breaking news
Veerappan history
-
ఇండియా@75: వీరప్పన్ హతం
తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల పోలీసులకు కొన్ని ఏళ్లపాటు కంట కునుకు లేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. పోలీస్ ఆఫీసర్లు, ఫారెస్టు అధికారులతో సహా సుమారు 185 మందిని నిర్దాక్షిణ్యంగా చంపిన నేర చరిత్ర వీరప్పన్ది. పోలీసుల రికార్డుల ప్రకారం దంతాల కోసం వీరప్పన్ 2 వేలకు పైగా ఏనుగుల్ని మట్టుపెట్టాడు. 143 కోట్ల రూపాయల విలువ చేసే గంధపు చెక్కల్ని కొల్లగొట్డాడు. 16 కోట్ల రూపాయల విలువైన ఏనుగు దంతాల్ని స్మగ్లింగ్ చేశాడు. చివరికి వీరప్పన్ని, వీరప్పన్ అనుచరుల్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ‘ఆపరేషన్ కుకూన్’ పేరుతో ప్రణాళికను రచించింది. ఈ ఆపరేషన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయకుమార్ నాయకత్వంలో సాగింది. 1991లో ఆరంభమైన ఈ ఆపరేషన్ 2004 అక్టోబర్ 18న వీరప్పన్, అతని అనుచరులు సేతుకాళి గోవిందన్, చంద్రె గౌడ, సేతుమునిలను కాల్చి చంపడంతో ముగిసింది. ఇది దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో భారతదేశ చరిత్రలోకెల్లా అత్యంత ఖరీదైన ఆపరేషన్ గా నిలిచింది. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు పెప్సీ విస్తరణ ప్రాజెక్టును తిరస్కరించిన ‘మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు’ దేశ ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్. ఐక్య ప్రగతిశీల కూటమి (యు.పి.ఎ.) ప్రభుత్వం ఏర్పాటు. ఆలయ మేనేజర్ను హత్య చేశారన్న ఆరోపణపై కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి అరెస్ట్. (చదవండి: ఆరు చొక్కాలు.. నాలుగు ప్యాంట్లు.. ఒక జత షూ) -
ఇది వీరప్పన్ బయోపిక్ కాదు!
‘‘వీరప్పన్ చరిత్రను తెరకెక్కించాలని చాలా సంవత్సరాలుగా ఆసక్తిగా ఉన్నా. ఆయన్ను పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. చంపడానికి పోలీసులకు 20 ఏళ్లు పట్టింది. వీరప్పన్ను చంపడం అనే పాయింట్తో సినిమా తీసేందుకు చాలాకాలం పరిశోధన చేశా’’ అని రామ్గోపాల్ వర్మ అన్నారు. ఆయన దర్శకత్వంలో బీవీ మంజునాథ్, ఇ. శివప్రకాష్, బీఎస్ సుధీంద్ర నిర్మించిన చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. సందీప్ భరద్వాజ్ టైటిల్ రోల్ పోషించారు. ఈ చిత్రం టీజర్ను ఆవిష్కరించిన అనంతరం రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ - ‘‘వీరప్పన్ లైఫ్లో చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఇది ఆయనకు సంబంధించిన బయోపిక్ కాదు. ఈ చిత్రాన్ని రియల్ లొకేషన్స్లో షూట్ చేశాం. ‘ఆపరేషన్ కుకూన్’లో పాల్గొన్న వ్యక్తులను, వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీని కలిసి సమాచారం సేకరించా. వీరప్పన్ చేతిలో కిడ్నాప్ అయిన కన్నడ నటుడు రాజ్కుమార్ తనయుడు శివరాజ్కుమార్ ఈ చిత్రంలో నటిస్తే యాప్ట్ అవుతాడని ఎంచుకున్నా. డిసెంబర్ 4న తెలుగు, కన్నడం, తమిళంలో విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్చంద్ర పధిరి.