-
చంద్రయాన్–3లో ఈసీఐఎల్ కీలక భూమిక
కుషాయిగూడ (హైదరాబాద్): చంద్రయాన్–3లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎల్రక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కీలక భూమిక పోషించింది. చంద్రయాన్ కమ్యూనికేషన్కు కీలకమైన 32 మీటర్ డీప్ స్పేస్ నెట్వర్క్ (డీఎస్ఎన్) యాంటెన్నాను సరఫరా చేసిందని సంస్థ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. 300 టన్నుల ఈ యాంటెన్నా వ్యవస్థను బాబా అటామిక్ రీసెర్చ్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, ఐఎస్టీఆర్ఏసీలతో కలిసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు చెప్పాయి. చంద్రుడి ఉపరితలంపై 0.3 మిల్లీమీటర్ల పరిమాణం కలిగిన వాటినీ క్షుణ్ణంగా చూపించేలా వీల్ అండ్ ట్రాక్ మౌంట్, బీమ్ వేవ్ గైడ్, ఫీడ్ సిస్టమ్తో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యాంటెన్నాలో అమర్చినట్లు చెప్పాయి. చంద్రుడిపై తీసే చిత్రాలు, డేటాను స్వాదీనం చేసుకోవడంలోనూ ఈ యాంటెన్నా కీలక పాత్ర పోషిస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన యాంటెన్నా సిస్టమ్తో పాటుగా సేఫ్ అండ్ సెక్యూర్ ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోల్ (పీఎల్సీ)ని అందిస్తూ ఇస్రోతో ఈసీఐఎల్ సన్నిహితంగా పనిచేస్తోందని ఆ వర్గాలు చెప్పాయి. రాబోయే ఆదిత్య, గగన్యాన్, మంగళ్యాన్–2 మిషన్లకు కూడా ఈసీఐఎల్ పనిచేస్తుందని పేర్కొన్నాయి. -
అంతరిక్ష రంగం..యు.ఆర్.రావు సేవలు
భారత అంతరిక్ష కార్యక్రమానికి గట్టి పునాదులు వేసిన ముగ్గురిలో ఉడిపి రామచంద్రరావు (యు.ఆర్.రావు) ఒకరు. ఆయన జూలై 24న కన్నుమూశారు. ఇస్రోలో దాదాపు ప్రారంభం నుంచి (ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం మొదలు) మంగళ్యాన్ వరకు అనేక విజయవంతమైన అంతరిక్ష కార్యక్రమాలకు దిశానిర్దేశం చేశారు. మూడు దశాబ్దాలకు పైగా అడ్వైజరీ కమిటీ ఆన్ స్పేస్ సైన్సెస్కు చైర్మన్గా వ్యవహరించి అనేక అంతరిక్ష పరిశోధనలకు మార్గదర్శిగా నిలిచారు. భారత అంతరిక్ష కార్యక్రమానికి సంబంధించి విక్రమ్ సారాభాయి, ప్రొఫెసర్ సతీష్ ధావన్, యు.ఆర్.రావులను త్రిమూర్తులుగా భావిస్తారు. భారత అంతరిక్ష కార్యక్రమ అభివృద్ధికి యు.ఆర్.రావు విశేష కృషి చేశారు. అంతరిక్ష విజ్ఞాన రంగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. అయితే ఆయనకు ఆ గుర్తింపు అంత సులభంగా రాలేదు. విజయాల వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. ప్రస్తుత ఇస్రో శాస్త్రవేత్తలతో పోలిస్తే ప్రారంభంలో యు.ఆర్.రావు వంటి వారికి అందుబా టులో ఉన్న వనరులు, నిధులు చాలా తక్కువ. ఆ సమయంలో అంతర్జాతీయ సహకారం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. అమెరికా తొలినాళ్లలో భారత అంతరిక్ష కార్యక్రమానికి ఎలాంటి సహకారం అందించలేదు. అలాంటి పరిస్థితుల్లో దేశీయ టెక్నాలజీని అభివృద్ధి చేయడమంటే ఆషామాషీ కాదు. ఇప్పటికీ ఉపగ్రహ రాకెట్ నిర్మాణ విజ్ఞానం కొన్ని దేశాలకే పరిమితమవడాన్ని చూస్తే మన శాస్త్రవేత్తల గొప్పదనం అర్థమవుతుంది. విశేష కృషి ఇస్రో 1975, ఏప్రిల్ 19న సోవియట్ యూనియన్ సహకారంతో మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను విజయ వంతంగా ప్రయోగించింది. దాని నిర్మాణంలో యు.ఆర్.రావు కఠోర శ్రమ, కృషి ఉన్నాయి. సమష్టి కృషితో ఏదైనా సాధించొచ్చనే ‘ఇస్రో సంస్కృతి’కి యు.ఆర్.రావు నాంది పలికారు. ఆయన ఆర్యభట్ట తర్వాత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల అభివృద్ధికి నడుంబిగించారు. భాస్కర 1, 2, రోహిణి–డీ 2, స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిరీస్ వంటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల నిర్మాణంతో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అభివృద్ధి, శిక్షణకు గట్టి పునాది పడింది. ముఖ్యంగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల (కార్టోశాట్, రిసోర్స్శాట్, ఓషన్శాట్) రూపకల్పనలో యు.ఆర్.రావు కృషి ఎంతగానో ఉపయోగపడింది. టెక్నాలజీ ఎక్స్పెరిమెంట్ శాటిలైట్ (ఖీఉ )లో ఒక మీటరు లోపల రిజల్యూషన్ సాధించడం గొప్ప ఘనత. దాన్ని సాధించడంలో యూ.ఆర్.రావు కృషి మరువలేనిది. డా.విక్రమ్ సారాభాయి భారత అంతరిక్ష పితామహుడిగా గుర్తింపు పొందితే.. యు.ఆర్.రావు భారత అంతరిక్ష ఉపగ్రహ పితామహుడిగా ఖ్యాతి గడించారు. రాకెట్ అభివృద్ధిలో కూడా యు.ఆర్.రావు పాత్ర ఎనలేనిది. 1984–1994 మధ్య (దాదాపు పదేళ్ల పాటు) ఇస్రో చైర్మన్గా ఆయన పనిచేశారు. ఆ కాలంలో ఇస్రో కొన్ని కీలక రాకెట్ కార్యక్రమాల్లో వైఫల్యాలు చవిచూసింది. అదే సమయంలో క్రయోజెనిక్ ఇంజన్ సరఫరాను అమెరికా అడ్డుకుంది. రెండో పరిశోధన రాకెట్.. ఏఎస్ఎల్వీ (అగ్మెంటెడ్ శాటిలైట్ వెహికల్), మొదటి రెండు అభివృద్ధి ప్రయోగాలు (ఏఎస్ఎల్వీ– డీ1, ఏఎస్ఎల్వీ–డీ2) విఫలమయ్యాయి. వీటితోపాటు మొదటి పీఎస్ఎల్వీ అభివృద్ధి ప్రయోగం (1993) సైతం విజయవంతం కాలేదు. దీంతో ఇస్రోపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ యు.ఆర్.రావు నేతృత్వంలోని ఇస్రో శాస్త్రవేత్తలు ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వైఫల్యాలను విశ్లేషించి సరిదిద్దారు. యు.ఆర్.రావు ఆ రకమైన పునాది వేయడంవల్లే నేడు ప్రపంచంలో అత్యంత విజయవంతమైన అతి కొద్ది రాకెట్లలో ఒకటిగా పీఎస్ఎల్వీ నిలిచింది. పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇప్పటి వరకు పీఎస్ఎల్వీ–డి1(1993) మాత్రమే విఫలమైంది. ఆ తర్వాత నిర్వహించిన ప్రయోగాలు వరుసగా జయవంతమయ్యాయి. అలాగే దేశీయ క్రయోజెనిక్ పరిశోధన, అభివృద్ధిలో కూడా యు.ఆర్.రావు మార్గదర్శకంగా నిలిచారు. అడ్వైజరీ కమిటీ ఆన్ స్పేస్ సైన్సెస్కు మూడు దశాబ్దాలకు పైగా చైర్మన్గా ఆయన వ్యవహరించారు. 2020 వరకు ఇస్రో నిర్వహించదలచిన ప్రయోగాల క్యాలెండర్ రూపకల్పనలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి ఫలితంగానే ఆస్ట్రోశాట్ వంటి రోదసీ పరిశోధన ఉపగ్రహ రూపకల్పన సాధ్యమైంది. భారత్∙చేపట్టిన చంద్రయాన్–1, మంగళ్యాన్ కార్యక్రమాల్లో శాస్త్రవేత్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో ఇస్రో నిర్వహించనున్న చంద్రయాన్–2, అంగారక రోవర్ మిషన్, ఆదిత్య, గ్రహ మిషన్లకు సంబంధించిన కార్యకలాపాల్లో చివరి వరకు ఆయన చర్చల్లో పాల్గొనేవారు. సూర్యుడి కరోనా, క్రోమోస్ఫియర్ అధ్యయనంపై అమితాసక్తి కనబర్చేవారు. ఫలితంగా ఇస్రో త్వరలో ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని నిర్వహించనుంది. భారత అంతరిక్ష వాణిజ్య సేవలను అంతర్జాతీయంగా విస్తరించే లక్ష్యంతో 1992లో ఆంత్రిక్స్ కార్పొరేషన్ ఏర్పాటులో ఆయన కృషి విశిష్టమైంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతరిక్ష టెక్నాలజీ అనువర్తనాలను విస్తరించాలనే యు.ఆర్.రావు కోరిక ఫలితంగా ఐరాసకు చెందిన సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ ది ఏషియా పసిఫిక్... భారత్లో ఏర్పాటైంది. దీంతోపాటు అమెరికా, రష్యా, ఐరోపా దేశాలకు చెందినవారి తర్వాత ఐరాసకు చెందిన యూఎన్ కమిటీ ఆన్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ ఔటర్ స్పేస్కు చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. మార్గదర్శకుడు కర్ణాటకలోని ఉడిపి దగ్గర ఒక మారుమూల గ్రామంలో జన్మించిన యు.ఆర్.రావు తన కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు. అవరోధాలను అధిగమించి దేశ అంతరిక్ష కార్యక్రమానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఒకే రాకెట్ (పీఎస్ఎల్వీ–సి37) ద్వారా 104 ఉపగ్రహాలను ఇస్రో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అదేవిధంగా తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి మంగళయాన్ను ప్రవేశపెట్టడానికి యు.ఆర్.రావు దిశానిర్దేశం, మార్గదర్శకత్వం ఎంతగానో ఉపయోగపడింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement