breaking news
ujwala
-
చిక్కుల్లో యశ్ దయాళ్!
ఘజియాబాద్: పేస్ బౌలర్ యశ్ దయాళ్పై ఒక అమ్మాయి తీవ్ర ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి మోసం చేశాడని, లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆమె పేర్కొంది. తాను, యశ్ గత ఐదేళ్లుగా కలిసి ఉన్నామని, తనతో అన్ని రకాలుగా అతను సంబంధం పెట్టుకున్నాడని ఉజ్వల అనే ఆ అమ్మాయి వెల్లడించింది. అయితే ఇప్పుడు తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి తప్పించుకుంటున్నాడని వెల్లడించింది. మరో వైపు ఇతర అమ్మాయిలతో కూడా సంబంధాలు పెట్టుకొని తనను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా తన పేరుతో సహా ఈ విషయాలన్నింటినీ బహిరంగపర్చిన ఆ అమ్మాయి అధికారికంగా కూడా ఘజియాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసింది. గతంలో కూడా మహిళల హెల్ప్లైన్ ద్వారా తన సమస్య చెప్పేందుకు ప్రయత్నించగా ఎలాంటి స్పందన రాలేదన్న ఆమె...ఇప్పుడైనా జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని నేరుగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు విజ్ఞప్తి చేసింది. దీనిపై ఇంకా దయాళ్ స్పందించలేదు. ప్రయాగ్రాజ్కు చెందిన 27 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్ దయాళ్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్, బెంగళూర రాయల్స్ చాలెంజర్స్ జట్ల తరఫున ఆడి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. -
అక్కున చేర్చుకుందాం
మూడున్నర కోట్లకు పైగా వీథికుక్కలున్నాయి మనదేశంలో. పెంపుడు కుక్కలకు ఉన్నట్లు వాటి పొట్టను చూసి ఆకలి తీర్చే పెట్ పేరెంట్స్ ఎవరూ వీథి కుక్కలకు ఉండరు. వాటి ఆహారాన్ని అవి సొంతంగా సంపాదించుకుంటాయి. అది ప్రకృతి నియమం కూడా. అయితే... వాటికి ఎదురయ్యే ప్రధాన కష్టం ఆరోగ్యరక్షణ లేకపోవడమే. ‘‘ప్రతి పాణికీ జీవించే హక్కు ఉంది. వీథికుక్కలు అయినంత మాత్రాన వాటి జీవించే హక్కును కాలరాసే అధికారం మనిషికి ఉండదు. చేతనైతే వాటిని పరిరక్షించడానికి ముందుకు రండి’’ అంటున్నారు ఎన్ఆర్ఐ ఉజ్వల చింతల. ఇందుకోసం ఆమె ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ ను స్థాపించి అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇండియాలోని వీథికుక్కల కోసం పని చేస్తున్నారు. మాది మహేశ్వరం ఉజ్వల చింతల 2019లో యూఎస్, ఫ్లోరిడాలో ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థను స్థాపించారు. అంతకు ముందు కొన్నేళ్లుగా ఆమె వీథి కుక్కల కోసం పని చేస్తూనే ఉన్నారు. ‘‘మాది హైదరాబాద్ సమీపంలోని మహేశ్వరం. నాన్న నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయంలోనే చదివాను. బాండింగ్ నా బలం, బలహీనత కూడా. ఇంటర్కి విజయవాడలోని మేరీస్టెల్లా కాలేజ్లో చేరిస్తే అమ్మానాన్నలకు దూరంగా ఉండలేక, మూడు నెలల్లో వెనక్కి వచ్చేశాను. డిగ్రీ హన్మకొండ, ఎంబీఏ బెంగళూరులో చేసిన తర్వాత పెళ్లితో యూఎస్ వెళ్లాల్సి వచ్చింది. యూఎస్లో కంప్యూటర్స్ కోర్సులు చేసి ఉద్యోగంలో చేరాను. పేరెంట్స్ మీద బెంగ తో తరచూ ఇండియాకి వస్తూనే ఉంటాను. అలా రావడమే ఈ సేవాపథంలో నడిపించింది. పాలు తాగే పిల్లల్ని విసిరేశారు 2013లో ఇండియా వచ్చినప్పుడు ఒక ఇంటి వాళ్లు చిన్న కుక్కపిల్లల్ని పాలుతాగే పిల్లలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా బయటపడేయడం నా కంట పడింది. అప్పుడు తల్లి కుక్క పడిన ఆరాటం, ఆవేదన వర్ణించడానికి మాటలు చాలవు. మరోసారి పెళ్లిలో భోజనాల దగ్గర... పదార్థాలన్నీ పారవేస్తున్నారు. ఆ ప్లేట్ల కుప్ప మీదకు కుక్కలు ఎగబడుతున్నాయి. ఓ వ్యక్తి కర్ర తీసుకుని వాటిని విచక్షణరహితంగా కొడుతున్నాడు. అలాంటిదే మరోటి... ఓ కుక్కకు వెనుక కాళ్లు రెండూ విరిగిపోయాయి. దేహాన్ని నేల మీద ఈడ్చుకుంటూ పోతోంది. దానికి ట్రీట్మెంట్ చేయించడానికి ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. పర్మిషన్ తీసుకుని నాతోపాటు మూడు కుక్కలను యూఎస్ తీసుకెళ్లాను. అక్కడ చికిత్స చేయించి కోలుకున్న తర్వాత పెంచుకునే వాళ్లకు దత్తత ఇచ్చాను. అప్పటి నుంచి స్ట్రే యానిమల్స్ కోసం పని చేస్తున్నాను. అమెరికాలో లడ్డూ హౌస్ హైదరాబాద్, అమీన్పూర్లో షెడ్ వేసి, ముగ్గురు ఉద్యోగులతో ఓ సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాను. ఇప్పడు తొంభై ఉన్నాయి. నెలనెలా వాటి పోషణ, ట్రీట్మెంట్ కోసం డబ్బు పంపిస్తున్నాను. నా జీతం నుంచి కొంత భాగం, నా లడ్డూ హౌస్ రాబడితో వాటిని సంరక్షిస్తున్నాను. లడ్డూ హౌస్ బ్రాండ్ మీద నేను ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో తినుబండారాలు తయారు చేసి, ఆదివారం ‘స్ట్రే యానిమల్స్ కోసం’ అని బోర్డు పెట్టి సేల్ చేస్తున్నాను. యూఎస్లో చారిటీ కోసం సేల్స్ చేసినప్పుడు... ఒక వస్తువు ధరను ఆ పదార్థానికి ఆపాదించి చూడరు, చారిటీ కోసం ధారాళంగా ఖర్చు చేస్తారు. మేము ప్రధానంగా గాయపడిన కుక్కలకు వైద్యం చేయించడం, కోలుకున్న తర్వాత పెంపకానికి ఇచ్చేయడం లేదా స్వేచ్ఛగా వదిలేయడం మీద దృష్టి పెట్టాం. ముసలితనం వల్ల ఎటూ పోలేని కుక్కలకైతే జీవితకాలపు సంరక్షణ బాధ్యత మాదే. ఇక కుక్కలకు స్టెరిలైజేషన్ వంటి కొన్ని సహకారాలను బ్లూ క్రాస్ నుంచి తీసుకుంటాం’’ అని చెప్పారు ఉజ్వల. భారతీయ సమాజాన్ని ఆమె కోరుకునేది ఒక్కటే... మనం మనుషులం, మానవీయంగా మసలుకుందాం. కుక్క అనగానే తక్కువగా చూడవద్దు. వాటి జీవితం మన అధికారం ప్రదర్శించవద్దు. మనవి ‘ప్రాణాలను హరించే చేతులు కావద్దు, రక్షించే చేతులు కావాలి’ అన్నారు. – వాకా మంజులారెడ్డి -
కీచక మేనమామ
ఆదిలాబాద్ క్రైం, న్యూస్లైన్ : మేనకోడలిని తండ్రిలా చూసుకోవాల్సిన మామ కామంతో కళ్లు మూసుకుపోరుు కాటెయ్యూలని చూశాడు. 13 ఏళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా రుు. ఉట్నూర్ మండలం గంగాపూర్కు చెందిన దుర్గం జ్ఞానేశ్వర్ చెన్నూరు మండలం రొయ్యలపల్లికి చెందిన తన మేనకోడలి(13)పై కన్నేశాడు. ఆ బాలిక జిల్లా కేంద్రంలోని వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. శనివారం జ్ఞానేశ్వర్ జిల్లా కేంద్రానికి చేరుకుని పాఠశాలకు వెళ్లే సమయంలో మేనకోడలిని అడ్డుకున్నాడు. తనతో పార్కుకు రావాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. పాఠశాల వద్దే పడిగాపులు కాస్తూ బయటకు రావాలని హెచ్చరించడంతో భయందోళన గురైన బాలిక ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు విషయం చెప్పింది. దీంతోవారు మహిళా సంరక్షణ అధికారి ఉజ్వలకు సమాచా రం అందించారు. వెంటనే ఆమె పాఠశాల ఎదుట పడిగాపులు కాస్తున్న జ్ఞానేశ్వర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న సంచిని సోదా చేయగా కిరోసిన డబ్బా, అగ్గిపెట్టే లభ్యమయ్యూరుు. అనుమానం కలగడంతో పాఠశాల లోపలికి తీసుకెళ్లి ప్రశ్నించగా తాను చనిపోవడానికి కిరోసిన్ తెచ్చుకున్నానని బదులిచ్చాడు. ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించగా తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని చెప్పుకొచ్చా డు. బాలికను పిలిపించగా తన మేనమామను తల్లిదండ్రులు సైతం గతంలో పలుమార్లు మం దలించారని, అరుునా అతడి ప్రవర్తన మారలేదని పేర్కొంది. దీపావళి సమయంలో హాస్టల్కు వచ్చి తనతో మేనకోడలిని పంపాలని కోరి నా అనుమానం వచ్చి పంపలేదని హాస్టల్ వా ర్డెన్ పేర్కొన్నారు. పోలీసులు జ్ఞానేశ్వర్ పర్సు ను పరిశీలించగా అందులో మేనకోడలు చిన్ననాటి ఫొటోలు లభించారుు. అతడి సెల్ఫోన్ స్క్రీన్పై ఆమె ఫొటో ఉంది. జ్ఞానేశ్వర్కు మేలో వివాహం జరగగా రెండు నెలల క్రితం భార్య అతడిని విడిచి వెళ్లిందని, నిర్మల్లో ఒంటరిగా ఉంటూ మేస్త్రీగా పనిచేస్తున్నాడని మహిళా సంరక్షణ అధికారి తెలిపారు. అతడు పారిపోయేందుకు యత్నించగా వన్టౌన్ పోలీసుల సాయంతో ఠాణాకు తరలించారు.