uttar pradesh assembly
-
‘అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో చూడండి?’
లక్నో: శాసనసభా సమావేశాలు రాష్ట్రం, ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు తమ వంతు పాత్ర పోషించి.. తీసుకునే నిర్ణయాల్లో భాగమవుతారు. అయితే, కొందరు ఎమ్మెల్యేలు అశ్రద్ధగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నారు. మనకేందుకులే అనుకుని నిద్రపోయిన ఎమ్మెల్యేల సంఘటనలు చాలానే చూసుంటాం. అయితే, ఓవైపు కీలక చర్చ జరుగుతుండగా కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు తమకేమి పట్టనట్టు ఫోన్లలో వీడియో గేమ్స్ ఆడటంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీలో జరిగింది. ఎమ్మెల్యేలకు సంబంధించిన రెండు వీడియోలను సమాజ్వాది పార్టీ శనివారం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఈ వ్యక్తులు ప్రజల సమస్యలకు సమాధానం చెప్పరు. అసెంబ్లీని ఒక వినోద హబ్గా మార్చేశారు. ఇది చాలా నీచమైన, అవమానకరమైన చర్య.’ అంటూ పేర్కొంది ఎస్పీ పార్టీ. సమాజ్వాది పార్టీ షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియలో వైరల్గా మారాయి. మొదటి వీడియోలో.. మొహబా ఎమ్మెల్యే రాకేశ్ గోస్వామి తన మొబైల్ ఫోన్లో కార్డ్స్ గేమ్ ఆడుతున్నారు. మరోవైపు సభ జరుగుతున్నట్లు మాటలు, చప్పట్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి. రెండో వీడియోలో.. ఝాన్సీ ఎమ్మెల్యే రవి శర్మ అసెంబ్లీలో కూర్చుని పోగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. డెస్కు నుంచి రాజ్నిగంధ బాక్స్ను బయటకు తీస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. सदन की गरिमा को तार-तार कर रहे भाजपा विधायक! महोबा से भाजपा विधायक सदन में मोबाइल गेम खेल रहे, झांसी से भाजपा विधायक तंबाकू खा रहे। इन लोगों के पास जनता के मुद्दों के जवाब हैं नहीं और सदन को मनोरंजन का अड्डा बना रहे। बेहद निंदनीय एवं शर्मनाक ! pic.twitter.com/j699IxTFkp — Samajwadi Party (@samajwadiparty) September 24, 2022 pic.twitter.com/822d0fQDG7 — Samajwadi Party (@samajwadiparty) September 24, 2022 ఇదీ చదవండి: ఐరాస వేదికగా పాక్ పీఎం ‘శాంతి’ మాటలు.. స్ట్రాంక్ కౌంటర్ ఇచ్చిన భారత్ -
అఖిలేష్ నోట అసభ్యకరమైన పదాలు.. సీఎం యోగి మందలింపు
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం ఆసక్తికర పరిణామాలు.. అదీ వాడీవేడిగా కొనసాగాయి. ప్రతిపక్ష నేత, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ నోటి నుంచి అసభ్య పదజాలం వెలువడగా.. జోక్యం చేసుకున్న సీఎం యోగి ఆయన్ని తీవ్రంగా మందలించారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార-ప్రతిపక్ష నేతల మాటల యుద్ధంతో బుధవారం అట్టుడికిపోయింది. తన హయాంలో జరిగిన అభివృద్ధినే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తమ ఘనతగా చూపించుకుంటోందని అఖిలేష్ పదే పదే ప్రకటించుకున్నారు. దీనికి కౌంటర్గా డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలతో చిర్రెత్తుకొచ్చిన అఖిలేష్ యాదవ్.. ఒకానొక టైంలో సభలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ అధికారంలో ఉన్నప్పుడు.. తన పాలన గురించి గొప్పగా చెప్పుకునేవారు. అదే నిజమైతే ఆయన పార్టీని జనాలు.. ఎన్నికల్లో ఊడ్చిపడేసేవాళ్లు కాదు కదా! అని మౌర్య వ్యాఖ్యానించారు. అలాగే తన హయాంలో సంక్షేమ పథకాల గురించి అఖిలేష్ పదే పదే చెప్పుకుంటున్నారని, దీనికి ఆయనకు చికిత్స అవసరమంటూ వ్యాఖ్యానించారు. రోడ్లు, మెట్రో, ఎక్స్ప్రెస్వే.. ఇవన్నీ సైఫాయ్లోని మీ భూములు అమ్మి కట్టించారా? అంటూ మండిపడ్డారు మౌర్య. ఈ కామెంట్లతో చిర్రెత్తుకొచ్చిన అఖిలేష్ యాదవ్.. ఒక్కసారిగా అసభ్య పదజాలంతో మౌర్యపై విరుచుకుపడ్డాడు. దీంతో జోక్యం చేసుకున్న సీఎం యోగి ఆదిత్యానాథ్.. అఖిలేష్ను మందలించారు. तुमने राशन के लिए पैसे क्या अपने पिता जी से लेकर बाँटे …? फ्लावर समझा है क्या, फायर हैं फायर #AkhileshYadav #kpmaurya समाजवादी पार्टी #KeshavPrasadMaurya #BJP pic.twitter.com/kD8GJT2uFb — parasmudgal (@Spamudgal786) May 26, 2022 ‘‘సభలో అదీ గౌరవ సభ్యుడ్ని ఉద్దేశించి అలా మాట్లాడడం ఎంతమాత్రం సరికాదు. ఇక్కడ విషయం సైఫాయ్ గురించి కాదు. అభివృద్ధి పనులు చేయడం.. పర్యవేక్షించడం ప్రభుత్వంగా మా విధి. సంక్షేమ పనులను, అభివృద్ధిని ప్రకటించుకునే హక్కు మాకు కూడా ఉంది. డిప్యూటీ సీఎం ఇదే విషయాన్ని చెప్పదల్చుకున్నారు. ఆయన ఏం చెప్తున్నారో మీరు ముందుగా వినాల్సింది. ప్రతిపక్ష సభ్యులు చాలామంది చేసే తప్పు ఇదే. ఇది అంగీకరించాల్సి విషయం. అంతేగానీ.. అంతగా ఉద్రేకపడాల్సిన అవసరం లేదు. సభలో సభ్యతతో వ్యవహరిస్తే మంచిది అని మందలించారు. అంతేకాదు సభ రికార్డుల నుంచి అఖిలేష్ వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా స్పీకర్ సతీష్ మహానాకు సీఎం యోగి రిక్వెస్ట్ చేశారు. అంతకు ముందు రోజు(మంగళవారం) అసెంబ్లీలో ఎస్సీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చేసిన బాయ్స్ విల్ బాయ్స్ కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. అత్యాచారాలకు మరణశిక్ష విధించాలన్న వాదనను వ్యతిరేకిస్తూ.. అబ్బాయిలు అబ్బాయిలే.. కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి అంటూ ములాయం వ్యాఖ్యలు చేశారు. అయితే యూపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ అసెంబ్లీ సమావేశాల్లో అఖిలేష్ వ్యాఖ్యలకు.. సీఎం యోగి ‘ములాయం వ్యాఖ్యలను’ వ్యాఖ్యలను కౌంటర్గా తెరపైకి తెచ్చారు. -
యూపీ అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. ఒకరికొకరు ఎదురుపడిన యోగి, అఖిలేష్
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పరస్పరం నవ్వుకుంటూ పలకరించుకున్నారు. యూపీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులు కలిశారు. యోగి అసెంబ్లీలోకి రాగానే.. సభ్యులందరూ లేచి నిలబడ్డారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ముందు వరుసలో కూర్చున్న అఖిలేష్ కూడా తన సీటులోంచి లేచి యోగికి విష్ చేశారు. ఒకరినొకరు షేక్ హ్యండ్ ఇచ్చుకొని అత్మీయంగా పలకరించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఎన్నికల వరకు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్న అఖిలేష్, యోగి.. ఇలా నవ్వుకుంటూ పలకరించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాన ప్రతిపక్ష నేత, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రమాణం చేశారు. చదవండి: బెంగాల్ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు, వీడియో వైరల్ #WATCH Uttar Pradesh CM Yogi Adityanath meets Leader of Opposition Akhilesh Yadav in the Legislative Assembly during oath-taking of newly-elected legislators #Lucknow pic.twitter.com/7r6fX7ErjX — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 28, 2022 ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 255 సీట్లు కైవసం చేసుకొని రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సమాజ్వాదీ పార్టీ 111 స్థానాలను గెలిచి ప్రతిపక్ష హోదా అందుకుంది. యోగి ఆదిత్యానాథ్ గోరఖ్పూర్ అర్భన్ స్థానం నుంచి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన అఖిలేష్ యాదవ్ అజంగఢ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అంతేగాక యూపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శనివారం ఏకగగ్రీవంగా ఎన్నికయ్యారు. -
ఎగ్జిట్ పోల్ ఫలితాలపై సాక్షి టీవీ ప్రత్యక్ష విశ్లేషణ
-
జయప్రద వర్సెస్ డింపుల్!
