-
క్యాంపస్ అంబాసిడర్ -వి. భానుప్రకాశ్ -ఐఐటీ - గువహటి
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -గువహటి (అసోం).. పరిచయం అక్కర్లేని విద్యా సంస్థ. ఇంజనీరింగ్ కోర్సులను అందించడంలో ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సెకండియర్) చదువుతున్నారు.. వండాన భానుప్రకాశ్. సీఎస్ఈ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్గా కూడా వ్యవహరిస్తున్న ఆయన తన ఇన్స్టిట్యూట్ ప్రత్యేకతలను, ఫ్యాకల్టీ విశేషాలను వివరిస్తున్నారిలా.. సీనియర్ల సహకారం ఎంతో ఐఐటీ గువహటి క్యాంపస్ 700 ఎకరాల్లో ఉంటుంది. చుట్టూ కొండలు, పచ్చటి గడ్డి మైదానాలతో అలరారుతుంది. క్యాంపస్లో ర్యాగింగ్ లేదు. మొదట్లో అంతా గజిబిజిగా ఉండేది. సబ్జెక్టులు, పరీక్షలు, ఇతర అన్ని విషయాల్లో సీనియర్లు సహాయం చేసేవారు. కారం ఎక్కువ తినే మన తెలుగు విద్యార్థులకు ఆహారం అంత రుచిగా అనిపించదు. ఇక.. క్యాంపస్ అంతా వై-ఫై ఉంది. లైబ్రరీ, ఆడిటోరియం, లేబొరేటరీలు, ప్లే గ్రౌండ్స చాలా బాగుంటాయి. ప్రతిభావంతులకు స్కాలర్షిప్స్ ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు క్లాసులుంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. శని, ఆదివారాలు సెలవు. ప్రతి విద్యార్థికీ యూజర్ నే మ్, పాస్వర్డ్ ఇస్తారు. దీని ద్వారా వెబ్లో లాగినై ఆన్లైన్ మెటీరియల్ పొందొచ్చు. విద్యార్థులు కోర్సుపై ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చు. విద్యార్థులకు కోర్సు నచ్చకపోతే దానిని తీసేస్తారు. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. ఏవైనా సందేహాలు వస్తే వెంటనే నివృత్తి చేస్తారు. ఒక్కో సెమిస్టర్లో 5 కోర్సులు, 2 ల్యాబ్ కోర్సులు ఉంటాయి. నేను పరీక్షలో ఇప్పటివరకు పదికి 8.00 సీజీపీఏ సాధించాను. సెమిస్టర్కు అన్నీ కలుపుకుని రూ.50,000 వరకు ఖర్చు అవుతుంది. అయితే తల్లిదండ్రుల వార్షికాదాయాన్ని బట్టి, ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. క్యాంపస్లో తెలుగు విద్యార్థులే ఎక్కువ తెలుగు ఫ్యాకల్టీ 15 మంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. వారు విద్యార్థులతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. ముఖ్యంగా ఉగాది. శ్రీరామనవమి, దీపావళి, వినాయకచవితి వంటి పండుగలను బాగా చేస్తాం. ప్రతి ఏటా టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్లను కూడా విద్యార్థులే కమిటీలుగా ఏర్పడి నిర్వహిస్తారు. టెక్నికల్ ఫెస్ట్లో భాగంగా వివిధ పోటీలు, గెస్ట్ లెక్చర్స్ వంటివి ఉంటాయి. దేశ,విదేశాల్లోని ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు క్యాంపస్కు విచ్చేస్తారు. కల్చరల్ ఫెస్ట్లో భాగంగా సంగీత, నృత్య కార్యక్రమాలు ఉంటాయి. మూడో ఏడాది వేసవి సెలవుల్లో ఇంటర్న్షిప్ ఉంటుంది. రెండు నెలలపాటు ఇంటర్న్షిప్ చేయాలి. ఇందుకోసం ఎన్నో కంపెనీలు క్యాంపస్కు వస్తాయి. రెండు నెలల ఇంటర్న్షిప్లో రూ.లక్ష వరకు స్టైఫండ్ కూడా ఇస్తారు. రూ.50 కోట్లకు యాహూ కొనుక్కుంది ఇక్కడ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ పొందుతున్నారు. వార్షిక వేతనాలు కనీసం రూ.6 లక్షలు, గరిష్టంగా రూ.1.2 కోట్లు అందుతున్నాయి. ఇటీవల మా సీనియర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన బుక్పాడ్ అనే స్టార్టప్ను.. యాహూ రూ.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ముగ్గురూ కూడా మన తెలుగువారే కావడం గర్వించదగిన విషయం. నేను కూడా కోర్సు పూర్తయ్యాక మూడు, నాలుగేళ్లు ఉద్యోగం చేస్తాను. తర్వాత సొంత కంపెనీని ఏర్పాటు చేస్తా. -
సారీ మమ్మీ...
రాంగోపాల్పేట్, న్యూస్లైన్: ఇంటర్ ఫెయిల్ కావడంతో పాటు మరో పరీక్ష కూడా సరిగా రాయలేకపోవడంతో ఓ విద్యార్థి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... ఉప్పల్ చిలుకానగర్లో ఉండే బాలాచారి, శ్యామల దంపతులకు వి.భానుప్రకాశ్ (17), అఖిల్ అనే ఇద్దరు కుమారులున్నారు. భానుప్రకాశ్ హబ్సిగూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన పరీక్ష ఫలితాల్లో భానుప్రకాశ్ ఫిజిక్స్లో తప్పాడు. అప్పటి నుంచి తీవ్ర వేదనకు గురవుతున్నాడు. సోమవారం బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఫిలాని (బిట్శాట్) ప్రవేశ పరీక్ష ఉంది. ఈ పరీక్ష కేంద్రం సెక్రటరియేట్ మై హోం సరోవర్ ప్లాజా భవనంలోని ఎడిక్విటీ కెరీర్ టెక్నాలజీస్లో ఉండటంతో.. తండ్రి బాలాచారి ఉదయం 8.30కి భానుప్రకాశ్ను సెంటర్ వద్ద వదిలి వెళ్లారు. 11.30కి పరీక్ష పూర్తయింది. మధ్యాహ్నం 2 గంటలకు భానుప్రకాశ్.. పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి తల్లికి ఫోన్ చేసి ‘సారీ మమ్మీ ఈ పరీక్ష కూడా బాగా రాయలేకపోయా’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. తిరిగి ఆమె ప్రయత్నించగా ఫోన్ కలువలేదు. సాయంత్రం 3.30కి ఎస్డీరోడ్లోని తాజ్మహాల్ హోటల్ ఎదురుగా ఉన్న శ్రీనాథ్ కమర్షియల్ కాంప్లెక్స్ భవనం 6వ అంతస్తుకు చేరుకున్న భానుప్రకాశ్ అక్కడి నుంచి కిందికి దూకాడు. వెంటనే స్థానికులు గమనించి మహంకాళి పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భానుప్రకాశ్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురికీ తరలించారు. మహంకాళి ఎస్సై విజయ్కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తండ్రి బాలాచారి, కుటుంబ సభ్యులు మార్చురీ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement