breaking news
TS Assembly budget
-
తెలంగాణ అసెంబ్లీ: ఇరిగేషన్పై మాటల యుద్ధం
Updates.. తెలంగాణ శాసన సభ నిరవధిక వాయిదా సభను నిరవధికంగా వాయిదా వేసిన స్పీకర్ 45 గంటల 32నిమిషాల పాటు నడిచిన అసెంబ్లీ 8 రోజుల శాసనసభ పనిదినాల్లో 59 మంది సభ్యులు మాట్లాడారు జీరో అవర్ లో 64మంది వారి సెగ్మెంట్ అంశాలను ప్రస్తావించారు ప్రభుత్వ ప్రకటనలు రెండు, మూడు బిల్లులకు ఆమోదం, ఒక లఘు చర్చ అసెంబ్లీ ఆవరణలో మల్లా రెడ్డి చిట్ చాట్ వీళ్ళకి మేడిగడ్డ తప్పా, వేరే గడ్డనే దొరకడం లేదు రోజు మేడిగడ్డ మేడిగడ్డ అంటే ప్రజలు బేజారవుతున్నారు మేడిగడ్డ ప్రాజెక్ట్ లీకేజ్ అయింది.. సరి చెయ్యాలి ఈసారీ అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ప్లాప్ హరీష్ రావు వన్ మెన్ హీరో మేడిగడ్డలో రిపేర్ కాంట్రాక్ట్ పెద్ద కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇస్తే ఆయనే సరి చేస్తాడు అన్నారం డ్యామేజిపై అసెంబ్లీలో వీడియో ప్రదర్శన అన్నారం డ్యామేజీపై అసెంబ్లీలో వీడియో ప్రదర్శన చేసి చూపించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారం డ్యామేజి సీరియస్ అంశం మూడు బ్యారేజిలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ(ఎన్డీఎస్ఏ)కు అప్పగిస్తాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారాంగానే నీళ్లు నింపాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయాలను కోడ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే తెలంగాణ తెచ్చుకున్నాం అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు కాళేశ్వరంనకు అన్నీ తానే అని చెప్పుకుంటున్నా కేసీఆర్.. ఇప్పుడు ప్రాజెక్టు డ్యామేజ్పైపై చర్చ కు ఎందుకు రావడం లేదు ఒకనాడు కేసీఆర్కు దేవాలయం అయిన మేడిగడ్డ.. ఇప్పుడు బొందల గడ్డ ఎలా అయింది ప్రాజెక్టును తొందర గా కట్టాలనే ఆతృత తప్ప..ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ గురించి పట్టించుకోలేదు. ప్రాజెక్టు ప్రమాదం బీఆర్ఎస్ హాయాంలోనే జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత ఎంత నీటి ని ఎత్తిపోసారో లెక్కలు చెప్పగలరా హరీష్రావు చిట్ చాట్@అసెంబ్లీ లాబీ నేను అసెంబ్లీలో కీలక అంశం మాట్లాడే టైంgలో మైక్ కట్ చేస్తున్నారు ఫేస్ చూపించకుండా కెమెరా వేరే వైపు టర్న్ చేస్తున్నారు ఈ రోజు గద్దర్, అందెశ్రీ పాట పాడుతుంటే కట్ చేసారు నేను మాట్లాడే సమయంలో అధికార పార్టీ నేతలు స్పీకర్కు స్లిప్ పంపుతున్నారు నా డ్యూటీ విషయంలో నేను వెనక్కి తగ్గను నల్గొండ మీటింగ్, మేడిగడ్డ టూర్ రోజు కూడా అసెంబ్లీ కి వచ్చాను నిన్ననే అసెంబ్లీ క్లోజ్ చేయమని చెప్పాం 3 గంటలు జీరో అవర్, 3 గంటలు బీసీ బిల్లు, 2 గంటలు టీ బ్రేక్ ఇచ్చారు.. మంత్రి భట్టి మాట్లాడుతూ.. కావాలనే ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారు రీడిజైన్ పేరుతో అంచనాలు పెంచారు లక్షల కోట్లు వృధా చేశారు హరీష్రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు కాళేశ్వరం తెలంగాణకు కళంకంగా మారింది సాగునీటి మంత్రిగా హరీష్ను ఎందుకు తప్పించారు ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. పదేళ్లు పాలించి నిండా ముంచారు ఈ పాపాలన్నింటికి హరీష్, కేసీఆరే కారణం తెలంగాణను చెదలు పట్టించారు హరీష్ మారాడు అనుకున్నా.. కానీ ఇంకా దిగజారాడు చేవెళ్లపై గతంలో సబితక్క(సబితాఇంద్రారెడ్డి) ధర్నా చేశారు ఇప్పుడు సబితక్క మాట్లాడకుండా హరీష్ను సమర్థిస్తున్నారు చేవెళ్ల ఎండిపోయినా వారికి కనిపించదు కడియం కూడా మంచోడే.. కానీ, ఆ స్కూల్లో చేరాక అలా తయాయ్యాడు అది వాళ్ల బడి.. అందులో చేరగానే సిలబస్ మారిపోతుంది కూలిన ప్రాజెక్టులు చూసి సిగ్గుపడండి విచారణకు వెళ్లి తప్పు ఒప్పుకుని రండి మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. మాటలతో ప్రజల్ని నమ్మించలేరు గట్టిగా మాట్లాడినంత మాత్రానా అబద్ధాలు నిజాలు అయిపోవు హరీష్రావు మాట్లాడుతూ.. సీఎం మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు సీడబ్ల్యూసీ CWC సూచనల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మించాం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్లకు ఒప్పుకోలేదుకే క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్ గతంలో దేవాదుల పైపులు, పగిలాయి.. టెన్నెల్స్ కూలాయి మిషన్ కాకతీయతో చెరువులు పునరుద్ధరించాం.. చెరువులు తెగిపోవడం తగ్గింది ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించింది మాపై కోపం ఉన్నా ఫర్వాలేదు.. రైతులకు అన్యాయం చేయొద్దు కేసీఆర్ చేసిన పనిని చెడగొట్టాలన్నది రేవంత్ ఉద్దేశం మేడిగడ్డ.. కేసీఆర్ ఆలోచనే: సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీయే ప్రాణహిత-చేవెళ్ల సాధ్యమని నివేదిక ఇచ్చింది మేడిగడ్డ కట్టాలన్నది కేసీఆర్ఆలోచన అక్కడే కట్టాలని కేసీఆర్ ఆదేశించారు వాళ్లు నియమించుకున్న ఇంజనీర్ల కమిటీతో నివేదిక ఇప్పించుకున్నారు వాళ్లు కూడా తుమ్మడిహట్టి దగ్గరే నిర్మించాలని చెప్పారు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం సరికాదని నిపుణుల కమిటీయే చెప్పింది హరీష్రావు, వాళ్ల మామ కేసీఆర్ కలిసి తెలంగాణకు ద్రోహం చేశారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ వచ్చాక ఆ అన్యాయం మరింతగా జరిగింది తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే బారిన పడింది మా కాంగ్రెస్ ఎంపీలే గోదావరి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం కమిటీ వేసింది ఆ కమిటీ నివేదిక ఇచ్చింది ఆ నివేదికలోని వివరాలనే ఇప్పుడు సభ ముందు ఉంచుతున్నాం ప్రాజెక్టులపై వాస్తవాలను ఉత్తమ్ బయటపెట్టే యత్నం చేస్తున్నారు ప్రతిపక్షం సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తోంది వాస్తవాలను కూడా తప్పుల తడక అని చెప్పి తప్పించుకునే యత్నం చేస్తున్నారు తప్పు ఒప్పుకోండి.. కప్పి పుచ్చుకోకండి మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ వచ్చాకే కృష్ణా జలాల్లో ఎక్కువ దోపిడీ జరిగింది హరీష్రావు అన్నీ అబద్ధాలే చెబుతున్నారు గోబెల్స్ హరీష్రావు అని పేరు పెట్టుకోండి పదేపదే అబద్ధాలు చెప్పడం మానుకోండి హరీష్రావు మాట్లాడుతూ.. ఉత్తమ్ మాట్లాడిన ప్రతీసారీ అబద్ధాలే చెబుతున్నారు అవినీతి ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధం కాంగ్రెస్ హయాంలోనే అవినీతి.. అన్యాయం జరిగిందని కవులు, కళాకారులు గొంతెత్తి పాడారు ప్రాణహిత చేవెళ్లను మేం మార్చాలనుకోలేదు ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు గనుకే రీ డిజైనింగ్ చేశాం ఎస్ఆర్ఎసీ-2కి నీళ్లు ఇచ్చిన ఘనత మాది తెలంగాణ ఏర్పాడ్డాక.. భూగర్భ వనరులు పెరిగాయి తెలంగాణ రాష్ట్రం వచ్చాక వలసలు తగ్గాయి ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్నారు అవినీతి ఆరోపణలపై ఏ ఎంక్వైరీకైనా రెడీ మంత్రి భట్టి మాట్లాడుతూ.. మేడిగడ్డ పిల్లర్ నిట్టనిలువునా చీటింది కాళేశ్వరంలో నాణ్యత లేదు మేడిగడ్డ ఒక్కటే కాదు..మిగతా రెండూ నాణ్యత లేవని NDSA తేల్చింది రూ.94 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు కూలిపోతోంది గత గవర్నర్ హరీష్రావుకు కాళేశ్వరరావు అని పేరు పెట్టారు ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్ల అవినీతి జరిగింది.. ఆ విషయం కాగ్ కూడా చెప్పింది ఉత్తమ్ చెప్పిన విషయాల్ని నిజమని ఒప్పుకోండి కూలిన దానికి తప్పు ఒప్పుకోండి ఇంకా సమర్థించుకోవడం సరికాదు ఇరిగేషన్పై వాడీవేడి వాదనలు ఇరిగేషన్ శ్వేత పత్రంపై శాసన సభలో మాటల యుద్ధం మేడిగడ్డ లోపాలతో విపక్షాన్ని కార్నర్ చేసిన అధికార పక్షం తప్పుమీదంటే మీదంటూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు లేచి బీఆర్ఎస్పై విరుచుకుపడ్డ మంత్రి కోమటిరెడ్డి కృష్ణాజలాల విషయంలో అన్నీ సక్రమంగా చేశామని అంటున్నారు: మంత్రి జూపల్లి మరి స్మితా సబర్వాల్ లేఖ సంగతి ఏంటి?: మంత్రి జూపల్లి మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. హరీష్రావు చెప్పిందే పదే పదే చెబుతున్నారు కేసీఆర్, జగన్ చాలాసార్లు నీటివాటాపై చర్చింఆరు అపెక్స్ కమిటీలో అభ్యంతరం చెబితే రాయలసీమ ప్రాజెక్టు ఆగేది శ్వేతపత్రం కాదు.. అబద్ధపు పత్రం తప్పుడు లెక్కలతో గత ప్రభుత్వాన్ని తప్పుబట్టే యత్నం చేస్తున్నారు ప్రాజెక్టులు అప్పగించాలన్న గెజిట్ నొటిఫికేషన్ను మేం వ్యతిరేకించాం మళ్లీ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి దిగింది ఎన్నికల ప్రచారంలో గోబెల్స్ప్రచారం చేసినట్లే.. సభలోనూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు ఆయకట్టు విషయంలో రెండు చోట్ల రెండు రకాలుగా చెప్పారు రూ.775 కోట్లు ఖర్చు పెట్టి ఎల్లంపల్లి, మిడ్ మానేరు పూర్తి చేశాం సభను ఉత్తమ్ తప్పుదోవ పట్టించే యత్నం చేశారు హరీష్రావు మాట్లాడుతూ.. ఇరిగేషన్పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం తప్పుల తడకగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం సత్యదూరంగా ఉంది మంత్రి ఉత్తమ్ సత్యదూరమైన మాటలు చెప్పారు గత ప్రభుత్వంపై బుదర చల్లాలనే శ్వేత పత్రం ప్రవేశపెట్టారు మిడ్మానేరు ప్రాజెక్టులను మా హయాంలోనే పూర్తి చేశాం ఇరిగేషన్పై చర్చకు 2గం. సమయం అవసరం మంత్రి ఉత్తమ్ ప్రసంగం అనంతరం.. తన సీట్లోంచి లేచి మాజీ సీఎం కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సభలో మంత్రి ఉత్తమ్.. లక్షా 81వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై గత ప్రభుత్వం ఖర్చు చేస్తే 15లక్షల ఎకరాలకు నీళ్లు మాత్రమే అందించారు రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతానికి 54వేల కోట్లు ఖర్చు చేసి 57లక్షల ఆయకట్టు సాగునీరు అందించింది అప్పటి ప్రభుత్వం కాళేశ్వరం పరిధిలోని బ్యారేజీలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA కు అప్పగించి విచారణ చేయిస్తాం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా పై విచారణ NDSA రిపోర్ట్ తో చర్యలు తీసుకుంటాం గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మేం సవరిస్తాం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 7లక్షల ఆయకట్టు ఏర్పాటు చేస్తాం సభలో మంత్రి ఉత్తమ్.. గత ప్రభుత్వం ఇరిగేషన్ పై బడ్జెట్ కేటాయింపులు కాకుండా 84వేల కోట్ల నిదులు లోన్స్ రూపంలో తెచ్చారు. అప్పులు వడ్డీల భారంతో రాబోయే పదేళల్లో రూ. 1లక్ష 35వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్లానింగ్.. డిజైన్ లోపం ఉంది ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులన్నీ గోదావరి పాలు అయ్యాయి కాళేశ్వరం ప్రాజెక్టు నిషేదిత ప్రాంతంగా ఉండేది మేడిగడ్డ కుంగుబాటు బాటు వల్ల మిగతా బ్యారేజీల పరిస్థితి ప్రశ్నర్ధకంగా మారింది ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డగోలుగా అవినీతి జరిగింది సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా మారింది ఎస్సారెస్సీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో ఒరిగిందేం లేదు గతంలో పోలిస్తే.. ఎకరాకు 12 రెట్లు ఖర్చు పెరిగింది ఆర్థిక క్రమశిక్షణతో ప్రాజెక్టులను నిర్వహించాలి అంతేకానీ అడ్డగోలు అవినీతి, నిర్లక్ష్యంతో కాదు సభలో మంత్రి ఉత్తమ్.. గత పదేళ్లలో ప్రాజెక్టుల కోసం అనాలోచితంగా ఖర్చు చేశారు ప్రాజెక్టుల రీడిజైన్ వల్ల అన్ని ప్రాంతాలకు నష్టం జరిగింది తెలంగాణకు రావాల్సిన నీటిని సాధించుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైంది గతంలో.. అపెక్స్ కమిటీ మీటింగ్ గత సీఎం కూడా పాల్గొన్నారు అప్పుడే కేఆర్ఎంబీకి నోటిఫికేషన్ను కేంద్రం రిలీజ్ చేసింది కానీ, అప్పటి ప్రభుత్వం ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు కేఆర్ఎంబీకి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాచింయింది కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తూ సూత్రప్రాయంగా బీఆర్ఎస్ ప్రభుత్వంనిర్ణయం తీసుకుంది సభలో మంత్రి ఉత్తమ్.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఏపీ యధేచ్ఛగా నీటిని వాడుకుంది కృష్ణా జలాలను ఏపీ యధేచ్ఛగా దారి మళ్లించుకుంది తెలంగాణ వాటా 68 శాతం ఉంటే.. గత ప్రభుత్వం 50 శాతం మాత్రమే అడిగింది పోలింగ్ రోజు సాగర్ నుంచి అదనపు నీటిని తీసుకుంది బీఆర్ఎస్ మాత్రం ప్రేక్షక పాత్ర వహించింది శ్రీశైలం నుంచి అదనపు నీటిని ఏపీవాడుకుంటున్నా.. బీఆర్ఎస్ అప్పుడు పట్టించుకోలేదు సభలో మంత్రి ఉత్తమ్.. కుంగిన ప్రాజెక్టులలో నీళ్లు నింపొద్దని ఎన్డీఎస్ఏ చెబుతోంది ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది ఏపీకి నీళ్లను కట్టబెట్టి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ నిర్ణయాలు.. తెలంగాణను నట్టేటా ముంచాయి ఇంత అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదు సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం ఆర్థికంగా అనుకూలమైనది కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అవసరం అయ్యే కరెంట్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కరోజే అవసరం మల్లన్న సాగర్ విషయంలో గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది కానీ, కాగ్ అనేక లోపాలు బయటపెట్టింది మల్లన్న సాగర్ ప్రమాదంలో ఉందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది చిన్నపాటి భూకంపాలు వచ్చినా మల్లన్నసాగర్ తట్టుకోలేదు మల్లన్న సాగర్ కింద గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయని కాగ్ పేర్కొంది సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమని గత ప్రభుత్వం చెప్పుకుంది కానీ, కాగ్ కాళేశ్వరం విషయంలో విస్తూపోయే విషయాలు కాగ్ చెప్పింది కరెంట్ కోసం ఏడాదికి రూ.10 వేల కోట్ల ఖర్చు అవుతుంది డీపీఆర్ అఫ్రూవ్ కాకుండానే కాంట్రాక్టర్లకు రూ.20 వేల కోట్లు కట్టబెట్టింది కాగ్ సూచించిన అంశాల పై ఖచ్చితంగా విచారణ చేస్తాం గతంలో జరిగిన వేల కోట్ల పనులను పక్కన పెట్టి రీ డిజైన్ పేరుతో ప్రాజెక్ట్ లను కొనసాగించారు మెట్టప్రాంతాలకు నీరు ఇవ్వాలన్నది ప్రాణహిత చేవెళ్ల లక్ష్యం ప్రాణహిత చేవెళ్ల కింద రూ. 81వేల కోట్ల ప్రాజెక్టును సీడబ్ల్యూసీ అనుమతి ఇస్తే.. గత ప్రభుత్వఅవినీతి వల్ల రూ.1లక్ష 47వేల కోట్ల అంచనాలకు పెరిగింది సభలో మంత్రి ఉత్తమ్.. అవినీతి, నిర్లక్ష్యం, నాసిరకం వల్లే ఈ పరిస్థితి మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం ,సుంధిళ్ళ బ్యారేజ్ ల నిర్మాణం లో క్వాలిటీ లేదు అన్నారంకు క్రాక్స్ వచ్చాయి అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉంది అన్నారం బ్యారేజీలో నిన్నటి నుంచే లీకులు మొదలయ్యాయి వెంటనే ఎన్డీఎస్ఏకి సమాచారం అందించాం నీటిని నింపొద్దని ఎన్డీఎస్ఏ చెబుతోంది ఉన్న నీటిని తొలగించమని చెప్పింది సభలో మంత్రి ఉత్తమ్.. మేడిగడ్డ ప్రాజెక్టు బాగా దెబ్బ తింది మేడిగడ్డ పనికి రాదు అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది అక్టోబర్లో మేడిగడ్డ కుంగితే కేసీఆర్ ఇప్పటిదాకా స్పందించలేదు అవినీతి, నిర్లక్ష్యం వల్ల బ్యారేజ్ బాగా దెబ్బతింది గత ప్రభుత్వ పెద్ద మనిషే చీఫ్ ఇంజనీర్.. డిజైనర్ గత పదేళ్లలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతి మరెక్కడా జరగలేదు ఇంత అవినీతి స్వతంత్ర భారతంలో ఇప్పటిదకా జరగలేదు యావత్ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలి నేషనల్ డ్యామ్ సేఫ్టీపై విచారణ జరిపించాలని కోరాం నీటి పారుదల శాఖ పై శ్వేత పత్రం 2014 వరకు నీటి పారుదల సామర్థ్యం 57.79లక్షల ఎకరాలు మొత్తం ఖర్చు 54,234కోట్లు 2014 వరకు ఓక్కో ఎకరానికి 93 వేల కోట్ల ఖర్చు 2014 నుంచి 23 వరకు ఇరిగేషన్ ఖర్చు 1.81లక్షల కోట్లు కొత్త ఆయకట్టు 15.81లక్షల ఎకరాలు ఒక్కో ఎకరం ఖర్చు 14.45లక్షలు సభలో కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ పపవర్ పాయింట్ ప్రజెంటేషన్.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి అవగాహన కోసమే పవర్పాయింట్ ప్రజంటేషన్ సభ్యులకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రం కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ గుండెకాయలాంటిది మేడిగడ్డ ప్రాజెక్టులో లోపాలున్నాయ్ అవగాహన లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారు మూడేళ్లకే ప్రాజెక్టు కుంగిపోయింది వందేళ్లు ఉండాల్సిన బ్యారేజ్.. దురదృష్టవశాత్తూ నాణ్యతా లోపంతో మూడేళ్లకే దెబ్బతింది రూ.1,800 కోట్లకు టెండర్ పిలిచి.. నిర్మాణానికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారు ప్రాజెక్టుకు అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోయారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నివేదిక ఇచ్చింది ప్రాజక్టు నిర్మాణం నాసికంగా ఉందని పేర్కొంది అసెంబ్లీ స్పీకర్ అన్ని రికార్డులను పరిశీలించి టెక్నీషియన్ ను సభలోకి అనుమతించా గతంలో సీఎం గా కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సభలోనే టెక్నీషియన్ ఉన్నాడు నేను టెక్నీషియన్ కు అనుమతి ఇస్తున్నా..నన్ను ఎవరూ ప్రశ్నించొద్దు మంత్రి శ్రీధర్ బాబు.. గతంలో సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం,టెక్నీషియన్ ద్వారా నే ఇచ్చారు స్పీకర్ అనుమతి తోనే టెక్నీషియన్ సభ లోపలికి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు.. మెంబర్ కాకుండా సభలోకి ఇతరులు రాకూడదు అడ్వకేట్ జనరల్ తప్ప మరో వ్యక్తి రావోద్దు టెక్నీషియన్ ను సభలోకి అనుమతించ వద్దు మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి టెక్నీషియన్ ను బయటకు పంపాలి ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేత పత్రం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ఫైర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం కులగణనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికి ధన్యవాదాలు. మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నాం. మాజీమంత్రి గంగుల కమలాకర్ తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయం. ఆ మాజీమంత్రికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సకల జనుల సర్వేను బయటపెట్టమని అడిగారా? అనుమానాలు పక్కన పెట్టి ఇప్పటికే జరిపిన ఆయా రాష్ట్రాల గురించి తెలుసుకోవాలి. మురళీధర్ కమిషన్ నుంచి తెలంగాణ ఉద్యమం, పార్లమెంట్లో బిల్లు ఆమోదం వరకు మేము ఉన్నాం. మిగతా వారిలాగా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలకే మేము పరిమితం కాలేదు. అందుకే సభలో తీర్మానం పెట్టాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేస్తాం ►తెలంగాణ అసెంబ్లీలో నేడు వాడీ-వేడి చర్చ జరుగనుంది. ►కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ►నేడు ఎనిమిదో రోజు తెలంగాణ శాసనసభ సమావేశం కొనసాగనుంది. ►ఇరిగేషన్పై సభలో శ్వేతపత్రం విడుదల చేయనున్న కాంగ్రెస్ సర్కార్. ►సభలో నీటి పారదలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం ►పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసిన అధికారులు ►ఇప్పటికే KRMBపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ►ఈ క్రమంలో తమకు కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ►నిన్న జరగాల్సిన ఇరిగేషన్పై చర్చ నేటికి వాయిదా ►ఇవ్వాల్టితో ముగియనున్న తెలంగాణ శాసన సభ సమావేశాలు ►ఇప్పటికే శాసన మండలి నిరవధిక వాయిదా. -
ప్రజల ఆశలు నెరవేర్చేలా.. సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.50 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని.. ప్రస్తుతం ఈ నష్టం రూ.లక్ష కోట్లకు చేరుకున్నదని సీఎం కె.చంద్రశేఖర్రావు అన్నారు. కరోనా తర్వాతి పరిస్థితులలో రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో గత బడ్జెట్ కంటే రాబోయే బడ్జెట్లో నిధుల కేటాయింపులు ఎక్కువగానే ఉండే అవ కాశం ఉందని తెలిపారు. బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతున్నదని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ 2021–22 రూపకల్పనపై శనివారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పద్దుల్లో పొందుపర్చాల్సిన శాఖల వారీ బడ్జెట్ అంచనాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులు సమర్పించిన నివేదికలను సీఎం పరిశీలించారు. ఆయా అం శాలపై చర్చించిన అనంతరం.. బడ్జెట్ కేటాయిం పుల విధివిధానాలను ఖరారు చేశారు. ఆదివారం నుంచి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తమ శాఖ అధికారులతో కలిసి.. ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, పురపాలక, విద్యా, నీటిపారుదల తదితర శాఖల బడ్జెట్ అంచనాల తయారీపై రోజువారీగా వరుస సమావేశాలు నిర్వహిస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు. అన్ని శాఖలతో బడ్జెట్ రూపకల్పన కసరత్తు ముగిసిన తర్వాత.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బడ్జెట్కు తుది మెరుగులు దిద్దనున్నారు. ఈ నెల మధ్యలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగింపు రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గొర్రెల పెంపకం కార్యక్రమం అమలు కొనసాగుతుందన్నారు. ఈ పథకం ద్వారా యాదవులు, గొల్లకుర్మల కుటుంబాలు ఆదాయాన్ని మంచి ఆర్జిస్తున్నందున.. ఇప్పటికే పంపిణీ చేసిన 3.70 లక్షల యూనిట్లకు కొనసాగింపుగా.. మరో 3 లక్షల యూనిట్ల పంపిణీ కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని తెలిపారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నదని సీఎం గుర్తు చేశారు. దేశంలోనే అధికంగా గొర్రెలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నదని కేంద్రం గుర్తించిన నేపథ్యంలో.. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించామన్నారు. ఇక చేపల పెంపకం కార్యక్రమం గొప్పగా సాగుతోందని, మంచి ఫలితాలు వస్తున్నందున దాన్ని కూడా కొనసాగిస్తామని ప్రకటించారు. సీ సమీక్ష్లలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక వ్యవహారాల సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్టారావు, కార్యదర్శి రోనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు. -
8 నుంచి అసెంబ్లీ
10న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సర్కారు l బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి తుది కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు మార్చి 8న ప్రారంభం కాను న్నాయి. 10న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించా రు. ఈ మేరకు అవసరమైన సన్నాహాలు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశిం చారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెడతారు. మరుసటి రోజున బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కేటాయింపుల కోసం వివిధ శాఖలు సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఆర్థిక శాఖ ఇప్పటివరకు రూపొందిం చిన బడ్జెట్, ఖరారు చేసిన పద్దులను సీఎం కేసీఆర్ గురువారం పరిశీలించారు. దీనిపై ప్రగతి భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణా రావుతో సమీక్షించారు. శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలు, కేటాయింపులపై చర్చించారు. రేపటి నుంచి మంత్రులతో సమీక్ష శాఖల వారీగా బడ్జెట్ అవసరాలు, ప్రతిపాద నలు, కేటాయింపులపై శనివారం నుంచి సమీక్షించాలని సీఎం నిర్ణయించారు. ఆయా శాఖల్లో ఇప్పటివరకు అమలైన కార్యక్ర మాలు, క్షేత్రస్థాయిలో వాటి పురోగతి.. వచ్చే ఏడాది చేయాలనుకుంటున్న పనులు, కార్యక్రమాలేమిటనే దానితోపాటు పథకాలు, కార్యక్రమాలు, నిధుల వినియోగాన్ని పక్కాగా మదింపు చేసుకుని నివేదిక అందజేయాలని మంత్రులను ఆదేశించారు. ఆ నివేదికల ఆధారంగా సమీక్షించి తుది కేటాయింపులు ఖరారు చేస్తామని తెలిపారు. దీంతో మంత్రులందరూ సంబంధిత నివేదికల తయారీలో నిమగ్నమయ్యారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఫోకస్! గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కొత్త బడ్జెట్ను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఫోకస్ చేయని సామాజిక వర్గాలు, వివిధ కుల వృత్తులకు ప్రయోజనాలు కల్పించే పథకాలకు పెద్దపీట వేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. బడ్జెట్కు ముందే జనహితలో చేనేత, మరమగ్గాల కార్మికులు, ఎంబీసీలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. అంతకు ముందే ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులపై అఖిలపక్ష ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులు ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు.