-
ఈ అనుమానాలు అర్థరహితం
విశ్లేషణ యోగి సరయూ నదికి హారతి పట్టడం బాగానే ఉంది. పెద్ద రామ విగ్రహ నిర్మాణమూ బాగానే ఉంది. అలాంటి విగ్రహాన్ని నెలకొల్పడం అయోధ్యకు తగ్గట్టుగానే ఉంటుంది. దానికి వివాదాస్పద స్థలానికి మధ్య సంబంధమే లేదు. రామ మందిరం– బాబ్రీ మసీదు కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా అయోధ్య ప్రధాన చర్చనీయాంశం అవు తోంది. ఎప్పుడూ అది వార్త ల్లోనే ఉంటోంది. రాజకీయాలు దాని చుట్టూనే తిరుగుతు న్నాయి. నాకు తెలిసిన వారిలో ఎవరైనా ఎప్పుడైనా అయో ధ్యను సందర్శించడం, లేక దాన్ని చూసి రావాలనే ఆకాంక్షను వ్యక్తం చేయడం జరిగిందేమో గుర్తుచేసుకుం దామని బాగా తరచి ఆలోచిస్తున్నాను. సాధారణంగా చార్ ధామ్ (నాలుగు పుణ్య క్షేత్రాలు)– బద్రీనాథ్, ద్వారక, పూరి, రామేశ్వరం లేదా కాశీ, పన్నెండు జ్యోతి ర్లింగాలు మాత్రమే భక్తులు ‘తప్పనిసరిగా దర్శించా ల్సిన’ వాటిలో భాగంగా ఉంటాయి. సప్తపురిగా పిలిచే ఏడు నగరాలలో అయోధ్య కూడా ఒకటి. పైన పేర్కొ న్నవాటిలో కొన్ని కూడా ఆ ఏడింటిలో ఉన్నా, అయోధ్య మాత్రం ఎన్నడూ అగ్రశ్రేణి దర్శనీయ స్థలం కాదు. గిన్నిస్బుక్లోకి ఎక్కడానికి తగినన్ని దీపాలను వెలిగించి గతవారం అయోధ్యలో జరిపిన దీపావళి ఉత్స వంపై చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఆ వేడుకను పైన చెప్పిన నేపథ్యం నుంచి చూడాలి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సొంత బ్రాండు హిందుత్వను ప్రదర్శించి చూపడానికి అసాధారణమైనది ఏదో చేయాలని చేసిన ఉత్సవం కాదది. వంద అడుగుల రాముని విగ్రహాన్ని నిర్మించడానికి ప్రణాళికను యోగి రూపొందించారు నిజమే. కానీ ఆయన అయోధ్యలోని కూలదోసిన, వివాదాస్పద కట్టడాన్ని పునర్నిర్మించే పనేమీ చేయలేదు. యోగి చేసే పలు వాదనలతో నాకు విభేదాలున్నాయి. ఆయన ప్రాపంచికమైన వాటిని అన్ని టినీ విసర్జించిన సాధువు కారనేది వాటిలో ప్రాథమి కమైనది. గోవధ నిషేధం వల్ల కలిగే ఆర్థిక ప్రభావాన్ని విస్మరించడం, గోసంరక్షణవాదం వంటివి కూడా నేను విభేదిస్తాను. అయితే, అయోధ్యను తిరిగి పర్యాటక ప్రదే శాలలో ఒకదానిగా, ప్రత్యేకించి దేశంలోని అంతర్గత పర్యాటకులకు దర్శనీయ స్థలంగా మార్చడం కోసం యోగి చేసిన ప్రయత్నాన్ని నేను తిరస్కరించలేను. ఏదిఏమైనా అయోధ్యలో నెలకొల్పనున్న ఆ రామ విగ్రహానికి తగ్గట్టుగా సరిపడేటన్ని హోటల్ గదులు, రవాణా సదుపాయాల వంటివి కూడా ఏర్పడతాయని ఆశించాలి. దాని నిర్వహణ సజావుగా సాగుతుందని, ఖర్చు చేసిన డబ్బుకు తగ్గ విలువ లభించేట్టు చూడటం పట్ల పట్టింపు లేకుండా పర్యాటకుల జేబుల్లోని డబ్బును దండిగా పిండేసుకునే ప్రాంతంగా అది మిగిలిపోదని కూడా అనుకుందాం. గంగా నదికి రాత్రిపూట బ్రహ్మాం డంగా హారతులను పట్టడాన్ని మీరు శివరాత్రి నాడు లేదా మోదీ ఎవరైనా ప్రపంచ నేతలను అక్కడికి తీసు కెళ్లినప్పుడు టీవీల్లో చూసే ఉంటారు. గంగానదిలాగే ఒక పవిత్ర స్థలంతో ముడిపడి ఉన్న సరయూ నది కూడా అంత పవిత్రమైనది ఎందుకు కాకూడదు? రామునితో ముడిపడి ఉండటం కారణంగా అయోధ్య పవిత్రమైనది అయినప్పుడు, సరయూ కూడా పవిత్రమైనదే. 