breaking news
try to attack
-
‘బాలాకోట్’ రిపీట్కు పాక్ యత్నం!
న్యూఢిల్లీ: ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ శిక్షణా శిబిరాలపై భారత వైమానిక దళం బాంబులు జారవిడిచిన మరుసటి రోజు అదే తరహాలో భారత భూభాగంలో దాడులకు పాకిస్తాన్ విఫలయత్నం చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా అదే నెల 26న పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్లో భారత వైమానిక దళం దాడులు నిర్వహించి ముష్కరులకు భారీగా నష్టం కలిగించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాతి రోజు అంటే ఫిబ్రవరి 27న పాకిస్తాన్ ప్రతీకార దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ సైన్యానికి చిక్కారు. వార్తా సంస్థ ఏఎన్ఐ కథనం ప్రకారం..ఆ రోజు పాకిస్తాన్ సుమారు 20 యుద్ధ విమానాలతో భారత్పై బాలాకోట్ తరహా దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్–16తో పాటు ఫ్రెంచ్ మిరాజ్–3, చైనీస్ జేఎఫ్–17 విమానాల సాయంతో సుమారు 1000 కిలోల బాంబులను పూంచ్, దాని సమీపంలోని మూడు చోట్ల భారత ఆర్మీ శిబిరాల వైపు విసిరింది. సరిహద్దుకు 50 కిలో మీటర్ల పరిధిలోని తన భూభాగం నుంచే పాకిస్తాన్ ఆర్మీ ఈ దాడులకు పాల్పడింది. అయితే భారత యుద్ధ విమానాలు సకాలంలో స్పందించడంతో పాకిస్తాన్ లక్ష్యం నెరవేరలేదు. దీంతో ఆ బాంబులను అక్కడికక్కడే వదిలి వెళ్లిపోయారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పారు. కశ్మీర్లోని ఓ సైనిక స్థావరంపై బాంబులు జారవిడిచినప్పుడు అక్కడ ఉన్న పెద్ద చెట్టు అడ్డుకుందని తెలిపారు. ఆ సమయంలో అదే భవనంలో సీనియర్ అధికారులు ఉన్నట్లు చెప్పారు. -
కన్నీళ్లే కన్నెర్ర చేస్తే..
కర్నూలు: అభం శుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడిని వారు తట్టుకోలేక పోయారు. దాడికి పాల్పడిన మానవ మృగాన్ని తామే చంపేస్తామంటూ పాతబస్తి వాసులు ఒక్కటై కదలివచ్చారు. కర్నూలు పెద్దాసుపత్రి ఆవరణలోని పోలీసు సదన్లో చికిత్స పొందుతున్న నిందితుడిని అంతు చూస్తామంటూ సోమవారం రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఆసుపత్రి ఎదురుగా గంట పాటు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. సార్... మాకు ఐదు నిమిషాలు అవకాశమివ్వండి... ఆ మానవ మృగాన్ని చంపేస్తామంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తూ బైఠాయించారు. ఈ దశలో ట్రాఫిక్ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. పాతబస్తీ వాసులకు బీజేపీ నాయకులు హరీష్ బాబు, రంగస్వామి, హేమలత, కాంగ్రెస్ నాయకులు పద్మావతి తదితరులు మద్దతు తెలిపారు. రాస్తారోకో అనంతరం ఒక్క ఉదుటున వందల సంఖ్యలో యువకులు నిందితుడు చికిత్స పొందుతున్న పోలీస్ సదన్ వద్దకు పరుగులు తీశారు. దీంతో ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐలు రంగనాయకులు, ప్రవీణ్కుమార్, బాబుప్రసాద్, రామకృష్ణ తమ సిబ్బందితో ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. దీంతో మళ్లీ ఆందోళనకారులు ఆసుపత్రి ఎదుట రహదారిపై ఆందోళన చేశారు. నిందితుడిని ఉరి తీసేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. దీంతో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత కొనసాగింది. అనంతరం అక్కడి నుంచి రాజ్విహార్ సెంటర్కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వీరికి వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకుడు హఫీజ్ఖాన్ మద్దతు తెలిపారు. -
ATMలో చోరికి యత్నం