breaking news
Vangaveeti Narendra
-
బయటపడ్డ సాయికృష్ణ మరదలి సంచలన ఆడియో
-
‘సాయికృష్ణ కేసులో వాస్తవాలు బయటకు రావాలి’
సాక్షి, తాడేపల్లి: సాయికృష్ణపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. అతన్ని పోలీసులు ఇబ్బంది పెట్టటానికి వేరే కారణాలు ఉన్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అవన్నీ వెలుగులోకి రావాలంటే సీబిఐతోనే విచారించాలని డిమాండ్ చేశారు.‘‘సాయికృష్ణపై అత్యాచారం కేసు అబద్ధం. తన మరదలు, సాయికృష్ణ ప్రేమించుకున్నారు. ఇరువైపులా కుటుంబాల్లో ఒప్పుకోకపోవటంతో పెళ్లి చేయలేదు. ఈ విషయంలో ఆ అమ్మాయిని బెదిరించి.. సాయికృష్ణపై అక్రమంగా కేసు పెట్టించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే సాయికృష్ణపై పోక్సో కేసు పెట్టారు. అది అబద్ధపు కేసని ఆ అమ్మాయే కోర్టులో చెప్పింది’’ అని వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు.‘‘అసలు సాయికృష్ణ మీద పోలీసులు ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఏంటి?. సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ వాళ్లు తీసుకువచ్చి విచారించాల్సినంత కేసు ఏం ఉంది?. అతన్ని పోలీసు శాఖ ఎందుకు వాడుకుందో తెలియాలి. సీపీ, డీజీపీ, హోంమంత్రి నోరు తెరిచి వాస్తవాలను వెల్లడించాలి. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారంటే వాళ్లు ఎంతపెద్ద క్రిమినల్స్?. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వెంకట్, రాజులను బెదిరించి సీసీ కెమెరా పుటేజీని డిలీట్ చేయించారు. సాయికృష్ణ కేసులో వాస్తవాలన్నీ బయటకు రావాలంటే సీబీఐతోనే విచారించాలి’’ అని వంగవీటి నరేంద్ర డిమాండ్ చేశారు. -
సీఐకి డైరెక్షన్ ఇచ్చిన కూటమి నాయకుడు..!? హత్య వెనుక ప్రభుత్వ హస్తం..?
-
సాయి కృష్ణను జైల్లోనే చంపేశారు!
-
‘డీఎస్సీ అక్రమాలను డైవర్టు చేయడానికే పవన్ పాట్లు’
సాక్షి, తాడేపల్లి: రెండేళ్ల పాలనలో చంద్రబాబు అన్ని వర్గాలను వంచించిందే కాకుండా వాటిపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడం, సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం పరిపాటిగా మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల పాలన పూర్తయినా సూపర్ సిక్స్లో ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపానపోలేదని.. బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ బాండ్లకు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు మొదటి సంతకం చేసిన మెగా డీఎస్సీ వెనుక జరిగిన కుంభకోణంతో ప్రభుత్వం ఇరుకున పడిందని, దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు.పవన్ కళ్యాణ్కి పాలన చేతకాకనే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తున్నాడని, చేతనైతే విభజన హామీల అమలుకు ప్రయత్నించాలని వంగవీటి నరేంద్ర హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...ఆరోపణలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనతో అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచింది. వైయస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి చివరికి ఏదీ కాకుండా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు బాండ్ పేపర్ల మీద సంతకాలు చేసి మరీ సూపర్ సిక్స్ హామీల విషయంలో మాటతప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజల తరఫున వైయస్సార్సీపీ ప్రశ్నిస్తుంటే రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.అక్రమ కేసులతో వేధింపులు, దాడులతో బెదిరించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలతో అడ్డంగా దొరికిన ప్రతిసారీ ప్రజల దృష్టిని మరల్చడానికి తల్లి, చెల్లి, గొడ్డలి అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. జరగని కుంభకోణాలను జరిగినట్టుగా కట్టుకథలు అల్లడంతోపాటు అక్రమ కేసులతో వైఎస్ జగన్కి దగ్గరగా ఉన్న నాయకులను జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. ఏ ఒక్క దానికీ ఆధారాలు లేకపోయినా పోలీసులను అడ్డం పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు బదులు తీర్చుకోవగానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.కూటమి పాలనలో గాడితప్పిన శాంతిభద్రతలువైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు నోటికొచ్చినట్టు తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్రం అప్పులపాలై శ్రీలంకగా మారిపోయిందని ఊదరగొట్టారు. 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైపోయారని పవన్ కళ్యాణ్ ఆధారాలు లేకుండా మాట్లాడాడు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా వారు చేసిన ఆరోపణల్లో దేనినీ నిరూపించలేకపోయింది.మహిళలకు రక్షణ కల్పస్తామని చెప్పిన కూటమి నాయకులు, రెండేళ్లుగా మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టలేకపోయారు. కేంద్ర సంస్థల నివేదిక ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం అట్టడుగున ఉందని, మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఏపీ మొదటిస్థానంలో ఉందని, నేరాలు గత ప్రభుత్వం కంటే మూడు రెట్లు పెరిగాయని రుజువైంది. వైయస్సార్సీపీ హయాంలో మహిళలకు రక్షణ కల్పించిన దిశ యాప్కి శక్తి యాప్ అని పేరు మార్చి నిర్వీర్యం చేసేశారు. కూటమి ఎమ్మెల్యేలే కామాంధులుగా మారి వేధిస్తున్నారని ఆధారాలతో సహా మహిళలు ఫిర్యాదు చేసినా వారిపై చర్యలు తీసుకోకపోగా, బాధితులనే వేధిస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా ఏం చేశాడో పవన్ కళ్యాణ్ చెప్పాలిడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండటం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసగించడమే కాకుండా పక్కనే ఉన్న తెలంగాణకి వెళ్లి తెలుగు రాష్ట్రాల మధ్య విభేధాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కేంద్రంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేన అధ్యక్షుడిగా విభజన హామీలు పరిష్కరించడానికి ప్రయత్నించకుండా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలి చూడటం సిగ్గుచేటు.కూటమి పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ పేరుతో సంతకాలు పెట్టి రిలీజ్ చేసిన బాండ్లకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సమాధానం చెప్పాలి. ఏపీలో పాలన గాలికొదిలేసి తెలంగాణలో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగినట్టు ఆధారాలతో సహా రుజువు కావడంతో దానికి సమాధానం చెప్పే ధైర్యం లేక పక్క రాష్ట్రం వెళ్లి విద్వేష ప్రకటనలు చేస్తున్నాడు.దీంతో పాటు అమరావతిలో అవినీతి నిరంతర ప్రక్రియగా మారిపోయింది. శాండ్, ల్యాండ్, మైన్, వైన్ దోపిడీని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ అక్రమాలను వైఎస్సార్సీపీ ఎప్పటికప్పుడు బయటకు తీసుకొస్తుంటే ఏ ఒక్కదానికి ప్రభుత్వం జవాబు చెప్పడం లేదు. చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం నడుచుకుంటూ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న పవన్ కళ్యాణ్కి కూడా ప్రజలు రానున్న రోజుల్లో బుద్ధి చెబుతారని వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు. -
రంగా హత్యకు చంద్రబాబే సూత్రధారి
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు ప్రోద్బలంతోనే విజయవాడలో వంగవీటి మోహనరంగా దారుణ హత్య జరిగింది. రంగా హత్యకు చంద్రబాబు సూత్రధారి అయితే, నాటి హోంమంత్రి కోడెల శివప్రసాదరావు, ఎస్పీ వ్యాస్ పాత్రధారులు. రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందని గట్టిగా విశ్వసించబట్టే మంత్రి పదవితోపాటు టీడీపీకి రాజీనామా చేస్తున్నానని హరిరామ జోగయ్య అప్పుడే చెప్పారు. విజయవాడలో ఏ ఇంటి తలుపు కొట్టి అడిగినా వంగవీటి రంగాను చంద్రబాబే చంపించాడని చెబుతారు.’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర స్పష్టంచేశారు.ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రంగా హత్య జరిగింది. ఈ కేసులో చంద్రబాబు పాత్ర బయటపడుతుందనే సీబీఐ విచారణకు నాటి టీడీపీ ప్రభుత్వం అంగీకరించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ చేయాలని కోరింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దర్యాప్తును ప్రభావితం చేసి ఆయన పేరు లేకుండా చేసుకున్నారు. రంగా హత్య జరిగినప్పుడు, కేసును కొట్టేసినప్పుడు టీడీపీనే అధికారంలో ఉంది.రంగా హత్య కేసు నిష్పక్షపాతంగా విచారణ చేసి ఉంటే ఇవాళ చంద్రబాబు జైలులో ఉండేవారు. అప్పట్లో దర్యాప్తును ప్రభావితం చేయడానికే వర్గ విభేదాల పేరుతో కట్టుకథలు అల్లారు. చంద్రబాబుతో ఉన్న విభేదాల కారణంగానే తనను ఈ కేసులో ఇరికించాడని దేవినేని నెహ్రూ పలు సందర్భాల్లో చెప్పారు. అదేవిధంగా కాపు కులానికి చెందిన జర్నలిస్టు పింగళి దశరథరామ్ దారుణ హత్య వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉందని ప్రజలందరూ నమ్ముతున్నారు.’ అని వంగవీటి నరేంద్ర చెప్పారు. చంద్రబాబు దిగజారుడుతనానికి పరాకాష్ట‘రంగా హత్యకు కడప నుంచి బాంబులు తెచ్చారని చంద్రబాబు ఇప్పుడు విష ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే ఇన్నాళ్లూ పోలీసులకు ఎందుకు చెప్పలేదు. సీబీఐ విచారణను ఎందుకు కోరలేదు. కాంగ్రెస్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి, వంగవీటి రంగా మధ్య ఉన్న స్నేహాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వికృతంగా చూపించడం చంద్రబాబు దిగజారుడుతనానికి పరాకాష్ట. 1985లో రంగాకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని చాలా మంది అడ్డుకున్నారు. అయినా వైఎస్సార్ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టి సాధించారు.అలాంటి సన్నిహితుల మధ్య కూడా వివాదాలు ఉన్నట్లు వారు చనిపోయిన తర్వాత కట్టుకథలు సృష్టించడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడుకుని దేవినేని నెహ్రూ ఆ పార్టీలో చేరితే వైఎస్సార్పై బురదచల్లడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ అడిగి ప్రశ్నలకు చంద్రబాబు నేరుగా సమాధానం చెప్పలేక వైఎస్సార్ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.’ అని వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. -
పచ్చ కళ్ళజోడు తీసి చూస్తే అభివృద్ధి కనిపిస్తుంది
-
‘అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్నారు. పీపీపీ పద్దతిలో ప్రైవేటుపరం చేయటం అభివృద్ధా? అని ప్రశ్నించారు. అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి అని చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి కొల్లు రవీంద్ర పచ్చ కళ్ళజోడు తీసి చూస్తే వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కనపడుతుంది. చంద్రబాబులాగా అబద్దపు హామీలు జగన్ ఇవ్వలేదు. మేనిఫెస్టో పూర్తిగా అమలు చేసిన ఏకైక నేత జగన్. చంద్రబాబు అధికారంలోకి రాగానే మేనిఫెస్టో అమలు చేయలేక చేతులెత్తేశారు. రాష్ట్రాన్ని అమ్మితే తప్ప హామీలు అమలు చేయలేమంటూ ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు. వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. ఎన్టీఆర్ నుండి రాష్ట్ర ప్రజల వరకు అందరికీ వెన్నుపోటు పొడిచారు.రాష్ట్ర అభివృద్ధి అంటే జగన్ హయాంలోనే జరిగింది. జగన్ తెచ్చిన పది హార్బర్లు, మూడు పోర్టులు, 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా?. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్నారు. పీపీపీ పద్దతిలో ప్రైవేటుపరం చేయటం అభివృద్ధా?. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందటం ఇష్టం లేదా?. విజయవాడ సిద్దార్థ కాలేజీకి కూడా లీజు పద్ధతిలో భూములు ఇచ్చారు. అక్కడ పేద విద్యార్థులకు సీటు కూడా దొరకదు. అమరావతిలో అద్దాలకు పెట్టే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవి. డిజైన్ల పేరుతో వందల కోట్లు వృథాగా ఖర్చు చేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పిచ్చి మొక్కలు.. వర్ష్పాలు వస్తే నీళ్లు తోడటం... ఇదే రాజధాని అభివృద్ది...