లక్నో: ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలయిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. రాంపూర్ ఎమ్మెల్యే ఆజంఖాన్.. అదే స్థానం నుంచి పోటీ చేసి లోక్సభకు ఎన్నికయిన విషయం తెలిసిందే. దీంతో రాంపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ నేపథ్యంలో కనౌజ్ ఎంపీగా పోటీచేసి ఓటమిచెందిన.. డింపుల్ను ఉప ఎన్నికల బరిలో నిలిపేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్పీకి కంచుకోటయిన రాంపూర్లో డింపుల్ అయితేనే గెలుపొందే అవకాశం ఉందని, ఆ పార్టీ స్థానిక నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువచ్చినట్లు ఎస్పీ సీనియర్ నేత వెల్లడించారు. అయితే బీజేపీ నుంచి ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను బరిలో నిలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాంపూర్ లోక్సభ స్థానం నుంచి ఆమె రెండు సార్లు ఎంపీగా గెలుపొందగా.. గత ఎన్నికల్లో ఆజంఖాన్ చేతిలో ఓటమిని చవిచూశారు. 2009, 14 ఎన్నికల్లో ఎస్పీ నుంచి గెలుపొందిన జయప్రద అనంతరం బీజేపీలో చేరి ఓడిపోయారు. దీంతో అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో ఆమెనే నిలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె ఇప్పటికే పార్టీ పెద్దలతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడే అవకాశం ఉండడంతో రాంపూర్ ఉప ఎన్నిక ఉత్కంఠగా మారింది. త్వరలోనే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇదిలావుండగా.. లోక్సభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీలు ఫలితాల అనంతరం ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇక జరగబోయే ప్రతి ఎన్నికల్లోనూ తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రకటించారు. అయితే డింపుల్ను బరిలోకి దింపితే.. బీఎస్పీ మద్దతు ఇస్తుందా లేదా అనేది ఎస్పీ నేతలను వెంటాడుతున్న ప్రశ్న. 1980 నుంచి ఇప్పటి వరకు ఈ స్థానంలో ఎస్పీ తప్ప మరో పార్టీకి గెలిచే అవకాశం రాలేదు. ఈసారి బీజేపీ ఇక్కడ విజయం సాధించాలని ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. అందుకే లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే జయప్రద రాంపూర్ స్థానిక నేతలతో చర్చలను ప్రారంభించారు. -
బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడి దారుణహత్య
సాక్షి, లక్నో: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ ప్రకాశ్ తివారీ (గిప్పీ తివారీ) కుమారుడు వైభవ్ తివారీ(36)ని ఓ గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి సమీపంలోని కస్మాండా హౌస్లో శనివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. లక్నో జోన్ ఏడీజీ అభయ్ ప్రసాద్ కథనం ప్రకారం.. వైభవ్ తివారీ ఐఐఎం అహ్మదాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందాక వ్యాపారం ప్రారంభించాడు. సూరజ్ అనే పార్ట్నర్తో కలిసి కొన్నేళ్లపాటు బిజినెస్ చేసిన అనంతరం వీరిద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి. దీంతో వీరు వేర్వేరుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే సూరజ్ మాత్రం వైభవ్పై గత కొంతకాలం నుంచి పగతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి యూపీ అసెంబ్లీ సమీపంలోని వైభవ్ నివాసం కస్మాండా హౌస్కు గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో వైభవ్పై కాల్పులకు తెగబడి అతడిని హత్యచేశాడు. సూరజ్ ఈ పని చేసినట్లు వైభవ్ ఇంట్లో పనివాళ్లు చెబుతున్నారు. నిందితుడు వైభవ్పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు లక్నో జోన్ ఏడీజీ అభయ్ ప్రసాద్ వివరించారు. గిప్పీ తివారీకి ఏకైక సంతానం వైభవ్ తివారీ. వైభవ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా, గిప్పీ తివారీ 1989, 1991, 1993లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దొమారియాగంజ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2014లో సమాజ్వాదీ పార్టీలో చేరిన గిప్పీ తివారీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. -
నాలుగో దశలో కీలక పోటీలు
-
నాలుగో దశలో కీలక పోటీలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశలో.. రాజకీయ దిగ్గజాల కేంద్రంగా పేరొందిన అలహాబాద్, రాయ్బరేలీ, వెనుకబడిన బుందేల్ఖండ్ ప్రాంతంలోని ఝాన్సీ, మహోబా తదితర 12 జిల్లాల్లో గురువారం పోలింగ్ జరగనుంది. యూపీ మధ్య, తూర్పు ప్రాంతాలకు దిగువున ఉన్న జిల్లాల్లోని 53 సీట్లల్లో బీజేపీ, ఎస్సీ–కాంగ్రెస్, బీఎస్పీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. పలువురు అభ్యర్థుల మధ్య పోటీ కీలకంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానాల్లో ఎస్పీ 24, బీఎస్పీ 15, కాంగ్రెస్ 6, బీజేపీ 5 సీట్లు గెలుచుకోగా, ఇతరులకు 3 స్థానాలు దక్కాయి. అలహాబాద్లో.. అలహాబాద్ మినహా మిగిలివన్నీ వెనుకబడిన జిల్లాలే. అయిదుగురు ప్రధానులకు ఎన్నికల క్షేత్రంగా నిలిచిన అలహాబాద్ పెద్ద జిల్లా. 2012 ఎన్నికల్లో ఇక్కడి మొత్తం 11 సీట్లలో 9 మంది సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించినా, వారిలో ఏ ఒక్కరికీ అఖిలేశ్ కేబినెట్లో మంత్రి పదవి దక్కలేదు. మాజీ ప్రధానులు నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, వీపీ సింగ్, చంద్రశేఖర్కు అనుబంధమున్న అలహాబాద్–వెస్ట్ నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రతిష్టాత్మక అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థిసంఘం అధ్యక్ష పదవిని కైవసం చేసుకుని 2014లో వార్తల్లోకి ఎక్కిన రీచాసింగ్ ఎస్పీ టికెట్పై అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో గెలిచిన బీఎస్పీ సిటింగ్ ఎమ్మెల్యే పూజాపాల్ మూడోసారి గెలిచే ప్రయత్నం చేస్తున్నా విజయావకాశాలు లేవని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పార్టీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్ రంగంలో నిలిచారు. లాల్ బహదూర్ శాస్త్రి మనవడైన సింగ్ చాలా కాలంగా ఢిల్లీలో నివసించడం ఆయనకు ప్రతికూలాంశంగా మారింది. జిల్లాలోని ఫూల్పూర్ నుంచి లోక్సభకు ఎన్నికైన కేశవ్ప్రసాద్ మౌర్య రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కావడంతో ఇక్కడి 11 సీట్లకు పోటీని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎస్పీ నేత ములాయం కేబినెట్లో పనిచేసిన మాజీ ఎంపీ రేవతీ రమణ్సింగ్ మనవడు ఉజ్వల్ రమణ్ ఎస్పీ తరఫున పోటీ చేస్తున్న కర్ఛనా స్థానం కూడా కీలకంగా మారింది. రాజా భయ్యా మళ్లీ బరిలోకి.. ప్రతాప్గఢ్ జిల్లా కుందా నుంచి 1993 నుంచి వరుసగా అయిదుసార్లు ఎన్నికైన మంత్రి రఘురాజ్ప్రతాప్ సింగ్ అలి యాస్ రాజా భయ్యా ఆరోసారీ ఇండిపెండెంట్గానే ఎస్పీ మద్దతుతో నామినేషన్ వేశారు. హింసే ఆయుధంగా భావించే ‘బాహుబలి’ నేతగా పేరొందిన రాజా భయ్యా గతంలో కల్యాణ్సింగ్, రాంప్రకాశ్ గుప్తా, రాజ్నాథ్సింగ్ (అందరూ బీజేపీ), ములాయం కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. ఓ పోలీసు అధికారి హత్య కేసులో ఆయన పేరు రావడంతో 2013లో అఖిలేశ్ కేబినెట్ నుంచి తప్పుకున్నా.. తర్వాత పోలీసులు క్లీన్చిట్ ఇచ్చాక తిరిగి మంత్రి అయ్యారు. ఇదే జిల్లాలోని రాంపూర్ ఖాస్ నుంచి వరుసగా 9 సార్లు గెలిచిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ప్రమోద్తివారీ కూతురు, సిటింగ్ ఎమ్యెల్యే ఆరాధనా మిశ్రా రెండోసారి పోటీచేస్తున్నారు. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ నేత కూతురు.. నెహ్రూ–గాంధీ కుటుంబ సభ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి దూరమై మళ్లీ అందులో చేరిన సీనియర్ నేత అఖిలేశ్కుమార్ సింగ్ కూతురు అదితీ సింగ్ ఈసారి కాంగ్రెస్ టికెట్పై రాయ్బరేలీ నుంచి పోటీచేస్తున్నారు. 2012 ఎన్నికల్లో అఖిలేశ్ పీస్ పార్టీ టికెట్పై గెలిచారు. అదితి.. బీఎస్పీ అభ్యర్థి షాబాజ్ఖాన్, ఆరెల్డీ నేత భారతీ పాండే నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఇదే జిల్లాలోని ఊంచాహర్ స్థానంలో బీఎస్పీ నుంచి బీజేపీలోకి ఎన్నికల ముందు ఫిరాయించిన మాజీ మంత్రి స్వామిప్రసాద్ మౌర్య కొడుకు ఉత్కర్‡్ష కమలదళం తరఫున పోటీ చేస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్