-
కోవిడ్ టైమ్లో దేశం ఏం చూసింది?
ముంబై: కోవిడ్ మహమ్మారి కాలంలో భారత్లో టెలివిజన్ వీక్షణ తొమ్మిది శాతం పెరిగినట్టు టీవీ రేటింగ్ ఏజెన్సీ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్సీ) వెల్లడించింది. మొత్తం టీవీ వ్యూయర్షిప్లో న్యూస్ ఛానళ్ల వ్యూయర్షిప్ 27 శాతం పెరిగినట్టు ఈ అధ్యయనం గుర్తించింది. పంజాబీ, గుజరాతీ, మళయాళం, తమిళ్, మరాఠీ, హిందీ న్యూస్ఛానళ్లకు అత్యధికంగా 10.4 శాతం వ్యూయర్షిప్ నమోదైంది. గత ఏడాది తొలి అర్థ భాగంలోకంటే ద్వితీయార్థ భాగంలో ప్రకటనలు 34 శాతం పెరిగాయని కూడా ఈ అధ్యయనం గుర్తించింది. అదే సమయంలో ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ వీక్షణలో మాత్రం రెండు శాతం తగ్గుదల కనిపించింది. వారంలో టీవీ వీక్షించే సమయం ఆధారంగా ఈ శాతాన్ని లెక్కించారు. భారతీయులు ఏం చూశారు? కోవిడ్ కాలంలో భారత ప్రజలు దేన్ని వీక్షించారు ‘వాట్ ఇండియా వాచ్డ్’అనే కోణంలో ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో కోవిడ్కి ముందు, కోవిడ్ సమయంలో, లాక్డౌన్ సమయంలో, లాక్డౌన్ అనంతరం, అలాగే 2020 ఏడాది చివర్లో భారతీయుల టీవీ వీక్షణపై ఈ అధ్యయనం చేశారు. ‘ద ఇయర్ ఆఫ్టర్ టూ థౌజండ్ అండ్ నైన్టీన్’అనే పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో 2020 మార్చి 25న భారత్లో లాక్డౌన్ విధించాక ప్రజలు తమ ఇళ్లకే పరిమితమై టీవీలకు అతుక్కుపోయి, టీవీల ద్వారా బాహ్యప్రపంచాన్ని వీక్షించేందుకు ప్రయత్నించారని ఈ సర్వే వెల్లడించింది. లాక్డౌన్ సమయంలో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, న్యూస్ ఛానళ్లను ఎక్కువగా వీక్షించినట్టు సర్వే పేర్కొంది. గత ఏడాది జనవరి–మార్చి కాలంతో పోలిస్తే మార్చి– జూన్ కాలంలో టీవీ వీక్షణం 23 శాతం పెరిగినట్టు ఈ అధ్యయనం గుర్తించింది. పిల్లల కార్యక్రమాల వీక్షణ 27 శాతం పెరిగింది. 2019తో పోల్చుకుంటే కోవిడ్ కాలంలో 2020లో జనరల్ ఎంటర్టెయిన్మెంట్ ఛానల్స్ వ్యూయర్షిప్ 9 శాతం పెరిగింది. సినిమా వీక్షణ 10 శాతం పెరిగింది. నాన్ ప్రైమ్ టైమ్ కార్యక్రమాల వీక్షణశాతం 2019లో 51 శాతం ఉంటే, లాక్డౌన్ కాలంలో (మార్చి 14 నుంచి జూలై 3 వరకు) 2020లో 53 శాతానికి పెరిగింది. టీవీ వీక్షకులు ఒక్క రోజులో టీవీల ముందు గడిపే సమయం 2019లో 3 గంటల 42 నిముషాలు ఉంటే 2020కి వచ్చేసరికి 4 గంటల 2 నిముషాలకు చేరుకుందని సర్వే వెల్లడించింది. లాక్డౌన్ ప్రధాన కారణం 2020లో కోవిడ్కి ముందు జనవరి 4 నుంచి మార్చి 13 వరకు టీవీ వ్యూయర్షిప్ ఆరుశాతం తగ్గినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు,లాక్డౌన్ కాలంలో జాతీయంగా, అంతర్జాతీయంగా క్రీడాకార్యక్రమాలు నిలిచిపోవడంతో క్రీడాకార్యక్రమాల వీక్షణ తగ్గిపోయింది. జూలై 4 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు సంబంధించిన టీవీ వీక్షణ క్రమంగా పెరిగింది. 2020 చివరి నెలల్లో మొత్తం టెలివిజన్ వీక్షణ 6 శాతం పెరిగింది. 127 శాతం పెరిగిన ఐపీఎల్ 13 వ్యూయర్షిప్ ఐపీఎల్–13 నేపథ్యంలో క్రీడా సంబంధిత కార్యక్రమాల వీక్షణలో 127 శాతం పెరుగుదలను నమోదు చేసింది. టీవీ వీక్షకుల్లో అతిపెద్ద క్యాటగిరీ అయిన జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్(జీఈసీ) వీక్షకులు టీవీ చూసే సమయం 9 శాతం పెరిగింది. సినిమా చూసేవారిలో పదిశాతం పెరిగింది. చిన్నపిల్లల కార్యక్రమాల్లో 27 శాతం పెరుగుదల, సంగీత కార్యక్రమాల వీక్షణ 11 శాతం పెరిగింది. క్రీడల వీక్షించే సమయం –35 శాతం తగ్గినట్టు తేలింది. 2020 తొలి అర్థభాగంతో పోల్చుకుంటే 2020 ద్వితీయార్థ భాగంలో ప్రకటనలు 34 శాతం పెరిగాయి. 2020లోని మొత్తం ప్రకటనల్లో టాప్ 10 అడ్వర్టైజింగ్ సెక్టార్లు 80 శాతం ప్రకటనలు ఇచ్చాయి. భారీగా పెరిగిన ప్రభుత్వ ప్రకటనలు.. 2020 పోల్చుకుంటే 2019లో ప్రభుత్వ ప్రకటనలు 184 శాతం(2.7 రెట్లు) పెరిగాయి. ఐపీఎల్–12 తో పోల్చుకుంటే ఐపీఎల్–13 వీక్షకుల శాతం 23 శాతం పెరిగింది. మొత్తం 40,000 కోట్ల నిముషాల పాటు ఐపీఎల్ని వీక్షించారు. ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అబుదాబీలో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ని అత్యధికంగా 11.2 బిలియన్ల సమయం వీక్షించినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి రిపబ్లిక్ టీవీ సహా మరో రెండు ఛానళ్ళు టీఆర్పీ రేటింగ్ని తారుమారు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర న్యూస్ చానళ్లకు సంబంధించిన వీక్లీ వ్యూయర్షిప్ డేటాని అక్టోబర్ మధ్య వరకు బీఏఆర్సీ వెల్లడించలేదు. మాజీ ప్రసార నిపుణులు పరితోష్ జోషి మాట్లాడుతూ భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతోందని అన్నారు. 2019లోనే వార్తా ప్రాధాన్యత కలిగిన ఘటనలు 2019లో ఇదే కాలంలో వార్తా ప్రాధాన్యత కలిగిన అనేక ఘటనలు జరిగాయి. లోక్సభ ఎన్నికలు, పుల్వామాలో ఉగ్రదాడి, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ నుంచి తిరిగి రాకలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి. అప్పుడు వార్తా వీక్షకుల సంఖ్య పెరగడానికీ, 2020లో వార్తా ఛానళ్ళ వీక్షకుల సంఖ్య తగ్గడానికి ఇదొక కారణమై ఉండొచ్చని రిపోర్టు వెల్లడించింది. అయితే లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్ళకే పరిమితం కావడం వల్ల టీవీ వీక్షకుల శాతం 2019లో ఇదే కాలంతో పోల్చి చూస్తే 18 శాతం పెరిగినట్టు రిపోర్టు తేల్చింది. 2019తో పోల్చితే వార్తా వీక్షకుల సంఖ్య లాక్డౌన్ కాలంలో 90 శాతం పెరిగితే, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల వీక్షకుల సంఖ్య 8 శాతం మాత్రమే పెరిగింది. దూర్దర్శన్ ఛానళ్లలో ప్రసారం అయిన రామాయణ్, మహా భారత్ కార్యక్రమాల కారణంగా ఎంటర్టైన్మెంట్ వీక్షకులు పెరిగారు. -
అతిగా టీవీ చూస్తే అంతే..
సాక్షి, న్యూఢిల్లీ : రోజుకు ఐదు గంటలు మించి టీవీ చూసే పురుషులను తాజా అథ్యయనం హెచ్చరించింది. అతిగా టీవీ చూసే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య 35 శాతం పైగా తగ్గే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. అతిగా టీవీ చూడటం అధిక క్యాలరీలతో కూడిన జంక్ ఫుడ్ తీసుకోవడానికి, సోమరితనానికి దారితీస్తుందని పేర్కొంది. టీవీలకు అడిక్ట్ వాయిన వారి వీర్యకణాల సంఖ్య చురుకుగా ఉండే వారితో పోలిస్తే 38 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. వారానికి కనీసం 15 గంటల వ్యాయామం లేదా ఆటల్లో పాల్గొనే వారిలో శారీరకంగా చురుకుగా లేనివారి కన్నా వీర్యకణాల సంఖ్య మెరుగ్గా ఉన్నట్టు తేలిందని నిపుణులు చెప్పారు. అయితే అధిక వ్యాయామంతో పాటు అతిగా టీవీ చూడటం శరీరంలో ఫ్రీ రాడికల్స్ వ్యాప్తి చెంది మృత కణాలు పేరుకుపోతాయని, వీర్యకణాలు తగ్గి సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని దెబ్బతీస్తాయని అథ్యయనం హెచ్చరించింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమాలజీలో ఈ పరిశోధన ప్రచురితమైంది. -
ఎక్కువసేపు టీవీ చూస్తే.. పురుషులకు ముప్పు!