1980 శీతాకాలంలో నెల రోజుల పాటూ వార ణాసిలో గడిపాను. అప్పుడు తరచుగా గంగానది ఘాట్ల వద్దకు వెళుతుండేవాడిని. ఇప్పటిలాంటి హారతులు అçప్పట్లో లేవు. కనీసం ఇప్పుడు మనం చూస్తున్న స్థాయి లోవి లేవు. ఇప్పుడు చూస్తున్నట్టుగా గంగా హారతులు జరగడం పాత సాంప్రదాయమేనంటే ఎలాంటి అభ్యంత రాలూ లేకుండా ఆమోదించారు. సరయూ హారతిని కూడా అలా ఆమోదించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పర్యాటక ప్రదేశాలకు ప్రాచుర్యం కల్పించడం కోసం కొత్త ఆకర్షణలు ప్రవేశపెట్టడం సమంజసమే. కాబట్టి, సరయూ నదికి హారతి పట్టడం బాగానే ఉంది. పెద్ద రామ విగ్రహ నిర్మాణమూ బాగానే ఉంది. అలాంటి విగ్రహాన్ని నెలకొల్పడం అయోధ్యకు తగ్గట్టు గానే ఉంటుంది. దానికి వివాదాస్పద స్థలానికి మధ్య సంబంధమే లేదు. దాన్నేదో కుట్రగా చూడటం అర్థరíß తం. ముంబైకి గేట్వే ఆఫ్ ఇండియా, హైదరాబాద్కు చార్మినార్లా సంకేతాత్మక కట్టడమేదీ లేని ఆ నగరంలో రాముని విగ్రహం పర్యాటక రంగానికి సంబంధించి ప్రధాన ఆకర్షణ అవుతుంది. కాబట్టి సరయూ నది ఒడ్డున భారీ విగ్రహం అనే ఆలోచన మంచిదే. కనీసం అది, తాజ్మహల్ కంటే ముందు అక్కడ శివాలయం ఉండేదనే మూర్ఖపు ఆలోచనకంటే తక్కువ చెడ్డది. ఉత్తరప్రదేశ్కు చెందిన అజ్ఞానులైన మంత్రులు లేవనెత్తిన ఆ వాదన, ఒకప్పుడు హిందూవాద చరిత్రకా రుడు పీఎన్ ఓక్ చేసిన వాదనను నెమరు వేయడమే. యోగి యోచన, అయోధ్యలో ఒకప్పుడు ఉండిన వివాదా స్పద కట్టడాన్ని కూలగొట్టిన చోటనే రామ మందిరాన్ని పునర్నిర్మించాలని కోరడం అంత చెడ్డదీ కాదు. కాబట్టి అయోధ్యను మంచి పర్యాటక స్థలంగా చేయాలనే ప్రయత్నం గురించి మనం ఇంత రాద్ధాంతం చేయాల్సిన పని లేదు. దేశీయంగా అంతర్గతంగా జరిపే పర్యటనల్లో అత్యధిక భాగం బంధువులను చూడటా నికి, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం జరిపేవే. యోగి ప్రయత్నాన్ని ప్రతికూల దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. అది నిరపాయకరమైనది. అలా అని, ఆసుప త్రుల్లో పసిపిల్లల మరణాలవంటి ప్రధాన పాలనాప రమైన సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోనవసరం లేదని నేను యోగికి చెబుతున్నానని అర్థం కాదు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపృకర్ ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
బీజేపీ గూట్లో రాణె
విశ్లేషణ ఇప్పటికే శివసేనతో కలతల కాపురాన్ని ఎలాగో కాపాడుకుంటూ వస్తోన్న బీజేపీ... రాణెకు పార్టీ తీర్థం ఇచ్చేలా ఉంది. ఇక అది రాణె ఆకాంక్షలను అదుపులో ఉంచడానికి ఎన్నో అదృశ్య విన్యాసాలను చే యాల్సి వస్తుంది. మహారాష్ట్రకు చెందిన దుందుడుకు రాజకీయ వేత్త నారాయణరాణెను తమ పార్టీలో చేర్చుకో డానికి భారతీయ జనతా పార్టీ పచ్చ జెండా చూపినట్టు ఇంకా రూఢి కాలేదు. అయినా, దేశంలోని అతి పెద్ద పార్టీ బీజేపీలో చేరాలని ఆయన భావి స్తున్నారని చాలా కాలంగానే వినవస్తోంది. ఈ విషయంలో అమిత్ షా, నరేంద్ర మోదీల మాటే నెగ్గుతుంది. అయినా ఆయనను పార్టీలోకి తీసుకునే అంశం ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగానే ఉంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి రాణె వలస రావడం పట్ల బీజేపీ శ్రేణులలో ఉన్న భయాలకు సజావైన కారణాలే ఉన్నాయి. నారాయణ రాణె, అహ్మదాబాద్లో ఉన్న అమిత్షాను కలుసు కోడానికి వెళుతూ ప్రయాణంలో ఉండగానే, బీజేపీలోనే ఆందోళన చెందిన ఒకరు ఆ భోగ ట్టాను లీక్ చేశారు. తద్వారా అటు రాణెకు, తన పథకాలకు సంబంధించి బీజేపీకి కలగగల ఇబ్బంది ఏదైనా ఉంటే దాన్ని తొలగించారు. రాణె ఈ విషయంపై మౌనం వహించడమే మేలు అనుకున్నారు. కాంగ్రెస్ నుంచి రాణె నిష్క్రమించడం, పైకి చూడటానికైతే పెద్ద కుదుపే. కానీ, ఆ పార్టీ బహుశా తలనొప్పి వదిలిందని అనుకునే అవ కాశమే ఎక్కువ. రాణె శివసేన నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించడాన్ని గతంలో స్వాగతించిన ట్టుగానే ఆయన నిష్క్రమణ కూడా ఆ పార్టీకి అలాంటి పరిణామమే అవుతుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కలసి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి పదవిని ఆశించి రాణె పార్టీ విచ్ఛిన్నకునిగానే ఉన్నారు. ఆయనను మచ్చిక చేయడం కాంగ్రెస్ వల్ల కాలేదు. నేడు ఆ పార్టీ ప్రాబల్యం, ప్రాముఖ్యం క్షీణిస్తున్నందువల్ల ఆయనకు ఇవ్వజూపడానికి వారి వద్ద ఏమీ లేదు. దీంతో రాణె తన ఇద్దరు కుమారులతో సహా మరేదారీ లేక ముందుకు సాగడానికి దారే లేని మార్గాన కొత్త అవకా శాలను వెదుక్కుంటున్నారు. రాణే గత్యంతరం లేని పరిస్థితి పట్ల బీజేపీ ప్రతిస్పందన అవకా శపూరితమైనది. క్షీణిస్తున్న కాంగ్రెస్ను మరింతగా చిన్నదిగా చేయడం కోసం అది ప్రయత్నిస్తోంది. అయితే, అందుకోసం అది కొన్ని ప్రమాదాలను ఎదుర్కొనడానికి సిద్ధ పడుతోంది. బీజేపీ, ఇప్పటికే శివసేనతో అసంతృప్తి కరమైన వివాహబంధాన్ని ఎలాగో కాపాడు కుంటూ వస్తోంది. రాణెను, ఆయన ఆకాంక్షలను అదుపులో ఉంచగలగాలంటే అందుకోసం అది అదృశ్యమైన ఎన్నో విన్యాసాలను చేయడం అవసరం అవుతుంది. రాణె, తన కుమారులు నీలేశ్, నితేశ్లతో కలసి మొత్తం సింధుదుర్గ్ జిల్లాను అంతటినీ ఒకప్పడు తమ కుటుంబం నియంత్రణలో ఉంచుకున్నదని గుర్తిస్తే... వారి ద్దరికీ కూడా పదవులు ఇవ్వాలి. ఏవో చిన్నా చితకా మార్పులు వారికి సరిపోవు. కీలకమైన స్థానాలే కావాలి. నారాయణ రాణెకు స్థానం కల్పించడం, రాష్ట్ర అధికార చట్రాన్ని అస్థిర పరచగలుగు తుంది. అది ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు మరో కొత్త తలనొప్పి అవుతుంది. రాణెను లేదా ఆయన కుమారులలో ఒకరిని రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా చూసిన శివసేన ప్రతిస్పందన ఎంత ప్రతికూలమైనదిగా ఉంటుందో ఊహించుకో వచ్చు. శివసేన మంత్రులు ఆయనతో కలసి మంత్రివర్గంలో ఉండటానికి సిద్ధపడకపోవచ్చు. ఒకవేళ ఇది, శివసేనను ప్రభుత్వం నుంచి వెళ్లగొట్టేసి, మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలన్న పథకంతో చేపట్టిన చర్యే అయితే తప్ప, జటిల సమస్యే. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన రాణె, ఆ తర్వాత ఒక ఉపఎన్నికలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుని అదే ఫలితాన్ని ఎదుర్కొన్నారు. ఆయన ప్రస్తుతం ఒక విధమైన ఒంటరి ఎడారి జీవితాన్ని గడుపుతున్నారు. ఏదైనా ఇంత కాలు మోపే నేలను దొరికించుకోవాలని ప్రయత్నిస్తు న్నారు, ముఖ్యమంత్రి పదవే దొరికితే అంతకు మించింది లేదు. రాణె, బహుశా తనకు రాజ్యసభ సీటు, ఇద్దరు కొడుకులకు శాసన మండలి సభ్య త్వాలు, తలా ఓ మంత్రిత్వ శాఖ కోరే అవకాశం ఉంది. నారాయణ రాణె బీజేపీలోకి వలసపోతే, అది భావజాలాల పట్టింపు లేకపోవడమే గాక, సాను కూలత, సౌఖ్యం, వ్యక్తిగత, కుటుంబ ఆకాంక్షల పట్ల మాత్రమే పట్టింపు ఉండే భారత రాజకీయాల తీరులె న్నులను మరోసారి నొక్కి చెపుతుంది అంతే. హఠాత్తుగా ఒక పార్టీ మాజీ విమర్శకుడు, అదే పార్టీకి... మళ్లీ పార్టీ ఫిరాయించే వరకు... ‘విధేయ సైనికుడు’ అయిపోతాడు. ఏది ఏమైనా ఒకటి మాత్రం ఖాయం.. రాణె బీజేపీలో కూడా సుఖంగా ఉండలేరు. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
గోల గోల పండుగల వేళ
విశ్లేషణ ధ్వని కాలుష్య నిరోధం గురించిన ప్రభుత్వ చట్టాలున్నా పండుగ సంబరాల నిర్వాహకులకు ఆ పట్టింపే ఉండదు. శబ్ద కాలుష్యం తాత్కాలికమైనదే అయినా, శాశ్వతమైన నష్టాన్ని కలగజేయగలదని రుజువైంది. మన భారతీయులకు లెక్కలేనన్ని పండుగలు న్నాయి. అవి ఎక్కువగా మతంతో ముడిపడినవి. ఈ వేడుకల విలువకు కొలబద్ద శబ్దమేనని మన వాళ్లు అపార్థం చేసుకుం టున్నారని అనిపిస్తుంది. రాత్రంతా చెవులు చిల్లులు పడేలా చేసే సంగీత ఘోషతో కూడిన దేవీ నవరాత్రే కావచ్చు, లేదా రోడ్డుకు అడ్డంగా పైనుంచి వేలాడు తున్న ఉట్టిని అందుకోడానికి దొంతరలు, దొంతర లుగా ఒకరిపైకి ఒకరు పైకి ఎక్కే దహీహండి(ఉట్లు కొట్టడం)యే కావచ్చు. శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాతి రోజున... కృష్ణ పర మాత్మునికి అందకుండా తల్లి ఎత్తుగా ఉన్న ఉట్టిలో ఉంచిన వెన్నను దొంగిలించడానికి ఆయన చేసిన లీలను అనుకరిస్తూ దహీహండి వేడుక జరుగు తుంది. మహారాష్ట్రలో అది పెద్దగా చప్పుళ్లు లేకుం డానే సాగిపోతుంది. హైడెసిబల్ సౌండ్ సిస్టమ్స్ను సరఫరా చేస్తే పోలీసులు స్వాధీనం చేసుకుంటారని వాటిని అద్దెకు ఇవ్వకపోవడమే అందుకు కారణం. లేకపోతే అది కూడా మహా శబ్ద ఘోషగా సాగేదే. ఆ తర్వాత చలికాలం వచ్చేసరికి దేవీ నవరాత్రి వంతు వస్తుంది. ఆ తొమ్మిది రాత్రులు స్త్రీ పురుషులు రాత్రిళ్లు గుజరాతీ దాండియా (కోలాటం) బాణీలు మోగుతుండగా నృత్యాలు చేస్తారు. అవి దసరా పండుగతో ముడిపడినవి. కాబట్టి నవరాత్రులకు కూడా ప్రాతిపదిక మతమే. కానీ, ఈ దాండియా వేడుకలను, ప్రధానంగా వాణిజ్యపరమైన కార్యక్ర మాలుగా ఈవెంట్ మేనేజర్లు టికెట్లు అమ్మి నిర్వహి స్తారు. వాటిలో కూడా డీజేలు హై డెసిబల్ సౌండ్ సిస్టమ్స్ను ఉపయోగిస్తూ, చెవులు గింగురుమనేలా సంగీతాన్ని వినిపిస్తారు. ఇక ఇప్పుడు, శుక్రవారం నుంచి ప్రారంభ మయ్యే గణేశ్ చతుర్థి వంతు. దాదాపు ప్రతి వీధి మలుపునా గజాననుని విగ్రహానికి పూజలు చేస్తారు. రోడ్లను, రోడ్డు పక్క ఉండే పాదచారుల బాటలను ఆక్రమించి, వాహనాలు సహా రాకపోకలన్నింటినీ అడ్డగించేస్తారు. లౌడ్ స్పీకర్లు ఈ పండుగ సర్వసా ధారణ లక్షణం. ఈ శబ్ద కాలుష్యానికి వ్యతిరేకంగా చేసిన ప్రచార ఉద్యమం ఏమైనా విజయం సాధిం చిందో లేదో వేచి చూడాలి. కోర్టులైతే అలాంటి ధ్వనులను నిషేధించాయి. దహీహండి పగటిపూట సాగే ఒక రోజు కార్య క్రమం. నవరాత్రి, గణేశ్ చతుర్థి తొమ్మిది రోజులు, పది రోజులు సాగే వేడుకలు. నిర్వాహకులు ఈ వేడు కలకు లౌడ్ స్పీకర్ల ఉపయోగపు వేళల పరిమితు లను 10 గంటల పరిమితికి దాటి కొనసాగేలా, కనీసం చివరి మూడు రోజులకైనా మిహాయింపు లను కోరి, సాధిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనేవారు ఇది మతపరమైన ఉత్సాహం అంటారు, ఇతరు లేమో ఆ విపరీత శబ్దాల వల్ల బాధపడాలి. 70 డెసి బల్స్కు మించిన శబ్దాలు ఈ పండుగలకు గుర్తుగా మారాయి. గణేశ్ చతుర్థి సందర్భంగా, రెండో రోజు నుంచే నిమజ్జనాలు సాగుతుంటాయి. కాబట్టి రోజంతా ఆ గోల సాగుతూనే ఉంటుంది. పదో రోజున పెద్ద పెద్ద విగ్రహాలన్నిటినీ ఊరేగింపుగా తీసుకుపోయి సాగ నంపుతారు. భారీ డోళ్లు, భేరీలు, పోర్టబుల్ డీజే సెట్లు విగ్రహాలతో పాటే ట్రక్కులపై జలాశయాలకు సాగిపోతాయి. శుభ శకునాల వేల్పును, పూజిం చడం కోసం పందిళ్లకు తరలించేటప్పుడు కూడా అవన్నీ వెంట ఉండాల్సిందే. ముంబై హైకోర్టు దహీహండిలో పాల్గొనే వారి ప్రాణ రక్షణ కోసం, కాళ్లుచేతుల రక్షణ కోసం ఉట్టి కట్టే ఎత్తు మీద, అందులో పాల్గొనేవారి వయసుపైన ఆంక్షలను విధించినప్పుడు... నిర్వాహకులు, ప్రధా నంగా రాజకీయవేత్తలు అది ఒక ‘సాహస క్రీడ’ అంటూ వాదించడం ఆసక్తికరం. ఇది అవకాశవాదా నికి సుస్పష్టమైన ఉదాహరణ. ఈ కేసులో, హైకోర్టు తీర్పును సమీక్షించాలని సుప్రీం కోర్టు కోరింది. దీంతో అది వాటిని నియంత్రించే పని చట్టసభల పనే తప్ప తాము చేయజాలమంటూ మునుపటి యథాతథస్థితి కొనసాగింపును పునరుద్ధరించింది. గణేశ్ చతుర్థికి రాజకీయపరమైన ప్రాపకం కూడా భారీ ఎత్తున ఉంది. అది స్థానిక రాజకీయ వేత్తలు అందించే దానికే పరిమితం కాదు. పైగా ఇది లాభసాటి వ్యవహారం కూడా. చిన్న సంస్థలు చిన్న విగ్రహాలను ఎంచుకుని, అక్రమంగా రోడ్డు స్థలా లను ఆక్రమిస్తాయి. అందుకోసం అవి రాజకీయ వేత్తల మద్దతును కోరతాయి. ఎన్నికల సమ యంలో చిన్న గృహ సముదాయాల ప్రాతిపదికపై ఏర్పడ్డ బృందాలు రాజకీయవేత్తల నుంచి నిధులను కోరతాయి. ‘దానికి బదులు’గా ఓటును ఆశించి ఆశించి వారు సమర్పించుకోడానికి అంగీకరిస్తారు. ధ్వని కాలుష్య నిరోధం గురించి ప్రభుత్వ చట్టా లున్నా నిర్వాహకులకు దాదాపుగా ఆ పట్టింపే ఉండదు. శబ్ద కాలుష్యం తాత్కాలికమైనదే అయినా, శాశ్వతమైన నష్టాన్ని కలగజేయగలదని రుజువైంది. నగరాలు, పట్టణాలలో అన్ని వైపులా చుట్టేసి వ్యాపించే శబ్ద కాలుష్యం... గణేశ్ చతుర్థి వంటి పండుగల సమయంలో మరింత ఎక్కువగా పెరుగు తున్నదే తప్ప తగ్గడం లేదని మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com మహేష్ విజాపృకర్ -
చట్టబద్ధమైన అహంకారమా?
విశ్లేషణ ‘చెప్పుతో 25 సార్లు కొట్టాన’ని గర్వంగా చెప్పుకున్న తర్వాత తాను ‘వినమ్రత’ కలిగిన వ్యక్తినని శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చెప్పిన మాటలను యథాతథంగా తీసుకోవడం ఎవరికైనా కష్టమే అవుతుంది. ఎయిర్లైన్స్ వ్యవహారంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గండం నుంచి బయటపడినట్లే. ఈ మరాఠా ఎంపీకి అనువుగా ఉండటం కోసం పుణె–ఢిల్లీ మార్గంలో బిజినెస్ క్లాస్ సీట్లు ఉన్న విమానాన్ని ఎయిరిండియా ప్రవేశపెట్టనున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఎంపీ గైక్వాడ్ తన వైఖరిని పూర్తిగా సమర్థించుకున్నట్లు కనిపించింది, అదే సమయంలో ఆయన ప్రత్యర్థులు మొదట్లో దృఢవైఖరిని అవలంబించినప్పటికీ ఆ తర్వాత మాత్రం లొంగుబాటు ప్రదర్శించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంమీద ఈ వివాదంలో శివసేన ఎంపీ గెలి చారు. పైగా ఈ మొత్తం ఉదంతంలో అవసరమైతే పార్టీ వైపు నుంచి న్యాయ సహాయం అందిస్తామని, కానీ భవిష్యత్తులో మాత్రం ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి సరిగా వ్యవహరించాలని సూచిస్తూ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే తమ పార్లమెంట్ సభ్యుడికి వత్తాసుగా నిలిచినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. రవీంద్ర గైక్వాడ్ ముందుగా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ ఎయిర్లైన్స్, విమానయాన మంత్రి గట్టిగా చేసిన డిమాండ్తో పోలిస్తే ఇది పట్టించుకోవాల్సిన పని లేనంత చిన్న విషయంగా అయిపోయింది. ఎయిర్లైన్స్ సీనియర్ ఉద్యోగిపై దాడికి సంబంధించి జరిగిన దానికి సారీ చెబుతూ శివసేన ఎంపీ చివరకు సభలో పశ్చాత్తాపం వ్యక్తపరిచారు. కానీ మీడియా మాత్రం దాన్ని క్షమాపణలాగా చూడనేలేదు. రాజకీయాధికార వర్గానికి చెందిన ప్రతిపక్షాలు లేదా వాటిలోని కొన్ని సెక్షన్లకు చెందిన వారు రవీంద్ర గైక్వాడ్ ప్రవర్తన చెడుగా ఉందని భావించినప్పటికీ, విమాన ప్రయాణం చేయడం నుంచి ఆయనను నిషేధించడం అనేది (సామాన్య ప్రయాణీకుడు ఇలా వ్యవహరించి ఉంటే ఇప్పటికే తను జైల్లో ఉండేవాడు) ఒక ఎంపీగా తన హక్కులను అతిక్రమించినట్లవుతుంది అనే ప్రాతిపదికన ఎంపీకి కల్పించాల్సిన హక్కులను భంగపరిచినట్లవుతుందన్న అభిప్రాయం కల్గించడానికి వీరు ప్రయత్నించారు. పైగా దీనికి సంబంధించి శివసేన పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెడతానని బెదిరించింది కూడా. కానీ, ఎంపీగా అతని ప్రత్యేకహక్కును అది ఉల్లంఘించినట్లేనా?. ఎయిరిండియా తన విమానాలలో ప్రయాణించకుండా ఆయనను తక్షణమే దూరం పెట్టేసినప్పుడు, ఒక ఎంపీని తన విధులు నిర్వర్తించకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నిస్తూ శివసేన.. ఇది అన్యాయమంటూ ఆక్రోశించింది. నిజమే.. చట్టసభలో కానీ, ఆయన ఏవైనా కమిటీలలో గానీ ఉన్నట్లయితే, ఒక ఎన్నికైన ప్రతినిధిగా తన విధులు తప్పక నెరవేర్చవలసే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆ నిషేధం తన పార్లమెంట్ విధులను నిర్వహించకుండా అడ్డగించడమే అవుతుంది. తన విధులు నిర్వర్తించకుండా శివసేన ఎంపీని అడ్డగించడం బహుశా తప్పే కావచ్చు. వాస్తవంగా కూడా ఏ ఎంపీని తన విధులను నిర్వర్తించడం నుంచి ఈ రూపంలో తప్పించకూడదు. ఇక్కడ ‘పనిచేయటం’, ‘విధులు’ అనే పదాలకే ప్రాధాన్యత ఉంది. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ జరిగిన ఉదంతం అసౌకర్యాన్ని కలిగించిందంటూ చాలా జాగ్రత్తగా పదప్రయోగం చేశారు. అది హక్కుల ఉల్లంఘన అని చెప్పకుండా ఆమె చాలా జాగ్రత్త వహించారు. అయితే విస్తృతార్థంలో.. ఎంపీ చేయవలసిన విమాన ప్రయాణాలపై విమానయాన సంస్థ నిషేధం విధించడం అంటే పార్లమెంటుకు హాజరు కాకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం అని అర్థం కాదు. కానీ ఎయిరిండియా ఉద్యోగిని తాను తన చెప్పుతో పాతిక పర్యాయాలు కొట్టినట్లు టీవీ కెమెరాల ముందు శివసేన ఎంపీ స్వయంగా అంగీకరించారు కాబట్టి, అది హక్కులను అడ్డుకోవడంలాగా కాకుండా పూర్తిగా విభిన్నమైన ఘటనకు చెందిన ఒక పాయలాగా మారిపోయింది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తన చర్యను సమర్థించుకోవడమే కాదు (ఆ వీడియో ఫుటేజీని మీరు చూసినట్లయితే) తాను చేసిన పనికి ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. ఆ గర్వం కూడా కొట్టడం తన చట్టపరమైన హక్కు అనే భావన నుంచి వచ్చిన గర్వం. విమానంలో ఉన్న ప్రయాణీకుల భద్రత రీత్యా ఆ ఎంపీ భవిష్యత్ విమాన ప్రయాణంపై ఎయిరిండియా ఆంక్షలను కూడా విధించింది. పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు కూడా దాదాపుగా ఈ విషయాన్నే లోక్సభలో ప్రకటించారు. విమానయాన సిబ్బంది ఆగ్రహానికి కూడా ప్రాతిపదిక ఇదే. ‘చెప్పుతో 25 సార్లు కొట్టాన’ని గర్వంగా చెప్పుకున్న తర్వాత తాను ‘వినమ్రత’ కలిగిన వ్యక్తినని గైక్వాడ్ చెప్పిన మాటలను య«థాతథంగా తీసుకోవడం ఎవరికైనా కష్టమే అవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కొట్టొచ్చినట్లుగా కనపడుతున్న తన దుష్ప్రవర్తన ఫలితంగానే ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఈ ఉదంతంలో కాస్త మెట్టు దిగాల్సి వచ్చింది. హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రివిలెజ్ కేసు ఉల్లంఘనకు సంబంధించిన నివేదికను పేర్కొంటూ, కౌల్ –షక్దర్ తమ ‘ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్’ అనే రచనలో.. ఇలాంటి తరహా ఉల్లంఘనలు, ‘ఇతర పౌరులకు మల్లే తనకూ వర్తించే సామాజిక విధుల నుంచి ఏ గౌరవ సభ్యుడినీ తప్పించలేవ‘ని చెప్పారు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com మహేష్ విజాపృకర్ -
చెల్లని కాసులు.. చిల్లర కాసులు
విశ్లేషణ నలుపు లేదా తెలుపు ఏదైనా కావచ్చు.. కోట్ల కొద్దీ నగదు కలిగిన వారు కూడా ఉన్నట్లుండి చిల్లర కాసులకు ఎంత విలువ ఉందో ఇప్పుడు గ్రహించారు. ఈ చిల్లరే లేకుంటే వారి జీవితాలు ఘోరంగా దెబ్బతింటాయి. గత శుక్రవారం నా బ్యాంకు నుంచి రూ. 2,000ల నోట్ల తొలి సెట్ను తీసుకోగానే, 1893లో సుప్రసిద్ధ రచ యిత మార్క్ ట్వెయిన్ ప్రచురించిన ‘ది మిలి యన్ పౌండ్ బ్యాంక్ నోట్’ అనే కథానిక నా తలపుకు వచ్చింది. ఆ కథానికలో ముఖ్య పాత్ర హెన్రీ ఆడమ్స్ పదిలక్షల పౌండ్ల విలువైన సింగిల్ కరెన్సీ నోట్కి సొంతదారై, దాన్ని ఖర్చు పెట్టాలని ప్రయత్నించాడు. కానీ అతడా నోటుని ఇవ్వబోయి నప్పుడు షాప్ కీపర్లు, రెస్టారెంట్ యజమానులు ఒక్కసారిగా బెదిరిపోయారు. ఆ నోటుకు తగిన చిల్లర వారి వద్ద లేకపోయింది. అలాగని అంత పెద్ద నోటుతో వచ్చిన అత డిని వెనక్కు పంపాలని కూడా వారనుకోలేదు. అంత పెద్ద సంపన్నుడిని కోల్పోయే సంప్రదాయం కూడా వారికి లేదు. ఆ క్రమంలో రుణం అతడిని వెతుక్కుంటూ వచ్చింది. తక్కువ ధరలో అతడు కొనుక్కోవాలనుకున్న సూట్ స్థానంలో ఖరీదైన పూర్తి స్థాయి వార్డ్రోబ్ వచ్చేసింది. వాళ్లు అతడికి రుణాలు కూడా ఇచ్చారు. అత్యధిక విలువ గల నోటుతో ఏదైనా బిల్లు కట్టడానికి కూడా కష్టమే అయినప్పటికీ, ఆ నోటు నిరుపయోగం మాత్రం కాలేదు. భారత్లో అయితే చిన్న కమ్యూనిటీలలో తప్పితే, రూ.2,000ల కరెన్సీ నోటుతో ఎవరూ రుణం పొందలేరు. పైగా సరైన ప్రణాళికతో నోట్ల రద్దు చేయనందున, తక్కువ విలువ కలిగిన 100, 50, 10 రూపాయల నోట్ల సరఫరాని అది సమర్థ వంతంగా తీసుకురాలేకపోయింది. మార్క్ ట్వెయిన్ కథానికలో హెన్రీ ఆడమ్స్కి దక్కిన అదృష్టం గురించి నేనయితే కల్లో కూడా ఆశించలేను. ఎందుకంటే రిటైల్ మార్కెట్లో రుణం తీసుకోవడం అంత సులభం కాదు. అందు కనే నవంబర్ 10న నా బ్యాంకు నుంచి రూ. 10 వేల చెక్కును విత్డ్రా చేసి మరీ నేను తీసుకున్న అయిదు 2 వేల రూపాయల నోట్లు నేటికీ నా వాలె ట్లోనే వృథాగా ఉండిపోయాయి. నేను కొనాలను కున్న చిన్న చిన్న కొనుగోళ్లు వాయిదా పడ్డాయి. శాసన మండలి ఎన్నికలు జరగనున్న మహా రాష్ట్రలో రాజకీయ నాయకులు తమ ఓటర్లకు బంగారు, వెండి నాణేలు లంచంగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఉత్తరప్రదేశ్, పంజాబ్లో ఈ పరిస్థితిని ఎలా తట్టుకోవాలో ఎవరికీ అర్థం కావటం లేదు. బహుశా అవినీతి పెరిగి బంగారు, వెండి నాణేల సత్వర సేకరణకు దారి తీయవచ్చు. అలా కాదంటే.. పరిశుద్ధమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఎన్నికలు జరగవచ్చు. రెండుసార్లు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రయోగాన్ని మినహాయిస్తే, నల్లధనం ప్రభావం లేని ఎన్నికలను ఇంతవరకు మనం విని ఉండలేదు. నలుపు లేదా తెలుపు ఏదైనా కావచ్చు.. కోట్ల కొద్దీ నగదు కలిగిన వారు కూడా ఉన్నట్లుండి చిల్లర కాసులకు ఎంత విలువ ఉందో ఇప్పుడు గ్రహించారు. ఈ చిల్లరే లేకుంటే వారి జీవితాలు ఘోరంగా దెబ్బతింటాయి. కూరలో కలిపే కొత్తి మీరను కొనుగోలు చేయ డానికి ఎస్యువీ వాహనాలలో లేదా సెడాన్ కార్లలో తమ డ్రైవర్లను పంపడం కూడా వారికి సాధ్యం కావడం లేదు. ఇక మధ్యతరగతి కుటుం బాలయితే చిల్లర కోసం తమ పిల్లల హుండీలలో చేయి పెట్టాల్సివచ్చింది. ఇది పట్టణ ప్రాంతాల్లోని మధ్యతర గతి, సంప న్నవర్గాలు ఎదుర్కొంటున్న సంక్షోభం. ఇక ద్రవ్యో ల్బణం కారణంగా అధిక విలువ కలిగిన నోట్లు ఆడుతున్న గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏమిట నేది ఎవరికీ తెలియటం లేదు. బ్యాంకింగ్ రంగం విస్తరించినప్పటికీ గ్రామీణులకు బ్యాంకులు అంత సులభంగా అందుబాటులో లేవు. ప్రధాన నగరా ల్లోని బ్యాంకులకు కూడా కొత్త, చిన్న నోట్లను తగినంతగా అందుబాటులో ఉంచలేకపోతున్న నేపథ్యంలో మారుమూల ప్రాంతాల్లో బ్యాంకుల తీరును ఎవరైనా ఊహించు కోవచ్చు. ఏమైనప్ప టికీ సంపన్న, మధ్యతరగతి వర్గాలు నిరుపేదల పట్ల సహానుభూతి ప్రదర్శించాల్సిన సమయమిది. ప్రపంచంలోని 120 కోట్లమంది అత్యంత నిరు పేదల్లో మూడోవంతు మంది భారత్లోనే ఉంటు న్నారు. ఇప్పుడు వీరిని గణాంకాలుగా లెక్కించడం మాని మనుషులుగా భావించాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. డబ్బు లేకుంటే ఏం జరుగుతుందన్నది మన అనుభవంలోకి వచ్చింది కాబట్టి, డబ్బులేని వారి పరిస్థితి గురించి మనం ఆలోచించవలసిన సమ యమిది. అవినీతిని ప్రోత్సహిస్తూ, సంక్షేమ పథకాల పేరుతో కొల్లగొడుతున్న వ్యవస్థకు పేదలు బలవుతుంటారు. పెద్ద నోట్ల రద్దు జరిగి ఆరురోజులు పూర్తయింది. ఈలోగా అరుణ్ జైట్లీ ఈ బాధ మరో రెండు వారాలు కొనసాగుతుందని సెలవిచ్చేశారు కూడా. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, మహేష్ విజాపుర్కర్ ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement