breaking news
veerashaivas
-
రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పదన్న స్వామిజీలు
-
కాయకమే కైలాసం... శ్రమయే శివనిలయం
కర్ణాటకలోని హింగులేశ్వర బాగేవాడి అగ్రహారంలో 1134వ సంవత్సరం వైశాఖ శుద్ధతదియ (అక్షయ తతీయ) రోజున మండెన మాదిరాజు, మాతాంబిక దంపతులకు బసవేశ్వరుడు జన్మించాడు. ఈయన వీరశైవ సంప్రదాయాన్ని మహోజ్వలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప భక్తుడు. ఆయనకు భక్తి బండారి అనే మరొక పేరు కూడా ఉంది. ఆయన గొప్ప సంఘసంస్కర్త. కులతత్వ నిర్మూలన, స్త్రీ పురుష సమానత్వం మొదలైన నూతన సంప్రదాయ యుగానికి ఆయన నాంది పలికాడు. బసవన్న రాసిన నాలుగు లక్షలకు పైబడిన వచనాలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోగా నేడు కొన్ని మాత్రం ప్రజలనాల్కలపై ఆడుతూ సజీవంగా నిలిచి ఉన్నాయి. సమాజంలోని అన్ని వర్గాలప్రజలూ దైవంతో వారికున్న అనుభవాల్ని పంచుకోవడానికి అల్లమప్రభువులవారి అధ్యక్షతన అనుభవమండపాన్ని ఏర్పరచారు. తన ఆరాధ్యదైవమైన కూడలసంగమేశ్వరుడే తన వచనాలకు మకుటంగా మార్చుకుని కీర్తించాడు. ఆ వచనాలు రాసి కొన్ని శతాబ్దాలు దాటినా నేటికీ నిత్యనూతనం. దయలేని ధర్మమదేవిటయ్యా దయయే కావాలి ప్రాణులన్నిటిలో దయయే ధర్మం మూలమయ్యా కూడలసంగముని వంటీ దైవం లేదయ్యా సిగ్గొదిలి అన్యులను యాచించకుండా మతిచెడి పరులను పొగడకుండా పరసతులపై మనసు పడకుండా శివపథభక్తుల పాదాలు విడువకుండా వేరుమార్గంలో నా నడక సాగకుండా నన్ను నడిపించు కూడలసంగమదేవా ఉన్నవాళ్లు గుళ్లు గోపురాలు కట్టిస్తారు లేనివాణ్ణి నేనేమి చెయ్యాలి? నా కాళ్లే స్తంభాలు కాయమే కోవెల శిరసే బంగారు శిఖరం కూడలసంగమదేవా! విను చెడితే స్థావరం చెడుతుంది గాని జంగమం చెక్కు చెదరదు దొంగిలించకు చంపకు అబద్ధం పలుకకు కోపగించుకోకు అన్యులను ఏవగించుకోకు నీ గురించి పొగుడుకోకు ఎదుటి వ్యక్తిని నిందించకు ఇదే అంతరంగ శుద్ధి ఇదే బహిరంగ శుద్ధి ఇదే మా కూడలసంగమదేవుని మెప్పించే పద్ధతి దేవలోకం మర్త్యలోకం వేరే వేరే లేవు సత్యాన్ని పలికేదే దేవలోకం అసత్యాన్ని పలికేదే మర్త్యలోకం ఆచారమే స్వర్గం అనాచారమే నరకం కూడలసంగమదేవా –కె.వి.ఎస్. బ్రహ్మాచార్య, శాస్త్ర ప్రవీణ -
ప్రత్యేక మతంగా లింగాయత్!
సాక్షి, బెంగళూరు: ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కర్ణాటకలో అధికార కాంగ్రెస్ మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్లు, వీరశైవ లింగాయత్లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. మతపరమైన మైనారిటీ హోదాను కల్పించే వ్యూహంపై ముందడుగేసింది. సోమవారం సమావేశమైన కర్ణాటక కేబినెట్.. లింగాయత్ సామాజికవర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. వారికి మతపరమైన మైనారిటీ హోదా కల్పించాలన్న రిటైర్డ్ జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీ సిఫారసులను ఆమోదించింది.ఈ సిఫారసులను త్వరలో కేంద్రానికి పంపనుంది. కన్నడ మంత్రి టీబీ జయచంద్ర మాట్లాడుతూ.. ‘రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ నిర్ణయం ద్వారా తదుపరి విస్తృతమైన సంప్రదింపులు, చర్చలు జరుపుతాం’ అని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రస్తుతం మైనారిటీ హోదాను అనుభవిస్తున్న వారికి ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. కొందరు లింగాయత్ స్వాములు.. సోమవారం సీఎం సిద్దరామయ్యను కలిసి కమిటీ రిపోర్టు వీలైనంత త్వరగా అమలయ్యేలా చూడాలని కోరారు. కేబినెట్ నిర్ణయంతో హర్షిస్తూ.. లింగాయత్లు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకోగా.. వీరశైవులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్బుర్గీతోపాటు దావణగెరె, బిజాపుర ప్రాంతాల్లో లింగాయత్లు, వీరశైవులకు మధ్య ఘర్షణలు జరిగాయి. కాగా, ఈ రిజర్వేషన్పై తమ వైఖరిని వెల్లడించాలని బీజేపీ చీఫ్ అమిత్షా, యడ్యూరప్పలు రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. నిప్పుతో ఆటలొద్దు.. బీజేపీ: లింగాయత్ లు, వీరశైవుల రిజర్వేషన్ల వివాదానికి బీజేపీ సహా పలు హిందూ సామాజిక వర్గాలు మొదటినుంచీ దూరంగా ఉంటున్నాయి. అయితే.. సిద్దరామయ్య సర్కారు తీసుకున్న తాజానిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. రాజకీయ అవసరాలకోసం సిద్దరామయ్య ప్రభు త్వం కులాలు, మతాలను విభజిస్తోందని మం డిపడింది. ఓటుబ్యాంకు రాజకీయాలకోసం సిద్దరామయ్య నిప్పుతో ఆడుతున్నారని కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధర్ రావు విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు.. విభజించు–పాలించు అన్న బ్రిటిషర్ల విధానాన్నే కాంగ్రెస్ అమలుచేస్తోందన్నారు. ‘వీరశైవులు, లింగాయత్లు ఒక్కటే. ఈ రెండు సామాజిక వర్గాలూ హిందుత్వంలో భాగమే. రాజకీయ లాభం కోసం వీరిని విడగొడుతున్నారు’ అని కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి య డ్యూరప్ప మండిపడ్డారు. కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. చాలాకాలంగా డిమాండ్ లింగాయత్లు చాలాకాలంగా ప్రత్యేక మతంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో లింగాయత్లకు మతపరమైన మైనారిటీ హోదా ఇవ్వాలన్న అంశం చాన్నాళ్లుగా పెండింగ్లో ఉంది. ఇలాంటి కీలకమైన అంశాన్ని.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో లేవనెత్తడం కాంగ్రెస్కు మేలు చేస్తుందని భావిస్తున్నారు. యడ్యూరప్ప కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారే. దీంతో ఆయన్ను, బీజేపీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ ఉన్నపళంగా ప్రత్యేక మతం పేరుతో మైనారిటీ అంశాలను తెరపైకి తెచ్చింది. 17 శాతం లింగాయత్ల ఓట్లకోసం.. అఖిల భారత వీరశైవ మహాసభ.. లింగాయత్లు, వీరశైవులు ఒక్కటేనని అందరికీ ప్రత్యేక మత హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా.. మరో గ్రూపు కేవలం లింగాయత్లకు మాత్రమే ఈ హోదాను ఇవ్వాలని పట్టుబడుతోంది. కొందరు లింగాయత్లు ఓ అడుగు ముందుకేసి.. వీరశైవులను తమలో కలుపు కునేందుకు సిద్ధమేనని.. అయితే వీరశైవులంతా లింగాయత్లేనని చెప్పుకోవాలనే షరతుపెట్టారు. దీనిపై కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనికితోడు ఎన్నికలు సమీపిస్తుండటంతో 17 శాతం ఉన్న వీరశైవులు, లింగాయత్ల ఓట్ల కోసం సిద్దరామయ్య సర్కారు.. హైకోర్టు రిటైర్డ్ జడ్జి హెచ్ఎన్ నాగమోహన్దాస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ మార్చి 2న తన నివేదికను అందజేసింది. ‘కర్ణాటకలోని లింగాయత్, వీరశైవ లింగాయత్లకు మతపరమైన మైనారిటీ హోదా ఇవ్వవచ్చు’ అని ఈ కమిటీ సూచించింది. లింగాయత్ X వీరశైవం! కర్ణాటక రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుండే లింగాయత్లు చాలాకాలంగా మతపరమైన మైనారిటీ హోదా కోసం పోరాడుతున్నారు. లింగాయత్లు రెండు వర్గాలు. ఇందులో ఒకరు లింగాయత్లు, రెండోవారు వీరశైవ లింగాయత్లు. 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు (బసవణ్ణ) లింగాయత్ సిద్ధాంతాన్ని ఏర్పాటుచేశారు. ‘అనుభవ మంటపం’ అనే వేదికను ఏర్పాటుచేసి అందరినీ ఆదరించారు. విగ్రహారాధన లేకుండా.. నిరాకారుడైన శివుడినే పూజించాలని ప్రబోధించారు. అందరూ ఇష్టలింగం పేరుతో లింగాన్ని మెడలో వేసుకోవాలని, చేసే పని ద్వారానే దైవాన్ని చేరతామని (కాయకేవ కైలాస) ప్రబోధించాడు. ఆయన తర్వాత తరతరాలుగా పలువురు గురువులు మఠాలను స్థాపించి బసవణ్ణ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఈ మఠాలు విద్యాసంస్థలతో బాటు, అనేక సంస్థలు నిర్వహిస్తూ ఆర్థికంగా, సామాజికంగా బలంగా వున్నాయి. గతంలోనే కర్ణాటక ప్రభుత్వం లింగాయత్లు, వీరశైవులను (గతంలో వీరంతా ఒకటేననే భావన ఉండేది) 5% రిజర్వేషన్తో బీసీ 3–బి కేటగిరీలో చేర్చారు. ప్రస్తుతం వీరంతా హిందువులుగానే పరిగణించబడుతున్నారు. ఇతర మైనారిటీల్లాగే..: లింగాయత్లు తాము హిందువులం కాదని.. బౌద్ధులు, జైనులు, సిక్కుల్లాగా తామూ గురువులనే అనుసరిస్తామనీ, కాబట్టి తమను కూడా వారిలాగే మైనారిటీలుగా గుర్తించాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. లింగాయతులు, తాము ఒకటే సమూహమని వీరశైవులంటున్నారు. వీరశైవులు తమను లింగాయత్లుగా చెప్పుకోవడం కొందరు లింగాయత్లకు నచ్చటం లేదు. నిజానికి వీరశైవం బసవణ్ణ కంటె ముందు నుంచే అస్తిత్వంలో వుంది. హిందూమతంలోని ఓ శాఖే వీరశైవం అంటారు. అయితే శివుణ్ని తప్ప విష్ణువుని కొలవరు వాళ్లు. శివుడికి బలులిస్తారు. వైదికకర్మలను, ఆగమ శాస్త్రాన్ని ఆచరిస్తారు. లింగాయతులు వీటికి వ్యతిరేకం. దీంతో వివిధ లింగాయత్ వర్గాలు తమను వీరశైవుల్లో కలిపి లెక్క వేయవద్దని, తమకు మైనారిటీ హోదా యిచ్చి తీరాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించాయి. కర్ణాటకలో లింగాయత్లు రాజకీయంగా కూడా కీలక స్థానాలు అలంకరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక 15 ఏళ్లపాటు లింగాయతులే ముఖ్యమంత్రులుగా వున్నారు (నిజలింగప్ప, బిడి జత్తి, ఎస్ఆర్ కాంతి, వీరేంద్ర పాటిల్). ఆ తర్వాత కూడా లింగాయత్ వర్గానికి చెందిన ఎస్ఆర్ బొమ్మయ్, జెహెచ్ పాటిల్, యడ్యూరప్ప సీఎంలయ్యారు. కన్నడనాట వీరి జనాభా 17 శాతం. దాదాపు 100 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించగలిగే స్థానంలో ఉన్నారు. -
మైనారిటీ హోదా విషయంలో ఘర్షణ
సాక్షి, బెంగళూర్: లింగాయత్లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన వీరశైవ లింగాయత్ నేతలు అన్నంత పని చేశారు. లింగాయత్ నేతల ప్రదర్శనను అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల ఘర్షణతో కర్ణాటకలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ వీరశైవ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. లింగాయత్ సామాజికవర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. వారికి మైనారిటీ హోదా కల్పించాలన్న నాగమోహన్ దాస్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కర్ణాటక కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు కూడా పంపింది. లింగాయత్లకు మాత్రమే ప్రత్యేక మైనారిటీ హోదా కల్పిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని మొదటి నుంచి వీరశైవ లింగాయత్ స్వాములు హెచ్చరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ వర్గ వారి అసమ్మతిని చల్లార్చేందుకు లింగాయత్లో భాగంగా వీరశైవ లింగాయత్లను కూడా గుర్తించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 12వ శతాబ్దానికి చెందిన వీరశైవ మతస్థాపకుడు బవసన్న అనుచరులే లింగాయత్లు, వీరశైవ లింగాయత్లు. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. కర్ణాటక జనాభాలో లింగాయత్లు 17శాతం మంది ఉన్నారు. వీరికి మైనారిటీ హోదా ఇవ్వాలన్న అంశం చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉంది. -
అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలి
– వీరశైవులకు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి పిలుపు – శ్రీశైలంలో వీరశైవ సాహిత్య సదస్సు శ్రీశైలం: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వీరశైవులు అధ్యాత్మికతతోపాటు సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా కూడా అభివృద్ధిసాధించాలని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామిజీ అన్నారు. శ్రీశైలమహాక్షేత్రంలోని శరణు బసవేశ్వర సదాశివయ్య వీరశైవ నిత్యాన్నదాన సత్రంలో ఈ నెల 26 నుంచి జరుగుతున్న అఖిలభారత వీరశైవ మహాసభలో భాగంగా ఆదివారం వీరశైవ సాహిత్య సదస్సులో పీఠాధిపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యపరంగా ఎందరో వీరశైవ శివచరుణులు తమ ప్రవచనాలతో సాధారణ వ్యక్తులకు సైతం అర్థమయ్యే రీతిలో అనేక సత్యాలను బోధించారన్నారు. వీరశైవుల అభ్యున్నతికి బసవేశ్వరస్వామి చేసిన కషిని కొనియాడారు. హేమారెడ్డి మల్లమ్మ, అక్కమహాదేవి వంటి శివచరుణులెందరో శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకుని ఆయనలో ఐక్యమైపోయిన వీరశైవుల ప్రగాఢమైన భక్తికి నిదర్శనంగా నిలిచినట్లు తెలిపారు. చరిత్రలో వీరశైవ మత గురువులు, మహాత్ములకు ఉన్నస్థానం వారు సమాజానికి అందించిన ధర్మసిద్ధాంతాలు, సేవలు ప్రతి ఒక్కరు మననం చేసుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ బాధ్యతను విస్మరిస్తే భవిష్యత్ అంధకారమవుతుందన్నారు. దీన్ని దష్టిలో ఉంచుకుని వర్తమానాన్ని సరిపోల్చుకుంటూ భవిష్యత్ నిర్మాణానికి పూనాది వేయాల్సిన అవసరాన్ని వీరశైవులు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే వీరశైవ ధర్మజాగతి కోసం సదాశివయ్యసత్రంలో సాహిత్య సదస్సు ఏర్పాటు చేసినట్ల తెలిపారు. కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించిన జగద్గురు సూర్యసింహాసన సమాజ సేవా సమితి అధ్యక్షులు నేతి జ్ఞానేశ్వర్, అఖిలభారత వీరశైవ మహాసభ అధ్యక్షులు నేతి మహేశ్వర్ను తెలంగాణ వీరశైవ సమాజానికి చెందిన వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గసభ్యులను ఘనంగా సన్మానించారు. చివరి రోజు సమావేశంలో భాగంగా వీరశైవంలో గురు– జంగంల ప్రాధాన్యం– భక్తుల పాత్రపై సదాశివపేట కల్యాణమయ్యస్వామి, పంచాచారాలు, సామాజికస్పహ అనే అంశంపై సిద్ధిపేట ఆనందయ్య తమ పరిశోధనలను సమర్పించినట్లు నేతి జ్ఞానేశ్వర్ తెలిపారు.