breaking news
turning
-
Viral Video: ట్యాప్ తిప్పి దాహం తీర్చుకున్న పక్షి
-
పాత నోట్ల ష్రెడ్డింగ్ మొదలు:ఆర్బీఐ
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఓర్వకల్లు: కాల్వబుగ్గ–రామళ్లకోట రహదారిలో శనివారం రెండు బైకులు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందగా మరొకరు గాయపడ్డారు. బేతంచెర్ల మండలం యంబాయి గ్రామానికి చెందిన శ్రీనివాసులు(42) హుసేనాపురం నుంచి స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా మార్గమధ్యంలో కంకర ఫ్యాక్టరీ మలుపు వద్ద అదే గ్రామానికి చెందిన స్వాములు బైకు వస్తుండగా ప్రమాదవశాత్తు ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు తలకు తీవ్రంగా రక్తగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్వాములు స్వల్పంగా గాయపడ్డారు. మృతుడికి భార్య చిట్టెమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. -
మలుపు మింగేసింది
– నన్నూరు సమీపంలో రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, నలుగురికి గాయాలు ఓర్వకల్లు : కర్నూలు–చిత్తూరు 18వ జాతీయ రహదారిపై నన్నూరు సమీపంలోని రబ్బాని గోడౌన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. కాల్వ గ్రామానికి చెందిన గోవిందరాజులు(40) హుసేనాపురానికి చెందిన రాముడు కారులో కర్నూలుకు బయలుదేరారు. మార్గమధ్యలో రబ్బాని గోడౌన్ వద్దకు చేరుకోగానే కర్నూలు వైపు నుంచి రబ్బాని గోడౌన్కు ధాన్యం బస్తాలు తరలిస్తున్న ‘ఐచర్’ వాహనం మలుపు తిరిగే క్రమంలో కారును బలంగా ఢీకొట్టింది. ఘటనలో కారు నడుపుతున్న గోవిందరాజులు అక్కడికక్కడే మతిచెందాడు. రాముడు స్వల్పంగా గాయపడ్డాడు. అదే సమయంలో కారు వెనుక వేగంతో వస్తున్న బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న లొద్దిపల్లె గ్రామానికి చెందిన విజయ్, నాగలక్ష్మి, రామలింగమ్మ గాయపడ్డారు. ఎస్ఐ చంద్రబాబు నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోవిందరాజులు మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మతునికి భార్య అనుపమ, ముగ్గురు కుమార్తెలున్నారు. -
జోరు తగ్గిన టాలీవుడ్ లక్కీ హీరోయిన్