-
సార్లొస్తారు
త్వరలో డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్..! ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు కుమ్రంభీం జిల్లాలోనే అత్యధిక ఖాళీలు.. నిర్మల్ జిల్లాలో స్వల్పం మంచిర్యాల సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులకు మోక్షం లభించనుందా..? ప్రభుత్వం టెట్, డీఎస్సీ నిర్వహించడం ద్వారా ఐదేళ్ల తరువాత నిరుద్యోగుల ఆశలు తీర్చనుందా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెపుతున్నాయి అధికార వర్గాలు. జిల్లాల వారీగా ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), డీఎస్సీని వేర్వేరుగానే నిర్వహించి నియామకాలు చేపట్టనున్నట్లు ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ముందుగా టెట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాతనే డీఎస్సీ ప్రకటన రానున్నట్లు – మిగతా 2లోu సమాచారం. అన్నీ సక్రమంగా కుదిరితే మార్చిలో టెట్ నోటిఫికేషన్ ప్రకటించి, ఏప్రిల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. అలాగే డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ చివరి వారం లేదా మేలో వెలువరించి జూలై నాటికి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. టెట్, డీఎస్సీ కలిపి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 1,867 కొత్త నియామకాలు జరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్లో అత్యధికంగా 989 టీచర్ పోస్టులు ఖాళీ ఉండ గా, నిర్మల్ జిల్లాలో అతితక్కువగా 175 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఐదేళ్ల తర్వాత.. : ఉపాధ్యాయ వృత్తి చేపట్టడానికి ఆశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఐదేళ్లుగా అవకాశాలు లేవు. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డీఎ స్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడమే చివరిది. అప్పటి నుంచి నిరుద్యోగులు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ వస్తుందని ఆశతో ఉన్న వారికి రెండున్నరేళ్ల తరువాత ఉప ముఖ్యమంత్రి ప్రకటన ఊపిరినిచ్చింది. నాలుగు జిల్లాల్లో కలిపి 1,867 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థుల శాతం తక్కువగా ఉన్న పాఠశాలలను విలీనం చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఖాళీల సంఖ్యలో మార్పులు ఉంటాయా అన్న విషయాన్ని ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కాగా.. ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరిస్తే నాలుగు జిల్లాల్లో 1ః28 చొప్పున సుమారు 55 వేల మంది పోటీపడే అవకాశాలు ఉన్నాయి. కుమ్రంభీంలోనే అధిక ఖాళీలు.. : ఉమ్మడి పరి ధిలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనే అత్యధిక ఖాళీలు ఉన్నాయి. ఈ జిల్లాలో అన్ని విభాగాల్లో కలిపి 989 పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. మారుమూల మండలాలైన బెజ్జూరు, కెరమెరి, తిర్యాణి, కౌటాల, సిర్పూర్(టి), చింతల్మానేపల్లి, దహెగాం, వాంకిడి, జైనూర్ మండలాల్లోని ప్రాథమిక పాఠశాలల్లోనే అత్యధిక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి, నెన్నెల, భీమిని, భీమారం, కాసిపేట, అదే విధంగా నిర్మల్ జిల్లాలోని కడెం, పెంబి, కుంటాల, సారంగాపూర్, ఖానాపూర్, లోకేశ్వరం, ఆదిలాబాద్ జిల్లాలోని బేల, జైనథ్, నేరడిగొండ, నార్నూర్, ఉట్నూర్, తలమడుగు, ఇంద్రవెల్లి మండలాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఎక్కువగా ఖాళీ ఉన్నట్టు సమాచారం. -
నిధుల విడుదలలో మమః అనిపిస్తున్నారు!
సాక్షి,సిటీబూరో: వెనుకబడిన తరగతుల కార్పొరేషన్లకు బ్యాంక్ లింకేజీ సబ్సిడీ రుణాలు పూర్తి స్థాయిలో విడుదల కాలేదు . మచ్చుకు కొన్ని నిధులను మాత్రమే విడుదల చేసి ప్రభుత్వం చేతులు దూలుపుకోవడంంతో లబ్ధిదారులు బ్యాంక్ లింకేజీ సబ్సిడీ రుణాల కోసం బీసీ కార్పొరేషన్లు, బ్యాంకుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో భాగంగా ఏటా బ్యాంకు లింకేజి సబ్సిడీ రుణాలల్లో భాగంగా 2015–16 ఆర్థిక సంవత్సరానికి గాను హైదారాబాద్– రంగారెడ్డి జిల్లాల్లోని బీసీ కార్పొరేషన్ల పరిధిలో 3,029 యూనిట్లకు రూ.23.42 కోట్లు మంజూరయ్యాయి. ఇందుకు అధికారయంత్రాంగం ఫిబ్రవరిలో లబ్ధిదారులను ఎంపిక చేసింది. అయితే ఆగస్టు చివరి వారంలో ప్రభుత్వం 820 యూనిట్లకుగాను రూ. 5.87 కోట్లు విడుదల చేసింది. మిగతా 2,209 యూనిట్లకు సంబంధించి రూ. 17.55 కోట్లు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు రెండు వారాలుగా బీసీ కార్పొరేషన్ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టు తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ నేపథ్యంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడుతున్న నేపథ్యంలో తమకు సబ్సిడి రుణాలు వస్తాయో ..రావోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. – మిగతా కార్పొరేషన్లు అంతే ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్లకు సంబంధించిన బ్యాంక్ లింకేజీ సబ్సిడి రుణాల పరిస్థితి అలాగే ఉంది. ఆయా కార్పొరేషన్లకు ప్రభుత్వం సగం నిధులు మాత్రమే విడుదల చేయటంతో లబ్ధిదారులు అందోళన చెందుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉపాధి కల్పనలో భాగంగా చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు పూర్తి స్థాయిలో నిధులు రాలేదు. ఎస్సీ కార్పొరేషన్ 1581 యూనిట్లకు గానూ రూ.21 కోట్లకు ప్రతిపాదనలు పంపగా, 1225 యూనిట్లకు గానూ రూ.17.86 కోట్లు విడుదల చేసింది. మిగతా 356 యూనిట్లకు గానూ రూ. 3.14 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఎస్టీ కార్పొరేషన్కు సంబంధించి 73 యూనిట్లకు గానూ 67 యూనిట్లకు మాత్రమే రూ. 1.10 లక్షలు విడుదలయ్యాయి. వికలాంగుల సంక్షేమ శాఖకు 76 యూనిట్లకు గానూ 22 యూనిట్లకు రూ.19 లక్షలు విడుదలయ్యాయి. -
జాబుల జాడే లేదు
ముషీరాబాద్: తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగమని, బాబు వస్తే జాబు వస్తుందని హామీలిచ్చిన కేసీఆర్, చంద్రబాబు గద్దెనెక్కి 27 నెలలు గుడుస్తున్నా ఉద్యోగాల జాడ లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. నిరుద్యోగులు ఐక్యంగా ఉద్యమిస్తేనే ప్రభుత్వాలు దిగివస్తాయన్నారు. సోమవారం ముషీరాబాద్లోని కషీష్ ఫంక్షన్హాల్లో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల నిరుద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు టీచర్ పోస్టులు మినహా ఏ ఒక్క పోస్టునూ భర్తీ చేయలేదన్నారు. ఏపీలో 1.45లక్షల ఖాళీలు ఉండగా, 10వేల ఉద్యోగాల భర్తీకి మంత్రి వర్గం నిర్ణయించడం దారుణమన్నారు. గ్రూప్ – 1,2,3 పోస్టులను పాత పద్దతిలోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కాంట్రాక్టర్లకు, నీళ్లను సముద్రానికి, నియామకాలను గాలికి వదిలేసిందన్నారు. ఇప్పటి వరకు కేవలం 3వేల ఇంజనీరింగ్ పోస్టులు, పోలీస్ ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేశారన్నారు. గ్రూప్ – 2 సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. సంస్కరణలు ఉద్యోగ భర్తీలో కాకుండా రాజకీయాల్లో ప్రవేశపెట్టాలన్నారు. కార్యక్రమంలో గుజ్జకృష్ణ, శ్రీనివాస్గౌడ్, సయ్యద్ పాల్గొన్నారు. -
మరో మోసం!
నిరుద్యోగులను వంచించిన సీఎం చంద్రబాబు నాడు ఉద్యోగాలు అన్నారు....శిక్షణ ఇచ్చారు నెలలు గడుస్తున్నా పిలుపూ లేదు...కొలువూ లేదు ఘొల్లుమంటున్న రాజధాని ప్రాంత యువతీయువకులు గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు హామీలకు రైతులు, రైతు కూలీలే కాదు నిరుద్యోగ యువకులు కూడా బోల్తా పడ్డారు. భూ సమీకరణ సమయంలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతు కుటుంబాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నైజం తెలిసిన కొందరు రైతులు భూములు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. అయితే ఆ కుటుంబాల్లోని నిరుద్యోగ యువతీ యువకులు సీఎం మాటల గారడీకి పడిపోయారు. భూములు ఇప్పించేందుకు తల్లిదండ్రులు అంగీకరించే విధంగా చేశారు. కొందరు యువకులైతే తల్లిదండ్రులను బెదిరించారు కూడా. భూములు ఇస్తే, దానికి ప్రతిఫలంగా నివేశన స్థలం, ఐదు సంవత్సరాల పాటు కౌలు చెక్కులు, తమకు మంచి ఉద్యోగాలు వస్తాయని, ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఎందుకు భూములు ఇవ్వరని తల్లిదండ్రులను కొందరు యువకులు నిలదీశారు. వీరి ఒత్తిడికి తలొగ్గి భూములు ఇస్తే, తీరా భూములకు తగిన విధంగా సొంత గ్రామంలో స్థలం ఇవ్వడం లేదు. నిరుద్యోగులకు శిక్షణ కల్పించి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీ నెరవేరకపోవడంతో యువతీ యువకులు ఆందోళన చెందుతున్నారు. సుక్షేత్రమైన మాగాణి ఉండి ఉంటే వ్యవసాయం అయినా చేసుకునే వారమని, లేకుంటే అమ్ముకుని వ్యాపారం అయినా చేసుకునే వారమని, బాబును నమ్మి నట్టేట మునిగి పోయాయని, తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఉద్యోగాలు వదిలి .... భూ సమీకరణకు ముందు రాజధాని గ్రామాల్లోని యువతీయువకులు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు. సుమారు 110 మంది వరకు బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులకు సీఆర్డీఏ పరిధిలో ఉద్యోగాలు ఇస్తామని, ముందుగా వారికి మంచి శిక్షణ ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో ఇతర ప్రాంతాల్లో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు జీతాలు తీసుకుంటున్న వారు ఆ ఉద్యోగాలకు రాజీనామా చేసి స్వగ్రామాలకు చేరుకున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఐదునెలల క్రితం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చింది. వర్సిటీ హాస్టల్లో ఉంటున్న ఈ నిరుద్యోగులను విద్యార్థిని రిషితేశ్వరీ కేసు నేపథ్యంలో అక్కడి నుంచి పంపి వేశారు. ఇంటికి చేరుకుని రెండు నెలలు గడిచినా అధికారుల నుంచి పిలుపు రావడం లేదు. చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదిలి, స్వగ్రామానికి వచ్చిన వీరికి ఇక్కడా ప్రభుత్వం ఉపాధి కల్పించకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర మానసిక వ్యధకు గురవుతున్నారు. ఉపాధి అవకాశాల కోసం సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సీఆర్డీఏ ఉన్నతాధికారులను కలిసి తమ గోడు వినిపించుకుంటున్నారు. అయినా సమస్య కొలిక్కి రావడంలేదు. మూడు రోజుల క్రితం సీఆర్డీఏ స్కిల్ డెవలప్మెంట్ డెరైక్టర్ జయదీప్ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. అయితే శిక్షణ పొందిన నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలంటే కనీసం రెండేళ్లు పడుతుందని అధికారుల కథనం. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు స్థాపించకుండా ఉపాధి కల్పించే అవకాశాలు లేవని చెబుతున్నారు. అలాగే డిగ్రీ, పీజీ చేసిన నిరుద్యోగులు నాలుగు వేల మంది వరకు ఉంటే వారి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. దీంతో నిరుద్యోగులు ఉపాధి కోసం మళ్లీ ఇతర నగరాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఉద్యోగం రాలేదు.. సీఎం చంద్రబాబు మా ఊరిలో ఉద్యోగం ఇస్తామన్నారు. ఎంతో ఆశపడ్డాను. వారు ఇచ్చిన శిక్షణ తీసుకున్నాను. మొదట సీఆర్డీఏలోనే ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఉద్యోగం మాత్రం రాలేదు. - బండి రోశయ్య, అబ్బురాజుపాలెం ఆశ పడ్డాం ... రాజధానిలోనే ఉద్యోగం అంటే ఎంతో ఆశపడ్డాం. సొంత ఊరిలోనే ఉద్యోగం కల్పిస్తామని సంబరపడ్డాం. వారు చెప్పిన విధంగా శిక్షణ తీసుకున్నాం. రెండునెలలుగా ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నాం. - మేకల దివ్య, తుళ్ళూరు -
నిత్య సమరం
హామీల అమలు కోరుతూ అంగన్వాడీల సమరశంఖం పోస్టుల భర్తీ కోసండీఎస్సీ అభ్యర్థుల పోరుబాట కనీస వేతనం కోసంవీఆర్ఏల నిరవధిక దీక్షలు ఉద్యోగులుగా గుర్తించాలని గళమెత్తిన గోపాలమిత్రలు ఉద్యమాలకు వేదికగా మారిన విజయవాడ నగరం కాలే కడుపులు కాపాడమంటున్నాయి.. ఉద్యోగ భద్రత కోసం ఆక్రోశిస్తున్నాయి.. ఉపాధి కోసం ఎదురుచూస్తున్నాయి.. హామీలు అమలుచేసి ఆదుకోమంటున్నాయి.. తమ సమస్యలు పరిష్కరిస్తామని, ఉజ్వల భవిత కల్పిస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోరుతూ ప్రభుత్వంపై పోరాటాలకు గళమెత్తుతున్నాయి. అంగన్వాడీలు, వీఆర్ఏలు, డీఎస్సీ 2014 అభ్యర్థులు, ఔట్సోర్సింగ్ కార్మికులు, గోపాలమిత్రలు, ఆశా వర్కర్లు.. ఇలా ఒక్కొక్కరు రోడ్డెక్కుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. నూతన రాజధాని విజయవాడ నగరం నిత్యం బడుగుజీవుల బతుకుపోరుతో హోరెత్తుతోంది. సమరశీల ఉద్యమాలకు వేదికగా మారుతోంది. దీనిపై ప్రత్యేక కథనం. లెనిన్ సెంటర్... ప్రస్తుతం హాట్టాపిక్. చర్చంతా ఇక్కడే. నూతన రాజధాని విజయవాడ నగరం మధ్యలో ఓ ప్రధాన కూడలిగా ఉంది. ఈ ప్రాంతం ప్రస్తుతం సమరశీల ఉద్యమాలకు వేదికైంది. ప్రజల సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఇక్కడి నుంచే తమ వాణిని రాష్ట్ర, దేశ ప్రజలకు వినిపిస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలతో నిరసన తెలుపుతున్నారు. ప్రజాసంఘాలు, నిరుద్యోగ యువత, ఉద్యోగ భద్రత కరువైన వివిధ విభాగాల ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఇక్కడే నిత్యం సమరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. విజయవాడ : నగరంలో నిరుద్యోగులు, భద్రత కరువైన ఉద్యోగులు నిత్యం సమరం చేస్తున్నారు. ప్రభుత్వం చాలీచాలని వేతనం ఇవ్వడం, హా మీలు నిలబెట్టుకోవడంలో విఫలం కావడంతో ఉద్యోగులు వీధుల్లోకి వచ్చారు. వీరందరి ఆందోళనకు లెనిన్ సెంటర్ వేదికైంది. పోలీసులకు చేతినిండా పని పెరిగింది. అంగన్వాడీల ఆందోళన ఒక కుటుంబం బతకాలంటే కనీసం రూ.10 వేలు కావాలి. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న అంగన్వాడీ కార్యర్తలు, ఆయాల పరిస్థితి దీనంగా ఉంది. పేరుకు ప్రభుత్వ ఉద్యోగులు. చేసేది వెట్టిచాకిరీ. కొత్తగా అధికారంలోకి వచ్చి న ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్యకర్తకు రూ.7,100, ఆయా కు రూ.4,800ల వేతనాన్ని సెప్టెంబరు ఒకటి నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కానీ అమలు జరగలేదు. వామపక్ష పార్టీల నేతల అండతో వీరు ఈనెల 10 నుంచి రిలే దీక్షలను లెనిన్ సెంటర్లో చేశారు. 18న సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించగా పోలీ సుల అణచివేత వైఖరి కారణంగా పలువురు గాయపడ్డారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించారు. పోలీసుల రాక్షసత్వాన్ని తప్పుపట్టారు. దీంతో వచ్చే సంవత్సరం హామీని నెరవేరుస్తామని ప్రభుత్వం ప్రకటించినా అంగన్వాడీల్లో వేడి కొనసాగుతూనే ఉంది. డీఎస్సీ అభ్యర్థుల.. ఉపాధ్యాయ నియామకాలకు 2014 సంవత్సరంలో డీఎస్సీ పరీక్ష నిర్వహించారు. మెరిట్ జాబితా ప్రకటించలేదు. రాష్ట్రంలో పోస్టులు ఖాళీగా ఉన్నా యి. రెండేళ్లయినా ఉద్యోగాల మాట ఎత్తకపోవడంతో వీరు ఆందోళన బాట చేపట్టారు. ఈనెల 21న సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి విఫలయత్నం చేశారు. 1998లో నిర్వహించిన డీఎస్సీకి ఇంతవరకు దిక్కులేదు. తప్పకుండా వీరికి ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ గాలిమాటగా మారింది. దీంతో వీరు కూడా ఆందోళన చేపట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగులను తీసుకున్నది. కొన్ని శాఖలు పది వేలు నెలకు ఇస్తుండగా కొన్ని శాఖలు ఆరు వేలు, ఐదు వేలే ఇస్తున్నాయి. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో ఇవ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. వీరి ఆందోళనకు కూడా లెనిన్ సెంటర్ వేదికైంది. మంగళవారం నుంచి రిలే దీక్షలు చేపట్టారు. ఆశాల దీక్షలు.. నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలోని ఆశా వర్కర్లు కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. కార్పొరేషన్ వారు రూ.4,500 జీతం ఇస్తుంటే వైద్యారోగ్య శాఖ వారు రూ.10 వేలు ఇస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని తీసేసి పది వేలు ఇవ్వాలని ఆశా వర్కర్లు కోరుతూ ఆందోళన చేస్తున్నారు. వీఆర్ఏల ఆందోళన రెవెన్యూ శాఖలో కీలక వ్యవస్థగా ఉన్న గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల ఆందోళన 51 రోజులుగా సాగుతోంది. వీరు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. డీఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) ద్వారా ఎంపికైన వారు. వీరికి కూడా కనీస వేతనం లేదు. తమకు కనీస వేతనంతోపాటు ప్రమోషన్లలో 70 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కోటా 30 శాతంగా ఉంది. వీరికి ప్రస్తుతం ఇచ్చే జీతం ఆరువేలు. ఈ జీతాన్ని వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లెనిన్ సెంటర్లో ఆందోళన చేస్తున్నారు. ఐదుగురు వీఆర్ఏలు రిలే దీక్షలు చేశారు. వీరిని ఈనెల 19న అరెస్ట్ చేశారు. దీంతో ఆగ్రహించిన వీఆర్ఏలు గుణదలోని ఒక సెల్టవర్ ఎక్కి అక్కడి నుంచి దూకి చనిపోతామని హెచ్చరించారు. గోపాల మిత్రలు పశువైద్య శాఖ వారు కాంట్రాక్ట్ పద్ధతిపై గోపాల మిత్రలను గ్రామాల్లో ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పశువులకు వ్యాధులు వస్తే ఇంటి వద్దకే వెళ్లి పశువైద్యం చేస్తారు. వీరికి కూడా కనీస వేతనం అమలు జరగటం లేదు. నెలకు రూ.3,500లు జీతం ప్రభుత్వం ఇస్తున్నది. వీరు 15 సంవత్సరాలుగా చేస్తున్నారు. వీరిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ శనివారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement