వీడ్కోలిద్దామని వెళ్లిపోయావా బిడ్డా..
వేమనపల్లి(బెల్లంపల్లి): ఇసుక అక్రమ రవాణా వేమనపల్లిలో విద్యార్థి ప్రాణాలను బలిగొంది. ప్రాణహితనదిలో వెలసిన అక్రమ క్వారీలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తొక్కటంతో గాండ్ల శ్రీకాంత్(16) తొమ్మిదో తరగతి విద్యార్థి మృత్యువాతపడ్డాడు. మండలకేంద్రంలో ఏడా ది కాలంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా కొనసాగుతుంది. నీల్వాయి ప్రాజెక్ట్ కాలువలు, డబుల్రోడ్డు, నీల్వాయివాగు వంతెన నిర్మాణంలో ఉన్నాయి. దీంతో ప్రాణహిత ఇసుకకు భారీ డిమాండ్ ఉంది. కాంట్రాక్టర్లు అనుమతుల పేరిట ఇసుక అక్రమ రవాణాకు తెర లేపారు. అడ్డొచ్చిన వారిని భయపెడుతూ రోజూ వందలాది ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి ట్రాక్టర్లో ఇసుక తరలిస్తున్నారు. మరో ట్రిప్పు నింపేందుకు డ్రైవర్ చీకట్లో ట్రాక్టర్ను క్వారీలోకి వెనక్కి తీసుకెళ్తుండగా అక్కడే నిద్రిస్తున్న శ్రీకాంత్పై ట్రాక్టర్ ట్రాలీ ఎక్కింది. చెన్నూర్కు తరలించే క్రమంలో మృత్యువాతపడ్డాడు.
కుటుంబసభ్యుల ఆందోళన
బాలుడి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ట్రాక్టర్ యజమాని సత్యం కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ బొల్లం రమేష్, ఎస్సై భూమేష్, ఎంపీపీ కుర్రు వెంకటేశం, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కుబిడే వెంకటేశం ఇరువర్గాలతో చర్చలు జరిపారు. ట్రాక్టర్ యజమాని 30గుంటల పొలం, రూ.2లక్షల నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకరించారు. ట్రాక్టర్ యజమాని, డ్రైవర్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపతున్నట్లు ఎస్సై తెలిపారు.
‘వీడ్కోలు’ ఖర్చులకెళ్లావా బిడ్డా
వీడ్కోలు సభ ఖర్చుల కోసమని వెళ్తే నీకే వీడ్కోలు చె ప్పాల్సి వస్తుందని అనుకోలేదు బిడ్డా అంటూ మృతుడి తల్లి రాజేశ్వరి కన్నీరుమున్నీరుగా విలపించింది. బాలు డి పాఠశాలలో మంగళవారం వీడ్కోలు సమావేశం ఉంది. ఆదివారం ఇంటి వద్దే ఉన్న శ్రీకాంత్ ఖర్చుల కోసమని స్నేహితులు చల్ల రాజేశ్, ఏట అజయ్, తెలిగ సాయిలుతో కలిసి ట్రాక్టర్ పనికి వెళ్లాడు. అందరూ ఒకే చోటే నిద్రపోతుండగా ముందు వరుసలో ఉన్న శ్రీకాంత్ను ట్రాక్టర్ తొక్కడంతో మృత్యువాత పడ్డాడు.