-
‘లక్ష జనాభా ఉన్న చోట రూ. 2 లక్షల కోట్లు ఖర్చా?’
తాడేపల్లి : అమరావతి నిర్మాణం వెనుక ఉన్నది భారీ దోపిడేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. లక్ష జనాభా ఉన్న చోట రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయడం అంటే ఏంటని ప్రశ్నించారు. ఇది విజన్ ఉన్న వారు చేసే పనేనా అంటూ నిలదీశారు. ఈరోజు(సోమవారం, ఏప్రిల్ 6వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన వంగవీటి నరేంద్ర.. వేల కోట్లు దోచుకునేందుకే అమరావతి ప్రాజెక్టు అని ధ్వజమెత్తారు. ‘అడ్డూ అదుపులేని అవినీతికి కేరాఫ్ అడ్రస్ అమరావతి. రాష్ట్రంలో ఎక్కడైనా అడుగు నిర్మాణానికి రూ.2 వేలు ఖర్చు చేస్తున్నారు. కానీ అమరావతిలో రూ.12 వేల నుండి రూ. 14 వేలకు చేస్తున్నారు. అమరావతి నిర్మాణాల పేరున అడుగడుగునా అవినీతే. అందుకే ఏ టెండర్లు, జీవోలు బయటకు రాకుండా దాచి పెడుతున్నారు. ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వకపోవడానికి కారణం స్కాంలే. అసలు నిర్మాణాలకు అదనంగా లైటింగ్, పంబ్లింగ్, కరెంటు పేరుతో మళ్ళీ దోపిడీనా?, భారీగా జరుగుతున్న దోపిడీని ప్రశ్నించిన వారిపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. పిచ్చి చెట్లు తొలగించటానికి కూడా వందల కోట్లు ఖర్చు చేస్తారా?, జనసంచారం లేని చోట రాజధాని కడతారా?, జనాభా ఉన్న చోట రాజధాని కట్టమని జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారు. కానీ వేల కోట్లు దోచుకునేందుకే చంద్రబాబు అమరావతి అంటున్నారు. మావిగన్ పేరు నచ్చకపోతే పేరు మార్చుకోమని కూడా జగన్ చెప్పారు. కానీ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ లెక్కన చంద్రబాబు నాయుడిని చంబునాయుడు అనవచ్చా?, పేదవాడు రాజధానిలో ఉండటానికి వీల్లేదని కోర్టులో కేసు వేసిన ఘనత చంబునాయుడిది. రాజధానిలోకి ఎంటర్ కావాలంటే టిక్కెట్ కొనేలా చంబునాయుడు వ్యవహార శైలి ఉంది. అమరావతిలో దోచుకున్నది విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరుగుతోంది’ అని విమర్శించారు. -
ధైర్యానికి మారు పేరు అంబటి
-
కాపుతో పెట్టుకున్నారు.. వంగవీటి నరేంద్ర మాస్ వార్నింగ్
-
Vangaveeti: ఆరోజు రంగా... ఈరోజు అంబటి.. దమ్మున్న కాపు నాయకులే నీ టార్గెటా
-
కూటమి పాలనలో డ్రగ్స్ డెన్గా ఏపీ: వంగవీటి నరేంద్ర
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ను డ్రగ్ డెన్గా కూటమి సర్కార్ మార్చేసిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విచ్చలవిడిగా పేకాట క్లబ్లను కూడా నిర్వహిస్తున్నారంటూ దుయ్యబట్టారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం వచ్చి పేకాట ఆడుతున్నారని.. టీడీపీ నేతల కనుసన్నల్లోనే డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ‘‘హోం మంత్రి.. పోలీసులను వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులకే ఉపయోగిస్తున్నారు. డ్రగ్స్ అరికట్టాం అంటున్న చంద్రబాబు, అనిత ఇప్పుడు దొరుకుతున్న డ్రగ్ర్కి ఏం సమాధానం చెప్తారు?. ఢిల్లీ నండి డ్రగ్స్ ఏపీకి వస్తుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు?. జగన్ హయాంలో డ్రగ్స్, గంజయిని అరికట్టడానికి సెబ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ఏం చేస్తుందో ఏమీ అర్థం కావటం లేదు’’ అని నరేంద్ర నిలదీశారు.‘‘ఈ విచ్చలవిడి డ్రగ్ర్ని నిలిపేయకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. విద్యా సంస్థల దగ్గర్లో యథేచ్ఛగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ వాడటం మొదలుపెడితే యువత తీవ్రంగా నాశనం అవుతుంది. ప్రభుత్వ అండదండలతోనే డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తోంది. మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ క్లబ్ వెనుక టీడీపీ నేతలు ఉన్నారు. వారెవరో బయట పెట్టాలి. రాష్ట్రాన్ని దౌర్భాగ్యకర పరిస్థితిలోకి తీసుకెళ్లారు’’ అంటూ వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు. -
లక్ష్మీ నాయుడు హత్యలో మొదటి ముద్దాయి పవన్ కల్యాణే
-
ప్రశ్నిస్తే దాడి చేయమని ఏ రాజ్యాంగంలో ఉంది పవన్
-
‘పవన్.. సుగాలి ప్రీతికి న్యాయం, 30 వేల మంది అదృశ్యం సంగతి ఏమైంది?’
తాడేపల్లి : రాజ్యాంగం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఏపీలో జరుగుతున్న దారుణాలు కనబడుతున్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్12) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన వంగవీటి నరేంద్ర.. ‘ సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం గురించి ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తే దాడి చేస్తారా?, ఇదేనా రాజ్యాంగ బద్దమైన పాలన అంటే?, లక్షల పుస్తకాలు చదివిన పవన్ రాజ్యాంగాన్ని చదివారా?, ఒకసారి చదివితే విషయాలు తెలుస్తాయి. మచిలీపట్నం మంగినపూడిలో మా పార్టీ నేత గిరి పై జనసేన నేతల దాడి అమానుషం. పెద్దమనిషిని మోకాళ్ళపై పెట్టి దాడి చేయమని ఏ రాజ్యాంగంలో ఉంది?, దాడి చేసిన జనసేన గూండా కొరియా శీను జనసేన నేత పార్టీలో చాలా కీలకం. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చేసిన కామెంట్ మేరకు సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి. 30వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారన్న మీ వ్యాఖ్యలకు మీరే సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్న అడిగితే మా పార్టీ నేతపై దాడి చేశారు. ఇలా దాడి చేసి కొట్టమని ఏ రాజ్యాంగంలో ఉంది పవన్ కళ్యాణ్?, కూటమి వచ్చాక ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ఇది మీకు తెలీదా.?, మా నాయకుడు వైఎస్ జగన్కు రాజ్యాంగం తెలుసు కాబట్టే ప్రతిపక్ష హోద అడిగారు. అందుకే ఆయన న్యాయ బద్దంగా పోరాటం చేస్తున్నారు’ అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: మా పవనన్ననే ప్రశ్నిస్తావా?..


