breaking news
Veterinarian Tirupati
-
భయం గుప్పిట్లో.. ఏడుగంటలు
► డబ్బులిస్తానన్నా కొడుతూనే ఉన్నారు ► అదనంగా డబ్బులడగడంతో మెసేజ్ పంపే అవకాశమొచ్చింది ► కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన పశువైద్యుడు తిరుపతి కాసిపేట(బెల్లంపల్లి): ‘ఆ ప్రాంతం తెలియదు.. వారి ఖాతాల్లో డబ్బులు వేయకుంటే చంపుతామని బెదిరిస్తూ వాహనంలో తిప్పుతూ కొట్టారు. డబ్బు లిప్పిస్తానని చెప్పినా కొడుతూనే ఉన్నారు. 7 గంటలు భయంగుప్పిట్లో గడిపినా అప్పుడు నా కుటుంబం గుర్తుకు వచ్చింది. డబ్బులిచ్చినా వదిలి పెడతారను కోలేదు’ మహా రాష్ట్రలో శుక్రవారం కిడ్నాపర్ల చెరలో ఏడుగంటలు గడిపి ఇంటికి చేరుకున్న మంచిర్యాల జిల్లా కాసిపేట మండల పశువైద్యాధికారి కుర్మ తిరుపతి అన్న మాటలివి. కిడ్నాప్ వివరాలు ఆయన మాటల్లోనే.. గత నెల 29న ఎనిమిది మంది లబ్ధిదారులకు గొర్రెలు కోనుగోలు చేసేందుకు మహారాష్ట్రలోని సోలాపూర్కు వెళ్లాను. 30న సోలాపూర్ జిల్లాలోని సంగోల ప్రాంతంలో తిరిగినా గొర్రెలు దొరకలేదు. జూలై ఒకటిన పుణేకు సమీ పంలోని బిగ్ 1కు వెళ్లాం. ‘నావద్ద గొర్లున్నాయి’ చెబుతూ రాంచంద్ర మహదేవ్ కబడి అనే వ్యక్తి తమవెంట ఉండడంతో 3 యూనిట్లు కొనుగోలు చేశాం. గొర్రెలను పరిశీలిస్తున్న క్రమంలోనే ఇతర లబ్ధిదారుల యూనిట్లకు సంబంధించిన డబ్బులు కూడా తమ ఖాతాల్లో వేస్తే వారికి ముట్టజెబు తామని కోరారు. అలా కుదరదు. సంబంధిత లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేస్తామన్నా. అప్పటి నుంచి వారి వేధింపులు మొదలయ్యాయి. అన్నం తింటూ లాడ్జిలో సొసైటీ సభ్యులతో మాట్లాడు తున్న. ఇంతలో గొర్రెలను పరిశీలిస్తున్న ఫొటోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈనెల7న శుక్రవారం ఉదయం కాసిపేట మండలం ధర్మ రావుపేటకు చెందిన యాదవ సొసైటీ సభ్యులు రావడంతో వారితో గొర్రెల విషయమై లాడ్జి ముందు ఫోన్లో మాట్లాడుతున్న క్రమంలో రాం చంద్ర మహదేవ్తోపాటు మరో నలుగురు తనను వాహనంలోకి ఎక్కించి కొట్టారు. వాహ నంలోనే తిప్పుతూ తమ ఖాతాల్లోకి రూ.10 లక్షలు పంపిం చాలన్నారు. రోజువారీగా పంపి నట్లు తమ ఖాతా ల్లోకి డబ్బులు పంపాలని లేకుంటే చంపేస్తానని బెదిరించాడు. ఓ ఇంట్లో పెట్టి కొడు తుండడంతో వీరి చెర నుంచి ఎలాగైనా బయట పడాలని తొమ్మిది యూనిట్లకు సంబంధిం చి రూ.9.90 లక్షలు పంపిస్తానని చెప్పి ఏడీకి ఫోన్ చేసిన. మూడు ఖాతా నంబర్లు ఇచ్చిన. దీంతో తెలుగులో మాట్లాడకుండా దగ్గరుండి హిందీలో మాట్లాడిం చారు. వారి ఖాతా నంబర్లు స్కాన్ చేసి ఏడీకి చెప్పగా, ఆయన పంపిస్తున్నట్లు చెప్పడంతో వారు నమ్మారు. నీ ఖాతా నుంచి రూ.లక్ష ట్రాన్స్ ఫర్ చేయాలని చెప్పడంతో తన దగ్గర అంత లేదని రూ.10 వేలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. అయితే, తనకు తెలిసిన ఇద్దరు, ముగ్గురు డాక్టర్లకు ఫోన్ చేయగా అందరూ డబ్బుల్లేవని చెప్పారు. ఐయామ్ కిడ్నాప్డ్ బెల్లంపల్లి వైద్యుడు శంకర్లింగం రూ.30 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. వారి ఖాతా ల్లో జమ చేసేందుకు ఒప్పుకున్నారు. వారు ఫోన్లో మాట్లాడుతుండగా ఖాతా నంబర్ పంపి న వెంటనే కొంత సమయం దొరకడంతో ఐయా మ్ కిడ్నాప్డ్ అని మేసేజ్ పంపించాను. దీంతో విషయం అర్థం చేసుకున్న ఆ వైద్యుడు తన కిడ్నాప్ విషయాన్ని అధికారులకు చెప్పారు. డబ్బులు ఖాతాలకు ఇంకా వస్తా లేవు అంటూ చెట్లు పుట్టల వెంబడి తిప్పారు. సోలాపూర్ కలె క్టర్, ఎస్పీలకు సంఘటన వివరాలు తెలియ డంతో ప్రత్యేక వాహనంలో వస్తున్న క్రమంలో గమనించి ఎక్తాపూర శివారులో 3 గంటలకు దింపేసి వెళ్లిపోయారని తిరుపతి పేర్కొన్నారు. -
గొర్రెలు అమ్ముతామంటూ..
► మంచిర్యాల పశు వైద్యుడు తిరుపతిని కిడ్నాప్ చేసిన మహారాష్ట్ర దొంగలు ► 9 యూనిట్లు అమ్మినట్టు సంతకం పెట్టి రూ.9 లక్షలు ఇప్పించాలని హుకుం ► చాకచక్యంగా తోటి డాక్టర్కు ఎస్ఎంఎస్ పెట్టిన తిరుపతి ► స్పందించిన ప్రభుత్వం.. మహారాష్ట్ర అధికారులతో సంప్రదింపులు ► సాయంత్రం 4 గంటలకు వదిలిపెట్టిన దుండగులు.. సాక్షి, హైదరాబాద్: గొర్రెల పథకం ఓ పశు వైద్యుడి ప్రాణం మీదకు తెచ్చింది. గొర్రెలు కొనడానికి పొరుగు రాష్ట్రానికి వెళ్తే దుండగులు కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. తాము గొర్రెలు అమ్మినట్టు సంతకం పెట్టించుకుని రూ.9 లక్షలు కాజేయాలని యత్నించారు. అయితే సదరు డాక్టర్ అప్రమత్తతతో వ్యవహ రించి తోటి వైద్యుడికి ఎస్ఎంఎస్ పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరిపింది. దీంతో కిడ్నాప్ అయిన డాక్టర్ క్షేమంగా విడుదలయ్యారు. గురువారమే ఫోన్.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పని చేస్తున్న పశు వైద్యుడు తిరుపతి.. గొర్రెల పథకం కింద గొర్రెల కొనుగోలు కోసం మహారాష్ట్రలోని బిగువాన్ జిల్లా సంగోలా ప్రాంతానికి వెళ్లారు. అక్కడే ఉండి గొర్రెలు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం సమ యంలో ఆయనకు కొందరు ఫోన్ చేసి తాము గొర్రెలు అమ్ముతామని చెప్పారు. వారి వద్దకు వెళ్లి గొర్రెలను పరిశీలించిన తిరుపతి.. ఒక్క యూనిట్ (21 గొర్రెలు) మాత్రమే పనికి వస్తుందని చెప్పారు. అయితే తమ వద్ద ఇంకా గొర్రెలు ఉన్నాయని, శుక్రవారం చూపెడతా మని చెప్పి డాక్టర్ను వెనక్కు పంపారు. చెప్పినట్టుగానే శుక్రవారం ఉదయం 8 గంటలకు తిరుపతికి ఫోన్ చేశారు. తాము వస్తున్నామని, ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ ఆరా తీశారు. తాను బస చేస్తున్న హోటల్ పైనుంచి కిందకు దిగి ఫోన్ మాట్లాడుతుం డగా బొలెరో వాహనంలో నలుగురు వ్యక్తులు వచ్చి తిరుపతిని కొట్టుకుంటూ బలవంతంగా వాహనం ఎక్కించారు. అక్కడి నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏక్తాపూర్కు తీసుకెళ్లి నిర్బంధించారు. తాము 9 యూనిట్ల గొర్రెలు అమ్మినట్టు సంతకం పెట్టి, ఆన్లైన్లో తమ బ్యాంకు ఖాతాల్లోకి రూ.9 లక్షలు జమ చేయించాలని డిమాండ్ చేశారు. ‘గొర్రెలను కొనుగోలు చేసేందుకు పశు వైద్యులను పంపడం అన్యాయం. రేపు ఏది జరిగినా మా మీదే వేస్తారు. అందుకే టెండర్లు పిలవాలి. లేదంటే విక్రేతలు, కొనుగోలు దార్లను ఓ చోట చేర్చి సంత తరహాలో ఏర్పాట్లు చేయాలి’ అని టీఏహెచ్ఓఎస్ఏ అధ్యక్షుడు డాక్టర్ బాబుబేరి అన్నారు. ఐ యామ్ కిడ్నాప్డ్.. డోంట్ సెండ్ మనీ గొర్రెల కొనుగోళ్లకు సంబంధించి కొనుగోలు కమిటీ పక్షాన గొర్రెలను కొన్న వైద్యుడు సంతకం పెట్టి ఉన్నతాధికారులకు చెబితే వారు డబ్బును ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్ చేసే అంశాన్ని హిందీలోనే మాట్లాడాలని కిడ్నాపర్లు తిరుపతిని బెదిరించారు. ‘వీళ్లు తొమ్మిది యూనిట్ల గొర్రెలు విక్రయించారు. డబ్బులు పంపండి’ అని హిందీలో చెప్పించారు. అదే సమయంలో తిరుపతి మరో డాక్టర్కు ‘ఐ యామ్ కిడ్నాప్డ్.. డోంట్ సెండ్ మనీ’ అంటూ మెసేజ్ పంపారు. వెంటనే సదరు డాక్టర్.. తిరుపతి కిడ్నాప్ అయిన విషయాన్ని జిల్లా అధికారులకు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్కు తెలియజేశారు. డైరెక్టర్ డాక్టర్.డి. వెంకటేశ్వర్లు వెంటనే అడిషనల్ డీజీ అంజనీకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్లకు విషయాన్ని తెలియజేశారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు, సీఎస్లతో తలసాని సంప్రదింపులు జరిపి తిరుపతి ఎక్కడున్నారో కనిపెట్టాలని ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసుల కదలికల గురించి తెలుసుకున్న కిడ్నాపర్లు సుమారు 8 గంటల అనంతరం సాయంత్రం 4.00 సమయంలో తిరుపతిని ఓ గుర్తుతెలియని ప్రాంతంలో వదిలివెళ్లారు. తిరుపతిని కిడ్నాపర్లు ఘోరంగా కొట్టారని, అక్కడి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మరోవైపు సాయంత్రం మహారాష్ట్ర నుంచి మంచిర్యాల బయలుదేరేందుకు తిరుపతి ఏర్పాట్లు చేసుకోవడంతో కథ సుఖాంతమైంది.