తనకిది నాలుగో శతకం.What a way to bring up the ton! #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/okMDAno5tE— cricket.com.au (@cricketcomau) November 24, 2024 ఈ క్రమంలో ఎన్నెన్నో అరుదైన రికార్డులను యశస్వి జైస్వాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. పెర్త్ టెస్టులో శతకం బాది టీమిండియా దిగ్గజాలుగా ఎదిగిన సునిల్ గావస్కర్, విరాట్ కోహ్లి మాదిరి జైస్వాల్ కూడా GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్)గా పేరొందుతాడంటూ అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదటి టెస్టు ఆరంభం కాగా.. మూడో రోజు ఆటలో భాగంగా యశస్వి జైస్వాల్ భారీ శతకం సాధించాడు. 205 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్న 22 ఏళ్ల ఈ లెఫ్టాండర్.. మరో 92 బంతులు ఎదుర్కొని ఓవరాల్గా 161 రన్స్ సాధించాడు.జైస్వాల్ ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, మిచెల్ మార్ష్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇవ్వడంతో జైస్వాల్ సంచలన ఇన్నింగ్స్కు తెరపడింది. కాగా పెర్త్ టెస్టులో టీమిండియా ఇప్పటికే నాలుగు వందలకు పైగా ఆధిక్యం సంపాదించి పట్టు బిగించింది.పెర్త్ టెస్టులో సెంచరీ చేసి యశస్వి జైస్వాల్ సాధించిన రికార్డులు👉23 ఏళ్ల వయసు కంటే ముందే టెస్టుల్లో అత్యధిక శతకాలు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో.. సునిల్ గావస్కర్(4), వినోద్ కాంబ్లీ(4)ల సరసన యశస్వి నిలిచాడు. ఈ లిస్టులో సచిన్ టెండుల్కర్ 8 శతకాలతో మొదటి స్థానంలో ఉండగా.. రవిశాస్త్రి(5) రెండో స్థానంలో ఉన్నాడు.👉అదే విధంగా.. 23 ఏళ్ల వయసులోపే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత బ్యాటర్ల జాబితాలోనూ జైస్వాల్ చోటు సంపాదించాడు. ఈ ఏడాది జైస్వాల్ ఇప్పటికి మూడు శతకాలు బాదాడు.👉ఆస్ట్రేలియా గడ్డమీద తొలి టెస్టులోనే సెంచరీ కొట్టిన మూడో బ్యాటర్ జైస్వాల్. అతడి కంటే ముందు ఎంఎల్ జైసింహా(101- బ్రిస్బేన్- 1967-68), సునిల్ గావస్కర్(113- బ్రిస్బేన్-1977-78)లో ఈ ఘనత సాధించారు.మరో అరుదైన ఘనత.. భారత తొలి క్రికెటర్గాపెర్త్ టెస్టులో భారీ శతకంతో యశస్వి జైస్వాల్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఆడిన మొదటి పదిహేను టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత బ్యాటర్గా యశస్వి జైస్వాల్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో విజయ్ హజారే(1420)ను అతడు వెనక్కినెట్టాడు. కాగా 2023లో వెస్టిండీస్ గడ్డ మీద జైస్వాల్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అతడి ఖాతాలో నాలుగు శతకాలు. రెండు డబుల్ సెంచరీలు, ఎనిమిది అర్ధ శతకాలు ఉన్నాయి. ఫోర్ల సంఖ్య 178, సిక్సర్లు 38.ఆడిన తొలి 15 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు👉డాన్ బ్రాడ్మన్- 2115👉మార్క్ టేలర్- 1618👉ఎవర్టన్ వీక్స్- 1576👉యశస్వి జైస్వాల్- 1568👉మైకేల్ హస్సీ- 1560.టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా పెర్త్ టెస్టు👉టాస్: టీమిండియా.. తొలుత బ్యాటింగ్👉టీమిండియా తొలి ఇన్నింగ్స్- 150 ఆలౌట్👉ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్- 104 ఆలౌట్.చదవండి: IPL 2025 Mega Auction: పేరు మోసిన స్టార్లు.. హాట్కేకులు వీళ్లే.. 116 మందిపైనే వేలం వెర్రి -
బెంగాల్ చేతిలో ఆంధ్ర పరాజయం
చెన్నై: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ను ఆంధ్ర జట్టు ఓటమితో ప్రారంభించింది. బెంగాల్తో శనివారం జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్లో ఆంధ్ర నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర 50 ఓవర్లలో 8 వికెట్లకు 225 పరుగులు చేసింది. రవితేజ (43; 2 ఫోర్లు), శివ కుమార్ (40; 2 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. 226 పరుగుల లక్ష్యాన్ని బెంగాల్ 48.5 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి అధిగమించింది. ధోని జట్టుకు షాక్: భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోని సారథ్యంలో ఈ టోర్నీలో పాల్గొంటున్న జార్ఖండ్ జట్టుకు తొలి మ్యాచ్లో ఓటమి ఎదురైంది. కర్ణాటకతో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లో జార్ఖండ్ ఐదు పరుగుల తేడాతో ఓడింది. 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్ 49.5 ఓవర్లలో 261 పరుగులవద్ద ఆలౌటైంది. సౌరభ్ తివారి (68; 5 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ ధోని (43; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించినా జార్ఖండ్కు పరాజయం తప్పలేదు. అంతకుముందు కర్ణాటక 49.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. -
ధోని విఫలమైనా..
ఆలూరు(కర్ణాటక): ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత సొంత జట్టు జార్ఖండ్ తరపున తొలిమ్యాచ్ ఆడిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విఫలమయ్యాడు. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా ఇక్కడ గురువారం జమ్మూ కశ్మీర్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో 24 బంతులను ఎదుర్కొన్న ధోని తొమ్మిది పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయినప్పటికీ జార్ఖండ్ 9 పరుగులతో విజయం సాధించి టోర్నీలో బోణి చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 50.0 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్ కాగా, ఆ తరువాత బ్యాటింగ్ చేసిన జమ్మూ కశ్మీర్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. జార్ఖండ్ ఆటగాళ్లలో ఇషాంక్ జగ్గీ(54), కౌశల్ సింగ్(53)లు బ్యాటింగ్ లో ఆకట్టుకోగా, బౌలింగ్ లో వసీం రాజాకు మూడు వికెట్లు దక్కాయి.


