breaking news
Ujjain Mahakali
-
బోనాలకు ఎంతో చరిత్ర ఉంది: గవర్నర్
రాంగోపాల్పేట్: ఆషాఢం, శ్రావణ మాసాల్లో తెలంగాణలో నిర్వహించే బోనాల పండుగకు ఎంతో చరిత్ర ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని సోమవారం సాయంత్రం దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో గుత్తా మనోహర్రెడ్డి, అర్చకులు గవర్నర్కు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కోవిడ్ను అరికట్టిన తర్వాత జరుపుకొంటున్న ఈ ఏడాది బోనాల పండుగకు ప్రత్యేకత ఉందన్నారు. ఉజ్జయినీ మహంకాళి దయతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆమె దీవెనలు తెలంగాణ ప్రజలకు ఉండాలని కోరుకున్నానని చెప్పారు. అనంతరం.. మోండా బూరుగుశెట్టిబజార్లోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఆమె పూజలు చేశారు. ఆర్పీరోడ్లోని భాగ్యనగర్ గణేష్ ఉత్స వ సమితి ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడిన గవర్నర్ తెలుగు ప్రజలన్నా, తెలుగు భాషన్నా తనకెంతో మక్కువన్నారు. ఈ నెల 15నుంచి ఉచితంగా వేస్తున్న బూస్టర్ డోస్ను అందరూ వేసుకోవాలని గవర్నర్ సూచించారు. -
భక్తులను ముందుగానే హెచ్చరిస్తున్నా: స్వర్ణలత
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజులు ప్రమాదకరంగా ఉంటాయన్నారు. నా భక్తులను ముందుగానే హెచ్చరిస్తున్నానని తెలిపారు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదని చెప్పారు. కాపాడుకుందాం అనుకున్నా కానీ ప్రజలే చేతులారా చేసుకుంటున్నారు. తనకు సంతోషం లేదని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. -
భవిష్యవాణి
-
సీఎం పాలనపై అమ్మవారికి లేఖ
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనపై మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి లేఖ రాశారు. చౌహాన్ దుష్టపాలనను అంతమొందించాలని ఆయన ఈ లేఖలో కోరారు. ‘2013 ఎన్నికల సమయంలో చౌహాన్ మహంకాళి ఆలయాన్ని సందర్శించుకున్న సమయంలో అనేక వాగ్ధానాలు చేశారు. మధ్యప్రదేశ్ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కానీ సీఎంగా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల బలవన్మరణాలు అధికంగా ఉన్నాయి. వ్యవసాయం చేస్తే నష్టపోవాల్సిందేనని రైతులు భావిస్తున్నారు. అవినీతి, కుంభకోణాలతో రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారు. వ్యాపం స్కామ్లో అమాయక విద్యార్థులను, వారి తల్లిదండ్రులను జైలు పాలు చేశారు’ అని కమల్నాథ్ తన లేఖలో పేర్కొన్నారు. రైతులు న్యాయం కోరితే వారిపై కాల్పులు జరుపుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం లేదని విమర్శించారు. చౌహాన్ చేసిన మోసాలకు, పాపాలకు అతన్ని శిక్షించాలని దేవున్ని లేఖ ద్వారా కోరారు. శనివారం రోజున చౌహాన్ మహంకాళి ఆలయాన్ని సందర్శించుకోనున్న నేపథ్యంలో కమల్నాథ్ ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌహాన్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మహంకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకోని ఈ యాత్ర మొదలుపెట్టనున్నారు. -
మహంకాళి దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతం!
సమాచార హక్కు చట్టంతో బహిర్గతం రాంగోపాల్పేట్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయానికి చెందిన ఆస్తులు అన్యాక్రాంతమైనట్టు తెలుస్తోంది. కోట్ల రూపాయల విలువ చేసే అమ్మవారి ఆస్తులను కొందరు అధికారులు కైంకర్యం చేసినట్టు స్పష్టమవుతోంది. తమ తప్పును దీన్ని కప్పిపుచ్చుకునేందుకు రికార్డులనే మాయం చేశారని తెలుస్తోంది. దీన్ని నిరూపించే బలమైన సాక్ష్యాధారాలను సమాచార హక్కు చట్టం కార్యకర్త నాగెల్లి శ్రీనివాస్ సంపాదించారు. ఆయన మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయానికి స్వాతంత్య్రానికి పూర్వమే భక్తులు ఎకరం 37 గుంటల స్థలాన్ని మాన్యంగా ఇచ్చారు. 1954 సంవత్సరానికి ముందు మసీదు, చర్చీలు, దేవాలయాలకు చెందిన ఆస్తులను అవుకాఫ్లో రిజిష్టర్ చేయించేవారు. 1954 సంవత్సరంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు కాగా 1966 సంవత్సరంలో దేవాదాయ శాఖ ఏర్పడింది. దీంతో 1946 (1356 ఫస్లీ)సంవత్సరంలో అప్పటి ఆలయ ఫౌండర్ ట్రస్టీలు దేవాలయానికి చెందిన ఎకరం 37 గుంటల మాన్యం భూమిని కితాబ్ ఉల్ అవుకాఫ్లో రిజిష్టర్ చేయించారు. దీనికి సంబంధించిన ఫైల్ నంబర్ 17/2గా నమోదు చేశారు. ఇదే భూమిలో 7 మడిగెలు కూడా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఈ రికార్డు ప్రకారం ఈ భూమికి సంబంధించిన సర్వే నంబర్ 92 భోలక్పూర్ విలేజ్గా ఉంది. ఆ రికార్డు ప్రకారం దేవాలయానికి ఎకరం 37 గుంటల స్థలం ఉండగా, ఇప్పుడు మిగిలింది మాత్రం కేవలం 1,308 గజాల స్థలం మాత్రమే. అంటే సుమారు 7,972 వేల గజాల స్థలం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ ప్రాంతంలో మార్కెట్ రేటు ప్రకారం చూస్తే సుమారు రూ.100 కోట్ల స్థలం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయిందనేది స్పష్టం అవుతుంది. లోకాయుక్తకు తప్పుడు సమాచారం.. ఆలయ భూమి కబ్జా వ్యవహారాన్ని నాగెల్లి శ్రీనివాస్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త బయటకు తేవడంతో లోకాయుక్త దీన్ని సూమోటోగా స్వీకరించింది. దేవాలయానికి చెందిన కోట్ల రూపాయల ఆస్తులు అన్యాక్రాంతం కాగా అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికారులు లోకాయుక్తకు తప్పుడు సమాచారం అందించారు. భోలక్పూర్ విలేజ్లో సర్వే నెంబర్ 92 లేదని, కితాబ్ ఉల్ అవుకాఫ్లో క్లరికల్ తప్పిదం వల్ల 17/2 ఫైల్ నంబర్ నమోదైందని చెప్పారు. సర్వే ల్యాండ్ రికార్డ్స్లో టీఎస్ నంబర్ 108, 109,110లో దేవాలయం, దాని సంబంధించిన స్థలం ఉందని భోలక్పూర్ విలేజ్ 92 సర్వే నంబర్ లేదని దేవాదాయ శాఖ అధికారులు లోకాయుక్తకు తెలిపారు. కానీ 1912 సంవత్సరంలో అప్పటి నిజాం నవాబు సర్వే నంబర్ 92 భోలక్పూర్ విలేజ్కు 15 ఎకరాల భూమిని బ్రిటిష్ వారికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భోలక్పూర్ విలేజ్ 92 కింద పలు డాక్యుమెంట్లు, దీన్ని నిర్ధారించే మ్యాప్లున్నా అధికారులు దాన్ని పక్కన బెట్టి 1963 సంవత్సరంలో చేసిన టౌన్ సర్వే ల్యాండ్ రికార్డ్స్నే ప్రామాణికంగా భావిస్తుండటం అనుమానాలకు దారితీస్తుంది. ఆ రికార్డు ఏమైంది? 1946 సంవత్సరంలో కితాబ్ ఉల్ అవుకాఫ్లో దేవాలయానికి చెందిన భూమి రిజిష్టర్ చేసిన 17/2 ఫైల్ మొత్తం కొంత మంది అధికారులే మాయం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్లరికల్ తప్పిదం వల్లే అలా జరిగిందంటూ తప్పించుకుంటున్నారు. భోలక్పూర్ విలేజ్ 92 సర్వే నంబర్తో అనేక లావాదేవీలు జరిగినటుట సాక్ష్యాధారాలున్నా కొంత మంది పెద్దలు చేసిన నిర్వాహకం బయటకు రాకుండా ఉండేందుకు ఈ ఫైల్తోపాటు సర్వే నంబర్ 92ను కూడా రికార్డుల్లో కనిపించకుండా చేసినట్టు తెలుస్తోంది. ఇదే రికార్డులో దేవాలయానికి చెందిన మరికొన్ని భూములు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మహంకాళి దేవాలయానికి చెందిన భూములపై దృష్టిసారిస్తే కోట్లాది రూపాయల ఆస్తులు బయటకు వచ్చే అవకాశం ఉంది.