breaking news
two crores
-
కరోనా@ 2 కోట్లు
న్యూయార్క్/మాస్కో: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 విజృంభణ ఆగడం లేదు. మంగళవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటేసింది. అమెరికా, బ్రెజిల్, భారత్లలోనే మొత్తం కేసుల్లో సగానికిపైగా నమోదయ్యాయి. గత ఏడాది డిసెంబర్లో చైనాలోని వూహాన్లో తొలిసారిగా బట్టబయలైన కరోనా వైరస్ అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యాలను ప్రస్తుతం వణికిస్తోంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం మంగళవారం ఉదయానికి ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 11వేల 186 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ మృతుల సంఖ్య 7 లక్షల 34వేలుగా ఉంది. కాగా 40శాతం కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేవని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్ మొదట్లో 10 లక్షల కేసుల వరకు నమోదైతే, మే 22 నాటికి కేసుల సంఖ్య 50 లక్షల కేసులు దాటేసింది. జూన్ చివరి నాటికి కేసుల సంఖ్య రెట్టింపై కోటి దాటింది. జూలై 22కి 1.5 కోట్ల కేసులు నమోదు కాగా ఆ తర్వాత మూడు వారాల్లో మరో 50 లక్షల కేసులు నమోదై మొత్తం కేసులు 2 కోట్లు దాటేశాయి. మరోవైపు 10 రోజుల తర్వాత న్యూజిలాండ్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. జపాన్, ఇండోనేషియాలలో కూడా కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది. వ్యాక్సిన్తో పూర్తిగా వైరస్ పోదు: డబ్ల్యూహెచ్వో కేసుల సంఖ్య అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నప్పటికీ త్వరలోనే ఈ మహమ్మారి పీడ వదిలించుకోగలమని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రాస్ అధ్నామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్పై ఆశ పెట్టుకోకుండా వైరస్ని అణిచివేయడానికే ప్రయత్నించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ను విడుదల చేయగా మరో 165 కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. వాటిలో ఆరు మూడో దశ క్రినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ పూర్తిగా వైరస్ని నిర్మూలించలేమని టెడ్రాస్ అభిప్రాయపడ్డారు. పోలియో, మశూచి వంటి వ్యాధులకు వ్యాక్సిన్ వచ్చినా ఇంకా పూర్తిగా ఆ వ్యాధుల ముప్పు తొలగిపోలేదని గుర్తు చేశారు. రికవరీ@ 70% న్యూఢిల్లీ: భారత్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నప్పటికీ తగ్గుతున్న మృతుల రేటు,పెరుగుతున్న రికవరీ రేటు ఊరట కలిగిస్తోంది. మంగళవారం నాటికి భారత్లో కరోనా రికవరీ రేటు 69.8% ఉంటే, మరణాల రేటు 1.99%గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో మొదటిసారిగా మరణాల రేటు 2శాతం కంటే తక్కువకి వచ్చిందని తెలిపింది. మృతుల్లో 70శాతానికిపైగా లెక్కకు మించి వ్యాధులతో బాధపడుతున్న వారని పేర్కొంది. 24 గంటల్లో 53,601 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 22,68,675కి చేరుకుంది. ఇక ఒక్క రోజులో 871 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 45,257కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 6,39,929 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇవి 28.21 శాతం. -
రూ.2 కోట్ల విలువైన బంగారం పట్టివేత
కోజికోడ్: అక్రమమార్గంలో దేశంలోకి తీసుకువచ్చేందుకు యత్నించిన ఏడు కిలోల బంగారం పట్టుబడింది. కేరళలోని కరీపూర్ ఎయిర్పోర్టులో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బహ్రెయిన్లో ఉంటున్న ఇద్దరు కేరళీయులు ఒమన్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో మంగళవారం ఉదయం 4.30గంటలకు కరీపూర్ చేరుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న వారి కదలికలను గుర్తించిన అధికారులు సామగ్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెషిన్ స్పేర్ పార్టులో ఉన్న 3.7 కిలోల బంగారం, ఐరన్ బాక్స్లో దాచి ఉంచిన మరో 3.29 కిలోల బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారాన్ని తీసుకొస్తున్న మహమ్మద్ కోయా, అబ్దుల్ రహీంలను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.2 కోట్లు ఉంటుందని తెలిసింది. -
రెండు కోట్ల ఖర్చుతో క్లబ్ రీమోడలింగ్
-
ఆలయ ఆస్తులనే అమ్మేసిన టీడీపీ నేత
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల దోపిడికి అడ్డూఅదుపు లేకుండా పోతుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని నేతలు అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా రూరల్ మండలానికి చెందిన స్థానిక టీడీపీ నేత ఏకంగా ఆలయ ఆస్తులనే విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నరసింహస్వామి ఆలయ భూముల్లో ఉన్న టేకు చెట్లను సదరు టీడీపీ నేత అక్రమంగా విక్రయించాడు. దీనిపై ఆలయ ఈవో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. అధికార పార్టీ నేతల తీరుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.