-
చార్జీల పెంపునకు ఇదా సమయం!
సాక్షి బెంగళూరు: కేరళ, కర్ణాటకల్లో వరద సమయాల్లోనూ ప్రైవేట్ విమానయాన సంస్థలు వ్యాపార దృష్టితో ఉండటం శోచనీయమని కేంద్ర మంత్రి సదానంద మండిపడ్డారు. సాధారణ వేళల్లో బెంగళూరు–మంగళూరు మధ్య విమాన ప్రయాణ చార్జీలు రూ. 4 వేలుంటే, ఇప్పుడు రూ.18 వేలకు తాకాయని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు, రైళ్లు సహా మంగళూరు, కేరళకు వెళ్లే అన్ని రవాణా మార్గాలు నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితిలో విమానయానం ఒక్కటే ప్రజలకు ముందున్న ప్రయాణ మార్గమని, దీన్ని ఆసరాగా చేసుకుని చాలా ప్రైవేటు సంస్థలు చార్జీలను అమాంతం పెంచేశాయి. -
మోదీని తిట్టిన కేంద్ర మంత్రి
సాక్షి, బెంగళూరు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పొరపాటున కేంద్ర మంత్రి సదానంద గౌడ తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని విమర్శించే తొందరలో ఆయన తడబడ్డారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విమర్శించే తొందరలో.. నరేంద్రమోదీనే తూలనాడారు. ‘కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నరేంద్రమోదీకి సిగ్గుండాలి’ అని పొరపాటున వ్యాఖ్యానించారు. బీజేపీ చేపట్టిన పరివర్తన యాత్రలో భాగంగా శనివారం దక్షిణ కర్ణాటకలోని బంట్వాళలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో సదానందగౌడ పాల్గొన్నారు. ఈ వేదికపైనే.. సీఎం సిద్ధరామయ్యపై విమర్శలు చేశారు. అదేజోరులో మోదీని తిట్టేశారు. అనంతరం సహచరుల సూచనతో ఆ పొరపాటును సరిచేసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. -
తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెంచాలి
కేంద్ర మంత్రి సదానంద గౌడకు ఎంపీ వినోద్ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడను గురువారం తెరాస ఎంపీ వినోద్ కుమార్ కలుసుకొని తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, తెలంగాణ కు ప్రత్యేక హైకోర్టు, హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తుల వాటా తదితర అంశాలపై చర్చించారు. అసెంబ్లీ స్థానాల పెంపునకు అనువుగా ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ చట్ట సవరణల బిల్లు ఈ నెల 25 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు బిల్లుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని వినోద్ కోరారు. కేంద్ర మంత్రితో సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 26 లో చేయాల్సిన సవరణపై కేంద్ర మంత్రితో చర్చించామని వినోద్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 26 లో చేసే చిన్న సవరణ ద్వారా రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు పెంచే ఆస్కారం ఉందన్నారు. ఈ సవరణ కు సంబంధించి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గతంలోనే లేఖలు రాశారని వినోద్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఒకటి, రెండు రోజుల్లో తమ మంత్రిత్వ శాఖ తగు నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి సదానంద గౌడ తెలిపారని వినోద్ చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఉన్నందున న్యాయమూర్తుల ఎంపికలో తెలంగాణ కు దక్కాల్సిన వాటాపై చర్చించామన్నారు. ఈ విషయంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement