breaking news
UK NRI
-
లండన్లో జగన్ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ యూకే, యూరోప్ విభాగం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి లండన్లోని హాన్స్లో నగరం 764 గ్రేట్ వెస్ట్ రోడ్లోని భుకారా బాంకెట్ హాలులో ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ విభాగం తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలందరు తప్పకుండా పాల్గొనాలని ఈ సందర్భంగా ఆ కమిటీ కోరింది. ఈ నెల 21న జగన్ పుట్టినరోజు కాగా ఆ రోజును పురస్కరించుకుని ఈ నెల 12 సాయంత్రం 4.30 గంటలకు హాన్స్లో నగరంలో వేడుక జరుపుతున్నట్టు ఆ విభాగం సభ్యులు వాసు, ఓబుల్రెడ్డి, సురేష్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, లోక్సభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్ కె రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు చలమలశెట్టి సునీల్ తదితరులు పాల్గొంటున్నారు. -
హత్య చేయడానికి ఇంటర్నెట్ లో వెతికాడు
లండన్: కుటుంబ సభ్యులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న ఎన్నారై జితేంద్ర లాడ్(49) గురించి దిగ్భ్రాంతికర వాస్తవం వెలుగు చూసింది. తనవారిని ఎలా చంపాలి, తర్వాత తాను ఎలా ఆత్మహత్య చేసుకోవాలనే దానిపై అతడు ఇంటర్నెట్ లో శోధించాడని అధికారులు వెల్లడించారు. కుంగుబాటు(డిప్రెషన్), గొంతు కోయడం గురించి అతడు అంతర్జాలంలో వెతికాడని తెలిపారు. జితేంద్ర తన భార్య దక్షాబెన్(44), కుమార్తెలు త్రిష(19), నిష(16) లను కత్తితో పొడిచి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంగ్లండ్ లోని బ్రాడ్ ఫోర్డ్ లో గతేడాది అక్టోబర్ 25న ఈ దారుణం జరిగింది. దీనికి కొద్దిరోజుల ముందు ఇంటర్నెట్ లో హత్య ఎలా చేయాలనే దాని గురించి వెతికినట్టు దర్యాప్తులో తేలింది. ఐటీ మేనేజర్ గా పనిచేసిన జితేంద్ర కుంగుబాటుకు గురై ఈ దారుణానికి పాల్పడ్డాడని వెల్లడైంది.