-
గాంధీ విగ్రహానికి విద్యార్థుల వ్యతిరేకత
సాక్షి, న్యూఢిల్లీ: భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని లండన్లోని మాన్చెస్టర్ క్లథడ్రల్ చర్చి ఆవరణలో ప్రతిష్టించాలనే ప్రతిపాదనను మాన్చెస్టర్ యూనివర్శిటీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ సిటీ కౌన్సిల్కు విద్యార్థులు ఓ లేఖ కూడా రాశారు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు నల్ల జాతీయులకు వ్యతిరేకంగా పనిచేశారని, ఆ జాతీయుల పట్ల ఆయనకు విద్వేషం ఉందని విద్యార్థి నాయకులు కొందరు ఆరోపిస్తున్నారు. ‘శాంతి, ప్రేమ, సామరస్యం’ సందేశంతో గుజరాత్కు చెందిన ‘శ్రీమద్ రాజ్చంద్ర మిషన్’ తొమ్మిది అడుగుల గాంధీజీ విగ్రహాన్ని మాన్చెస్టర్ సిటీ కౌన్సిల్కు బహూకరించింది. 2017, మాన్చెస్టర్ ఎరినాలో పేలుడు సంభవించి 22 మంది మరణించిన నేపథ్యంలో అహింసా వాది అయిన గాంధీజీ విగ్రహాన్ని ఆ మిషన్ అందజేసింది. దీన్ని నవంబర్ 25వ తేదీన ప్రతిష్టించేందుకు నగర మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. -
మార్కుల కోసం డ్రగ్స్ వాడుతున్న విద్యార్థులు!
ప్రస్తుత పోటీ ప్రపంచంలో తోటి విద్యార్థులతో పోటీపడి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేందుకు బ్రిటన్లోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు జ్ఞాపకశక్తిని, సృజనాత్మకతను పెంచే ప్రమాదకరమైన మందులు వాడుతున్నారు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి లాంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలే కాకుండా మాంచెస్టర్, బ్రిస్టల్, వార్విక్, న్యూకాజిల్, బాత్, లీడ్స్, యూసిల్ విద్యార్థులు కూడా ప్రమాదకరమైన 'నూపెప్ట్' అనే మందును ఆశ్రయిస్తున్నారు. వారు కొకైన్లా పీల్చే పద్ధతిలో లేదా క్యాప్సూల్లా మింగుతూ ఈ మందు తీసుకుంటున్నారు. 'నేను 18 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు బ్రెయిన్ బూస్టర్ డ్రగ్ 'రిటాలిన్'ను తీసుకున్నాను. ఇప్పుడు నూపెప్ట్ తీసుకుంటున్నాను. ఇది తీసుకున్నాక పరీక్షలు బాగా రాశాను. మంచి ఫలితాలు వచ్చాయి. దీనికి కారణం నా సొంత శక్తా, లేక నాలో ప్రవేశించిన రసాయనం కారణమా? అన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేను గానీ, ఈ డ్రగ్ పరీక్షలు రాయడానికి ఉపయోగపడిందని మాత్రం నమ్ముతున్నాను' అని వార్విక్ యూనివర్శిటీలో సామాజిక శాస్త్రం చదువుతున్న మైక్ అనే 21 ఏళ్ల విద్యార్థి తెలిపారు. మైక్ లాగా వందలాది మంది వివిధ యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులు ఈ డ్రగ్ను ఉపయోగిస్తున్నారు. సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా 'నూపెప్ట్' ఔషధాన్ని అమ్మకూడదు. అలా చేస్తే ఏడేళ్లవరకు జైలుశిక్ష విధించే చట్టం దేశంలో అమల్లో ఉన్నా... ఈ డ్రగ్ ఆన్లైన్ ద్వారా విచ్చలవిడిగా విద్యార్థులకు లభిస్తోంది. అమెరికా, రష్యా మార్కెట్ల ద్వారా ఆన్లైన్లో పది గ్రాముల మందు రెండు వేల రూపాయలకు లభిస్తోంది. ఇంకా పరిశోధన దశలోనే ఉన్న రిటాలిన్, మొడాఫినిల్ కన్నా చవగ్గా దొరకుతుండడంతో ఎక్కువమంది విద్యార్థులు ఈ డ్రగ్నే వాడుతున్నారు. పది నుంచి 20 శాతం మంది యూనివర్శిటీ విద్యార్థులు ఈ డ్రగ్ వాడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. గతంలో వివిధ యూనివర్శిటీలు పరీక్షలకు ముందు విద్యార్థులకు డ్రగ్ పరీక్షలను నిర్వహించేవి. విద్యార్థులను అనవసరంగా శంకించడం మంచిని కాదన్న ఉద్దేశంతో ఇలాంటి పరీక్షలకు పలు యూనివర్శిటీలు స్వస్తిపలికాయి. ఆన్లైన్ మార్కెట్పై లండన్లో అంతగా నియంత్రణ లేకపోవడంతో ప్రమాదకరమైన ఈ డ్రగ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. నూపెప్ట్ వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉండడమే కాకుండా అలవాటయ్యే లక్షణం, ఎప్పటికప్పుడు డోసేజ్ పెంచాల్సిన ప్రేరణ ఈ డ్రగ్లో ఉండటం మరింత ప్రమాదరకరం. ఈ డ్రగ్ వల్ల మానసిక ఒత్తిడి లాంటి అనేక మానసిక రుగ్మతలు తలెత్తడమే కాకుండా, కార్డియో వాస్కులర్ లాంటి హృద్రోగాలు వస్తాయి. అల్జీమర్స్, కొన్నిరకాల మానసిక రోగాలను నయం చేయడం కోసం 1990లో రష్యాలో ఈ ఔషధాన్ని కనిపెట్టారు. విస్తారమైన సిలబస్ కారణంగా తమపై ఒత్తిడి పెరగడం వల్లే తాము ఇలాంటి డ్రగ్స్ వాడాల్సి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. -
భారత్కు 25 వేలమంది బ్రిటన్ విద్యార్థులు
పాట్నా: భారత్, బ్రిటన్ల మధ్య విద్యావ్యవస్థలో భాగస్వామ్య సంబంధాలు మెరుగుపరచడంలో భాగంగా రానున్న ఇదేళ్లలో దాదాపు 25 వేలమంది బ్రిటన్ విద్యార్థులు భారత యూనివర్సిటీల్లో చదవనున్నట్లు సీనియర్ బ్రిటిష్ దౌత్యాధికారి ఆండ్రూ సోపెర్ బుధవారం విలేకర్లకు తెలిపారు. భారత్లో అనేక మంచి విద్యాసంస్థలున్నాయన్నారు. ఇక్కడ చదవడం వల్ల బ్రిటన్ విద్యార్థులు వారు ఎంచుకున్న రంగంలో రాణించే అవకాశముందన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement