breaking news
tupparivalan
-
త్రిపాత్రాభినయం చేయబోతున్నా
హీరో విశాల్– దర్శకుడు మిస్కిన్ కాంబినేషన్లో ‘తుప్పారివాలన్’ (తెలుగులో డిటెక్టివ్) అనే చిత్రం వచ్చింది. మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతుంది. మిస్కి దర్శకత్వంలోనే విశాల్ హీరోగా నటిస్తూ, ఈ సీక్వెల్ను నిర్మిస్తున్నారు. బడ్జెట్ సమస్యల కారణంగా సినిమా నుంచి తప్పుకున్నారు దర్శకుడు మిస్కిన్. దాంతో దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు విశాల్. ‘‘దర్శకత్వం చేయాలనే ఆలోచన నాకు ఎప్పుట్నుంచో ఉంది. కానీ ఇలా వస్తుందని ఊహించలేదు. ఇది మారువేషంలో వచ్చిన అదృష్టంలా భావిస్తున్నాను. సినిమా మేకింగ్లో అన్ని బాధ్యతలు దర్శకుడి మీదే ఉంటాయి. డైరెక్షన్ చేయడానికి ఎగ్జయిటింగ్గా ఉన్నాను. ఈ సినిమాకు త్రిపాత్రాభినయం (నటన–నిర్మాణం– దర్శకత్వం) చేయబోతున్నాను’’ అన్నారు విశాల్. -
సిమ్రాన్కు ఏమైంది?
తమిళసినిమా: నటి సిమ్రాన్, ఈ మూడక్షరాల పేరు 2009 వరకూ దక్షిణాది సినిమాలో మారు మోగిందనే చెప్పాలి. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ ముంబయి బ్యూటీ మొదట్లో బాలీవుడ్లో ఒకటి రెండు చిత్రాలు చేసి ఆ తరువాత దక్షిణాదికి దిగుమతి అయ్యారు. ఇక్కడ తొలి రోజుల్లో ఈత దుస్తులు సహా అందాలారబోత మోత మోగించిన సిమ్రాన్ ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనూ తన సత్తా చాటుకున్నారు. అలా దాదాపు దశాబ్దంన్నర పాటు తమిళం, తెలుగు భాషల్లో టాప్ కథానాయకిగా రాణించారు. అలా నటిగా మంచి ఫామ్లో ఉండగానే పెళ్లి చేసుకుని నటనకు దూరం అయ్యారు. అయితే చాలా మంది హీరోయిన్ల తరహాలోనే రీఎంట్రీకి సై అన్న సిమ్రాన్ మంచి వెయిట్ ఉన్న పాత్రల్లో ఈ భామను చూడబోతున్నామని అభిమానులు సహా సినీ వర్గాలు భావించారు. అయితే అలా జరగలేదు. నిజం చెప్పాలంటే రీఎంట్రీ అయిన హీరోయిన్లలో చాలా తక్కువ మందే మళ్లీ హీరోయిన్గా నటించడం సాధ్యమైంది. ఎక్కువ మంది అక్క గానో, వదిన గానో, మరే బలమైన పాత్రల్లోనో నటిస్తున్నారు. అలాంటిది నటి సిమ్రాన్కు ఈ రెండు రకాలుగానూ అవకాశాలు రాకపోవడం చర్చనీయాంశం. అసలు నటి సిమ్రాన్కు ఏమైందో అన్న సందేహం కలిగేలా ఆమె పాత్రలను అంగీకరిస్తున్నారు. చిత్రాల్లో ఏమాత్రం ప్రాధాన్యత కాదు కథా, గుర్తింపు లేని పాత్రలను అంగీకరించి నటించేస్తున్నారు. ఆ మధ్య పార్థిబన్ నటించి దర్శకత్వం వహించిన కోడిట్ట ఇడంగళ్ నిరప్పుగా చిత్రంలో కేవలం రెండు మూడు సీన్స్లో కనిపించి మాయమయ్యారు. తాజాగా విశాల్ హీరోగా నటించిన తుప్పరివాలన్ చిత్రంలో అయితే ఒక సహాయ నటి తరహాలో రెండే రెండు సన్నివేశాల్లో అదీ ఏ మాత్రం నటనకు అవకాశం లేని పాత్రలో కనిపించారు. అసలు అలాంటి పాత్రల్లో నటించడానికి సిమ్రాన్ ఎందుకు అంగీకరిస్తున్నారు? అలాంటి పాత్రల్లో ఆమెను దర్శక నిర్మాతలు ఎందుకు ఎంపిక చేస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాని డాలర్ల ప్రశ్నగా మారింది. ఆ మధ్య కొన్ని సీరియళ్లలో నటించి బుల్లి తెరపైనా మెరిసిన సిమ్రాన్ వాటిపైనే దృష్టి సారించినా బాగుంటుందంటున్నారు సినీ వర్గాలు. సిమ్రాన్ కంటే ముందు కథానాయికలుగా రాణించిన రాధిక, కుష్బూ, భానుప్రియ వంటి వారు చిత్రాల్లో తమ పాత్రలకు ప్రాధాన్యత ఉంటేనే అంగీకరించి నటిస్తున్నారన్నది గమనార్హం. -
సీనియర్స్తో సై...
అక్షరా హాసన్ సెలైంట్గా తమిళంలో బిజీ అయిపోతోంది. ‘షమితాబ్’ చిత్రం ద్వారా హిందీ తెరకు నాయికగా పరిచయమైన అక్షర ఆ తర్వాత అక్కడ వేరే సినిమాలు కమిట్ కాలేదు. ఈ మధ్యే తమిళంలో అజిత్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ఓ కథానాయికగా నటించడానికి అంగీకరించింది. ఇందులో కాజల్ అగర్వాల్ ఓ నాయిక. తాజాగా విశాల్ హీరోగా రూపొందుతోన్న ‘తుప్పరివాలన్’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించింది. తుప్పరివాలన్ అంటే డిటెక్టివ్ అని అర్థం. ఇందులో కథానాయికగా రకుల్ ప్రీత్సింగ్ నటిస్తోంది. రకుల్ కంటే కాజల్ సీనియర్. రకుల్ వచ్చి నాలుగైదేళ్లవుతోంది. ఈ ఇద్దరితో పోల్చితే అక్షర జూనియర్. మరి.. ఇద్దరు సీనియర్ నాయికలున్న సినిమాలో ఓ నాయికగా నటించడమంటే అక్షరకు సవాలే. అయినా.. లోక నాయకుడు కమల్హాసన్ కూతురు కదా... సీనియర్స్కి ధీటుగా అక్షర నటిస్తుందని ఊహించవచ్చు.