breaking news
Union groups
-
చీరాల ఇరిగేషన్లో రచ్చకెక్కిన విభేదాలు
సాక్షి, చీరాల: చీరాల ఇరిగేషన్ కార్యాలయంలో ఈఈ కి, సిబ్బందికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇరిగేషన్ డ్రైనేజీ డివిజన్ కార్యాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.వెంకటరాజు కార్యాలయం యూడీసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. మిగిలిన ఉద్యోగులపై కూడా అట్రాసిటీ కేసు పెడతానని బెదిరిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. తాను చెప్పిన పనులు చేయడం లేదని, ఏదైనా చెబితే ఎదురు మాట్లాడుతున్నారని, అందుకే తాను కులం పేరుతో తిట్టాడని యూడీసీ హేమంత్కుమార్పై అట్రాసిటీ కేసు పెట్టానని ఉన్నతాధికారులకు ఈఈ చెప్పుకున్నట్లు సమాచారం. నిత్యం తమను పిలిపించి కాంట్రాక్టర్లు, ఉన్నతోద్యోగుల ముందు అవమానకరంగా మాట్లాడుతూ ఈఈ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని యూడీసీ కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈఈ అకారణంగా తమను దుర్భాషలాడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని ఉద్యోగులు సైతం చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం యూడీసీపై వేధింపులకు పాల్పడటంతో పాటుగా చొక్కా పట్టుకుని దుర్బాషలాడుతూ కర్ర తీసుకొని ఈఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఉద్యోగులంతా ఈఈని ప్రశ్నించారు. ఈఈ మాత్రం తనను యూడీసీ కులంపేరుతో దూషించి దాడికి యత్నించాడని అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసి అట్రాసిటీ కేసు పెట్టినట్లు చెబుతున్నారు. యూనియన్ నాయకులను కలిసిన సిబ్బంది ఇరిగేషన్ చీరాల డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బండి శ్రీనివాసరావును ఒంగోలులో కలిసి ఈఈ ఆగడాలను, వేధింపులను వివరించారు. దీనిపై ఎన్జీవో నేతలు ఈఈతో మాట్లాడితే యూడీసీపై పెట్టిన కేసును మాత్రం వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పాడు. తాను ఇచ్చిన కేసు రిజిస్టర్ చేయాల్సిందేనని డీఎస్పీ వద్ద పట్టుబట్టాడు. ఉన్నతాధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? కింది స్థాయి ఉద్యోగులు సరిగా పనిచేయకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చునని, సంవత్సర కాలంగా ఉన్నతాధికారులను సైతం తిట్టుకుంటూ తమపై అరాచకంగా ఈఈ ప్రవర్తిస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఆయన అనారోగ్యంతో బాధ్యతలు తీసుకున్నాడని, ఇరిగేషన్ గెస్ట్హౌస్లోనే సంవత్సరం అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఉద్యోగులు తెలిపారు. ప్రతి చిన్న విషయానికి ఫైళ్లు తీసుకుని గెస్ట్హౌస్లోకి తాము వెళ్లాల్సి వస్తుందని, ఏదో ఒక వంక చూపించి తిట్టడం పరిపాటిగా మారిందని ఉద్యోగులు తెలిపారు. పొన్నూరులో పనిచేస్తున్న ఏఈ నాగేశ్వరావు ప్రతి నిత్యం ఈఈ కార్యాలయంలోనే ఉంటూ ఎస్టాబ్లిష్మెంట్ క్లర్క్ చేయాల్సిన పనులన్నీ తాను చేస్తూ కార్యాలయంలో ఎవ్వరికీ ఏ పనీ చేతకాదని చాడీలు ఈఈకి చెబుతున్నాడని ఉద్యోగులు వాపోతున్నారు. చీరాల డ్రైనేజీ ఈఈ నుంచి తమకు రక్షణ కల్పించాలని లేకుండా ఉమ్మడి సెలవులు పెడతామని ఉద్యోగులు అంటున్నారు. యూడీసీని తిట్టిన మాట వాస్తవమే కానీ.. చీరాల డ్రైనేజీ కార్యాలయంలో పనిచేస్తున్న యూడీసీ హేమంత్కుమార్ బిల్లుల విషయంలో నన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఐటీ రిటన్స్ విషయంలో ఈఈగా నాకు అధికారం లేదు. ఈ విషయమై యూడీసీతో మాట్లాడుతూ పనిలో నిబద్దత ఉండాలని, పనికిమాలిని పనులు చేయవద్దని తిట్టిన మాట వాస్తవమే. అయితే యూడీసీ మాత్రం తనను బూతులు తిట్టడంతో పాటుగా దాడికి యత్నించి కులం పేరుతో దూషించాడు. సిబ్బంది పనితీరు మార్చుకోవాలని సూచిస్తే నాపై దాడికి యత్నించి, కులం పేరుతో దూషించాడు. అందుకే అట్రాసిటీ కేసు పెట్టా. పనిచేయని ఉద్యోగులు ఎవ్వరినీ విడిచి పెట్టను. -బి.వెంకటరాజు, డ్రైనేజీ ఈఈ, చీరాల. -
సమయమిదే.. స్పందించాలి మరి!
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్ను అత్యంత దారుణంగా కాటేసిన కరువు రక్కసి రబీ సీజన్నూ వెంటాడుతోంది. జులై తర్వాత ఒక్కరోజు కూడా సరైన వర్షం కురవకపోవడంతో ‘అనంత’ అతలాకుతలమైంది. పంట తొలగింపు ఖర్చులు కూడా దక్కే పరిస్థితి కనిపించకపోవడంతో కొన్ని చోట్ల వేరుశనగను పశువులు, గొర్రెలకు వదిలేశారు. సాగుకే కాదు.. తాగునీటికీ కటకట మొదలైంది. చలికాలంలోనే తాగునీరు లభించడం కష్టంగా మారింది. అననుకూల వర్షాలు, సుదీర్ఘ వర్షపాత విరామాల (డ్రైస్పెల్స్) కారణంగా ఈ ఖరీఫ్లో 6.09 లక్షల హెక్టార్లలో వేరుశనగ దెబ్బతినింది. 1.50 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు కూడా 90 శాతం వరకు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ వర్షాలు లేకపోవడంతో 1.50 లక్షల హెక్టార్లలో సాగులోకి రావాల్సిన రబీ పంటల విత్తనమే ఆగిపోయింది. ఇంతటి దుర్భర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుతం తరుణంలో కరువు పరిశీలనార్థం కేంద్ర బృందాలను జిల్లాకు తీసుకురాగలిగితే దుర్భిక్ష పరిస్థితుల తీవ్రత వారికి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లకూ సంబంధించి అన్ని పంటల పరిస్థితి, రైతుల స్థితిగతులు వారిని చలింపజేస్తాయనడంలో సందేహం లేదు. తద్వారా జిల్లాకు మేలు కలిగే అవకాశాలూ ఉంటాయి. అలాకాకుండా పంటలన్నీ తొలగించిన తర్వాత, ఎక్కడా పంటలు లేని సమయంలో కరువు బృందాలు పర్యటిస్తే ఒనగూరే ప్రయోజనాలేవీ ఉండవని రైతుసంఘాల నాయకులు చెబుతున్నారు. కరువు నివేదికలు బుట్టదాఖలు జిల్లాకు వచ్చి వెళుతున్న కేంద్ర బృందాలు చేసిన సిఫారసులు కూడా అమలు కావడం లేదు. వారికి ఇచ్చిన కరువు నివేదికలు బుట్టదాఖలవుతూనే ఉన్నాయి. భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ సారథ్యంలోని 18 మంది నిపుణులతో కూడిన ‘హైపవర్ టెక్నికల్ కమిటీ’ 2012 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో రెండు దఫాలుగా జిల్లాలో పర్యటించింది. ఆ కమిటీ చేసిన సిఫారసుల అమలు కోసం రూ.7,676 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించిన ‘ప్రాజెక్టు అనంత’ కూడా అనతికాలంలోనే కాలగర్భంలో కలిసిపోయింది. 2013 ఏప్రిల్ 18న భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) రాష్ట్ర జనరల్ మేనేజర్ కళ్యాణ చక్రవర్తి నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారుల బృందం జిల్లాలో పర్యటించింది. తక్షణసాయంగా రూ.1,065 కోట్లు కావాలని జిల్లా అధికారులు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. 2013 డిసెంబర్లో కేంద్రానికి చెందిన కమిషన్ ఫర్ సెంట్రల్ క్రాప్స్ అండ్ ప్రైసెస్ కమిషనర్ అశోక్గులాటే బృందం పర్యటించింది. 2014 ఏప్రిల్ 22, 23 తేదీల్లో ‘ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం’ పేరుతో మరోసారి కేంద్ర బృందం జిల్లాకు వచ్చింది. తక్షణం రూ.1,147.50 కోట్లు అవసరమని జిల్లా అధికారులు నివేదిక అందజేశారు. 2015 ఏప్రిల్ 1న కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ షకీల్అహ్మద్ నేతృత్వంలో మరో బృందం పర్యటించగా జిల్లా తరపున రూ.1,404 కోట్లు తక్షణసాయం కావాలని కోరారు. కానీ ఏ ఒక్కసారీ రూపాయి కూడా మంజూరు చేయలేదు. కేంద్ర కరువు, విపత్తు నివారణ కమిషనర్ రాఘవేంద్ర సింగ్, కేంద్ర హార్టికల్చర్ డైరెక్టర్ అతుల్పాట్నేలతో కూడిన మరో బృందం కూడా కరువును పరిశీలించి వెళ్లింది. ఫలితం మాత్రం శూన్యం.