breaking news
tunikaku
-
తునికాకు.. సేకరణ ఏ మేరకు?
పాల్వంచ రూరల్: వేసవిలో గిరిజన, గిరిజనేతర కూలీలకే కాకుండా అటవీశాఖకు ఆదా యం సమకూర్చిపెట్టే తునికాకు సేకరణకు రంగం సిద్ధమైంది. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో తునికాకు సేకరణ ఆశించిన రీతిలో సాగలేదు. అయితే ఈ సారి పరిస్థితులు మెరుగుపడడంతో ఆకు సేకరణపై గిరిజను లు ఆశలు పెంచుకున్నారు. ఈ ఏడాది పాత పది జిల్లాలకు గాను ఎనిమిది జిల్లాల (నల్ల గొండ, హైదరాబాద్ మినహా) పరిధిలోని 242 యూనిట్లలో 195 యూనిట్లలోనే తుని కాకు టెండర్ల ప్రక్రియ జరిగింది. మిగతా యూనిట్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఆకు నాణ్యత ఆధారంగా భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలో 50 ఆకుల కట్టకు రూ.2.50 చెల్లించడానికి నిర్ణయం తీసుకోగా, మిగిలిన జిల్లాల్లో రూ.2.05 చెల్లించనున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ అధికారు లు వెల్లడించారు. తునికాకు సేకరణ ద్వారా ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు రెండు నెలల పాటు ఉపాధి లభిస్తుంది. సీజన్ మొత్తంలో ఈ పని ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా. పూర్తయిన టెండర్ల ప్రక్రియ ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,41,700 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరించాలని అటవీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గత నెలలోనే ఆన్లైన్ ద్వారా టెండర్ల ప్రక్రియ పూర్తయింది. గతేడాది 2,41,600 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకున్నా.. కరోనా తదితర కారణాలతో లక్ష్యాన్ని చేరుకోలేదు. కేవలం 1,60,460 బ్యాగులే సేకరించగలిగారు. ఈ సారి పరిస్థితులు కొంత మెరుగ్గా ఉండడంతో లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. రెండేళ్లుగా పూర్తికాని లక్ష్యం రెండేళ్లుగా తునికాకు సేకరణ లక్ష్యం మేరకు జరగడం లేదు. గత ఏడాది తునికాకు టెండ ర్ల ప్రక్రయలో జాప్యం జరగడం, కాంట్రాక్టర్లు సకాలంలో ఆకుల్లోని వ్యర్థాలను శుభ్రం చేయకపోవడం ఓ కారణమని తెలుస్తోంది. దీనికి తోడు కరోనా కారణంగా ఆకు సేకరణకు గిరిజనులు పెద్దగా ఆసక్తి చూప లేదు. అలాగే, గిరిజనులు ఉపాధి హామీ పనులకు వెళుతుండడం, అడవుల్లో పోడు సాగు కారణంగా తునికాకు చెట్లు అంతరించిపోవడం, తునికాకు కట్ట ధర గిట్టుబాటు కాకపోవడం వంటి కారణాలతో లక్ష్యం నెరవేరడం లేదని చెపుతున్నారు. అలాగే ఎండాకాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవుల్లో ప్రమాదకర ప్రదేశాల్లో ఆకు సేకరించడం కంటే సులభంగా ఉండే ఉపాధి పనులకు వెళ్తే రూ.250 కూలి వస్తుందని గిరిజనులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. స్టాండర్డ్ బ్యాగ్ అంటే.. ఒక్కో కట్టలో 50 ఆకులు ఉంటాయి. ఇలాంటివి వెయ్యి కట్టలు కలిపితే ఒక స్టాండర్డ్ బ్యాగ్ అవుతుంది. కూలీలు ఆసక్తి చూపడం లేదు.. తునికాకు సేకరణ క్రమంగా తగ్గిపోవడానికి గిరిజనులు, గిరిజనేతరులు పెద్దగా ఆసక్తి చూపకపోవడమే కారణం. ఉపాధి హామీ పనులకు వెళ్తే ఎక్కువ కూలీ దక్కుతుందని వారు భావిస్తున్నారు. తునికాకు సేకరణలో శ్రమకు తగిన ఫలితం రావడం లేదనే భావన గిరిజనుల్లో ఉంది. – కట్టా దామోదర్రెడ్డి, వైల్డ్లైఫ్ విభాగం ఎఫ్డీఓ, పాల్వంచ -
తునికాకు టెండర్ల ఖరారు
గతేడాది కంటే అధిక రేటు చింతూరు (రంపచోడవరం) : ఏజెన్సీ ప్రాంత గిరిజనులు కాసుల పంటగా భావించే తునికాకు (బీడీ ఆకు) టెండర్లు ఖరారయ్యాయి. చింతూరు అటవీ డివిజన్లోని ఐదు రేంజ్లలోని తొమ్మిది యూనిట్లకు గతేడాది కంటే అధికంగా రేటు లభించినట్టు చింతూరు డీఎఫ్వో ఎంవీ ప్రసాదరావు బుధవారం తెలిపారు. తునికాకు సేకరణకు ఏటా మార్చిలో ఫ్రూనింగ్ పనులు, ఏప్రిల్, మే నెలల్లో కోతలు జరుగుతాయి. గతేడాది 50 ఆకుల తునికాకు కట్టకు 1.52 పైసల చొప్పున అటవీశాఖ కార్మికులకు చెల్లించింది. కూనవరం రేంజ్ పరిధిలోని చింతూరు ఏడుగురాళ్లపల్లి యూనిట్లో నాణ్యమైన తునికాకు లభిస్తుండడంతో కాంట్రాక్టర్లు ఈ యూనిట్ను దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు. కాగా తునికాకు సేకరణ అనంతరం కార్మికులకు బకాయిపడిన 2013 నుంచి చెల్లించక పోవడంపై కార్మికులతో పాటు రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెయ్యి కట్టల తునికాకును ఒక స్టాండర్డ్ బ్యాగ్గా పరిగణించి టెండర్లు ఖరారు చేస్తారు. చింతూరు అటవీ డివిజన్లోని తొమ్మిది యూనిట్లకు ఈ ఏడాది తునికాకు సేకరణ లక్ష్యం, ఖరారైన టెండర్ల వివరాలు యూనిట్లు లక్ష్యం స్టాండర్డ్ బ్యాగుల్లో – స్టాండర్డు బ్యాగుకు ఖరారైన రేటు చింతూరు – 4000 – రూ.14,116 కుందులూరు – 3500 – రూ.12,567 లక్కవరం – 2700 – రూ.14,116 ఏడుగురాళ్లపల్లి – 7300 – రూ.15,000 కూనవరం – 2400 – రూ.11,369 మురుమూరు – 1200 – రూ.13,179 వీఆర్పురం – 1800 – రూ.13,791 నెల్లిపాక – 3100 – రూ.11,299 మాధవరావుపేట – 3065 – రూ.15,340 -
తునికాకు లారీ దగ్ధం
ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం ఆస్నాద్ వద్ద ఓ తునికాకు లారీ ప్రమాదవశాత్తూ దగ్ధమైంది. సోమవారం మధ్యాహ్నం తునికాకుతో వెళుతున్న లారీకి విద్యుత్ తీగలు తాకడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్, క్లీనర్ వాహనం నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధం అయింది.