breaking news
Venkataramanan
-
ట్రిపుల్ ఐటీలో ఇంటర్ తరహా పరీక్షలు
బాసర (ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో ఈ విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ పరీక్షలకు బదులు ఇంటర్మీడియట్ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఇన్చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ఇదే అంశంపై ‘సాక్షి’ పత్రిక గతంలోనే కథనాలను ప్రచురించింది. తాజాగా ఆ విషయాన్నే ఇన్చార్జి వీసీ ప్రకటించారు. మొదటి రెండు సంవత్సరాల పీయూసీ–1, 2 చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రిపుల్ ఐటీ ఆధునీకరణకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి శనివారం వర్సిటీ సందర్శనకు వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేస్తారని వివరించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వీసీలు కూడా త్వరలో ట్రిపుల్ ఐటీని సందర్శిస్తారన్నారు. డిసెంబర్లో స్నాతకోత్సవం బాసర ట్రిపుల్ ఐటీలో స్నాతకోత్సవ కార్యక్రమాన్ని డిసెంబర్లో నిర్వహిస్తామని ఇన్చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ఈ1, ఈ2 విద్యకు అవసరమయ్యే 2,200 ల్యాప్టాప్లను విద్యార్థులకు సమకూర్చినట్లు వెల్లడించారు. యూనిఫామ్కు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, విద్యార్థులకు అవసరమయ్యే బూట్లను తెలంగాణ రాష్ట్ర లెదర్ ఇండస్ట్రీ సంస్థ సరఫరా చేస్తుందని చెప్పారు. ట్రిపుల్ ఐటీ అవసరాల దృష్ట్యా మరో 24 తరగతి గదులను ప్రస్తుత భవనాలపై నిర్మిస్తామని వెల్లడించారు. కాగా, కళాశాలలోని 27 ఎకరాలలో ఎకో పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీశ్కుమార్ తెలిపారు. రూ.3 కోట్లతో యూనివర్సిటీలో స్పోర్ట్స్ స్టేడియాన్ని నిర్మించన్నుట్లు ఆయన చెప్పారు. కళాశాలలో తల్లిదండ్రులు విద్యార్థులను కలిసేందుకు విజిటింగ్ అవర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఇన్చార్జి వీసీ.. ఆర్జీయూకేటీ వెబ్సైట్లో వీసీ డాష్ బోర్డు, విద్యార్థుల ఈ–ప్రొఫైల్ పోర్టల్ను ప్రారంభించారు. -
మిస్త్రీకి చుక్కెదురు
ముంబై: టాటా సన్స్ ఛైర్మన్గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. టాటా ట్రస్ట్స్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్. వెంకటరామన్ దాఖలు చేసిన దావాను ముంబై చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు విచారణకు స్వీకరించచింది. ఈ నేపథ్యంలో ముంబై కోర్టు సైరస్మిస్త్రీ, షాపూజీ మిస్త్రీ, నలుగురు డైరెక్టర్లకు సమన్లు జారీ చేసింది. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కృష్ణా పల్దేవార్ మిస్త్రీ, సోదరులు కోర్టు ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. మిస్టరీ సోదరులు, సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లకు ఈ నోటీసులు జారీ చేసింది. టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ టాటా ట్రస్ట్స్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్. వెంకటరామన్ సైరస్ మిస్త్రీపై రూ.500కోట్ల డిఫమేషన్ కేసును చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వద్ద పిటిషన్వేశారు. రూ .500 కోట్ల నష్టపరిహారాన్ని కోరుతో ఈ పిటిషన్ దాఖలు చేశారు. సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్లు , మిస్ట్రస్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్ పై ఈ పిటీషన్ వేశారు. 2016 అక్టోబర్ 25న ఒక ఈ మెయిల్లో టాటాసన్స్ డైరెక్టర్లు, టాటా ట్రస్ట్కు చెందిన ఇతర ట్రస్టీలకు తప్పుడు ఆరోపణలు చేశారని తన పిటిషన్లో ఆరోపించారు. వెంకటరామన్ (వెంకట్) ఎయిర్ ఏషియా ఇండియా డైరెక్టర్ గా ఉన్నారు.