ఒలింపిక్స్ వస్తున్నాయనో... ఫేవరెట్ కార్యక్రమాలు వస్తున్నాయనో గంటల తరబడి టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారా.. అయితే జర భద్రం. దానివల్ల దీర్ఘకాలంలో సమస్యలు ఎదురవుతాయట. ముఖ్యంగా పురుష పుంగవులు అలా ఎక్కువ సేపు టీవీ చూడటం ఏమాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజుకు ఐదు గంటల కంటే ఎక్కువసేపు టీవీ చూస్తే.. స్పెర్మ్ కౌంట్ మూడోవంతు తగ్గుతుందట. 1200 మంది ఆరోగ్యవంతులైన యువకుల మీద చేసిన పరిశోధనల అనంతరం కోపెన్హాగెన్ యూనివర్సిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. సాధారణంగా టీవీ ఎక్కువ సేపు చూడని వారికి మిల్లీమీటరు వీర్యంలో 52 మిలియన్ల శుక్రకణాలు ఉంటే.. రోజుకు 5 గంటలు టీవీ చూసేవాళ్లలో మిల్లీలీటరు వీర్యానికి 37 మిలియన్ల శుక్రకణాలే ఉంటాయట. అంతేకాదు.. శుక్రకణాలను ఉత్పత్తి చేయడానికి శరీరానికి కావల్సిన టెస్టోస్టిరాన్ హార్మోను కూడా తగ్గుతుందని చెబుతున్నారు. టీవీ చూడటమే కాదు.. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చున్నా కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఎక్కువసేపు టీవీ ముందు లేదా కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల తగినంత వ్యాయామం గానీ, ఆరోగ్యకరమైన ఆహారం గానీ ఉండవని.. దానివల్ల సంతానభాగ్యం కలిగే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. వారానికి 15 గంటల పాటు వ్యాయామం చేస్తే మాత్రం శుక్రకణాల నాణ్యత బాగా పెరుగుతుందని 2013లోనే అమెరికన్ పరిశోధకులు చెప్పారు. ఇటీవలి కాలంలో పురుషులలో శుక్రకణాల సంఖ్య బాగా పడిపోతోందని గత 20 ఏళ్లుగా జరిగిన పరిశోధనలు చెబుతూనే ఉన్నాయి. కొవ్వు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ తీసుకోవడం కూడా ఇందుకు ప్రధాన కారణం అవుతోంది. -
అలా ఉద్యోగం చేయడం పొగతాగడంతో సమానం!
లండన్: రోజులో ఎనిమిది గంటలపాటు ఆఫీసులో పనిచేసి ఎలాంటి శారీరక వ్యాయామం లేకుండా జీవించడం పొగతాగడంతో సమానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 1 మిలియన్ ఉద్యోగుల మీద చేసిన పరిశోధనల్లో ఈ చేదు నిజాలు వెల్లడైనట్లు నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ పరిశోధకులు తెలిపారు. రోజుకు కనీసం 60 నుంచి 75 నిమిషాల పాటు సాధారణ వ్యాయామం లేదా ఒక గంటపాటు నడక సాధన చేయడం వల్ల ఆఫీసులో కూర్చున్న ఎనిమిది గంటల సమయం నుంచి హీల్ కావొచ్చని తెలిపారు. ఆఫీసులో ఎనిమిది గంటలు పనిచేసిన తర్వాత మరో ఐదుగంటలపాటు టీవీ వీక్షించడం వల్ల వ్యాయామం కూడా పూడ్చలేని తీరని నష్టం కలుగుతుందని హెచ్చరించారు. ఇంటివద్ద కానీ, ఆఫీసులో కానీ ఎక్కువ సమయం కూర్చొని ఉండటం వల్ల అనారోగ్యం కలుగుతుందని చెప్పారు. 45 ఏళ్ల వయసు పైబడిన ఉద్యోగుల దినచర్యలను, టీవీ చూసే అలవాట్లు, ఫిజికల్ యాక్టివిటీ లెవల్స్ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ప్రతి రోజూ 60-75 నిమిషాల పాటు వ్యాయామం చేస్తున్నవారు జబ్బుపడే అవకాశం తక్కువగా ఉన్నట్లు తేలింది. ఎక్కువ సమయం ఒకే ప్రదేశంలో కూర్చొని పనిచేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ పెరుగుతాయని దీని వల్ల శారీరక క్రియల్లో తేడాలు వస్తాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కొన్ని దేశాల్లో ప్రజలు ఆఫీసుకు నడుచుకుంటూ లేదా సైకిల్ పై వెళ్తూ ప్రమాదకర జబ్బుల బారిని పడకుండా వారినివారే రక్షించుకుంటున్నారని తెలిపారు. అలాగని ఎక్కువగా శారీరక శ్రమ చేయడం, జిమ్ కు వెళ్లడం తదితరాల వల్ల కూడా ప్రయోజనంలేదని చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement