breaking news
Tutors problem
-
ఒలీవియా.. ఆలియా.. పాఠాలయ్యా
పాత్రను బట్టి డైలాగ్ మారుతుంది. అది చెప్పే విధానం మారుతుంది. పరభాషా నటీనటులు తమకు రాని భాషలో సినిమాలు చేసేప్పుడు డైలాగ్స్ సరిగ్గా పలికేందుకు డైలాగ్ కోచ్లను పెట్టుకుంటారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కూడా పలువురు డైలాగ్ ట్యూటర్స్ను నియమించిందట. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కొమరమ్ భీమ్గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ కనిపించనున్నారు. వీళ్లకు జోడీగా ఒలీవియా మోరిస్, ఆలియా భట్ నటించనున్నారు. ఒలీవియా హాలీవుడ్ నటి, ఆలియా బాలీవుడ్ నటి. అందుకే వీళ్ల కోసం ప్రత్యేకంగా డైలాగ్ ట్యూటర్స్ను ఏర్పాటు చేశారట. ఆలియా భట్ వచ్చే వారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో జాయిన్ అవుతారట. అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు. -
క్లిక్ చేస్తే సారొస్తారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ వంటివే కాదు ప్లంబర్, పెయింటర్లను కూడా ఆన్లైన్లో బుక్ చేసే రోజులివి. అయితే వీటిల్లో ఏ సేవలకైనా సరే ఇంటికొచ్చే వ్యక్తి గురించి మనం ఎంక్వయిరీ చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే? ఆర్డర్లను డెలివరీ చేయటం వరకే వారి పని. మరి, హోమ్ ట్యూషన్స్ చెప్పే ట్యూటర్స్ను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే? తల్లిదండ్రులు చాలానే ఆలోచించాలి. ఎందుకంటే ట్యూటర్ మేధస్సే కాదు అతని వ్యక్తిత్వం, ప్రవర్తన కూడా ముఖ్యం. ఒక తల్లిగా తనకెదురైన ఇలాంటి సమస్య... ఇంకెవరికీ రాకూడదని నిర్ణయించుకుంది జయ. అంతే! ట్యూటర్స్ప్రైడ్.కామ్ను ప్రారంభించింది. అకడమిక్ ట్యూటర్స్ మాత్రమే కాక నాన్–అకడమిక్లోనూ ట్యూటర్స్ అందుబాటులో ఉండటమే దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు కె.ఎం.ఈ.జయ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది తూర్పు గోదావరి జిల్లా. పెళ్లయ్యాక హైదరాబాద్లో స్థిరపడ్డాం. ఎంఫిల్ చదివా. సిటీలోని ఒకటిరెండు స్కూల్స్, కాలేజీల్లో టీచర్గా పనిచేశా. యూఎస్, యూకేలోని పలువురు స్టూడెంట్స్కు ఆన్లైన్లో పాఠాలు చెప్పేదాన్ని. మా రెండో అబ్బాయి జాతీయ స్థాయిలో టెన్నిస్ ప్లేయర్. దీంతో రోజూ స్కూల్కెళ్లడం ఇబ్బందయ్యేది. పరీక్షల సమయంలో నేను, మా ఆయన ఒకటిరెండు సబ్జెక్ట్లు తప్ప చెప్పలేకపోయాం. ప్రైవేట్ ట్యూషన్ పెట్టిద్దామని ప్రయత్నించాం. లాభం లేకుండా పోయింది. ఆ సమస్యకు పరిష్కారం వెతికే పనిలోనే ట్యూటర్స్ ప్రైడ్కు బీజం పడింది. రూ.10 లక్షల పెట్టుబడితో గతేడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజున ‘ట్యూటర్స్ ప్రైడ్.కామ్’ను ప్రారంభించాం. స్కూల్స్, కాలేజీలకు కూడా సేవలు.. ప్రస్తుతం ట్యూటర్స్ ప్రైడ్లో హోమ్ ట్యూషన్ సేవలు, ఆన్లైన్ కోర్సుల విక్రయం, వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే 6 నెలల్లో వాట్సాప్ వీడియో కాల్స్, వీడియో లైవ్ స్ట్రీమింగ్ సేవలను అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం 66 వేల రకాల కోర్సులున్నాయి. స్కూల్, కాలేజీ సబ్జెక్ట్ ట్యూటర్స్ మాత్రమే కాక స్పోకెన్ ఇంగ్లిష్, పోటీ పరీక్షలు, కంప్యూటర్ కోర్సుల ట్యూటర్స్తో పాటూ సంగీతం, నృత్యం, డ్రాయింగ్, పెయింటింగ్, గుర్రపు స్వారీ, పర్సనల్ జిమ్ ట్రెయినర్స్, మెజీషియన్స్, ఫొటోగ్రఫీ, జ్యోతిష్యం, ఫిజియోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాసం, కుకింగ్, స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ వంటి నాన్ అకడమిక్లోనూ శిక్షకులుంటారు. తల్లిదండ్రులే కాకుండా స్కూల్స్, కాలేజీలు కూడా మా ట్యూటర్స్ సేవలను వినియోగించుకుంటున్నాయి. తనిఖీ చేశాకే ట్యూటర్స్ నమోదు.. ట్యూటర్స్ నమోదు ఉచితమే. కానీ, పలు రకాల తనిఖీలు, పరీక్షలు నిర్వహించాకే వారిని నమోదు చేస్తాం. ముందుగా ఇంటర్వ్యూ.. తర్వాత వీడియో డెమో క్లాస్లు, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత సర్టిఫైడ్ ఆన్లైన్ ట్యూటర్ (సీఓటీ) పరీక్ష ఉంటుంది. గంటలు, రోజుల లెక్కల చొప్పున లేదా సబ్జెక్ట్ల వారీగా కాకుండా పాఠాల వారీగా, చాప్టర్ల వారీగా కూడా ట్యూటర్స్ను నియమించుకునే వీలుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6 లక్షల మంది ట్యూటర్స్ నమోదయ్యారు. ఇందులో అకడమిక్లో 70 శాతం, నాన్–అకడమిక్లో 30 శాతం ఉంటారు. రూ.20 కోట్ల ఆదాయం లక్ష్యం.. యూజర్లు మా సేవలను వినియోగించుకోవాలంటే ఏడాది సబ్స్క్రిప్షన్ రుసుము రూ.2,999. ప్రస్తుతం 46 వేల యూజర్లున్నారు. వీరిలో 1,500 మంది సబ్స్క్రిప్షన్ యూజర్లు. ఏడాదిలో 2 లక్షల యూజర్లకు చేరాలనేది లక్ష్యం. నెలకు 600 మంది మా సేవలను వినియోగించుకుంటున్నారు. గత ఏడాది రూ.40 లక్షల వ్యాపారాన్ని చేరుకున్నాం. 2020 నాటికి రూ.20 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. రూ.100 కోట్ల నిధుల సమీకరణ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ప్రతి వారం పేరెంట్స్ కౌన్సెలింగ్ సమావేశాలు, పలు విద్యా సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టాం. ప్రస్తుతం మా సంస్థలో 27 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో వంద మందిని నియమించుకుంటాం. ఇందులో 60 శాతం మంది మహిళ ఉద్యోగులే ఉంటారు. వచ్చే ఏడాది కాలంలో రూ.100 కోట్ల నిధులను సమీకరించాలన్నది లక్ష్యం’’ అని జయ వివరించారు. -
ట్యూటర్ల సమస్య ఉంది
కొమరోలు : పశ్చిమ ప్రకాశంలో జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇక్కడి వసతి గృహాల్లో హాజరుశాతం 20 నుంచి 50శాతం వరకు తగ్గిందని జిల్లా బీసీ సంక్షేమాధికారి కె. మయూరి తెలిపారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘గుండెల్లో పది గంటలకు’ స్పందించిన ఆమె నియోజకవర్గంలోని పలు వసతి గృహాలను తనిఖీ చేశారు. వసతి గృహాల్లో టూటర్ల సమస్య ఎక్కువుగానే ఉందని, దీని ప్రభావం విద్యార్థుల చదువులపై పడి ఉత్తీర్ణతాశాతంపై పడే ప్రమాదం ఉందన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు, గిద్దలూరు, రాచర్ల మండలాల్లోని పలు హాస్టల్స్ను తనిఖీలు చేశారు. అక్కడున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొమరోలు మండలంలోని కొమరోలు బీసీ బాలికల, బాలుర హాస్టల్స్, అల్లినగరం బీసీ హాస్టల్, గిద్దలూరు బీసీ బాలికలు, బాలుర హాస్టల్స్, కళాశాల బీసీ హాస్టల్, సంజీవరాయునిపేట బీసీ హాస్టల్, అనుమలవీడు బీసీ హాస్టల్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్థులు తక్కువ మంది ఉంటున్నారని, జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తుతోందన్నారు. హాస్టల్ సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడంలేదన్నారు. విద్యార్థులకు సరైన ఆహారం, వసతి, విద్యను అందించాల్సిన సంక్షేమ సిబ్బంది సరిగా లేనందున ఏబీసీడబ్ల్యూ, హెచ్డబ్ల్యూలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. కొమరోలు బీసీ బాలికల వసతి గృహంలో వార్డెన్ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గిద్దలూరులోని బీసీ బాలికల వసతి గృహంలో భోజనం చేశామని, అక్కడ సంతృప్తికరంగా ఉందన్నారు. హాస్టల్స్లో ట్యూటర్ల సమస్య కొంత ఇబ్బందిగానే ఉందన్నారు.